అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు? | Sakshi
Sakshi News home page

అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు?

Published Wed, May 8 2024 1:10 AM

అన్నదాతలంటే బీజేపీకి అక్కసు ఎందుకు?

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అంటే బీజేపీకి అక్కసు ఎందుకని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని తన నివాసంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ ను అడ్డుగా పెట్టుకొని బీజేపీ, బీఆర్‌ఎస్‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన సొమ్మును నిలిపివేయడం సరికాదన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎన్నికల రోజు రైతుబంధు సొమ్ము జమచేస్తే ఆనా డు నోరు మెదపని బీజేపీ.. నేడు రైతుబంధు డబ్బు ఎందుకు ఆపిందని నిలదీశారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలపై రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌శర్మకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందనేనిది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రి రమ, టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు శశిభూషణ్‌ కాచే, ఎంపీపీ కొండ శంకర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, నాయకులు పురుశోత్తంరెడ్డి పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement