![Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 4th Updates - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/4/AP-politics.jpg.webp?itok=Jwhi27p_)
AP Elections Political Latest Updates Telugu..
7:20 PM, Mar 4th, 2024
నర్సీపట్నం:
నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఆర్పి అగ్రహారం గ్రామస్తులు
- పది రోజుల క్రితం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక
- టీడీపీలో చేరిన కార్యకర్తలు తిరిగి ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక
- కుటుంబ కలహాలతో టీడీపీలో చేరాం: ఆర్పి అగ్రహారం గ్రామస్తులు
- జగన్నన్న ఆధ్వర్యంలో రాష్టం సుభిక్షంగా ఉంది
- రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ మరొకసారి సీఎంగా గెలవాలి
6:36 PM, Mar 4th, 2024
రాజమండ్రి:
టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్ ఫైర్
- వాలంటీర్లను బెదిరిస్తున్న ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన భరత్
- వాలంటీర్లను బెదిరిస్తే చెప్పుతో కొడతా
- బ్లేడ్, గంజాయా బ్యాచ్లను పెంచి పోషించేది ఆదిరెడ్డి వర్గమే
6:30 PM, Mar 4th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
రాజమండ్రిలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎన్నికల లోపు కచ్చితంగా ఇస్తాం: పేర్ని నాని
- రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్లను బెదిరించాడు
- ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తే ఊరుకునేది లేదంటూ మాట్లాడిన ఆడియోను సిద్ధం సభలో ప్రజలకు వినిపించిన ఎంపీ భరత్
- దేశంలో రాజకీయాలను మారుస్తూ కార్యకర్తలకు విలువ ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్..
- ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు జరిగాయి.. కార్యకర్తలు మాకు వద్దు.. నాయకులను మార్చమంటే మార్చాడు
- 2019కి ముందు అనేక హామీలు ఇచ్చి... హామీ పత్రాలు కూడా చంద్రబాబు ఇచ్చాడు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు
- గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కొడుక్కి మినహా ఎవరికి జాబు రాలేదు
6:25 PM, Mar 4th, 2024
విజయవాడ
వాంబే కాలనీ లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ కార్యక్రమం
లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
- సెంట్రల్ నియోజకవర్గంలో 21488 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది
- అమరావతిలో 8500 ఇళ్ల కేటాయించడం జరిగింది
- 14 వేల 886 నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి
- 3342 ఇల్లు నిర్మాణం పూర్తి సిద్ధంగా ఉన్నాయి
- కొద్దిరోజుల్లో మిగతా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్ కె దక్కింది
- చంద్రబాబు జీవితంలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు
- మిగతా ఇళ్లన్నీ పూర్తి అవ్వాలంటే మరల సీఎం జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి
- ఎంతమందికి మా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం
6:20 PM, Mar 4th, 2024
విశాఖ:
రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్లో పర్యటన చేస్తున్నారు: గుడివాడ అమర్నాథ్
- విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం
- ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది ప్రముఖులు హాజరవుతారు..
- ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు
- విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన
- ఈస్ట్ కోస్గ్గా గేట్ వేగా వైజాగ్ను చూడలనేది సీఎం ఉద్దేశ్యం
- విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారు
- గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారు
- విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్ ను సీఎం జగన్ విడుదల చేస్తారు
- 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు
- 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్ కు శంకుస్థాపన చేయనున్నారు
- 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు
- 7 తేదీన అనకాపల్లిలో ఆసరా 4 విడత కార్యక్రమంను ప్రారంభిస్తారు
- సచివాలయం తాకట్టు అనేది అవాస్తవం
- ప్రజలను మభ్యపెట్టే విధంగా రాతల రాస్తున్నారు
- తప్పుడు వార్తలు మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు పిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నాము
- ఎల్లో మీడియా రాసిన ప్రతి తప్పుడు వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
- అభివృద్ధిని అడ్డుకోవాలని 600 తప్పుడు కేసులు వేశారు
- వైజాగ్ గ్రోత్ ఇంజన్గా రాష్ట్రానికి ఉంటుంది
6:15 PM, Mar 4th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
చిట్టేల లాంటి చిన్న గ్రామంలో 36 మంది వైఎస్సార్సీపీలో చేరారంటే టీడీపీ ఖాళీ అయినట్లే: ఎంపీ కేశినేని నాని
- చంద్రబాబు పచ్చి మోసగాడు.. డ్వాక్రా,రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అన్ని వర్గాలు బాగుండాలంటే మళ్లీ జగన్నే గెలిపించుకోవాలి
- తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్కుకేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్
- అమరావతి ఉద్యమం పేరిట హైదరాబాద్ నుంచి ఒకతను వచ్చాడు
- అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను
- అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు
- అదే హోటల్ వారిని చందాలు అడిగేవాడు అతని అరాచకాలు అలాంటివి
- చంద్రబాబుకు తిరువూరు అంటే చాలా కోపం
- ఇక్కడ టీడీపీలో ఆలీ బాబా 40 చోర్ లు ఉన్నారు
- ఎందుకంటే వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాలి కాబట్టి
- ఆలీబాబా 40 దొంగలను మించిన పెద్ద దొంగని తిరువూరు పంపించాడు చంద్రబాబు
- అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి
- మమ్మల్నీ డబ్బులు అడుగుతున్నాడేంటీ అని నన్ను అడుగుతున్నారు
- స్వామిదాస్ మీద కొలికపూడి కామెంట్ చేశాడట
- ఎవరితోనైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెబితే నేను,స్వామిదాస్ ఇద్దరం పోటి నుండి విరమిస్తాం
5:04 PM, Mar 4th, 2024
ఎన్టీఆర్ జిల్లా :
- తిరువూరు మండలం చిట్టెల గ్రామంలో టీడీపీ నుండి వైఎస్సార్సీపీలో చేరిన 18 కుటుంబాలు
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్
4:15 PM, Mar 4th, 2024
విశాఖపట్నం
మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్సీ రవీంద్ర
- ముస్సోరిలో సివిల్స్ శిక్షణా కేంద్రంలో కూడా ఇన్ని సదుపాయాలు లేవు
- వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది
- కోవిడ్ సమయంలో వైద్యం అందించడంలో ఖర్చుకు వెనుకాడని నాయకుడు సీఎం జగన్
2:55 PM, Mar 4th, 2024
విజయవాడ
ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్
- ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రాలో టీమ్ ఉందా?
- అతను సర్వేలు ఎప్పుడు చేసాడు
- ఐ ప్యాక్కి, ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు
- ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు
- ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది
- ప్రశాంత్ కిషోర్ని ఎవరూ పట్టించుకోరు
- చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు
- టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నాడు
- ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు
- జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం
2:52 PM, Mar 4th, 2024
విశాఖ:
విశాఖలో ప్రలోభాల పర్వానికి తెర లేపిన టీడీపీ
- భీమిలి నియోజకవర్గంలో బట్టలు పసుపు కుంకుమ పంపిణీకి సిద్ధం
- పంచేందుకు లక్ష కిట్లను రెడీ చేసిన మాజీ మంత్రి గంటా
- భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా
- చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాను ఆదేశించిన చంద్రబాబు
- అధినేత మాటను లెక్క చేయని గంటా
2:50 PM, Mar 4th, 2024
శ్రీసత్యసాయి జిల్లా:
సూరీ వర్సెస్ పరిటాల.. ధర్మవరంలో బయటపడ్డ టీడీపీ నేతల విబేధాలు
- ధర్మవరం నియోజకవర్గంలో తీవ్ర స్థాయికి చేరిన టీడీపీ నేతల విబేధాలు
- మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ వర్సెస్ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్
- బత్తలపల్లిలో వరదాపురం సూరీ వర్గీయుల వాహనాలు ధ్వంసం చేసిన పరిటాల అనుచరులు
- పరిటాల - సూరీ వర్గీయుల రాళ్ల దాడులు
- వరదాపురం సూరీ వర్గీయులు ప్రయాణిస్తున్న 10 వాహనాలు ధ్వంసం
- నలుగురు వరదాపురం సూరీ వర్గీయులకు గాయాలు
- పెనుకొండలో సాయంత్రం జరిగే చంద్రబాబు రా.. కదలిరా.. సమావేశానికి వెళ్తుండగా ఘటన
- ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరీ వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ దాడికి పాల్పడిన పరిటాల శ్రీరామ్ వర్గీయులు
- ధర్మవరం టికెట్ కోసం కొంతకాలంగా గొడవపడుతున్న పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరీ
2:41PM, Mar 4th, 2024
శ్రీసత్యసాయి జిల్లా:
పెనుకొండలో చంద్రబాబు రా.. కదలిరా సభ సందర్భంగా టీడీపీ నేతల ప్రలోభాలు
:
- జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
- లేపాక్షి మండలం మైదుగోళం వద్ద ఇద్దరు టీడీపీ నేతల అరెస్టు
- 4608 కర్నాటక మద్యం బాటిళ్లు స్వాధీనం
- కర్నాటక నుంచి పెనుకొండకు మద్యం తీసుకెళ్తుండగా టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
- టీడీపీ నేతలు హుస్సేన్, మాంతేష్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- పారిపోయిన మరో ఇద్దరు నేతలు
2:25 PM, Mar 4th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
ప్రతిపక్షాలకు ఓ ఎజెండా అంటూ ఏమీ లేదు: హోంమంత్రి తానేటి వనిత
- 2024లో సీఎం జగన్ సింగిల్గా పోటీ చేస్తుంటే ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నారు
- ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై స్పందించడం లేదు
- ప్రజలకు ఏం మంచి చేస్తామో చెప్పడం లేదు
- మొన్నటి వరకు సంక్షేమ పథకాలతో అప్పుల పాలవుతుందని ప్రచారం చేశారు
- ఇప్పుడు సీఎం జగన్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని ప్రతిపక్ష పార్టీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది
- వారికి ఓ ఎజెండా లేదు
- పక్క వాళ్ళ ఏజెండాను కాపీ కొట్టడమే ప్రతిపక్షాల పని
1:35 PM, Mar 4th, 2024
బాబుకు షాకిచ్చిన నేతలు..
- పెనమలూరు టిక్కెట్పై ఎటూ తేల్చని చంద్రబాబు
- రోజుకో పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు
- తాజాగా పెనమలూరులో తెరపైకి ఎం.ఎస్.బేగ్ పేరు
- ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయిస్తున్న టీడీపీ
- సర్వేపై మండిపడుతున్న పెనమలూరు టీడీపీ మైనార్టీ నేతలు
- టీడీపీ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్
- పెనమలూరు టిక్కెట్ ప్రకటించకుండా చంద్రబాబు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు
- మొదటి జాబితాలో బోడె ప్రసాద్కు సీటు ప్రకటిస్తారని ఆశించాం
- బోడె ప్రసాద్కి సీటు ఇవ్వకుంటే మైనారిటీ అభ్యర్థిగా నాకు కేటాయించాలి
- వలస వచ్చే వారికి మేము సహకరించే ప్రసక్తే లేదు.
- స్థానికులకే సీటు ప్రకటించాలి.
- పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించడం లేదు
- వైఎస్సార్సీపీ ఇప్పటికే ఏడుగురు మైనార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
- చంద్రబాబు ఒక మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు
- రెండో మైనార్టీ అభ్యర్థిగా నా పేరు చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను.
1:15 PM, Mar 4th, 2024
పీకేపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..
- పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్ రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు
- అంతా కలిసి ముప్పేట దాడి చేస్తున్నారు
- ప్రశాంత్ కిషోర్ వంటి వారితో మాట్లాడిస్తున్నారు
- బీహార్ నుంచి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు
- తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పీకే అంచనా తప్పింది
12:43 PM, Mar 4th, 2024
కృష్ణాజిల్లా:
సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
- సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడు
- నేడు రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే
- ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా
- ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే
- సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే
- ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా?
- ప్రజల అవసరాల కోసం... ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది
- చిల్లర రాజకీయ నాయకుడు... చంద్రబాబు చేస్తేనే సంసారం
12:00 PM, Mar 4th, 2024
విజయవాడ
ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా మేము పరిగణించట్లేదు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
- సీఎం జగన్ పేద ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు
- చంద్రబాబు తప్పుడు పేపర్లు కోర్టులో సబ్మిట్ చేసి దుర్మార్గానికి పాల్పడ్డాడు
- కచ్చితంగా న్యాయపోరాటం చేసి పేదలకు ఇల్లు కట్టిస్తాం
- పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు
- నేటి రాజకీయ విశ్లేషణలకు ప్రశాంత్ కిషోర్ పనికిరాడు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి అవగాహన లేదు
- నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి మంతనాలు జరిపాడు
- చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ కలసి ఉన్నారు
- చంద్రబాబు ప్యాకేజీ కింద ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు
- ఆంధ్రప్రదేశ్ వాస్తవ సంగతులు ప్రశాంత్ కిషోర్కి తెలియదు
- ఇద్దరు పీకేలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పీకేది ఏం లేదు
- పవన్ కళ్యాణ్ ఒక పీకే.. ప్రశాంత్ కిషోర్ ఒక పీకే
- ఇలాంటి వారి గురించి ఆలోచించే పరిస్థితి సీఎం జగన్కి లేదు
- ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారు
11:30 AM, Mar 4th, 2024
చిత్తూరు
చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్లు
- చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసింది
- ఆ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి
- ఆయన్ని పార్టీ నుండి ఇప్పటికే సస్పెండ్ చేశాం
- డిస్క్వాలిఫికేషన్కు అవకాశం ఉంటే అదికూడా పరిశీలిస్తాం
- తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరం
11:00 AM, Mar 4th, 2024
పీకే వ్యాఖ్యలకు రాచమల్లు కౌంటర్
- పీకే వ్యాఖ్యలపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
- పీకే ఒక వ్యక్తి.. జనం కాదు.. వ్యూహకర్త..
- అతను ప్రజల్లో తిరిగి సమస్యలు పరిష్కరించేవాడు కాదు
- అలాంటి వ్యక్తి టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని మాట్లాడటం కరెక్ట్ కాదు
- ఇదే పీకే 15 రోజుల క్రితం వైఎస్సార్సీపీ గెలవబోతుందని చెప్పాడు
- సర్వేలంటే శాస్త్రీయత ఉంటుంది
- కానీ పీకే మాటాల్లో శాస్త్రీయత లేదు.
- సర్వేలన్నీ వైఎస్సార్సీపీకే 130-150 సీట్లు వస్తాయని చెబుతున్నాయి
- వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి
- ఇక, 15 రోజుల్లోనే పీకే మాట మర్చారు.
10:20 AM, Mar 4th, 2024
మోసాల బాబును ప్రజలు నమ్మొద్దు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- చంద్రబాబు దళితుల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి కాదు
- సీఎం జగన్ దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగులకు ఎంతో చేశారు
- బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీవైపే
- చంద్రబాబు ప్రజల్ని ఏమార్చేందుకు వస్తున్నారు
- మోసపూరిత హామీలతో బాబు ఎత్తుగడలు
9:30 AM, Mar 4th, 2024
భీమవరంలో గెలుపు నాదే: గ్రంధి శ్రీనివాస్
- ఎమ్మెల్యే గ్రంధి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన పవన్ కల్యాణ్ అభిమానులు
- భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కామెంట్స్..
- భీమవరంలో 2019లో పవన్ వెంట వెళ్లిన అభిమానులు తిరిగి.. మళ్లీ ఇప్పుడు నా వద్దకు వస్తున్నారు
- ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై పాజిటివ్గా ఉన్నారు.
- నా గురించి తెలుసుకుని పవన్ కల్యాణ్ను భీమవరం నుంచి పారిపోయారు.
8:40 AM, Mar 4th, 2024
చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు..
- అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు.
- కోడెల శివప్రసాద్ మరణానికి కారణం చంద్రబాబే.
- చంద్రబాబుకు కౌంటరిచ్చిన మంత్రి అంబటి రాంబాబు.
అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు
— YSR Congress Party (@YSRCParty) March 3, 2024
కోడెల శివప్రసాద్ గారి మరణానికి కారణం @ncbn
-మంత్రి అంబటి రాంబాబు#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/pRxKBY11xA
8:00 AM, Mar 4th, 2024
టీడీపీకి వరుస షాక్లు..
- ధర్మవరంలో టీడీపీకి ఎదురుదెబ్బ
- ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు
- ఇప్పటికే పలుచోట్ల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.
7:20 AM, Mar 4th, 2024
పీకేకు మంత్రి అంబటి కౌంటర్..
- నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు!
- ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్దంగా వున్నాడు!
నాడు లగడపాటి
— Ambati Rambabu (@AmbatiRambabu) March 3, 2024
సన్యాసం తీసుకున్నాడు!
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్
సిద్దంగా వున్నాడు! @PrashantKishor
7:00 AM, Mar 4th, 2024
సిద్ధం కాని ‘సైకిల్’
- ముందుకు కదలక మొండికేసే.. తెలుగుదేశంలో గందరగోళం
- సీట్లు తేలవు.. జనం పట్టించుకోరు
- రెండో జాబితాపై నోరు మెదపని చంద్రబాబు
- బీజేపీతో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు
- మరోవైపు బాబు సభలకు స్పందన కరువు
- ‘రా కదలిరా’ సభలన్నీ ఫ్లాప్
- జనసేన– టీడీపీ ఉమ్మడి అ‘జెండా’ ఫెయిల్
- ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాన్నే నమ్ముకున్న బాబు
6:50 AM, Mar 4th, 2024
బాబు మాటలే.. పీకే నోట..
- అవి కిరాయి పలుకులే: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం
- బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా తప్పుకున్న ప్రశాంత్ కిశోర్
- బిహార్లో చెల్లని కాసులా మారడంతో చంద్రబాబుతో డీల్
- వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి
- సీఎం జగన్ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్
- పొత్తులో సీట్ల లెక్క తేలాక చంద్రబాబు, పవన్ నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్
- ఉనికి కాపాడుకోవడానికే పీకేతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్న చంద్రబాబు
6:40 AM, Mar 4th, 2024
బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: మంత్రి అమర్నాథ్
- పీకేను చంద్రబాబు పలుమార్లు రహస్యంగా కలిసారు
- ఒక రోజు క్రితం కూడా హైదరాబాద్లో సమావేశమయ్యారు
- ఒక పీకే వల్ల కావడం లేదనే రెండో పీకేని తెచ్చుకున్నారా..?
- మాంత్రికుడనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు సున్నా అయ్యాడు?
- సొంత రాష్ట్రం బిహార్లో రాజకీయ భిక్షగాడిలా మారాడు
- ఏపీలో సర్వే టీం లేని ఆయన డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారు?
6:30 AM, Mar 4th, 2024
పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ
- రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.
- అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం
- 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం
- 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం.
- అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం.
- సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం
- పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు
- పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే.
- 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి
- జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం
- మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం
- 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం
- రాజ్నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment