తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కీలక వ్యాఖ్యలు | Former Cs Iyr Krishna Rao Key Comments On Tirumala Laddu | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కీలక వ్యాఖ్యలు

Published Fri, Sep 20 2024 12:56 PM | Last Updated on Fri, Sep 20 2024 3:33 PM

Former Cs Iyr Krishna Rao Key Comments On Tirumala Laddu

సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్‌ అన్నారు.

మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్‌ ఖండించింది.  ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం

తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని.. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమని చెప్పింది. 

	చంద్రబాబు వ్యాఖ్యలు నేను నమ్మడం లేదు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement