Iyr Krishna Rao
-
తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎస్ ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ అన్నారు.మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయంతిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని.. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమని చెప్పింది. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్టాపిక్గా మారింది. భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ నానాయాగీ చేస్తోంది. ఇంకా అమల్లోకే రాని చట్టంపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండంతో ఏం చేయాలో తోచక సీఎం జగన్పై, ఆయన ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది.తాజాగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదంపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ చట్టంపై చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఆయన తిప్పికొట్టారు."ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?’ అని ట్వీట్ చేశారు..కాగా శుక్రవారం నాటి ఆంధ్రజ్యోతి ప్రతికలో ‘మీ భూమి మీది కాదు’ అనే నినాదంతో ఫస్ట పేజ్లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.దీనిని కృష్ణారావు షేర్ చేస్తూ.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీదేనని తెలిపారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలో ఏపీ బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం. ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024 -
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
‘మురుగు’ పన్ను మరిచారా బాబూ!?
సాక్షి, అమరావతి: ‘చెత్త’ పన్ను.. ‘చెత్త’ పన్ను అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. అసలు ఆ తరహా పన్నుల విధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఎందుకంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు గత 20 ఏళ్లుగా మురుగు కాల్వలు వాడుతున్నందుకు పన్ను కడుతున్నారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పన్నునే ఆయన కొత్తగా ప్రవేశపెట్టారు. అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు 2002 మార్చి 14న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఏపీ గ్రామ పంచాయతీ నియమావళి పేరుతో.. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలుచేస్తున్న దాంట్లో కొంత మొత్తం అదనంగా ‘యూజర్ ఛార్జెస్ ఫర్ డ్రెయినేజీ ఫెసిలిటీ’కి వసూలుచేయడానికి అప్పట్లో ఆ నోటిఫికేషన్ను జారీచేశారు. మురుగు కాల్వలపై యూజర్ చార్జీల వసూలుకు అప్పటివరకు అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం పలు సవరణలు కూడా చేసింది. అంతేకాదు.. గ్రామాల్లో వీధి దీపాలు, పక్కా మురుగుపారుదల సదుపాయాలు, మంచినీటి సరఫరా వంటి వసతుల కల్పన సహా స్థానికంగా కల్పించే సౌకర్యాలపై అక్కడ నివసించే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలను వసూలుచేయాలని ఆ గెజిట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. ఆయా సదుపాయాలు నిర్వహించడానికి అయ్యే వ్యయాన్ని, ఆ సేవలను వినియోగించుకునే అన్ని కుటుంబాలకు విభజించి యూజర్ ఛార్జీలను లెక్కగట్టాలని అందులో వివరించారు. 2014–19 మధ్య కూడా ఇలాగే.. ఇక 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనూ చంద్రబాబు సర్కారు ప్రజల నడ్డి విరిచింది. కొత్తకొత్త పన్నులు విధిస్తూ ఆదేశాలను జారీచేసింది. ఉదా.. ► ప్రమాదాల సమయంలో ఫైర్ ఇంజన్ల ద్వారా సేవలు అందిస్తున్నందుకు గాను ప్రత్యేకంగా ఫైర్ టాక్స్ వసూలుకు 2014 డిసెంబరు 3న అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ప్రజలు ఇంటి పన్ను రూపంలో చెల్లించే మొత్తానికి అదనంగా ఒక శాతం చొప్పున ఈ ఫైర్ టాక్స్ను లెక్కించి వసూలుచేయాలని ఆదేశించారు. ► అలాగే.. గ్రామాల్లో వసూలుచేసే ఇంటి పన్నులో 3 శాతం చొప్పున స్పోర్ట్స్ ఫీజు (ఆటలపై పన్ను) రూపంలో లెక్కించి, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు జమచేయాలంటూ 2014 నవంబరు 18న మరో జీఓను కూడా చంద్రబాబు సర్కారు జారీచేసింది. ఇలా తన హయాంలో ఎడాపెడా పన్నులను బాదేసిన చంద్రబాబు ఇప్పుడు పన్నులను విమర్శించడంపై రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
'బహుశా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ గుజరాత్లో మాత్రం కొందరు మహిళలు డీసీఎం వాహనంలో నుంచి దిగడానికి జేసీబీని ఉపయోగించారు. ఆ సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్ రీట్వీట్ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు. Inventions become useful as people start innovating . https://t.co/f3UZfRUI0n — IYRKRao , Retd IAS (@IYRKRao) February 24, 2020 -
ఈ వార్త ఎందుకో పొసగడం లేదు: ఐవైఆర్ ట్వీట్
-
వాతావరణ మార్పుల పర్యవసానం
గ్రేటా థమ్బర్గ్ స్వీడన్ దేశానికి చెందిన విద్యా ర్థిని. గత సంవత్సరంగా ప్రతి శుక్రవారం పర్యా వరణ పరిరక్షణే ధ్యేయం గా నిరసనలు వ్యక్తం చేస్తూ గుర్తింపు పొందింది. సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణకు జరిగిన ప్రపంచవ్యాప్త ఉద్యమంలో న్యూయార్క్ నగరంలో పాల్గొనే ఉద్దేశంతో కేవలం సూర్యరశ్మి సహాయంతో నడిచే చిన్న పడవలో ప్రయాణం చేసి అమెరికా దేశాన్ని చేరుకున్నది. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ వాయువులు వెలువడకుండా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి ఉద్య మించింది. న్యూయార్క్ నగరానికి చేరుకొని నిర సన ఉద్యమంలో పాల్గొనడమే కాక ఐక్య రాజ్యసమితి పర్యావరణ సమావేశాల్లో కూడా పాల్గొని ప్రసంగించింది. ఆవేశపూరితంగా సాగిన ఆమె ప్రసంగాలు కొంత మంది విమర్శలకు అవ కాశం ఇచ్చినా, పర్యావరణ పరిరక్షణలో ఈ విద్యార్థిని చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఒక విధంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై ప్రపంచ దృష్టిని మళ్లించటంలో ఈ చిన్నారి సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి. ఇదే సమయంలో ఐస్లాండ్ దేశంలోని శాస్త్ర వేత్తలు ఆగస్టు నెలలో వాళ్ల దేశంలో కరిగిపోయిన ఓక్స్ఓకుల్ హిమనీనదానికి (గ్లేసియర్) ఒక జ్ఞాపికను ఏర్పాటు చేశారు. ‘భవిష్యత్తుకు మా లేఖ’ అనే శీర్షికతో ఏర్పాటుచేసిన ఈ జ్ఞాపికలో తమ దేశంలో కరిగిపోయిన మొదటి హిమనదం ఓక్స్ఓకుల్ అని.. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రెండు వందల సంవత్సరాలలో ఐస్లాండ్ దేశంలో ఉన్న అన్ని హిమనీనదాలు కరిగిపోతాయని వారు పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకుని రావడానికి స్వీడన్ దేశపు విద్యార్థిని ఒకవైపు అవిరళ కృషి జరుపుతుంటే, మరొకవైపు పర్యావరణ మార్పుల వలన వచ్చే దుష్ఫలితాలను ఐస్లాండ్ దేశంలో కరిగిపోయిన హిమనీనదం మనకు తెలియజేస్తూ ఉంది. మరొకవైపు ప్రపం చంలోనే శక్తివంతమైన దేశం, పర్యావరణ సమ స్యలకు కారణభూతమైన ప్రధాన దేశం అయిన అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పర్యావరణం అసలు సమస్యే కాదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. ఇక బ్రెజిల్ దేశంలో అధ్యక్షుడు బోల్సనారో ఆధ్వర్యంలో దట్టమైన వర్షారణ్యాల విధ్వంసం కొనసాగుతోంది. పర్యా వరణ పరిరక్షణకి కొత్త అడవులను సృష్టించే బదులు దట్టమైన కీకారణ్యాలను నాశనం చేసుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ప్యారిస్ నగరంలో 2015లో సమా వేశమై ఒక ప్రధానమైన అంగీకారానికి రావడం జరిగింది. భూమండలంపై ఉష్ణోగ్రత స్థాయి పారిశ్రామిక యుగానికి ముందు ఉన్న ఉష్ణో గ్రత కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ లను మించి ఉండ రాదు. ఈ ఒప్పందానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ముందు ఆమోదం తెలిపాయి. కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించబడిన ప్రధాన ఒప్పందానికి ఆదిలోనే విఘాతం కలిగింది. ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం పారి శ్రామిక యుగానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతల స్థాయి కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా ఉష్ణోగ్రతలు కట్టడి చేయాలి అంటే కేవలం భవి ష్యత్తులో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు కట్టడి చేస్తే సరిపోదు.ఒక భార తదేశపు పరిమాణం కలిగిన ప్రదేశాన్ని అరణ్యంగా మార్చి కొత్తగా చెట్లను నాటితే గాని మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేము. దీనిని బట్టే సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోగలం. ప్రత్యామ్నాయంగా బొగ్గుపులుసు వాయువును భూమి లోపలి భాగంలో బంధించడం ద్వారా కూడా ఇదే ప్రయోజనాన్ని సాధించవచ్చు కానీ ఆ సాంకేతికత ఇంకా పూర్తిగా విజయవంతమైనది కాదు. చెట్లు నాటడం ద్వారా బొగ్గుపులుసు వాయువు పరిమాణాలను వాతావరణంలో తగ్గించడం చాలా సులభమైన మార్గం. ఉన్న అడవులనే నరికేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగే పనిగా తోచడం లేదు.వాతావరణ కాలుష్యానికి సింహ భాగం కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాలు తగ్గించుకోటానికి ఇష్టపడనప్పుడు అభి వృద్ధి చెందుతున్న దేశాలను ఈ దిశగా త్యాగాలు చేయమని కోరటం హాస్యాస్పదమే అవుతుంది. అందు కనే పర్యావరణ పరిరక్షణకు జరిగే అన్ని ఒడం బడికలు ఒప్పందాలు కాగితాల మీదనే మిగి లిపోతున్నాయి.ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చిన దీనికి సంబంధించిన ఖర్చు ఎవరు భరిస్తారు అనేది కూడా తేలని సమస్యగానే మిగిలిపోతుంది. వాతావరణ కాలుష్యానికి కారణభూతులైన అభి వృద్ధి చెందిన దేశాలు ఈ ఖర్చులు భరించాలి అనే ది అభివృద్ధి చెందే దేశాల సహేతుకమైన వాదన. కానీ అలా భరించటానికి అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా లేవు. ఈ సమస్య ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ద్వారా అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకనే ప్రభుత్వాలకు అతీతంగా ప్రజలే ఈ అజెండాను తమదిగా భావించి ముందుకు తీసుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాతావరణ పరి రక్షణ ర్యాలీ అన్ని దేశాలలోని ప్రజలు పాల్గొ నటంతో చాలా విజయవంతంగా ముగిసింది. ప్రకృతి పరిరక్షణ, తృప్తికరౖమైన సాధారణ జీవన విధానంకు అనుగుణంగా పారిశ్రామికీకరణతో కూ డిన ఆధునిక యుగం రాకముందు మానవ జీవన విధానం సాగేది. పర్యావరణ రక్షణకు అదే శ్రీరామరక్ష. కానీ అభివృద్ధి చెందిన దేశాలు తమ సదుపాయాలు వదులుకొని ఈ అంశంలో మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా లేని నాడు వాతావరణంలో జరిగే మార్పులు మానవాళికి పెద్ద ఎత్తున హాని కలిగించే ప్రమాదం పొంచి ఉన్నది. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అర్థవంతమైన చర్చతోనే అసలైన రాజధాని
ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. స్థల అనుకూలతను పరిగణలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం మోసపూరితంగా తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈమధ్య కృష్ణానదిలో వచ్చిన వరదల తర్వాత రాజధాని ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం సరి అయినదా కాదా అనే అంశంపై చర్చ మొదలైంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకన్నా పెద్ద వరద రాదనే నమ్మకం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావాన్ని పట్టి ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య వచ్చిన వరదలలో అధికంగా 9 లక్షల క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలారు. 2009లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవహించింది. ఇక మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రస్తు్తతం బీజేపీ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకటేష్ రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. సాధారణంగా రాయలసీమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటారు. రాజధాని స్థల ఎంపికను గురించి నా పుస్తకం ‘ఎవరి రాజధాని అమరావతి‘ లో విపులంగా చర్చించా. అందులో ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను. ‘ముందుగా అనుకూలతను అధ్యయనం చేయకుండానే సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ఏకైక ప్రాంతంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది‘. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఒక మహా నగర నిర్మాణ ప్రయత్నం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెపుతూ రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన మార్గమని సూచించింది. ఈ సిఫార్సులను పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఆనాటి పురపాలక శాఖామాత్యులు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల కమిటీ ఎటువంటి సిఫార్సులు ఇవ్వలేదు. ఈ రకంగా స్థల అనుకూలతను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. స్థల నిర్ధారణ సమయంలో ఆ ప్రాంతం భూకంపాల ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి ఇస్లామాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఎంపికకు కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగి వివిధ ప్రాంతాల మధ్య రాజీ మార్గంగా ఏకాభిప్రాయంతో ఆనాడు రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్చ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం లేకుండా వ్యూహాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని ముందు అనుకున్న విధంగా కృష్ణా నది తీర ప్రాంతంలో బాబు గారు రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. అందుకనే 52మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు రాజధాని ఎంపికలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు అని గట్టిగా భావించారు కాబట్టే అటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇదేరకమైన భావన ఉత్తరకోస్తా ప్రాంతాల్లో కూడా లేకపోలేదు. రాజధానులు వాటి నిర్మాణం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాదిం రాస్మన్ ‘క్యాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పేట్రన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీ లొకేషన్ ‘అనే పుస్తకం రాశారు. దానిలో ఆయన రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో తమకు ఉనికి ఉందని వారు భావిస్తున్నారా? రాజధాని నుంచి వచ్చే ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు లభిస్తున్నాయా? అనేవి ముఖ్యమైన అంశాలని ఈ నిష్పాక్షికత అందరినీ కలుపుకుపోవడం అన్నదే ప్రభుత్వానికి న్యాయసమ్మతం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైఅంశాలలో వేటినీ అమరావతి స్థల సమీకరణలో పాటించలేదనేది తేటతెల్లమవుతుంది. విజయవంతంగా నిర్వహించబడుతున్న రాజధానుల విషయంలో స్థల ఎంపిక విషయంలో ఎటువంటి ప్రక్రియను అనుసరించారో పరిశీలిద్దాం. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రే లియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. ఈ దేశాలలో ఏర్పడిన రాజధానులు కేవలం పరిపాలన రాజధానులుగానే ఉన్నాయి. ఆ దేశాలలో ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. రాజధానులుగా ఈ పట్టణాలు విజయవంతంగా నడవటానికి కారణం వీటి ఏర్పాటు వివిధ వర్గాలు ప్రాంతాల మధ్య సర్దుబాటు ఫలితంగా ఏర్పడటమే. ఇటువంటి విశాల విధానాన్ని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అనుసరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని పునఃపరిశీలించి అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రకంగా జరిగిపోయింది కాబట్టి ఈ అంశాన్ని తిరగతోడడం సరికాదు అనేవాళ్ళు వినిపించే వాదనలు వేరే ఉన్నాయి. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, నిర్ణయంలో మార్పు వల్ల వాళ్లకు నష్టం జరుగుతుందని ఒక వాదన. ప్రభుత్వ ధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ అంశాన్ని పునః పరిశీలించటం సరికాకపోవచ్చని రెండవ వాదన. ఈ రెండు వాదనలు ఇక్కడ పరిశీలిద్దాం. భూ సమీకరణ కేవలం స్వచ్ఛందంగానే ఇవ్వలేదని చాలా వరకు ప్రభుత్వం బలవంతం చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా భూ సమీకరణ పూర్తి చేసిందని ఆ రోజుల్లోనే ఈ అంశాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి రిజిస్టర్ అయినది ఎంత, రైతుల చేతిలోనే ఉన్న భూమి ఎంత, ప్రభుత్వ అవసరాలకు కానీ, వివిధ సంస్థలకుగాని కేటాయించిన భూములు ఎంత, పనులు మొదలు పెట్టిన భూములు ఎంత అనే వివరాలు వెల్లడిస్తే ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజధాని స్థల ఎంపికకు ముందు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఆ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. ఇక రెండో అంశం పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు ఇక్కడ ఇప్పటికే వెచ్చించడం జరిగింది కాబట్టి ఈ సమయంలో రాజధాని తరలింపు చర్చ అర్థరహితం అనేది కొందరి వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో నమూనాల పరిశీలన, నిర్ధారణ లోనే పుణ్యకాలం అంతా వెచ్చించింది. పెద్ద స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే జరిగాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయి లో ప్రభుత్వ నిధులు ఇప్పటికే వినియోగం అయినాయి. దానికి అను గుణంగా పూర్తయిన భవనాలు ఎన్ని? ఈ సమాచారం ఆధారంగా ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపే అవకాశం ఉంటుంది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆనాడు రాజధానికి స్థల సేకరణ సమయంలో ఈ అర్థవంతమైన చర్చ పూర్తిగా లోపిం చింది. అటువంటి చర్చ జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఎంతైనా ఉంది. ఈనాడు రాజధానిని మార్చాలి అనే ప్రతిపాదన తుగ్లక్ ప్రతిపాదనగా వర్ణించే వారికి నా సమాధానం ఒక్కటే. తుగ్లక్ కొన్ని శతాబ్దాలుగా దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని మార్చటానికి ప్రయత్నించాడు. ఈనాడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏకపక్షంగా రాజధాని ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని. దీనిని తుగ్లక్ చర్యతో పోల్చటం భావ్యం కాదు. పోల్చాలి అనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన చర్యతో పోల్చవచ్చు. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వృద్ధి కేంద్రంగా క్రియాశీల బడ్జెట్
నిర్మలా సీతారామన్ గతవారం లోక్సభలో సమర్పించిన కేంద్ర బడ్జెట్ను ఆచరణ సాధ్యమైన క్రియాశీలక బడ్జెట్గానే చెప్పాలి. సంకీర్ణ పక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రాజీమార్గంలో పాలన సాగించాల్సిన అవసరం లేకపోవడంతో 2019 బడ్జెట్లో సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దొరికినట్లయింది. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడం అనే సాధారణ నమూనాకు భిన్నంగా స్థిర అభివృద్ధి విధానంపై కేంద్రం దృష్టి పెట్టింది. వృద్ధి రేటును పెంచుతూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా ముఖ్యం. అందుకే ప్రజాప్రయోజనాలకు పట్టం కడుతూనే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. భారతీయ జనతాపార్టీ 2019 ఎన్నికలలో ఇతర పార్టీల మీద ఆధార పడవలసిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీని సాధించింది. సంకీర్ణ ప్రభుత్వాలలో మిగిలిన పార్టీలతో కలసి వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ రాజీ మార్గంలో పరిపాలన సాగించాల్సిన అవసరం ఈరోజు బీజేపీకి లేదు. వెనువెంటనే ఎన్నికలు కూడా ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019 బడ్జెట్. సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పరిస్థితులు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆచరణ సాధ్యమైన క్రియాశీలకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లోని ప్రధానమైన అంశం ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం. ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రధాన అంశంగా పేర్కొంటూ ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 3.3% ఉండేటట్టుగా రూపొందిం చారు. ఆర్థిక క్రమశిక్షణకు ఆర్థికరంగ స్థిరత్వానికి ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతం కన్నా తక్కువ ఉండటం శ్రేయస్కరం. ఆ దిశగా అడుగులు వేస్తూనే ప్రస్తుత సంవత్సరానికి 3.3% ఉండేలాగా బడ్జెట్ను రూపొందించారు. గత సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో వృద్ధిరేటు మందగించింది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ వృద్ధి రేటుకు ఊతమిచ్చేలాగా ఉండాలని అందుకోసం వ్యయం పెంచాల్సిన ఆవశ్యకతను పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని కొందరు ఆర్థికవేత్తలు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపేలాగా బడ్జెట్ ఉండాలని ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచటం ద్వారా ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని వీరి అభిప్రాయం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయకుండా ఆర్థిక మంత్రి విజ్ఞతతో కూడిన స్థిర అభివృద్ధి విధానానికి ప్రాధాన్యమిచ్చారు. వృద్ధి రేటు ఎంత ముఖ్యమో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రధాన విజయాల్లో ఒకటి.. ధరలను అదుపులోకి తీసుకొని రావటం. వృద్ధి రేటు ప్రాధాన్యమిచ్చే విధానాన్ని అనుసరించి ప్రభుత్వం వ్యయాన్ని పెంచుకుంటూ పోతే ద్రవ్యోల్బణం నియంత్రణ లేకుండా పెరిగే అవకాశం ఉంది. దీనితో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణకే ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. ద్రవ్యలోటును నియంత్రించటం ఎంత ముఖ్యమో ద్రవ్యలోటులో భాగంగా రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కూడా అంతే ప్రధానమైన విషయం. ఈ బడ్జెట్లో మొత్తం ద్రవ్యలోటు 7 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయం ఖర్చుపెట్టడానికి కేటాయించిన మొత్తం 3లక్షల 38 వేల కోట్లు మాత్రమే. మిగిలిన అప్పులు రెవెన్యూ లోటు భర్తీకే సరిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే రెవెన్యూ అకౌంట్లోని పన్నులు పన్నేతర రాబడి అయినా పెరగాలి లేదా రెవెన్యూ అకౌంట్లోని ఖర్చులైనా తగ్గాలి. కొన్ని శ్లాబులలో ప్రత్యక్ష పన్ను రేటు పెంచటం, పెట్రోలు పెట్రోల్ ఉత్పత్తులపై పెంపు ఈ రకంగా అధిక ఆదాయ వనరులను సేకరించటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక రెవెన్యూ వ్యయం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ ఖర్చులో సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార సబ్సిడీ కిందనే లక్షా 80 వేలకోట్ల దాకా ఖర్చు అవుతోంది. దాదాపు 80 వేల కోట్ల దాకా ఎరువుల సబ్సిడీ కింద ఖర్చు అవుతోంది. దాదాపు బడ్జెట్లో 9 శాతం వరకు ఈ రెండు అకౌంట్లలో రాయితీల కిందనే ఖర్చు అవుతోంది. లబ్ధిదారులకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ రాయితీ చేరే విధంగా ప్రత్యక్ష ద్రవ్య బదిలీ విధానాన్ని అమలు చేయగలిగితే ఈ సబ్సిడీల వలన లబ్ధిదారులకు నిజమైన మేలు చేకూరుతుంది. ఈ సబ్సిడీలను అమలు చేసే విధానంలో ఉన్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. రాయితీ నేరుగా చిన్న సన్నకారు రైతులకు అందిస్తారు కాబట్టి ఎరువుల ధరలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించవచ్చు. ప్రభుత్వానికి సబ్సిడీలో కొంత మిగులు, రైతులకు ద్రవ్య రూపంలో ప్రత్యక్ష బట్వాడా జరుగుతున్నది కాబట్టి లాభం ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే బడ్జెట్లో ఎక్కువ భాగం సబ్సిడీల రూపంలోనే పోవటం వల్ల మూలధన వ్యయానికి నిధుల కొరత ఏర్పడుతున్నది. జాతీయోత్పత్తిలో అధిక వృద్ధి రేటు సాధించాలంటే మూలధన వ్యయం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం అమలు చేస్తున్న ఇంకొక పెద్ద పథకం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కింద రూ. 60 వేల కోట్లు కేటాయించారు. గ్రామ ప్రాంతాలలో అవసరం ఉన్న సామాజిక ఆస్తుల నిర్మాణానికి ఈ పథకం కింద ప్రాజెక్టులను చేపడుతున్నారు. అక్కడ ఉన్న ప్రాజెక్టులు పరిమితం కాబట్టి అవి పూర్తి కాగానే ఈ పథకం కింద దుర్వినియోగం, అవినీతి ఎక్కువ జరుగుతోంది. ఈ పథకం వల్లనే వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడుతున్నది అనే అభియోగం ఒకటున్నది. ఈ స్కీమును కూడా గ్రామీణ పేదలకు అదనపు ఆదాయం కల్పించే విధంగా మార్చి ప్రత్యక్ష నగదు బట్వాడా ద్వారా ఏ ఏ కుటుంబాలు ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్ అయి ఉన్నాయో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు. అప్పుడు గ్రామీణ పేదల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలకు కూలీలు దొరకడం లేదనే సమస్య కూడా వుండదు. ఈ విధంగా సబ్సిడీల విషయంలోనూ కొన్ని అధిక వ్యయంతో కూడిన ప్రభుత్వ పథకాలను పూర్తిగా విశ్లేషించి అవినీతికి దుర్వినియోగానికి తావు లేకుండా లబ్ధిదారులకు ప్రత్యక్షంగా లబ్ధి పొందే విధంగాను, ప్రభుత్వానికి సబ్సిడీలు తగ్గే విధంగానూ క్రియాశీలకంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం చేసే ఈ భారీ వ్యయం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి కొంత వెసులుబాటు వచ్చి అధిక మొత్తం మూలధన వ్యయం చేయటానికి వీలుంటుంది. వృద్ధి రేటు పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల కన్నా ప్రైవేట్ పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రుణాలను ఇబ్బంది లేకుండా చేయటం కోసం రెండు ప్రత్యేక స్కీములను ప్రవేశపెట్టారు. ఈ రోజు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ప్రధాన సమస్యగా వాటి నిరర్ధక ఆస్తులు తయారైనాయి. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో 70 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం కోసంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు రంగానికి గృహ నిర్మాణానికి రుణాలు అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈరోజు ద్రవ్య అందుబాటు సమస్య (లిక్విడిటీ)తో సతమతమవుతున్న ఎన్బిఎఫ్సి సంస్థలకు కూడా వనరులు లభించే విధంగా మరో స్కీమును బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కావలసిన వనరుల సమీకరణకు విదేశాలలో బాండ్లను జారీ చేయటానికి ప్రతిపాదించారు. దీనివలన దేశీయ రుణ మార్కెట్ మీద ఒత్తిడి తగ్గి తద్వారా వడ్డీ రేట్లు కూడా తగ్గి సులభంగా ప్రైవేట్ రంగానికి రుణాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కార్పొరేట్ టాక్స్ అంశంలో కూడా కంపెనీలకు వెసులుబాటు కల్పించడం ఆయా కంపెనీలు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తాయి. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కొన్ని చర్యలను బడ్జెట్లో పొందుపరిచారు. మౌలికం కాని, లాభసాటి కాని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా అదనపు వనరులను సమీకరించే యత్నాన్ని ఈ బడ్జెట్లో కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మూడు ప్రధాన అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు అమెరికా విధిస్తున్న ఆంక్షల మూలంగా ఎన్నో పరిశ్రమలు చైనా దేశం నుంచి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇవి భారతదేశంలో బహుళజాతి కంపెనీలను ఏర్పరిచే విధంగా కేంద్రీకృత దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం ఈనాడు ఉపాధి కల్పన లేని వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా తయారైంది. పెద్ద ఎత్తున యాంత్రీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్ల ప్రయోగం వలన ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అధిక మూలధన వినియోగం, తక్కువ ఉపాధి కల్పన ప్రధానమైన ఆర్థిక నమూనాగా ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది. ఈ విధానం జనాభా అధికంగా గల భారత చైనా లాంటి దేశాలకు మంచి పరిణామం కాదు. ఈ సమస్య ఎట్లా అధిగమించాలి అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ ప్రధాన అంశం దేశంలో ప్రాంతీయ ఆర్థిక అసమానతలు. దక్షిణ, పశ్చిమ భారతం ఆర్థిక పురోగతిలో ముందంజలో ఉంది. తూర్పు, ఉత్తర భారతం బాగా వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై అధిక వ్యయం ద్వారా ప్రైవేట్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తూర్పు ఉత్తర భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ వ్యయంతోను, ప్రోత్సాహాలతోనే జరిగే అంశం కాదు. ఆయా రాష్ట్రాలలో పరిపాలన సామర్ధ్యంలో, విధానాలలో మౌలికమైన మార్పు రావటం ఎంతైనా అవసరం. అప్పుడే పెట్టుబడులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
సామరస్యమే సరైన పరిష్కారం
ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగనప్పుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగలేదు. విభజన జరిగే నాటికి కే చంద్రశేఖరరావు అప్పుడే ఉద్యమ నేతగా ఉద్యమాన్ని నడిపి అధికార బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమానికి కారణభూతమైన అంశాలు వారి ఆలోచనలను ప్రభావితం చేయటం సహజమే. విభజన చట్టం లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉండటం కూడా విభజన అంశాల పరిష్కారంలో సమస్యలకు కారణమైంది. కాలక్రమేణా ఆవేశాలకు బదులు ఆలోచనలు ప్రధాన భూమిక పోషించే కొద్దీ సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ మహనీయుడు పేర్కొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి నేడు ఇలాంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది . కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణమే ఈ సమస్యల పరిష్కారానికి సరైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగుల విభజన పూర్తయినట్లే! నేడు మిగిలి ఉన్న విభజన సమస్యల పరిష్కారాన్ని గురించి ఆలోచించే ముందు గత ఐదేళ్లలో ఈ అంశాల పరిష్కారంలో పురోగతిని సమీక్షించుకుందాం. ప్రప్రథమంగా పరిష్కారమైన అంశం అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చాలా త్వరగా మొదటి ఆరునెలల్లోనే అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తయి రెండు రాష్ట్రాలకు వాళ్ళ కేటాయింపు అయిపోయింది. సరైన విధానాన్ని కమిటీ అనుసరించలేదని భావన కొందరు అధికారులకు ఉన్నా, వారు వారి రాష్ట్ర కేడర్లలో ఇమిడిపోయి పనిచేయడం ప్రారంభించారు. ఇక రెండో ప్రధాన అంశం ఉద్యోగుల విభజన. దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమలనాథన్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణకు, మరొక వైపు సమైక్యాంధ్రాకు జరిగిన ఉద్యమాలలో ఉద్యోగస్తులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో విభజన అంశంలో నిర్ణయాలు కొన్ని వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తుల కేటాయింపు చాలా జటిలమైన సమస్యగా తయారైంది. కానీ కమలనాథన్ ఆధ్వర్యంలో కమిటీ చాలా ఓర్పుతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరించింది. ఈరోజు కోర్టు సమస్యల దృష్ట్యా ఆగిపోయిన ఒకటి రెండు కేడర్లు తప్పితే మిగిలిన అన్ని కేడర్ల అధికారులను, ఇతర సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య కేటాయించారు. ఇది ఒక క్లిష్ట సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లేనని చెప్పాలి. ఇక పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థలు. షెడ్యూల్ 10 సంస్థలన్నీ ప్రధానంగా శిక్షణ నైపుణ్య తర్ఫీదు కోసం ఏర్పాటు చేసిన సంస్థలు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ సంస్థలను పొందుపరిచేటప్పుడు చాలా పొరపాట్లు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి చట్టబద్ధమైన మహిళా సంస్థల దాకా అన్నింటిని ఈ షెడ్యూల్లో పొందుపరచారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి ఈ సంస్థలకు సంబంధించిన విభజన ప్రధాన పాత్ర చోటుచేసుకుంది. దీనికి కారణం విభజన చట్టం చాలా లోపభూయిష్టంగా ఉండటమే. ఆస్తుల పంపకంలో ఇచ్చిపుచ్చుకోవచ్చు విభజన చట్టంలోని సెక్షన్ 75ను అనుసరించి ఇవి తమకే వర్తిస్తాయి కాబట్టి తెలంగాణ ఆరవ భాగంలోని ప్రకరణలకు అనుగుణంగా ఈ సంస్థలు తమవేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాదించింది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఈ సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దానిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల మూలనిధిని రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై కేటాయిస్తూ ఆస్తులు ఈ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేవంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఈ అంశాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు. ఈ సంస్థలను కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్కు నిధుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గానీ, తెలంగాణ గానీ సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఆ నిధులతో ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికి అనుగుణంగా ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నిధులు ఏపీకి వస్తాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఇక రెండవ ప్రధాన అంశం షెడ్యూల్ 9 సంస్థల విభజన. ఇవి అన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఈ సంస్థల విభజనకు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ షీలా భిడే నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 90 సంస్థల్లో 40 సంస్థలకు ఆ కమిటీ తన సిఫార్సులను అందజేసింది. మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిణి షీలా భిడే. ఆ కమిటీ సిఫార్సులను రెండు రాష్ట్రాలు ఆమోదించి ఈ అంశాన్ని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ వాణిజ్యపరమైన సంస్థల ప్రధాన కార్యాలయాలు విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య విభజితమవుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే ఆస్తులను తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ధరకు తీసుకుంటే ఉత్తమం. ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అంగీకారయోగ్యం కాకపోతే పరస్పర అవగాహనతో కొన్ని భవనాలను తెలంగాణ, కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన భవనాలను మార్కెట్ ధరకు అమ్ముకుని ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థలను స్వరాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తుంది. పరస్పర అవగాహన తప్పనిసరి ఇక చట్టంలోని లోపం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి వాయిదా వేసిన పన్నులు, వారి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున ఇక్కడే చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి చట్టంలోని ఈ లోపాన్ని సవరించవలసిందిగా అభ్యర్థించింది. చట్టసవరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛందంగా ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయటం మంచి సంకేతాలను పంపిస్తుంది. ఇది వివాదాలకు తావు లేని అంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ బాకీలను తెలంగాణ చెల్లిం చాలని, లేదు.. ఆంధ్రప్రదేశే మాకు చెల్లించాలని ఒక వివాదం నడుస్తూ ఉన్నది. సామరస్యపూర్వక వాతావరణంలో ఈ అంశాన్ని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. నాకు తెలిసి నేను ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా పద్ధతుల్లో చెల్లించటానికి సమయం అడిగింది కానీ ఈ బాకీలు సరికావని ఏనాడు పేర్కొనలేదు. చాలా జటిలమైన సమస్య వెంటనే పరిష్కారం అవడానికి అవకాశం లేని సమస్య నదీ జలాల పంపిణీ. ఇది కేవలం తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన అన్ని రాష్ట్రాలకు చెందిన అంశం. రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఎన్ని వివాదాలు ఉన్నాయో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా అన్ని వివాదాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కేవలం నిపుణులతో కూడిన కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించవలసి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించటానికి కొంత సమయం పట్టవచ్చు. రెండు రాష్ట్రాలలో ఈ విభజన అంశాల పరిష్కారానికి ఏర్పడిన కమిటీలోని అధికారులకు సర్వీసులో సమర్థులైన, నిష్పాక్షికతకు పేరొందిన ఆఫీసర్లుగా మన్నన ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాల పరిష్కారాన్ని వీరికి వదిలేసి వారి సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే త్వరితగతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఎవరి తనిఖీలైనా భద్రత కోసమే!
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేసేటప్పుడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా దానిని విస్మరించి విమానయాన శాఖ వారు సాధారణ ప్రయాణికుడిలాగా తనిఖీలు నిర్వహించారని ఇది ఉద్దేశపూర్వకంగా ఆయనను కించపరచడానికి చేసిన చర్యగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించి నిరసనలు తెలపడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి విమాన శాఖ రక్షణ విభాగం ఈ అంశంలో వివ రణ ఇస్తూ కేవలం గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేరుగా విమాన ప్రవేశం ఉంటుందని జడ్ ప్లస్ విభాగానికి చెందిన ప్రయాణికులను కూడా సాధారణ ప్రయాణికుల గానే పరిగణించి తనిఖీలు నిర్వ హిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి మూలం రాజకీయ నాయకులు వారి అభిమానులు ఊహించుకున్న లేని ప్రాధాన్యత. మర్యాదలు ప్రత్యేక సదుపాయాలు పదవికి సంబంధించినవే కాని వ్యక్తికి సంబంధించినవి కావు అనే ప్రధానమైనటువంటి అంశం మరిచిపో బట్టే చాలామంది నాయకులు పదవీచ్యుతులు అయిన పిదప కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కని పరిపాలన సంçస్కృతులు ఉన్న ఐరోపా దేశాలలో పదవిలో ఉన్నప్పుడే ప్రధాన మంత్రులు ఇతర ఉన్నత స్థాయి నాయకులు మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఉపయోగించుకోవటం, సైకిల్పై పార్కులు లాంటి బహిరంగ స్థలాల్లో వచ్చి మిగిలిన వారితో కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది. కానీ భారతదేశం లాంటి దేశాలలో వలస పాలన వారసత్వంగా పాలకులకు పాలితులకు మధ్య మొదటినుంచి దూరం ఉంటూనే ఉన్నది. అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలలో సివిల్ లైన్స్ ప్రాంతాల్లో ఉండటం ఆఫీసు హంగామా, దర్జా ,బిళ్ళ బంట్రోతు లు ఒక కృత్రిమమైన వాతావరణాన్ని అధికారంలో ఉన్నవారి చుట్టూ కల్పిస్తాయి. వలస పాలనకు చిహ్నాలైన ఇదే విధానాలను గణతంత్ర ప్రజాస్వామ్యం అయిన తరువాత కూడా భారతదేశంలో మనం కొనసాగిస్తూనే ఉన్నాం. దీంతో రాజకీయ నాయకులు స్వతంత్ర భారతంలో ఆధునిక కాలపు మహారాజులాగా తయారైనారు. సరైన నియంత్రణ బాధ్యతాయుత విధానాలు లేకపోవడంతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, దుబారా దర్జా ఖర్చులకు అలవాటై పోయారు. అంతేకాకుండా పదవి కోల్పోయిన తర్వాత కూడా అవే సదుపాయాలను జన్మహక్కు లాగా భావించి ప్రవర్తించడం జరుగుతున్నది. పదవి కోల్పోయిన తర్వాత కూడా ఈ నాయకులు ప్రభుత్వ నివాసాలు వదలక పోవడం విద్యుత్తు, నీటి చార్జీలు కూడా కట్టకపోవడం వీరికి పరిపాటి అయిపోయింది. చివరకు కోర్టులు కలగచేసుకొని ప్రభుత్వ నివాసాల నుంచి వీరిని బయటికి పంపించి వారిచే బిల్లులు కట్టించే పరిస్థితి ఏర్పడింది. ఈ జాడ్యం రాజకీయ ప్రముఖులకే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది. తమను ప్రత్యేకంగా గుర్తించి మర్యాదలు చేయాలని భావించడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య టోల్గేట్ వద్ద ఒక మంత్రిగారి భార్య ప్రవర్తించిన విధానం ఈ అహంకార భావన ఫలితమే. ఇటువంటి దౌర్జన్యాలు అధికారులపై రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు చేయటం సాధారణం అయిపోయింది. సరైన నియంత్రణ విధానాలు ఆడిట్ విధానాలు లేకపోవటంతో రాజకీయ ప్రముఖులు నాయకులు వారి హోదాకి, స్థాయికి మించిన అనేక సదుపాయాలను, సౌకర్యాలను పొందుతున్నారు. సరైన ఆడిటింగ్ విధానాలు, నియంత్రణల ద్వారా వీరందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించేటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన సంఘటనకు వస్తే ఇది అధికారికంగా ఉన్న సదుపాయము సౌకర్యము కానే కాదు. కేవలం ఆయన అభిమానులు ఊహించుకున్న ప్రాధాన్యం లేని సౌకర్యాలు మాత్రమే. ఇతర జడ్ కేటగిరి వ్యక్తుల లాగానే ఆయనను విమానయాన సంస్థ వారు పరిగణించడం జరిగింది. ఈ అంశంపై విమానయాన భద్రత విభాగం వారు ఇచ్చిన వివరణలో ఒక అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. వారి వివరణ గవర్నర్ ముఖ్యమంత్రి స్థాయి వారికి మాత్రమే తనిఖీ లేని ప్రవేశానికి అవకాశం ఉన్నది. తనిఖీ అనేది ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేసే అంశం కాదు. మిగిలిన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసే చర్య. అందువలన దీని నుంచి ఎంత గొప్ప వారైనా మినహాయింపు ఉండటానికి అవకాశం లేదు. అందరిని భద్రత తనిఖీ తర్వాతనే ప్రవేశం ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ముందే తెలియదు కదా! వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
-
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు..!
సాక్షి, గుంటూరు: ‘నా తర్వాత ఉపద్రవం’ అని ఫ్రాన్స్ దేశంలో లూయీ ప్రభువు చెప్పినట్టు గత ఐదేళ్ల చంద్రబాబు పాలన ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో ఐవైఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు. ఇటీవల రెండు టీడీపీ అనుకూల పత్రికల్లో ‘అప్పుల అంచులో ఆంధ్రప్రదేశ్’ అనే కథనాలు వచ్చాయని, అది నిజం కాదని రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయం భారీగా చూపారని, రూ.10వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారని, వాస్తవానికి అంత మొత్తంలో కేంద్రం నిధులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఎప్పుడైతే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందో అప్పుడే పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను సైతం తగ్గించారన్నారు. రూ.30 వేల కోట్ల వరకూ అప్పులు చేస్తామని బడ్జెట్లో చూపారని, అంత మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అప్పులు ఇస్తారా అన్నది అనుమానమేనన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, కానీ ఆ అప్పు దేనికోసం చేస్తున్నామనేది ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.సి.రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11.5 శాతం అభివృద్ధి రేటు ఉందంటున్నారని, అందుకు సరిపడా పన్ను వసూళ్లు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మాత్రం పెరగడం లేదన్నారు. దీనికి తోడు గత రెండేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగాయన్నారు. 3 లక్షల కోట్లకు చేరిన రుణభారం 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.85వేల కోట్లుగా ఉన్న రుణ భారం గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.3.05లక్షల కోట్లకు చేరిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ రుణానికి తోడు ప్రభుత్వ ఏజెన్సీలు, కార్పొరేషన్లు రూ.లక్ష కోట్లు అప్పుగా పొందడానికి సైతం ప్రభుత్వం గ్యారంటీగా ఉందన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30వేల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కార్పొరేషన్లు, సంస్థలకు పీడీ అకౌంట్ ఉండేదని, ఆ అకౌంట్ ఆధారంగా ఆయా కార్పొరేషన్లు, సంస్థ అవసరాలు తీర్చుకోడానికి డబ్బును ఉపయోగించుకునేవారని, ఆ పీడీ అకౌంట్లలో డబ్బు లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. భారత్లోకెల్లా అత్యధికంగా దుబారా వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరొందిందన్నారు. కాంగ్రెస్ను తిట్టడానికి నవనిర్మాణ దీక్షలు, బీజేపీని తిట్టడానికి «ధర్మపోరాట దీక్షలు అని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఒక ఇల్లు, ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుందని కానీ, చంద్రబాబుకు మాత్రం నాలుగు క్యాంప్ ఆఫీస్లు ఉన్నాయన్నారు. సమాజానికి, ప్రజలకు, అభివృద్ధికి ఉపయోగపడని వాటి కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు డీఎల్ సుబ్రహ్మణ్యం, బాలభారతి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి కొమ్ముకాసిన మీడియా సంస్థలు రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు నడపడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, అయితే కొన్ని మీడియా సంస్థలు టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రజలకు వాస్తవాలను చూపించడం లేదని ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు విమర్శించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని బొక్కేశారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో 25 మంది వెళ్తారని, స్పెషల్ ఫ్లైట్లు, స్టార్ హోటళ్లలో జల్సాలు చేసి డబ్బు వృథా చేశారన్నారు. నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అమరావతి, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో అంచనాలను అంతకంతకూ పెంచుతూ టీడీపీ నాయకులు కమీషన్లు బొక్కేశారని దుయ్యబట్టారు. ఉన్న ప్రాజెక్టులను పునరుద్ధరించి, మౌలిక వసతుల కల్పనకు టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఉంటే రాష్ట్రం గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. -
కేబినెట్ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు!
-
కేబినెట్ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్ అధికార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి.. చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తే మరో ఐదేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు మరో వాదన వినిపిస్తున్నారని ఐవైఆర్ మండిపడ్డారు. -
పర్యవేక్షణ లోపమే ‘ఇంటర్’ వైఫల్యం
పరీక్షా ఫలితాల వెల్లడి కోసం ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత, దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్ బోర్డుపై ఉన్నాయి. ఈ బాధ్యతలను తెలంగాణ ఇంటర్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది నిజం. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు.. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. అలాంటి పర్యవేక్షణ, నిర్ధారణ లోపమే పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యానికి కారణం. భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయమవుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరొక విభాగానికి మారే అవకాశం లేని మన విద్యా విధానంలో ఇంటర్మీడియట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్లయ్యేది, ఇంజనీర్లయ్యేది, ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలతోపాటు తామూ శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష. ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ, జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారంగా రాజీనామాలు చేయడానికి సమాయత్తపడటం సీఎంలు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ నేడు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు. ఇలాగే 1997లో ఒకసారి ఇంటర్ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్ బోర్డు తీవ్రమైన తప్పులు చేసింది. నాటి సీఎం ఇంటర్ బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని భావించినా, నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు. అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్మాల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు నేడు మళ్లీ తన పరిమితులను చాటుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. తమ ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ.. మరొకరి అసమర్థతకూ, నిర్లక్ష్యానికీ పిల్లలు బలైపోయారు. తెలం గాణలో ఇటీవలి ఎన్నికలలో పూర్తిగా నైతిక స్థైర్యం దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధంగా పనికి వచ్చింది. ప్రభుత్వం పక్షం నుంచి వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న విధి విధానాలే నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ విద్యాపరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగానీ అధ్యక్షులుగా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో లాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్ బోర్డుకు రీజనల్ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలను రాష్ట్రమంతటికీ కేంద్రీకృత విధానంలో ఇంటర్ బోర్డు ద్వారా వెల్లడిస్తున్నారు. గతంలో సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి ఫలితాలను క్రోడీకరించి ఎలక్ట్రానిక్ విధానంలో వెల్లడించసాగారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఏపీలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్ బోర్డుకు అందజేయడం జరిగేది. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించే జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సీసీఎల్గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్ షీట్ పరీక్ష ద్వారా విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచినప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జేఎన్టీయూ నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. అటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయ సహకారాలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయంగా జేఎన్టీయూ వారి సేవలను వినియోగించుకోకుండా, అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని తెలం గాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంలో తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్నప్పటికీ, వాటిని బోర్డు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితికి దారితీసింది. నేడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన గ్లోబరీనా సంస్థపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఇంటర్మీడియట్ బోర్డును అధికారులను తప్పుపట్టారు. ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశి తంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుపై ఉంది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహిం చారు. అక్కడ నేడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించగలిగారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలోను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలోనూ, దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్నా, విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నా, ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో, ఫలితాలు వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తే బాగుంటుంది. కొసమెరుపు: మొదట్లోనే చెప్పినట్లు, లోపాలకు నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రహసనప్రాయంగా మారిపోవడానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్గా చేరక ముందు జరిగిన సంఘటన. 1986లో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమాతో లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ‘ఆమోదించండి’ అని తన ఆమోదముద్రను తెలియజేశారు. సీఎం ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీ నామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించినప్పటికీ.. అంతర్గతంగా ఖిన్నుడైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యులతో మీరు ఆ రోజు సరైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయిఉండేది కాదని వాపోయారట. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
సీఎం ఆరోపణల పర్వంలోకి వెళ్లడం దురదృష్టకరం
-
స్వీయ తప్పిదమే పతన కారణమా?
పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయటం మొదలు పెట్టగానే అంతవరకు ప్రభుత్వ ఏకస్వామ్య విధానాల వలన రక్షణ పొందిన చాలా రంగాల్లో ప్రైవేట్ రంగ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విమానయాన రంగాన్ని కూడా సరళీకరించారు. దానిలో భాగంగా ఆనాడు మోడీ లుఫ్ట్, దమానియా, ఎన్ఈపీసీ, జెట్ ఎయిర్వేస్ లాంటి విమానయాన సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మూడు నాలుగేళ్లలోనే వాటిలో చాలా సంస్థలు మూతపడినా, జెట్ ఎయిర్లైన్స్ మాత్రం అప్పటి నుంచి తన కార్యక్రమాలను సాగిస్తూ, నష్టాల దృష్ట్యా ఒక వారం క్రితం తన విమాన సర్వీసులను నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్కు రుణాలు మంజూరు చేసిన సంస్థలు ఉదారంగా కొంత ఆర్థిక సహాయం ఈ సమయంలో అందించి ఉంటే విమాన సంస్థ మూసేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పనిచేసే ఉద్యోగులకు ఆసరాగా ఉండేదని, విమానయానంలో ధరలు పెరగకుండా చూడటానికి కూడా తోడ్పడేదని కొందరి వాదన. ఈ వాదన సరికాదు. ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు, కొద్ది కాలంలో వచ్చే అంశం కాదు. సంస్థకు ఆర్థిక సమస్యలు చాలాకాలం నుంచే ప్రారంభమై ఉంటాయి. తొలి దశలో రుణాలు మంజూరు చేసిన సంస్థలు సరైన పాత్ర పోషించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. జెట్ ఎయిర్వేస్ను కాపాడుకునే అవకాశాలు అప్పుడు మెండుగా ఉండేవి. పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు రుణ సహాయం చేయడం వల్ల సంస్థ కొన్నాళ్ళు ఆక్సిజన్పై బతకడానికి సహాయపడుతుందేమో కానీ సంస్థ పరిస్థితిలో ఎటువంటి మౌలికమైన మార్పు తీసుకొని రావు. ఈనాడు ఇచ్చే సహాయం బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోతుంది. బ్యాంకులు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన. జెట్ విమానయాన సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్లో చాలామంది ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిగా ఎదిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. రాజకీయ నేతలను, అధికారులను సంతృప్తి పరచడం ద్వారా వారి సహాయ సహకారాలతో వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యక్తులు వీరందరూ. వీరు సరళీకృత ఆర్థిక విధానంలో వచ్చే పోటీ పరిస్థితిని తట్టుకుని నిలబడే సామర్థ్యం శక్తి ఉన్న వ్యక్తులు కారు. ఆ కోవకు చెందిన వ్యక్తి జెట్ ఎయిర్వేస్ అధినేత. ఇండిగో స్పైస్ జెట్ లాంటి ఆర్భాటం లేని విమానయాన సంస్థల పోటీని ఈయన తట్టుకోలేకపోయారు. ఎక్కువ ధర వెచ్చించి కొన్న సహారా విమాన సంస్థ ఎయిర్ దక్కన్ కింగ్ ఫిషర్ సంస్థకు ఏరకంగా గుది బండ అయిందో జెట్ ఎయిర్వేస్కీ అట్లాగే అయింది. వీటన్నిటికీ మించి టికెట్ల అమ్మకం కోసంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఏజెంట్లకు చెల్లించిన రుసుము సంస్థ ఖర్చులలో 12 శాతం ఉంది. ఇండిగో లాంటి సంస్థలకు ఇది రెండు శాతం మాత్రమే. 2017– 18లో రూ.2,826 కోట్లు ఈ పద్దు కింద ఏజెంట్లకు చెల్లించడమైంది. గత నాలుగేళ్లలో ఈ పద్దు కింద కమీషన్గా చెల్లించిన మొత్తం రూ. 10 వేల కోట్లు. ఈరోజు ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తం కన్నా ఇది ఎక్కువ. జెట్ ఎయిర్వేస్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కంపెనీని ప్రమోట్ చేసిన నరేష్ గోయల్ మాత్రమే కాక మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాన్ని విస్మరించటానికి కారణాలు చెప్పవలసిన బాధ్యత ఆడిటర్లకు, సంస్థలో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లకు ఉన్నది. సంస్థ వనరులను కొందరు బినామీలకు బదిలీ చేయటానికి యాజమాన్యం ప్రమోటర్స్ ప్రయత్నం చేశారా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాలలో పనిచేసే ప్రైవేట్ సంస్థలు అన్నీ విజయవంతం కాకపోవచ్చు. పోటీ విధానంలో సమర్థ సంస్థలే దీర్ఘకాలంలో మనగలగటం జరుగుతుంది. అసమర్థ సంస్థలు మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోలేక మూతపడటం సహజమే. కానీ సంస్థ మూతపడటానికి కారణం ప్రమోటర్లు, యాజమాన్యం చేసిన అవినీతికర కార్యక్రమాలు అయితే ఆ ప్రమోటర్లు యాజమాన్యం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైతే వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థ విషయంలో మాత్రం సంస్థ మూత పడటానికి మార్కెట్ ప్రేరేపిత కారణాలకన్నా నిర్వహణ లోపాలు అనైతిక విధానాలు ప్రధాన కారణాలని అనిపిస్తున్నాయి. ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాలపై దృష్టి సారించి నిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు -
ఉన్నతాధికారులపై నిందలు హానికరం
తనకు అనుకూలంగా పనిచేస్తేనే సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం.. లేకపోతే అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం ఏపీ సీఎం చంద్రబాబుకు పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్నవిధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం తన అనుకూల మాధ్యమాలకు అలవాటు అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నించడం ఆయనకూ, అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన సీఎం వ్యక్తిగత స్థాయిని తుడిచిపెట్టేశాయి. నేను సర్వీసులో చేరిన కొత్తలో శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఎమ్మార్ పాయ్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్న ఆ రోజుల్లో నాటి సీఎం చెన్నారెడ్డి వారిని విస్మరించి వారి కన్నా సర్వీసులో జూనియర్ని చీఫ్ సెక్రటరీగా చేశారు. అపారమైన పరిపాలన అనుభవం నిజాయతీ, మంచితనం కలిగిన వ్యక్తి. పరిపాలన శిక్షణ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తూ మాకందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తన అనుభవాలను మాతో పంచుకుంటూ ఉండేవారు. వారు సర్వీస్లో చేరిన కొత్తలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది వివరిస్తూ, బెజవాడ గోపాలరెడ్డి లాంటి సీఎంలు తమవంటి కలెక్టర్లతో ఎంత మర్యాద పూర్వకంగా ప్రవర్తించేవారో చెప్తూ ఉండేవారు. మేము సర్వీసులో చేరేనాటికి ఈ ప్రమాణాలు చాలా తగ్గినప్పటికీ అధికారులకు, ప్రభుత్వ సర్వీసులకు చాలా విలువ ఉండేది. నేను విజయవాడ సబ్ కలెక్టర్గా పని చేసే రోజుల్లో చనుమోలు వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. అధికారులకు గౌరవం ఇవ్వటంలో, రాజకీయ సత్ప్రవర్తనలో ఆయనకు ఆయనే సాటి. ఆ కాలంలో ఎవరికో ఒకరికి సిమెంటు కేటాయించాలని సిఫార్సు చేశారు. అయితే ఆ వ్యక్తి అంతకుముందు నాతో ఎట్లా ప్రవర్తించిందీ వివరించి నిర్మొహమాటంగా ఇచ్చేది లేదని చెప్పాను. ఆ వ్యక్తికి ఏ స్థాయిలో అక్షింతలు పడ్డాయి అంటే రెండవ రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. ఆనాటికే దిగజారుడుగా మాట్లాడే చాలా మంది మంత్రివర్యులు ఉన్నా, చనుమోలు వెంకటరావు లాంటి మర్యాదస్తులేన రాజకీయ నాయకులు చాలా మందే ఉండేవారు. కాలక్రమేణా ఇది తగ్గుతూ వచ్చి ఈనాడు అధికారులు అంటే చులకన భావం రాజకీయ నాయకులలో జాస్తి అయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం అధికారులలో అవినీతి పెరగటం. అవినీతిపరుడైన అధికారిని ఏ విధంగా తమ లాభం కోసం ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు చూస్తారే కానీ అతనిని గౌరవంగా చూసే అవకాశం తక్కువ. అవినీతిపరుడైన అధికారికి రాజకీయ నాయకుడికి వ్యవస్థలో ఆత్మీయమైన అవినాభావ సంబంధంఉంటుంది. అవినీతిపరులైన అధికారుల సంఖ్య పెరగటంతో నీతిపరులైన అధికారుల అవసరం వ్యవస్థకు లేకుండా పోయింది. పరిపాలనా యంత్రాంగంలో నిలబడాలంటే అటువంటి అధికారులు కూడా కొంత సర్దుకొని పోవలసిన అవసరం ఏర్పడింది. చట్టాలు గుడ్డిగా ఉండటంతో అవినీతిపరులైన అధికారులు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నారు. విలువలకు ప్రాధాన్యమిస్తూ తప్పని పరిస్థితుల్లో ఫైళ్ల పైన కేవలం రూల్స్ పాటించకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులు దోషులుగా నిలబడుతున్నారు.. బలైపోతున్నారు. ఇక అధికారులు చులకన కావడానికి మరొకప్రధాన కారణం.. విలువ లేని వ్యక్తులు రాజకీయాలలో ఉన్నత స్థానాల్లోకి రావటం. అడ్డదారిలో డబ్బులు చేసుకొని డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకునే ఈ చౌకబారు రాజకీయ నాయకులకు ఉచ్చ నీచాలు తెలియటం లేదు. నడమంత్రపు సిరి లాగా నడమంత్రపు అధికారం చేతిలోకి రాగానే కొందరు రాజకీయ నాయకులకు కళ్ళు నెత్తికి ఎక్కటం సహజం. ఈ మధ్య ఒక మంత్రివర్యులు ఒక విశ్రాంత అధికారిని ఉద్దేశించి ఉద్యోగంలో ఉన్నప్పుడు గాడిదలు కాచారా అనటం ఇందుకు నిదర్శనం. ఈ రెండు ప్రధాన కారణాల దృష్ట్యా ఈనాడు అధికారులు రాజకీయ నాయకుల దృష్టిలో చులకన అయిపోతున్నారు. మూడవ కారణం.. భారత రాజ్యాంగంలో అధికార వ్యవస్థను రాజకీయ ప్రమేయం లేని తటస్థ వ్యవస్థగా పొందుపరిచారనే ప్రధాన అంశాన్ని మర్చిపోయి కొందరు అధికారులు ఒక పార్టీకో, పార్టీ నాయకులకో కొమ్ముకాయడం. దీనివలన అధికార వ్యవస్థ నిలువుగా చీలి రాజ్యాంగంలో పొందుపరచిన తటస్థ వ్యవస్థకు బదులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న టఞౌజీlటటyట్ట్ఛఝ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాజకీయ నాయకత్వం మార్పు జరగ్గానే అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయి కొత్తవారు పదవిలోకి రావటం దీనికి నిదర్శనం. అటువంటి సమయంలో తటస్థ అధికార విధానానికి అర్థం లేకుండా పోతుంది. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని టఞౌజీlటటyట్ట్ఛఝను ప్రవేశ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ నాటకాలకు అవసరం లేకుండా గెలుపొందిన పార్టీకి అనుకూలంగా వారి సలహాదారులు వస్తారు. సలహా ఇస్తారు. వారితోపాటే నిష్క్రమిస్తారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకులు, అధికారుల సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన కాలక్రమేణా మార్పు. ఈ సాధారణ అంశాలకు సంబంధం లేకుండా గత వారంలో అధికారులను చులకన చేసి ఏపీ సీఎం రెండు సందర్భాలలో మాట్లాడారు, ప్రవర్తించారు. ఎన్నికల నిర్వహణ తేదీ కన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇటువంటి విషయాలకు సీఎంలు సాధారణంగా ఒక సీనియర్ నాయకుడిని పంపించడం పరిపాటి. అంతేకాకుండా ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక సాధారణమైన నాయకుడు కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా కీర్తిని గడించిన నాయకుడు. మమతా బెనర్జీలాంటి నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ధర్నా చేయడం ముఖ్యమంత్రిగా ధర్నాకు దిగటం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ చంద్రబాబులాంటి లబ్ధప్రతిష్టులు ఈ రకంగా చేయటం వారి స్థాయికి తగదు. ఇంతేకాక ప్రధాన ఎన్నికల అధికారిని దోషిగా చూపెడుతూ ‘మీ కార్యాలయమే మూసుకోవచ్చు కదా’ అన్న ధోరణిలో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి సీఎం హోదాను గౌరవించి చాలా సభ్యతతో, పద్ధతిగా ప్రతిస్పందించారు. సీఎం హోదాను, గౌరవాన్ని కాపాడారు. గట్టిగా సమాధానం చెప్పి సహేతుకంగా వాదనలు వినిపించి ఉంటే ముఖ్యమంత్రి గారి హోదాకు భంగం కలిగి ఉండేది. దురదృష్టం ఏమిటంటే ఆయన నమ్రతను, సభ్యతను బలహీనతగా చిత్రీకరిస్తూ ఏదో తప్పు చేశాడు కాబట్టి సీఎంకి సమాధానం చెప్పలేదు అంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని కొనసాగించి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం. ఇక ఎన్నికలు అయిన రెండవ రోజు సీఎం ఏకంగా ప్రధాన కార్యదర్శినే లక్ష్యంగా చేసుకుని తన విమర్శలు సంధించారు. ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నిస్తూ ఈవీఎంల విషయం ప్రస్తావన చేస్తూ ప్రధానకార్యదర్శి అంశం కూడా లేవనెత్తారు. తాను నియమించిన ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత్ని తొలగించి మరొకరిని ముఖ్య కార్యదర్శిగా ఎన్నికల సంఘం ఎట్లా నియమిస్తుంది అని ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత జగన్తో పాటు సహ నిందితుడు అనీ, అటువంటివారిని ప్రధాన కార్యదర్శి ఎట్లా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా చంద్రబాబు మర్చిపోయిన విషయం ప్రధాన కార్యదర్శి మార్పుకు ఎవరైనా కారణం అయితే అది తానుమాత్రమే. ఎన్నికల షెడ్యూలు విడుదల తరువాత అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం అధీనంలోకి వస్తుందని తెలిసి కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి బేఖాతర్ చేసే విధంగా సీఎం నిర్దేశించారు. వారి ఆంతరంగిక అధికార వర్గం ఈ విషయంలో సరైన విధి విధానాలను సీఎంకు వివరించ కుండా ఆయన అభిప్రాయానికే వత్తాసు పలికారు. ఇటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రధాన కార్యదర్శి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అందువల్లనే ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించుకుని అన్ని విధాల అర్హుడైన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం అర్హతల ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని విధాల అర్హులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అర్థరహిత అనవసర అభాండాలు వేయడం ఆయన స్థాయికి తగని పని. మనకు అనుకూలంగా పనిచేస్తేనే నిష్పాక్షిక సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం లేకపోతే అసమర్థులుగా అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం సీఎంచంద్రబాబుకి పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్న విధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం ఆయన అనుకూల మాధ్యమాలకు పరిపాటి అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నిచడం ఆయనకు, ఆయన అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రధాన కార్యదర్శి విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా చాలా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన వారి వ్యక్తిగత స్థాయిని ఒక్క పెట్టుతో తుడిచి వేశాయి. దీనికి కారణం ఆయన నిజమైన వ్యవహారశైలి.. తను కష్టపడి ప్రపంచానికి ప్రదర్శించిన కృత్రిమ వ్యవహార శైలి కన్నా పూర్తిగా భిన్నంగా ఉండటమా? లేక ఎన్నికలలో పరాజయ సంకేతాలు రావటంతో ఏర్పడిన నిరాశ నిçస్పృహలా? వేచి చూడాలి. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ మెయిల్ : iyrk45@ gmail. com -
బాబు ఇదా అనుభవం?
-
పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలాంటీది: ఐవైఆర్
-
‘పోలవరం ఓ కామధేనువు.. క్యాపిటల్ ఓ కల్పవృక్షం’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏటీఎమ్ లాంటిదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. పోలవరం డ్యామ్ పూర్తి కాకుండానే మే నెలలో నీళ్లు ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. చంద్రబాబుకు పోలవరం ఒక కామధేనువు, క్యాపిటల్ సిటీ కల్పవృక్షం లాంటివని ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థలన్నీ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇష్టానుసారంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు ఒక సామాజిక వర్గానికి ఇవ్వడం.. నాలుగేళ్లు గడిచిన తరువాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పనిచేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి 2019 ఎన్నికల్లో డబ్బులతో ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా అవినీతి పెంచారని మండిపడ్డారు. -
అయిదేళ్లు సాగినదంతా దోపిడీనే
ఏ పని చేసినా దానివల్ల నాకేమిటి? రాజకీయంగా, ఆర్థికంగా నాకేమొస్తుంది? అనే స్వార్థ కోణంలోనే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే అభిలాష ఆయనకు ఏ కోశానా లేదు. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందాలనే స్వార్థంతోనే కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు ఇటీవల వివిధ కులాలు, వర్గాలకు 31 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను కుంభకోణాలమయంగా మార్చేశారు. ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం.. అందినకాడికి దోచేయడం చందంగానే ఈ ఐదేళ్లూ ప్రభుత్వం నడిచింది. ప్రభుత్వ భూములే కాకుండా దేవుళ్ల మాన్యాలు కూడా కొట్టేసేలా సాగిన కుట్రలకు లెక్కే లేదు. ప్రయివేటు విద్య, వైద్య రంగాలను నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రులను, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. బాబు అవినీతి, అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తూనే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, దీక్షలు, విహారయాత్రల పేరుతో లెక్కలకందనంత దుబారా చేశారు. అనుకూల మీడియాను వినియోగించుకుని చేయనిది చేసినట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంలో గోబెల్స్ను చంద్రబాబు ఎప్పుడో మించిపోయారు. సాక్షి, అమరావతి : ‘ఎక్కడైనా తప్పులు బయటపడితే విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉంటుంది. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా కుంభకోణాల్లో వాస్తవాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు పాతరేశారు. విశాఖపట్నం భూ కుంభకోణం, అమరావతి ల్యాండ్ స్కాం, విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులు ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. లోతుగా దర్యాప్తు జరిపిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయనే ఉద్దేశంతో వీటన్నింటినీ తూతూమంత్రం విచారణలతో ‘మమ’ అనిపించేశారు. ఒకరిద్దరు చిన్నవారిపై చర్యలు తీసుకోవడం ద్వారా విచారణ జరిపించినట్లు అనుకూల మీడియాలో పెద్దఎత్తున వార్తలు రాయించుకున్నారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రిటైర్డు) ఐవైఆర్ కృష్ణారావు. అంతేకాదు... బాబు జమానాలోని పక్షపాతాన్ని, పచ్చి నిజాలను పూసగుచ్చినట్లు కుండబద్ధలు కొట్టారు. ‘ఆయన ఎంతసేపూ తమ వర్గం, తమ కాంట్రాక్టర్లు, తమ రియల్ ఎస్టేట్ వ్యక్తుల మేలు కోసమే పాటుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో గతంలో సఖ్యతగా ఉన్నది కూడా రాష్ట్రానికేదో మేలు చేయాలని కాదు. వాళ్ల అనుకూలురుకు కేంద్రంలో కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, కావాల్సిన పనుల కోసమే. నాలుగేళ్లు వాళ్ల దృష్టి దానిపైనే ఉంది. అలాకాకుండా రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలపై దృష్టిపెట్టి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేదని’ ఐవైఆర్ విశ్లేషించారు. ఈ అయిదేళ్ల టీడీపీ పాలనలో ఏం జరిగింది? రాష్ట్రం పురోగమనంలో ఉందా? తిరోగమనంలో ఉందా? అందుకు కారణాలేమిటి? రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి? తదితర అంశాలపై ఐవైఆర్ అభిప్రాయాలివి.. ప్రభుత్వ డేటాను వాడుకోవడం పెద్ద తప్పు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎంత దరిద్రంగా సాగుతుందో చెప్పడానికి ఐటీ గ్రిడ్ వ్యవహారమే నిదర్శనం. సహజంగా పాలనలో సీఎం సమావేశానికి కూడా అన్ని విభాగాల వారు రారు. కానీ, ఎవరో అనామకుడు ఒక ప్రతిపాదన తెచ్చిస్తే దానిని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలన్నిటితో సమావేశం పెట్టారు. కమిటీ ఏర్పాటు చేసి వారిచేత పని చేయించారు. పోనీ, ఆ ప్రతిపాదన పెట్టింది ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్లాంటి పెద్ద సంస్థలు కాదు. రోడ్డున పోయే దానయ్య ప్రతిపాదనకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి మొత్తం ప్రభుత్వ డేటాను వాడుకుని పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూడటం చాలా పెద్ద తప్పు. ఇది చాలా దూరం వెళ్తుందని నేను భావిస్తున్నా. దోపిడీ కోసం ఇసుకను సాధనంగా వాడుకున్నారు. బాబు పాలన గురించి చెప్పాలంటే ‘ఇసుక పాలసీ’ చూస్తే చాలు. ఇసుకను ఎలా డీల్ చేయాలో ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతారనేది అతి ముఖ్యమైన ప్రశ్న. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం సాఫీగా జరిగిపోతున్న దానిని... వారి దోపిడీ కోసం చెడగొట్టారు. తాము వెనకుండి దండుకునేందుకు మొదట ‘డ్వాక్రా సంఘాలకు ఇసుక సరఫరా బాధ్యతలు’ అప్పగించినట్లు తెరపైకి తెచ్చారు. వాస్తవంగా అక్కడ డ్వాక్రా లేదు. మహిళలు లేరు. ఆ ముసుగులో తెలుగుదేశం నాయకులు వెనకుండి అనుచర, బంధుగణంతో అడ్డగోలుగా ఇసుక తవ్వించి అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. మొత్తం గందరగోళం చేశారు. ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. వీరి నిర్వాకానికి ఒక దశలో నిర్మాణ రంగానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు.. బియ్యం ఉడికాయా? లేదో చెప్పాలంటే ఒకటి రెండు మెతుకులు పట్టుకుని చూస్తే చాలంటారు. బాబు పాలనలో ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలాంటివే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ అంతా ఒక పెద్ద స్కామ్. ప్రతిచోటా ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం, సబ్ కాంట్రాక్టులు ఇచ్చేయడం, దోచేయడం. అయిదేళ్లుగా సాగుతున్నది ఇదే. ఈ నేపథ్యంలో పజలు బాగా ఆలోచించుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లు ఎన్నికల కోసమే.. ఈయన (చంద్రబాబు) మళ్లీ గెలిస్తే కాపు కార్పొరేషన్ ఉండదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండదు. ఎన్నికల ముందుపెట్టిన మొత్తం కార్పొరేషన్లలో ఏ ఒక్కటీ ఉండదు. ఇవన్నీ ఎన్నికల అవసరం కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థలు మాత్రమేనని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. వీటితో తమకేదో జరుగుతుంది, ఒరుగుతుంది, అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. మళ్లీ గెలిస్తే అన్నింటినీ తీసేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు తొమ్మిదేళ్ల పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకున్న వారెవరికైనా ఈ విషయం బోధ పడుతుంది. జంధ్యాల సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘నాకేంది?’ అనే తరహాలో చంద్రబాబు ఆలోచనంతా సాగుతుంటుంది. ప్రతి సమస్యకు, ప్రతి విధానానికి, ప్రతి అంశానికి నాకేంటి? పొలిటికల్గా నాకేంటి? అనే ఆయన ఆలోచిస్తుంటారు. ప్రజలకు మేలు చేస్తే ఆటోమేటిగ్గా రాజకీయంగా అనుకూల ఫలితాలు ఉంటాయనే విశాల దృక్పథం ఏనాడూ లేదు. ఆలయాలు, «ధార్మిక సంస్థలంటే ఆయనకు ఏమాత్రం పవిత్రతగాని, భక్తి గాని ఉన్నట్లు లేదు. ఈనాం చట్టాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు మార్చి అతి పెద్ద కుంభకోణం చేయబోతున్నారు. దేవుడి మాన్యాలు కొట్టేయడానికి పెద్ద పన్నాగం పన్నారు. దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న గ్రామంలో రూ.5 వేలు తీసుకునే అర్చకుడికి సాయం చేయడానికి ఈయనకు మనసు రాదు. అందులోనూ నాకేంటి? అని ఆలోచించే రకం. ప్రభుత్వ విద్యను నాశనం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ విద్యను నెత్తిమీద పెట్టుకుని ప్రభుత్వ విద్యను, కార్పొరేట్ ఆస్పత్రులను భుజాన మోస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే పేదలు భయపడేంతగా పరిస్థితిని దిగజార్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత రాష్ట ఆదాయం, పన్నుల్లో వాటా పెరిగాయి. అయినా దానిని విద్య, వైద్యంపై ఖర్చు పెట్టలేదు. కప్పిపుచ్చుకోవడానికి కొత్త సాకులు.. ఇటీవలి గుంటూరు, విశాఖపట్నం సభలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమీ మోసం చేయలేదని ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇంకో సాకు కోసం చూసుకుంటున్నారు. కేసీఆర్ను తీసుకెళ్లి అక్కడపెట్టి, రాష్ట్రం మీద ఏదో కుట్ర జరుగుతోందని చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కచ్చితంగా ఇందులో విఫలమవుతారు. ఎందుకంటే చంద్రబాబు ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. ఆయన పార్టీ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. రాష్ట్రం ఆయన కంటే, ఆయన పార్టీ కంటే చాలా పెద్దది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అనుకూల మీడియా ద్వారా పదికి వందసార్లు చెప్పి, వాళ్లు వందకు వెయ్యిసార్లు చెబితే ప్రజలు మోసపోతారనే భ్రమల్లో ఉన్నారు. అది ఎన్నటికీ జరగదు. బోగాపురాన్ని అడ్డుకున్నారు పని లేనప్పుడు, పని చేయనప్పుడు, వాస్తవంగా ప్రగతి సాధించలేనప్పుడు వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టుతుంటారు. బోగాపురం ఎయిర్పోర్టు టెండరు రద్దు చంద్రబాబు అవినీతి విధానానికి పరాకాష్ట. ఎయిర్పోర్టు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండరు వచ్చింది. దానితో త్వరగా ఒప్పందం కుదుర్చుకుని పనులకు అనుమతించి ఉంటే చక్కటి అద్భుతమైన విమానాశ్రయం రూపుదిద్దుకుని ఉండేది. అయితే, కమీషన్ల కోసం, కావాల్సిన వారికి కాంట్రాక్టును కట్టబెట్టడం కోసం బాబు ఈ టెండరును రద్దు చేశారు. ఈ ప్రభుత్వం ఎలా, ఎందుకు నడుస్తోందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఒక్క ఓడ రేవునైనా నిర్మించారా? వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చంద్రబాబు వెయ్యిసార్లు పైగా చెప్పి ఉంటారు. ఇక్కడ మంచిగా ఓడరేవులు కట్టుకోవచ్చని చెబుతుంటారు. అయిదేళ్లలో కట్టిన ఓడరేవు ఒక్కటి చూపించమనండి. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఈ సమయం ఎక్కువే కదా? మచిలీపట్నం ఓడరేవును అప్పటికే నవయుగ వారికి ఇచ్చారు. తలచుకుంటే భావనపాడు పూర్తి చేసి ఉండవచ్చు. కేంద్రం కోరినట్లు దుగరాజుపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంను చూపించి ఉంటే అదీ వచ్చి ఉండేది. మూడు ఓడ రేవులు వచ్చే అవకాశం ఉన్నా ఒక్కటీ కట్టకుండా... ‘ఐదేళ్లుగా రోజూ మాకు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని’ చెప్పుకుంటూ ఉంటే లాభం ఏముంటుంది? రియల్ ఎస్టేట్తో దండుకోవడమే లక్షం.. ఈనాం భూములుగానీ, ప్రభుత్వ భూములు గానీ, దేవుని భూములుగానీయండి ఏవైనా భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగానే సదావర్తి భూములపై కన్నేశారు. అదృష్టవశాత్తు కోర్టుల జోక్యంతో సదావర్తి భూములు వారి పాలుకాకుండా కొంతవరకు ఆగాయి. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చెడు జరిగితే ఇతరులపై నెట్టేస్తారు.. మంచి జరిగితే అంతా తన ప్రతిభ అని ప్రచారం చేసుకోవడం, ఏదైనా నిర్ణయం వివాదాస్పదమైతే అధికారులపై నెట్టేయడం ఆయనకు ఆది నుంచి అలవాటే. ఇది ఆయన విధానం కూడా. గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతివ్వాలని నిర్ణయించడం పెద్ద వివాదమైంది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఆ కమిషనర్ను తప్పించి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబే. మీడియాను అడ్డుపెట్టుకుని.. కాగితాల పైన కంపెనీలు సృష్టించి టీడీపీ నాయకులు అన్ని ప్రధాన ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములను కబ్జా చేసేశారు. విశాఖపట్నంలో, అమరావతిలో ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను కూడా వెనక్కు తీసుకుని ఆక్రమణదారులకు కట్టబెట్టే దుష్ట పన్నాగం సాగింది. ఏదైనా కుంభకోణం కొద్దిగా బయటకు పొక్కితే విచారణ జరిపించి దోషులను శిక్షించే పరిస్థితి లేదు. కాల్మనీ రాకెట్ను ఇలాగే తొక్కిపెట్టేశారు. విశాఖ భూముల కుంభకోణాన్ని, అమరావతి రియల్ ఎస్టేట్ కుంభకోణాన్ని పక్కకు పెట్టేశారు. అనుకూల మీడియా ఉన్నది కాబట్టి వ్యతిరేక వార్తలు రాకుండా, పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఎక్కడికక్కడ మూసేశారు. ఎదుటివారి విశ్వసనీయతను దెబ్బతీస్తూ కాలయాపన చేశారే గాని ఒక మంచి పారదర్శక పాలన ఇవ్వాలని ఏ రోజూ ప్రయత్నం చేయలేదు. అంతా తనవారికోసమే ఎంతసేపటికి తను, తన వర్గం, తనవాళ్లు... అనే చంద్రబాబు ఆలోచిస్తారు. వారి మేలు కోసం పనిచేయడం తప్పితే బాబు చేస్తున్నదేమీ లేదు. చేయాలన్న అభిలాష కూడా లేదు. చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. వినేవారుంటే చెప్పిందే చెబుతుంటారు. చేసే పనులకు చెప్పే మాటలకు ఏమాత్రం పోలిక, పొంతన ఉండదు. బాండ్లదంతా డాంబికమే.. అమరావతి కోసమంటూ బాండ్లుజారీ చేసి రుణం తీసుకున్నారు.దానికి ఎక్కడా లేనంత అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. బాండ్లను మార్కెట్లో అమ్ముకుంటే లాభ పడేది కొన్నవారే. సర్కారుకు ఏమీ రాదు. దానికి సీఎం ముంబై వెళ్లి మార్కెట్లో గంట కొట్టి అదో పెద్ద అద్భుతంలా రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్నారు. అక్కడ ఏమీ లేదు. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. అభివృద్ధిని చేజేతులా పాడు చేశారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కటి ప్రణాళికతో అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని చేజేతులా నాశనం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బును సరిగా వినియోగించుకోలేదు. అనవసరంగా నిందలు, అభాండాలు వేసి వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నారు. తను చేసిన పనులను చెప్పుకొని ఎన్నికలకు పోతే నెగ్గలేమని గుర్తించారు. అందుకని ఏదో ఒక నెపం కోసం వెదుకుతున్నారు. మొన్నటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి లబ్ధి పొందాలని చూశారు. దానిని ప్రజలు తెలుసుకున్నారు. కల్పిత వృద్ధి చూపారు చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి అంతా బూటకమే. ఇందుకు రాష్ట్రంలో తక్కువగా ఉన్న మానవాభివృద్ధి సూచికలే నిదర్శనాలు. శిశు మరణాల రేటు (ఐఎంఆర్), మాతా మరణాల రేటు (ఎంఎంఆర్) జీవిత కాలం (లైఫ్ ఎక్స్పెక్టెన్సీ)లను మానవాభివృద్ధి సూచికలకు ప్రామాణికాలుగా తీసుకుంటారు. వీటన్నింటా మనం వెనుకబడే ఉన్నాం. సీఎం చెబుతున్నట్లు నిజంగా జరిగి ఉంటే ఆ ప్రగతి మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబించాలి కదా? కానీ, రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి గతం కంటే గణనీయంగా తగ్గింది. బాబు మార్కు గొప్ప అభివృద్ధి ఇదేనేమో.! జాతీయ ఉత్పత్తి అంకెలను ఎంతంటే అంత పెంచేసి, దొంగ లెక్కలు చూపించి 10 నుంచి 15 శాతం వృద్ధి ఉందని చెబుతున్నారు. జాతీయ ఉత్పత్తి పెరిగితే పన్ను రాబడి నిష్పత్తి కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? మరి ఎందుకు లేదు? ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయం పెరిగితే ల్లలను బాగా చూసుకుంటారు. అందువల్ల వారి మరణాలు తగ్గాలి. ప్రసవానంతర మరణాలు తగ్గాలి. మరి ఆ సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు. ఊరికే జాతీయ అభివృద్ధి పెరిగింది... పెరిగింది... అంటే అంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. బాబు సమస్య రెండు రాష్ట్రాల సమస్యా? ప్రతిసారి తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించి ప్రయోజనం పొందాలని ఎత్తుగడలు వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అక్రమార్కులపై ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేస్తే తన వర్గీయులను కేంద్రం వేధిస్తోందంటారు. తనపై దాడికి వస్తే ప్రజలు రక్షణగా నిలవాలంటారు. దానిని కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా చెప్పుకొంటారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తే ఆంధ్ర – తెలంగాణ సమస్యగా చెబుతారు. ప్రభుత్వ సమాచారం లీకైన ఐటీ గ్రిడ్ గురించి మాట్లాడినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యంటారు. అసలు పదేళ్ల హక్కు ఉన్న హైదరాబాద్ను ఏపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదు. అయితే, తనకు సమస్య (ఓటుకు కోటి కేసు) వచ్చినందున హఠాత్తుగా విజయవాడలో వాలారు. ప్రజాస్వామ్యానికి మనకు తెలిసిన నిర్వచనం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అనేది. చంద్రబాబు దానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. కొంతమంది డబ్బులు వసూలు చేస్తారు. కొంత మంది దానిని ఖర్చుపెడతారు. ఇదే డెమోక్రసీ అన్నది బాబు మాట. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పట్టపగ్గాల్లేని దుబారా లోటు బడ్జెట్, డబ్బులు లేవని గొంతు చించుకుని అరుస్తున్నవారు ఎవరైనా పాలనలో కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. కానీ, రాష్ట్రంలో పై నుంచి కింద వరకు అటువంటి విధానం కనిపించడం లేదు. పైపెచ్చు అప్పు చేసి పప్పు కూడు చందంగా విపరీతమైన దుబారా సాగుతోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. పోలవరం, రాజధాని విహార యాత్రలు సర్కారు మితిమీరిన దుబారాకు నిదర్శనాలు. పోలవరంలో గాని, రాజధానిలో గాని నిజమైన ప్రగతి ఉంటే ఎవరినీ తీసుకెళ్లి చూపించాల్సిన అవసరం ఉండదు. అభివృద్ధి జరిగితే వారు ఎలాగైనా తెలుసుకుంటారు. సాగర్ నిర్మాణమే ఇందుకు నిదర్శనం. ఇక్కడ పోలవరంలో గాని, అమరావతిలో గాని జనం వెళ్లి చూడాల్సిన స్థాయిలో జరుగనందునే విచ్చలవిడిగా సర్కారు సొమ్ము ఖర్చు చేస్తూ విహార యాత్రకు తీసుకెళ్తున్నారు. చూపెట్టేందుకు ఏముందక్కడ?పోలవరంలో కొంత పెడుతున్నందున కొంత పని జరుగుతుంటుంది. ఎవరైనా వెళ్లి చూసి రావచ్చు. సర్కారు తీసుకెళ్లడం ఏమిటి? ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం? ధర్మ పోరాట దీక్షలంటూ ఆందోళన చేస్తున్నారు. ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం? ధర్మం మనవైపు ఉంటే కదా పోరాటం చేయడానికి?ఇచ్చినవన్నీ ఇవ్వలేదని చెబుతున్నారు. తప్పుడు లెక్కలు చూపించి కేంద్రాన్ని ప్రజల ముందు దోషిలా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. దాని నుంచి ఏమీ రాదని తెలుసు. అయినా అంతంత డబ్బు ఖర్చు పెట్టడమన్నది చాలా అవాంఛనీయం. -
మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం!
సాక్షి, అమరావతి: ‘మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రజలు ఆలోచించి.. మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అర్హతలేని రాజకీయ వారసులను ఓడించాలి’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. మంగళగిరిని ‘మందలగిరి’గా మార్చేస్తారేమో! ‘మంగళగిరికి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యముంది. అధికార బలంతో, ధనబలంతో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవాలనుకుంటున్నారు. స్థానికేతరుడైన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. భూ వ్యాపారం చేసుకోడానికి, వేలకోట్ల నల్లధనం దాచుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. మంగళగిరిపై లోకేష్కు ఎలాంటి ప్రేమలేదు. అభివృద్ధి పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. మంగళగిరి పేరును మందలగిరిగా పేరు మార్చే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. నారా లోకేష్ అమాయకుడేమీ కాదని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలన్నింటికీ ఆయన సూత్రధారి అని మండిపడ్డారు. లోకేష్ అంటే లోకాన్ని దోచేటోడని, ఈ నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇట్లో జరిగిన ఐటీ సోదాలను టీడీపీ నేతలు అడ్డుకున్న తీరు అమానుషమని మండిపడ్డారు. అడ్డకున్న వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉగ్రవాదులుగా టీడీపీ నేతలు మారారని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ దళారులకు అప్పజెప్పి టీడీపీ రాజకీయం చేస్తోందని, టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ వెంటనే రాజీనామా చెయ్యాలని అన్నారు. అన్య మతుస్తుల తరఫున ప్రచారం చేసే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం వెనక చంద్రబాబు ఉద్దేశం ఏమిటన్ని ప్రశ్నించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, ఆ పార్టీకి ప్రస్తుత ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాదని జీవీఎల్ పేర్కొన్నారు. -
‘ఎలాంటి హోదా ఇస్తారో రాహుల్ చెప్పాలి’
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఎలాంటి హోదా ఇస్తారో చెప్పడంలేదని బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ ఛీప్ మాయావతి పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తారా రాయితీలు లేని హోదా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు రాయితీలు లేని ప్రత్యేక హోదా ఇస్తే దాని కంటే ప్యాకేజీ బెటరన్నారు. చంద్రబాబు హోదాపై మాట్లాడి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మేనిఫేస్టో విడుదల చేయని చంద్రబాబు ఓట్లు ఎలా అడుతారని ప్రశ్నించారు. పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వల్పకాలిక ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని కోరారు. కులాలు వారిగా ఏర్పాటు చేసిన కొర్పొరేషన్లను భవిష్యత్తులో ఉంచుతారనే నమ్మకం లేదన్నారు. ఏపీ ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు.. అలా చేస్తే బీజేపీకి 50 సీట్లు ఎక్కువే వస్తాయన్నాని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబును ముంచేశారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలబిరుసుతో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా హైకోర్టు ఎక్కిన చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘ఎన్నికల సంఘంతో చంద్రబాబు దురుసు ప్రవర్తన.. సీబీఐ పట్ల మమతా బెనర్జీ తీరు కన్నా ఘోరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థ. ఎవరు తప్పుడు సలహా ఇచ్చారోగాని చంద్రబాబును ముంచేశారు. తప్పుడు, తలబిరుసు ప్రవర్తనకు జీవితంలోని మర్చిపోలేని గుణపాఠం తప్పద’ని జీవీఎల్ ట్వీట్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న సీఈసీ ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో స్పందించారు. ‘ఎన్నికల సమయంలో డీజీపీగా సీఎస్ ఉండటం నాకు తెలిసి సవాళ్లతో కూడిన విషయం. నాకు తెలిసి సీఎస్, డీజీపీ ఈ సమయంలో ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారు. టీఎన్ శేషన్ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. మరి వారే ఎన్నికల సంఘంపై కోర్టు కేసు ఎట్లా వేస్తారు? నాకు తెలియని న్యాయపరమైన అంశాలు దీంట్లో ఉన్నాయా’ అని ఐవైఆర్ ప్రశ్నించారు. (చదవండి: ఈసీకి ఎదురుతిరిగిన ఏపీ ప్రభుత్వం) -
హామీల జాతరలో వనరుల పాతర
ఎన్నికల సమయం వచ్చింది. మేనిఫెస్టోల జాతర మొదలైంది. హామీలు ఇవ్వడంలో అశలు చూపెట్టడంలో ఎవరు ఎవరికీ తగ్గాల్సిన అవసరం లేదు. కాబట్టి నింగిన ఉన్న చంద్రుడ్ని కూడా తెచ్చి చేతులో పెడతామనే విధంగా వివిధ పార్టీలు వారి వారి ఎన్నికల ప్రణాళికలతో ప్రజలను మభ్య పెట్టే విధంగా తమ హామీలను, వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తా యని ప్రజలు ప్రశ్నించడం లేదు. పార్టీలు సమాధానం చెప్పటం లేదు. అవినీతి రహిత పాలన, జవాబుదారీతనంతో కూడిన పాలన, దేశ అభివృద్ధిని క్రమశిక్షణతో, శ్రమతో సాధించే పాలనను గురించి ఎక్కడైనా పేర్కొన్నారు ఏమోనని అన్ని పార్టీల మేనిఫెస్టోలను భూతద్దం వేసుకొని చూసినా∙కనిపించే అవకాశాలు మృగ్యం. ఈనాడు అన్ని పార్టీల మేనిఫెస్టోలలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు తొలి బీజం ఇంగ్లండ్లో 1942లో పడింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండ్లో విలియం బేవరిడ్జ్ అనే వ్యక్తి ఈ సంక్షేమ పథకాల అమలుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ఆయన దృష్టిలో ప్రధానంగా ఐదు సమస్యలను పరిష్కరించగలిగతే అది సంక్షేమ రాజ్యం ఏర్పాటుకు తోడ్పడుతుంది. అవి అనారోగ్యం, అవివేకం, ఆర్థికంగా దీనస్థితి, సోమరితనం మొదలైనవి. సంక్షేమ కార్యక్రమాలలో ఆయన విశ్రాంత ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వికలాంగులకు ప్రత్యేకమైన అలవెన్స్ ఇచ్చే విధానాన్ని రూపొందించారు. చిన్న పిల్లలకు, అంద రికీ వర్తించే విధంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ నాటికీ ఇంగ్ల్లండ్లో ఈ జాతీయ ఆరోగ్య విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తూ వస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం సంక్షేమ కార్యక్రమాల అమలు కమ్యూనిస్టు దేశాల్లోనూ ప్రజాస్వామిక దేశాల్లోనూ విస్తృతంగా అమలు కావడం జరిగింది.పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ పరిరక్షణకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక రక్షణ కవచంగా భావించడం జరిగింది. నియంతృత్వ దేశాల్లో కూడా నియంతలు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా చూసుకోవడానికి ఒక స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈనాడు స్కాండినేవియన్ దేశాలలో చాలా విస్తృత ప్రాతిపదికన ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. దేశ బడ్జెట్లో సింహభాగం దీని కోసమే ఖర్చు చేయడం జరుగుతున్నది. జర్మనీలాంటి దేశాలలో లబ్ధిదారులు కూడా కొంత ఖర్చు భరించే విధంగా రూపొందించడం జరిగింది. ఇంగ్లండ్ లాంటి దేశాలలో ఈ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఒకసారి అమలు చేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ఉపసంహరించటం కష్టతరమవుతుంది. ఈజిప్ట్ దేశంలో ఆహారపదార్థాలపై రాయితీల తొలగింపు సమయంలో జరిగిన కొట్లాటలే దీనికి నిదర్శనం. చాలాకాలం అమలు అయినప్పుడు ప్రజలు ఈ రాయితీలను ఒక హక్కుగా భావించే ప్రమాదం ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నా వనరులు చాలా అవసరం. ఎవరి చేతిలో మంత్రదండం లేదు. స్కాండినేవియన్ దేశాలలో జాతీయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సంక్షేమ కార్యక్రమాల మీద ఉపయోగించుకుంటున్నారు. ప్రతి దేశంలోనూ సంక్షేమ కార్యక్రమాలకు భవిష్యత్తులో ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల మీద పెట్టుబడులకు మధ్య సమతుల్యం పాటిస్తూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి సమతుల్యం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే ఆ ఖర్చులు భరించలేక మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. అలవికాని హామీలు ఎన్నికల సమయంలో ఇవ్వటం, వాటిని చూసి మోసపోయి ప్రజలు ఓట్లు వేయడం ఆపైన రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను మర్చిపోవడం, మర్చిపోక పోయినా అమలుచేయడానికి తగిన వనరులు లేకపోవడంతో చేయగలిగిందేమీ లేక చేతులెత్తేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఎన్నికల మేనిఫెస్టోలకు బడ్జెటింగ్ అవసరం. ప్రతి రాజకీయ పార్టీ తాము చేసే వాగ్దానాలకు ఎంత ఖర్చవుతుంది. దానికి కావలసిన వనరులు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటారు అనే అంశాన్ని మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియచేయాలి అనే నిబంధన ఉండాలి. ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి పెట్టి అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలకు అనుబంధంగా వనరుల సేకరణ విధానాన్ని వివరిస్తూ బడ్జెటింగ్ వివరాలను పొందుపరచాలి అనే నిబంధన విధిస్తే మేనిఫెస్టోలకు ఒక ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అప్పుడు ప్రజలు కూడా మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను పరిశీలించి ఓటు వేయవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి- iyrk45@gmail.com -
అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు..!
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో మీ భవిష్యత్తు.. నా బాధ్యత.. అని నినాదాలివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎస్ అజేయకల్లం విమర్శించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీనిధి కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సులో మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి అజేయకల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత పులివెందులలో శుక్రవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సదస్సులో అజేయకల్లం మాట్లాడుతూ టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఐదేళ్లలో 25 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరాలని, అయితే 2014లో 3.68 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.69 కోట్లమంది ఓటర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున టీడీపీ పాలనలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. కొన్ని కులాల వారీగా ఓట్లను టార్గెట్ చేసి టీడీపీ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. మనకున్న రీసర్చ్, పారిశ్రామిక సంస్థలు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ 1980కు ముందే వచ్చాయని, ఆ తర్వాత కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు నిర్మించారని అజేయకల్లం చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని అజేయకల్లం అన్నారు. మన రాష్ట్రానికి రూ.94 వేల కోట్ల గ్యారంటీ లిమిట్స్కు అర్హత ఉండగా.. దానిలో 30–35 శాతం మించి గత 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో గ్యారంటీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం 101 శాతం ఇప్పటికే గ్యారంటీ రుణం తీసుకుందని చెప్పారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, పోలవరం, శంకుస్థాపనలు, ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ పాతాళానికి.. 2004–2014 మధ్య సంవత్సరానికి 39.5 శాతం లెక్కన రాష్ట్ర రెవెన్యూ 395 శాతం పెరగగా..గత నాలుగు సంవత్సరాల్లో టీడీపీ పాలనలో రాష్ట్ర రెవెన్యూ 30 శాతం కంటే తక్కువ నమోదైందని అజేయకల్లం అన్నారు. అంటే సంవత్సరానికి కనీసం 7 శాతం కూడా పెరగలేదని చెప్పారు. అయితే 2004–14మధ్య పెరిగిన తలసరి ఆదాయంలో సగం నమోదవుతుంటే తాము అద్భుతాలు సృష్టించామని ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవని, అయినా వ్యవసాయంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయిందని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పశుక్షేత్రాల్లో దొంగ లెక్కలు చూపిస్తూ రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఫాం పాండ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇసుక ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి తాండవమాడుతుందని అజేయకల్లం అన్నారు. ఎల్లో మీడియా మశూచిలా పట్టిపీడిస్తోంది: ఐవైఆర్ రాష్ట్రాన్ని ఎల్లో మీడియా మశూచిలా పట్టి పీడిస్తోందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి ప్రజలను తికమక పెట్టి టీడీపీని గెలిపించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఎంత సేపటికీ నాలుగు బిల్డింగ్లు వచ్చాయి, ఫిల్లర్ ఇలా వేశాం, ఊచలు ఇలా కట్టాం అని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే ఒక అద్భుతం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థనూ నాశనం చేశారు.. పోలీస్ వ్యవస్థను సైతం నాశనం చేసి పార్టీ కార్యకర్తల్లా పోలీసులను ఉపయోగించుకుంటున్నారని అజేయకల్లం విమర్శించారు. 2వేల మందికి ప్రమోషన్లు ఇస్తే సీఎంకు సన్మానం చేసి, ఓటు వేసి రుణం తీర్చుకుంటామని పోలీసులు ప్రమాణాలు చేశారని, వాళ్లను పోలీసులు అనాలో ఖాకీ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలు అనాలో అర్థం కావడం లేదని అన్నారు. అవినీతిలో మొదటిస్థానం.. భారత దేశంలో కెల్లా అత్యధికంగా అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్–1 స్థానంలో నిలుస్తుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో ప్రాంతీయ అసమానతలు గణనీయంగా పెరిగాయని, జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ పాలనలో చట్టసభల్లో ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకు లేకుండా చేశారన్నారు. రైల్వేస్ మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎం.పాపిరెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాఘవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ చుండూరు సాయి పాల్గొన్నారు. -
ఉగ్రవాద దాడిపై కఠిన వైఖరి అవశ్యం
ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో అవంతిపురం ప్రాంతంలో సిఆర్పీఎఫ్ వారి కాన్వాయ్పై ఉగ్రవాద దాడి జరిగింది. ఆదిల్ అహ్మద్ ధార్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు పక్కదారి నుంచి వచ్చి సిఆర్పిఎఫ్ శకటాల శ్రేణిలో 5వ క్రమసంఖ్యలో ఉన్న వాహనాన్ని తన వాహనంతో కొట్టి తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ మారణహోమంలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైనారు. ఈ దాడిని నిర్వహించింది తనేనని ఆదిల్ అహ్మద్ ధార్ రూపొందించిన ముందస్తు వీడియో ఒకటి వెనువెంటనే విడుదలైంది. పాకిస్తాన్లో స్థావరం ఏర్పరచుకుని ఉగ్ర దాడులు ప్రేరేపిస్తున్న జైషే మొహమ్మద్ సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ శతాబ్దిలో ఇంతే తీవ్రమైన దాడులు ఇంతకుముందు మూడు జరిగాయి. 2001 సంవత్సరంలో భారత పార్లమెంటు లక్ష్యంగా ఒక దాడి జరిగింది. 2008లో ముంబాయి మహానగరంలో పలు పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. 2016 సంవత్సరంలో ఉడీ విభాగంలో సైన్యంపై దాడి ఆ తర్వాత పఠాన్ కోట్లో మరొక దాడీ జరిగాయి. ఇంతకు ముందు జరిగిన దాడుల సమయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్కు సైనికపరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయంగా ఉగ్రవాద నిరో ధం కోసం పాకిస్తాన్పై ఒత్తిడి పెంచటానికే భారత ప్రభుత్వ చర్యలు పరిమితమైనాయి. పాకిస్థాన్ సైన్యం పూర్తి సహాయ సహకారాలతో ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయని పూర్తి సమాచారం ఉన్న భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం వరకే తన చర్యలను పరిమితం చేసింది. పాక్ నిఘా విభాగమైన ఐఎస్ఐ ఈ ఉగ్రవాద సంస్థలతో కలిసి మెలిసి పనిచేస్తుందనేది నిర్వివాదాంశం. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో జుల్ఫీకర్ అలీ భుట్టో భారతదేశంపై 1000 సంవత్సరాల జిహాద్ జరుపుతామని ప్రకటించారు. బహిరంగ యుద్ధంలో చాలామార్లు ఓటమి చవి చూసిన తర్వాత నాటి పాకిస్తాన్ సైన్యం అధిపతి జియావుల్ హక్ భారతదేశానికి 1000 ఏళ్లు నష్టం కలిగించే విధంగాగా ఉగ్రవాద సంస్థల చర్యలు ప్రోత్సహిస్తూ పరోక్షంగా భారత్పై చర్యలు చేపట్టడానికి ఒక విధానాన్ని రూపొందించారు. దానిలో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, మద్దతుతో ఈ సంస్థలు ఉగ్రవాద కార్యక్రమాలను భారతదేశంలో నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14 సంఘటన తర్వాత భారత ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఇంతకుముందు లాగానే పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగేటట్లుగా చూడటం. ఈ ఒత్తిడి మూలంగా పాక్ ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకుంటుందని ఆశించటం. ఈ సమస్యను భారత్లేవనెత్తిన ప్రతిసారీ తనకు సరైన సాక్ష్యాధారాలు ఇవ్వమని పాక్ మనల్ని కోరటం, ఆ పైన ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోలేదని పేర్కొనటం పరిపాటి అయిపోయింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఈ ఉగ్రవాద సంస్థలపై తగిన ఆధారాలు సేకరించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందనే విషయాన్ని పాక్ ఎప్పుడో మర్చిపోయింది. ఈ సంస్థలు పాక్ ప్రభుత్వ కనుసన్నల్లోనే పని చేస్తున్నప్పుడు వారిపై అంతర్జాతీయ ఒత్తిడి మూలంగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించటం అవివేకమే అవుతుంది. ఈసారి భారత ప్రభుత్వం ఇంతకుముందు కన్నా భిన్నంగా వ్యవహరించటానికి నిర్ణయించుకుంది. దీనికనుగుణంగా చక్కని ప్రణాళిక రచించింది. భారత యుద్ధ విమానాలు పాక్లో చాలా లోపలికి చొచ్చుకుని పోయి బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యాన్ని ఛేదించి ఎటువంటి నష్టం లేకుండా వెనక్కి తిరిగి వచ్చాయి. మర్నాడు ఈ సంఘటనకు సంబంధించి పాక్ స్పందన గంట గంటకు మారిపోతూ వచ్చింది. భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను మాత్రమే దాటాయని బాలాకోట్ దాకా రాలేదని ఉదయాన్నే ప్రకటించింది. సాయంత్రానికి మాట మార్చి భారత్ విమానాలు బాలాకోట్ దాకా వచ్చాయి కానీ పాక్ యుద్ధ విమానాలు నిలువరించే సరికి గమ్యరహితంగా తమ బాంబులను వదిలిపెట్టి వెళ్ళిపోయాయని ప్రకటించారు. రెండవ రోజు ప్రపంచ మీడియాను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపెడతామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఈరోజు వరకు ప్రపంచ మీడియాను ఆ ప్రాంతాలకు రాకుండా కట్టడి చేయడం గమనార్హం. భారతదేశంపై ఎదురుదాడి ఆలస్యం ఎందుకు అయింది అని అడిగిన ప్రశ్నకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే ఎదురుదాడికి దిగాము అని ఇమ్రాన్ఖాన్ సమాధానమిచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తే భారత యుద్ధ విమానాలు తీవ్రవాదుల స్థావరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినట్లే ఉంది. భారత వైమానిక అధిపతి మార్చి 4న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చాలా సమాచారం సేకరించిన తర్వాతనే లక్ష్యాలను నిర్ధారిం చుకోవడం జరిగిందని లక్ష్యాలను అనుకున్న విధంగానే ఛేదించామని ఎంతమంది చనిపోయారు అనేది అక్కడ ఉన్న వారి సంఖ్యను బట్టి ఉంటుంది కానీ ఇదమిద్ధంగా చెప్పలేమని చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. పాకిస్తాన్ రెండోరోజు తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి వైమానిక దాడికి తలపెట్టడం, దానిని తిప్పికొట్టే యత్నాల్లో రెండవసారి భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకొనిపోవడం వెంటవెంటనే జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఒక ఎఫ్–16 విమానాన్ని, ఒక పైలట్ను కోల్పోయింది. భారత్కు చెందిన మిగ్–21 విమానం కూలి పోయి ఆ విమాన పైలెట్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి దొరికారు. అతని విడుదల తర్వాత రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రస్తుతానికి ఉపశమించింది. ఈ మొత్తం సంఘటనలో ప్రతిపక్షాల పాత్ర చాలా విచి త్రంగానూ బాధ్యతారహితంగానూ ఉంది. దాడులు చేసింది మేము అని జైషే మొహమ్మద్ సంస్థ ఒప్పుకున్న తర్వాత కూడా ఈ మొత్తం పుల్వామా సంఘటనపై తమకు అనుమానాలున్నాయని మమతా బెనర్జీ, చంద్రబాబు వ్యాఖ్యాని స్తారు. తీవ్రవాదులపై విమాన దాడులను గురించి సాక్ష్యాలు చూపెట్టమని కాంగ్రెస్ మరికొందరు అడుగుతారు. దేశ రక్షణ అంశంలో అందరూ కలిసి పనిచేయాలనే మౌలిక అంశాన్ని ప్రతిపక్షాలు విస్మరించినట్లున్నాయి. అదే బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఆ నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఇచ్చిన మద్దతు వారి దార్శనీక నాయకత్వ లక్షణాలు తెలియజేస్తున్నాయి! పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక రక్షిత ప్రాంతంగా ఉండి ఇతర దేశాలపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న సమయంలో దానిని ఏ విధంగా దీర్ఘకాలంలో ఎదుర్కోవాలి అనే అంశంపై స్పష్టత అవసరం. ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ రక్షక దళాల పూర్తి సహాయ సహకారాలతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అనేది స్పష్టమే. గతంలోనే ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పుడు తగిన ప్రతీకార చర్యలు తీసుకుని ఉంటే ఈ ఉగ్రవాద సంస్థలు మళ్లీ మళ్లీ ఇటువంటి కార్యక్రమాలకు విజృంభించి ఉండేవి కావు. చాలా స్పష్టంగా భారతదేశంలో జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా సరే.. భారతదేశం మీద యుద్ధంగా పరిగణించి స్పందిస్తామనే సందేశాన్ని పాకిస్తాన్కు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రధాని ఈ మధ్య ప్రతి ఉగ్రవాద దాడికి అవసరమైతే పాకిస్తాన్లో చొరబడి అయినా సమాధానం చెబుతామని పేర్కొనటం హర్షణీయం అయిన విషయం. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన విషయం గుర్తు చేసుకుందాం. ‘పిరికితనం’ హింస మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటే నేను హింసనే ఎంచుకుంటాను. భారతదేశం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే ఆయుధాలను చేపట్టడాన్ని నేను సమర్థిస్తాను. తనపట్ల జరుగుతున్న అగౌరవానికి పిరికితనంతో సాక్షిగా ఉండే బదులు ఆయుధాలు చేపట్టడమే ఉత్తమం’. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అర్చకులకు శఠగోపం
షేక్సి్పయర్ రాసిన హేమ్లెట్ నాటకంలో హేమ్లెట్ తన తల్లిని గురించి తలుచుకుంటూ బలహీనత రూపం స్త్రీ అని వ్యాఖ్యానిస్తారు. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో గ్రామీణ అర్చకుల దారుణ పరిస్థితి ఆయన హృదయాన్ని కలిచివేసింది అన్న ట్వీట్ చూసిపై వ్యాఖ్యానం గుర్తుకొచ్చి ‘కపటత్వమా నీ పేరు బాబు గారు’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాల అర్చకుల పరిస్థితి అతి దారుణంగా ఉందనేది నిర్వివాదాంశమైన విషయం. ఏమి చేస్తే ఆ పరిస్థితులు బాగుపడతాయనే దానికి కూడా ఒక స్పష్టమైన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది. దానిమీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రాథమికంగా ఇచ్చిన జీవో 76ను ఆమోదిస్తూ తుది ప్రకటన చెయ్యకుండా ఈరోజు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల అర్చకుల పరిస్థితి చూస్తే నా హృదయం కలత చెందుతోంది అని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇక ప్రధాన సమస్యను అవతల పెట్టి కంటితుడుపు చర్యగా 5,000 పారితోషకాన్ని 8,000కు పెంచుతామని, 10,000 నుంచి 12,500 చేస్తామని ప్రకటించారు. ఈ కేటగిరీ కింద వచ్చే అర్చకుల సంఖ్య పదిహేను వందలకు మించి లేదు. 16 కోట్లు దీనికోసం టీటీడీ నుంచి వస్తుందని ప్రకటించారు. వాస్తవానికి 5 సంవత్సరాల క్రితం అర్చక సంక్షేమానికి టీటీడీ 100 కోట్లు ప్రకటించి మొదటి 2 సంవత్సరాలు 25 కోట్ల చొప్పున 50 కోట్లు ఇచ్చి గత రెండు సంవత్సరాల నుంచి మిగిలిన 50 కోట్లు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన 16 కోట్లు ఆ 50 కోట్ల లోనివే. అదనంగా ఇచ్చింది ఏమీలేదు. ఈ హామీ అమలు చేయాలన్న టీటీడీ మిగిలిన పెద్ద ఆలయాల నుంచి ఒక వంద కోట్ల తో మూల నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానిని గురించి కార్యాచరణ గానీ, ఆలోచన గానీ లేదు. కానీ అసలు సమస్య 5 వేల కన్నా తక్కువ పారితో షికాన్ని పొందుతూ గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులది. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయ వ్యవస్థ ఒక ప్రత్యేక రీతిలో రూపుదిద్దుకుంది. దేవాలయాల మనుగడకు నిర్వహణకు ఆనాటి పాలకులు భూములు ఇచ్చారు. వాటిని దేవాలయ ఈనాము అంటారు. అదేవిధంగా అర్చకత్వం, భజంత్రీలు మొదలైన కార్యక్రమాలు నిర్వ హించేవారి భుక్తి కోసం ప్రత్యేకంగా సర్వీసు ఈనాములు కేటాయించడం జరిగింది. ఈ విధంగా పాలకుల ప్రాపకంతోను స్థానిక సమాజం మద్దతు తోనే దేవాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన ఆధ్యాత్మిక సామాజిక కేంద్రాలుగా పరిణతి చెందాయి. ఈ విధానాన్ని 1987 దేవాదాయ చట్టం మార్పుల ద్వారా సవరించి ఈ చిన్న దేవాలయాలు అన్నింటిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని రావటం జరిగింది. అసలే ఆదాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్న దేవాలయాలు, ఈ దేవాదాయ శాఖ అధికారుల జీతభత్యాలు కూడా మోయాల్సి రావటంతో వాటి అస్తిత్వం పూర్తిగా దెబ్బతింది. ఈరోజు అర్చకుల ప్రధాన అభ్యర్థన, ఆదాయం లేని 25వేల దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి స్థానిక సమాజం సహకారంతో అర్చకుడు నిర్వహించే విధంగా మార్చమని. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి అర్చకుడి కి నెలకు కనీస వేతనం 10,000 వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కూడా వారికి ఎటువంటి అభ్యంతరం లేదు.ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయాల్సింది పోయి, 1,500 మందికి కొద్దిగా సహాయపడే చిన్న కార్యక్రమాన్ని ప్రకటించి ఏదో అర్చకుల అందరికీ ఈ ప్రభుత్వం మేలు చేసిందన్న స్థాయిలో రాజకీయ లబ్ది కోసం ప్రకటన ఇచ్చుకున్నారు. సమస్యపై అవగాహన, చిత్తశుద్ధి ఉంటే సమస్యకు పరిష్కారాలు లభిస్తాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వ చర్యలే నిదర్శనం. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు అర్చకులకు 10,000 కనీస పారితోషికం ఇచ్చే విధంగా రూపొందించి, ఒక మూలనిధిని ఏర్పాటుచేసి ఆ నిధికి రాష్ట్ర బడ్జెట్ నుంచి గ్రాంట్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకత్వం ఈ విషయంపై అవగాహన లేకుండా సమస్యకు సరైన పరిష్కారాలు ఆలోచించకుండా ఐదు సంవత్సరాలు కాలం వెళ్లదీసి, ఇప్పుడు కూడా ప్రధాన సమస్యలు పక్కనపెట్టి అసలు సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా రాజకీయ లబ్ధికోసం ప్రచార ఆర్భాటానికి పరిమితం అవుతున్నది. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
ఐవైఆర్ కృష్ణరావుతో మన్సులో మాట
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
-
పుల్వామా ఉగ్రదాడి : చంద్రబాబుపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణరావు, కేవీ రావు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజకీయాల్లో సీనియర్నని చెప్పుకునే బాబు ఇలా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. బాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. (మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?) పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను కోల్పోయి యావత్ దేశం విషాదంలో మునిగితే.. చంద్రబాబు మాత్రం మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రదాడిపై మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... పుల్వామా దాడికి ప్రధాని మోదీయే కారణమనే అర్థం వచ్చేలా బాబు విమర్శల దాడికి దిగారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశాన్ని తాకట్టు పెడితే సహించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశభక్తి, భద్రతలో టీడీపీ రాజీపడదు అని వ్యాఖ్యానించారు. -
అధర్మ పోరాట దీక్ష ఫలించిందా?
గత కొద్దికాలంగా రాష్ట్ర ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షల పేరుతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రజాధనంతో సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ ధర్మ పోరాట దీక్షలకు ఫైనల్స్ రూపంలో హస్తిన నగరంలో ఈ మధ్యనే భారీ స్థాయిలో దీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ దీక్షలను ప్రజాధనాన్ని ఉపయోగిస్తూ పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తున్నారు కనుక ఈ సభలు, సమావేశాల వలన ఒరిగిన ప్రయోజనం ఏమిటో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ, అడిగే హక్కు ప్రజలకూ ఉన్నది. నిన్నటికి మొన్న నిర్వహించిన హస్తిన ధర్మ పోరాట దీక్షకు జీవో 216 ద్వారా 10 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల తరలింపుకోసం ప్రత్యేక రైలు సదుపాయం కల్పించడానికి రైల్వేశాఖ వారికి కోటి 12 లక్షల రూపాయలు చెల్లింపు చేస్తూ జీవో 262 విడుదల చేశారు. ఇంత ప్రజాధనాన్ని వినియోగించి చేసిన ఈ ధర్మ పోరాట దీక్ష ఫలితాలను పరిశీలించే ముందు ఈ దీక్షకు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలో రాష్ట్రానికి చెందిన ఏ ప్రతిపక్ష నాయకుడూ హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నాలుగేళ్లుగా బీజేపీతో పాటు కేంద్రంలో భాగస్వాములుగా ఉండి ఆనాడు లేవనెత్తని చాలా అంశాలను ఈరోజు లేవనెత్తడం, ఆ రోజు ఇదే అంశాలపై ఉద్యమించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల మిగిలిన విపక్షాల వారు ఈరోజు ప్రభుత్వంతో ఈ అంశంపై కలిసి రావటం లేదు. ఆరోజు ప్రత్యేక హోదా సంజీవనినా అని ప్రశ్నించి, ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసి ఈ రోజు కేంద్రంతో పోట్లాడుతాం.. మీరూ కలిసి రండి అంటే విపక్షాలు సుముఖంగా లేవు. ఈ పరస్పర విరుద్ధ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన విపక్షాలు ఈ దీక్షలకు దూరంగా ఉంటున్నాయి. విపక్షాలను కలిపి తీసుకుని పోలేని ధర్మపోరాట దీక్ష ఆదిలోనే విఫలమైనది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయం నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సహజంగానే ఈనాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ధర్మ పోరాట దీక్షలో వారు ప్రస్ఫుటంగా పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం వెన్నుదన్నులతో ఈ ఉద్యమాన్ని కొనసాగించటంలో కీలకపాత్ర పోషిస్తున్న కొన్ని స్వయంప్రకటిత పౌర సంఘాలు వాటి నాయకులు చాలా ప్రముఖంగా ఈ దీక్షలో కనిపించారు. హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఒక వేదిక గనుక సహజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడటానికి అన్ని జాతీయ స్థాయి విపక్షాలు క్యూ కట్టాయి. కానీ ప్రజాధనాన్ని వెచ్చించి చేసిన ఈ దీక్ష ఏమి సాధించింది అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. వచ్చిన ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ప్రధాన అంశమైన పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాకు మద్దతు తెలపలేదు. రాహుల్ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు కానీ పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కాదు. పరిశ్రమ రాయితీలు లేని ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీకి సమానమే కానీ ఏ విధంగానూ ఎక్కువ కాదు. మరి ఎవరి నుంచి ఎటువంటి హామీలు రాకుండా కేవలం రాష్ట్రప్రభుత్వ వ్యయంతో కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడానికి ఏర్పాటు చేసిన ఒక సభ గానే హస్తిన ధర్మ పోరాట దీక్ష మిగిలిపోతుంది. రాష్ట్రంలో ప్రసారమాధ్యమాలన్నీ ముఖ్యంగా ప్రాంతీయ భాష ప్రసార మాధ్యమాలు చాలా బహిరంగంగా తెలిసిన కారణాలవల్ల ఈ ప్రభుత్వం ఎట్లాంటి తప్పులు చేసినా వత్తాసు పలకటం పరిపాటి అయిపోయింది. ప్రశ్నించతగిన స్థాయిలో సామాజిక సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఏపీలో లేకుండా పోయినారు. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జంకూగొంకూ లేకుండా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి సాహసిస్తున్నది. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఏనుగుల ఖరీదు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అది ఈ సందర్భంలో కూడా తప్పకుండా వర్తిస్తుంది. హస్తినలో కొలువుదీరిన ధర్మ పోరాట దీక్ష ఒక విధంగా నాకు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన కౌరవ సభ తిరిగి కొలువుతీరినట్లు కనిపించింది. నాటి రాష్ట్ర విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన నాటి ప్రధాని ధృతరాష్ట్రవర్యులు దీక్షలో ప్రధాన పాత్ర వహిం చారు. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన శకుని గారు కూడా చాలా ప్రముఖంగా కనిపించారు. లక్ష్మణ కుమార్లవారు వచ్చి హాజరు వేసుకొని వెళ్లారు. విభజనలో కీలక పాత్ర పోషించిన స్త్రీ రూపంలోని దుర్యోధనులవారు మాత్రం సభకు వేంచేయలేదు. మొత్తంమీద విభజన గాయాలపై సీఎం మాట ల్లోనే కారం చల్లే విధంగా సభ కొనసాగింది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘‘ iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
మితిమీరిన లోటుతో బడ్జెట్కు చేటు
అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్లు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్యక్రమాలు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్ర బడ్జెట్లో ఆదాయాన్ని ఏకంగా 15శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఈ స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్ను అపహాస్యం చేయడమే అవుతుంది. కేంద్రంలో ఒక బడ్జెట్టు, రాష్ట్రంలో ఒక బడ్జెట్టు ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి రెండు బడ్జెట్లలో ప్రజాకర్షణ పథకాలను, వరాలను పొందుపరిచారు. ఎవరు తాయిలాలు ఇవ్వాలన్నా దానికి తగ్గ వనరులు ఉండాలి. బడ్జెట్ అంటేనే భవిష్యత్తులోని ఆదాయ వ్యయ అంచనా. ఈ అంచనాలలో లెక్కలు తప్పితే మొదటికే మోసం వస్తుంది. ఈ రెండు బడ్జెట్లు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించే ముందు రెండు, మూడు సాంకేతికమైన విషయాల మీద మౌలికమైన పరిజ్ఞానం అవసరం. ప్రతి బడ్జెట్లో రెవెన్యూ విభాగం, మూలధన విభాగం ఉంటాయి. సాలుసరి పన్నుల రూపంలో ఇతరత్రా వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఆదాయంగా చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జీతాలు, పెన్షన్లు లాంటి సాలుసరి ఖర్చులను రెవెన్యూ ఖర్చులుగా చూపెట్టడం జరుగుతుంది. ఈ విభాగంలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. అది చాలా శుభకరమైన పరిణామం. అదే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. ఇక మూలధన పట్టికలో వచ్చే నిధులు అప్పుల రూపంలో ఉంటాయి. ఖర్చు ప్రాజెక్టుల మీద ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే స్థిరాస్తుల మీద ఉంటుంది. తీసుకున్న మొత్తం అప్పులను ద్రవ్యలోటు అంటారు. ఈ తీసుకున్న అప్పులో కొంత భాగం రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఉపయోగిస్తే అంతవరకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి ఉండే నిధులు తక్కువవుతాయి. ఏ దేశంలో రెవెన్యూ లోటు సున్నా ఉండి మొత్తం అప్పులు ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడతారో ఆ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా బలోపేతంగా ఉంటుంది. ఇంకొక చిన్న అంశం ప్రాథమిక లోటు. తెచ్చే అప్పులు కనీసం పాత వడ్డీలను కట్టడానికైనా ఉపయోగపడితే ప్రాథమిక లోటు ఉండదు. అప్పుడు భవిష్యత్తులో మరింత అప్పుల భారం వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రాథమిక లోటు ఉండి తెచ్చిన అప్పులు కట్టే వడ్డీల కన్నా ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో అప్పుల భారం పెరుగుతున్నట్టు అర్థం. ఇది మంచి పరిణామం కాదు. విచ్చలవిడి బడ్జెట్తో మొదటికే మోసం ప్రజాస్వామ్యంలో ప్రజలదే రాజ్యం. బడ్జెట్లు ప్రజారంజకంగాను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజారంజకం పేరుతో పైన పేర్కొన్న సూచికలను పూర్తిగా విస్మరించి విచ్చలవిడిగా బడ్జెట్ రూపొందిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే బడ్జెట్లు ఎప్పుడూ వాస్తవికతకు దగ్గ రగా ఉండాలి. ఇక దర్శనీయంగా పెట్టుబడులను, అభివృద్ధిని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ ప్రామాణికాలను ఆధా రంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మూడు ప్రధానమైన ప్రజారంజక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా దేశమంతటా రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయలు జమ చేసే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చే విధంగా మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్పు తీసుకొని వచ్చింది. ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలు ఉన్నా బడ్జెట్లో బాగా ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు ఈ మూడు. మరి ఇవి ఆచరణ సాధ్యమేనా! బడ్జెట్లోని గణాంకాలు చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఆచరణ సాధ్యంగా ఈ మూడింటినీ ప్రవేశపెట్టారని అర్థం అవుతుంది. ఆదాయపు అంచనాలను చాలా వాస్తవికంగా రూపొందిం చారు. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదలను 2%గానే తీసు కున్నారు. 17–18, 18–19 సంవత్సరాల మధ్య వచ్చిన రాబడిలో పెరుగుదల 20% ఉంటే 19–20 ఏడాది రాబడిలో పెరుగుదల 14% గానే తీసుకున్నారు. కాబట్టి ఈ ఆదాయాలు రావటంలో ఎటువంటి సమస్యా ఉండకపోవచ్చు. ద్రవ్యలోటు జాతీయాదాయంలో 3.4%గా అంచనా వేశారు. మూడు శాతం కన్నా తక్కువ ఉంటే మంచి పరిణామంగా భావించాల్సి ఉన్న ద్రవ్యలోటు నిర్వహణ పరిమితులలోనే ఉన్నది (ఝ్చn్చజ్ఛ్చb ్ఛ జీఝజ్టీట). రెవెన్యూ లోటు కూడా 1.3% దగ్గర ఉంది. ఇది పూర్తిగా లేకపోయినా ద్రవ్య మిగులు ఉన్నా చాలా మంచి పరిణామం. కానీ 1.3% ప్రమాదకరమైన సంకేతమైతే కాదు. ఏడు లక్షల కోట్లకు ప్రాథమిక లోటు చాలా తక్కువగా 38 వేల కోట్లు ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తీసుకున్న అప్పులలో ఎక్కువ శాతం వడ్డీలు చెల్లించడానికి పోతున్నది కాబట్టి అదనంగా అప్పుల భారం పడే అవకాశం చాలా తక్కువ. వాస్తవికతకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఈ బడ్జెట్లో కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన కొన్ని కార్య క్రమాలు వెసులుబాటు కల్పించాయి. ఎన్నాళ్ల నుంచో తెగకుండా సాగు తున్న జీఎస్టీని ఒక కొలిక్కి తెచ్చి ప్రవేశపెట్టడంతో దేశమంతటా ఒకే మార్కెట్ ఏర్పడింది. దీని వల్ల వచ్చే ఆదాయాలు కూడా పెరిగాయి. ఆర్థిక మంత్రి చెప్పినట్టు జీఎస్టీ ప్రవేశ పెట్టిన కొత్తలో నెలకు 89,700 కోట్లు ఉన్న ఆదాయం 97 వేల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దుతో అదనంగా చాలామంది ఆదాయపన్ను మదింపుకి వచ్చారు. నిరర్థక ఆస్తులను రాబట్టడంలో ఇన్సాల్వెన్సీ చట్టం చాలా ఉపయోగపడింది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల దాకా మొండి బకాయిలు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీనితో బ్యాంకింగ్ రంగానికి బడ్జెట్ ద్వారా సహాయం చేయాల్సిన అవసరం తగ్గింది. ఈ మంచి పరిణామాలను ఉపయోగించుకొని కొన్ని వర్గాల ప్రజలకు రాయితీలను ప్రకటిస్తూ వాస్తవికతకు దగ్గరగా ఆచరణకు ఏ విధమైన ఇబ్బంది ఉండని బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిద్దాం. 2017– 18లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఒక లక్షా 91 వేల కోట్లు. 18–19కి ఈ ఆదాయం ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసినా, సంవత్సరాంతానికి రెండు శాతం పెరిగి లక్షా 95 వేల కోట్లు అయింది. ఈ ఆదాయాన్ని ఏకంగా 15 శాతం పెంచి 19–20 సంవత్సరానికి రెండు లక్షల 25 వేల కోట్లుగా చూపెట్టారు. ఇంత స్థాయిలో అమాంతంగా వనరులు ఎట్లా పెరుగుతాయో అర్థం కావటం లేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏకంగా ఒక సంవత్సరంలో 10 వేల కోట్లు పెరుగుతున్నట్లుగా చూపెట్టారు. కేంద్రం పన్నులలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం పెంచిన తర్వాత కేంద్రం గ్రాంట్లను తగ్గించింది. అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అమాంతంగా అదనంగా వస్తాయని చూపెట్టి అమలుచేయలేని, చేయాలన్న ఉద్దేశం లేని అనేక కార్యక్రమాలను ప్రకటించడం కేవలం బడ్జెట్ను అపహాస్యం చేయడమే అవుతుంది. అదేవిధంగా సొంత పన్నుల రాబడిలో కూడా పొంతన లేని పెరుగుదలను చూపెట్టుకు న్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక మద్యం, పెట్రోల్ మీద తప్పితే మిగిలిన వాటిపై అమ్మకం పన్ను పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత అనూహ్యంగా రాబడి ఎక్కడి నుంచి వస్తుందని అంచనా వేశారో అర్థం కాకుండా ఉంది. ఇక అప్పుల విష యానికొస్తే 2017–18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 86 వేల కోట్ల అప్పు, 2018–19 సంవత్సరంలో 39 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం 17 శాతం వృద్ధితో 47 వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు రెండు వేల కోట్ల రూపాయలుగా చూపెట్టినా అంచనా వేసిన రాబడి వాస్తవ విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చాలా పెరిగే అవకాశం ఉంది. 32 వేల కోట్లుగా అంచనా వేసిన ద్రవ్యలోటు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి దారుణం అన్నిటికీ మించి ప్రాథమిక లోటు 14, 570 కోట్లు. అంటే మనం తీసుకునే అప్పు వడ్డీలు కట్టగా కూడా ఇంకా 14,570 కోట్లు అప్పు ఉండి భవిష్యత్తులో ఇంకా రుణ భారం, వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రుంగ తీయబోతున్నాయి. 27 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర బడ్జెట్లో ప్రాథమిక లోటు 39 వేల కోట్లు ఉంటే రెండు లక్షల 25 వేల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రానికి ప్రాథమిక లోటు 14,570 కోట్లు ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారంజకంగా బడ్జెట్ను తయారు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటానికి ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తే బాగుంటుందో ఆర్థిక శాస్త్రవేత్తలు కొన్ని సూచికలు స్థిరీకరించారు. వాటికి కొంత అటూఇటుగా కొన్ని సంవత్సరాలు బడ్జెట్ను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయదు. కానీ ఆ సూచికలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆచరణ సాధ్యం కాని వనరులు లేని ఖర్చు మాత్రమే చూపెడుతూ తయారుచేసిన బడ్జెట్ కేవలం భ్రమల భ్రాంతుల బడ్జెట్గా మిగిలిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఎవరి చేతి లోనూ మంత్ర దండాలు లేవు కదా. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
బీజేపీ ప్రతినిధిగా నేను అడ్డుకున్నా
-
విశాఖను విస్మరిస్తే అమరావతికి మంచిదికాదు
ఈ మధ్య వార్తా పత్రిక లలో ఒక వార్త చదివా. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో భాగంగా ఆర్థిక నగరాన్ని అభివృద్ధి చెయ్యాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార వర్గాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ వార్త సారాంశం. అమరావతి నగర నిర్మాణంలో భాగంగా ఒక ఆర్థిక నగరాన్ని, పరిపాలన నగరాన్ని, న్యాయ నగరాన్ని అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు నెలవుగా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి ఒక బృహత్ ప్రణాళికను రూపొందించారు. ఈ విధంగా అమరావతిలో భాగంగా ఒక ఆర్థిక నగరాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ అంశాన్ని పరిశీలించే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకత, వివిధ ప్రాంతాలకు ఉన్న సహజసిద్ధమైన లక్షణాలను వనరులను, అవకాశాలను, పరిశీలించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక కాస్మోపాలిటన్ నగరంగా స్వయంసిద్ధంగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం. కలకత్తా నుంచి చెన్నై మధ్యలో కోరమాండల్ తీరంలో వ్యాపారానికి ఒక ప్రధాన బిందువు వైజాగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రులు హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని విశాఖపట్నానికి కూడా ఇచ్చి ఉంటే ఈనాటికే ఇది ఇంకా గొప్ప నగరంగా అభివృద్ధి చెంది ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాణిజ్య వ్యాపారపరంగా ఆర్థిక కేంద్ర బిందువుగా ఏనాటికైనా అభివృద్ధి చెందగలిగిన ఏకైక నగరం విశాఖపట్నం. విశాఖపట్టణాన్ని విస్మరించి, ఆర్థిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన అటు విశాఖపట్నానికి, ఇటు అమరావతికి మేలుకన్నా ఎక్కువ కీడు చేస్తుంది. ఇందువలన అమరావతిలో ప్రత్యేకంగా ఆర్థిక నగరం అభివృద్ధి చేసే ప్రతిపాదనలు మానుకొని విశాఖపట్నం మీదనే దృష్టి కేంద్రీకరించటం మంచిది. ఆర్థిక వాణిజ్య వ్యాపార అంశాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి విశాఖపట్నాన్ని కేంద్రబిందువుగా అభివృద్ధి చేస్తే గణనీయమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రినుంచి గుంటూరు వరకు ఉన్న మధ్య కోస్తా ప్రాంతం పంజాబ్ హరి యాణాలకన్నా మెరుగైన వ్యవసాయానికి నెలవు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి, చొరవ తీసుకొని ప్రయోగాలు చేసి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించిన వ్యవసాయదారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. విజయవాడ ప్రాంతం మొదటినుంచీ రవాణా కార్యక్రమాలకు నెలవుగాఉంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మొదటినుంచి నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యారంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, రవాణా లాజిస్టిక్స్ సర్వీస్ విభాగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకుంటే గణనీయమైన ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. ఇక రాయలసీమ ప్రాంతం మూడు మహానగరాలకు మధ్య స్థానంగా ఉంది. చెన్నై నగరానికి పారిశ్రామిక స్థానంగా నెల్లూరు, చిత్తూరు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులను అభివృద్ధి చేసి అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రబిందువుగా చేయవచ్చు. ఓబులవారిపల్లె, కృష్ణపట్నం రైల్వేలైన్ నిర్మాణం పూర్తి కావడంతో కాళహస్తి నడికుడి రైల్వే లైన్∙నిర్మాణంతో రవాణాపరంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాళహస్తి, నడికుడి రైల్వే లైను కేంద్ర ప్రభుత్వ సహాయంతో వరంగల్ దాకా పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు చెన్నై వరంగల్ రైల్వే మార్గానికి సమాంతర రైల్వే మార్గం అభివృద్ధి చెందుతుంది. గూడూరు నుంచి బలార్షాకు మూడవ రైల్వే లైను వేయటానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇది త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు చూసుకోవాల్సిన అవ సరం ఏపీ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. గూడూరు బలార్షా అదనపు రైల్వే లైను వైజాగ్ రాయపూర్ రైల్వే లైన్లు డబుల్ లైన్లుగా మార్చటం తూర్పు తీరంలో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఓడరేవుల కార్యక్రమాలు విస్తృతం కావడానికి దోహదం చేస్తాయి. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పడిన నిష్ణాతుల కమిటీ భవిష్యత్తులో పెట్టే పెట్టుబడులలో 85% రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలలో పెడితేనే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని అంశాల మీద దృష్టి కేంద్రీకరించడానికి ముందుగా అమరావతి మహానగర వ్యామోహం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మహా నగరాలు తేనె కుండల్లాగా అన్ని ప్రాంతాల పెట్టుబడులను ఒక చోటికి ఆకర్షించి మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి నష్టం చేస్తాయని శివరామకృష్ణ తన అనుభవంతో చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆలోచించకుండా మొండిగా ముందుకు పోతే రాష్ట్రం అన్ని విధాలా నష్టపోక తప్పదు. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
పార్టీలన్నీ కలసి పోరాడాలి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలకోసం అన్ని పార్టీలు కలసిపోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. జాతీయస్థాయిలో ఐక్యంగా పోరాడితేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమన్నారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ఉండవల్లి మంగళవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని సూత్రప్రాయంగా లెక్కతేల్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పనిచేయాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయన్నారు. నాలుగున్నరేళ్లలో కేంద్రమేమీ ఇవ్వలేదన్నారు. నిధుల కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. విభజన హామీల సాధనకోసం సమష్టి పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బీజేపీ తరఫున ఐవైఆర్ కృష్ణారావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించకుండా నాలుగున్నరేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి ప్రజలను మోసగించిన టీడీపీతో కలసి వేదిక పంచుకోమని చెబుతూ వైఎస్సార్సీపీ ఈ భేటీలో పాల్గొనేందుకు నిరాకరించింది. బీజేపీ పాల్గొంటున్నందుకు నిరసనగా సీపీఎం బహిష్కరించింది. కాగా, ఐవైఆర్ కృష్ణారావు విడిగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్లు రావాలని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. తాను వ్యతిరేకించానన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజెంటేషన్ ఇస్తామన్నారని, అలాగైతే తాము కూడా కేంద్రమిచ్చిన నిధులపై వివరాలిస్తామనడంతో వారు వెనక్కు తగ్గారన్నారు. -
‘కేంద్రాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నం’
సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నించిందని బీజేపీ నాయకుడు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉండవల్లి సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన సందర్భంగా ఏపీకి ఇవాల్సినవన్నీ కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ ప్రతినిధిగా తను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. ‘ఏపీకి కేంద్రం ఇంకా 1.16 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని టీడీపీ చెబుతోంది.. అది అబద్ధం. ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత ఇవ్వాల్సి ఉందనేదానిపై మా వద్ద లెక్కలు ఉన్నాయి. టీడీపీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామంటే, మేము కూడా ఇస్తామన్నాం. దాంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరగలేదు. సమావేశంలో హోదా కోసం కలిసి ఉద్యమం చేసే విషయంలో చర్చ జరగలేదు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై చర్చ జరగాలనే అంశంపై అందరు సానుకూలంగానే ఉన్నార’ని ఐవైఆర్ తెలిపారు. -
పురంధేశ్వరి చైర్పర్సన్గా బీజేపీ మేనిఫెస్టో కమిటీ
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని మేనిఫెస్టో చైర్పర్సన్గా, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కన్వీనర్గాను నియమించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా పి.విజయబాబు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, దాసరి శ్రీనివాసులు, షేక్ మస్తాన్, పాకా సత్యనారాయణ, కె.కపిలేశ్వరయ్య, పి.సన్యాసిరాజు మురళి, సుధీష్ రాంబోట్ల, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యంను నియమించారు. -
ఏపీ బీజేపీ మేనిపెస్టో కమిటీ ఇదే..!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించడానికి కన్నా లక్ష్మీనారాయణ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చైర్పర్సన్గా, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్గా ఉన్నారు. వీరితోపాటు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు.. 1. డి. పురందేశ్వరి(చైర్పర్సన్) 2. ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్) 3. పి. విజయ బాబు 4. పీవీఎన్ మాధవ్ 5. దాసరి శ్రీనివాసులు 6. షేక్ మస్తాన్ 7. పాక సత్యనారాయణ 8. కె. కపిలేశ్వరయ్య 9. పి సన్యాసి రాజు 10. సుదీష్ రాంబోట్ల 11. డీఏఆర్ సుబ్రహ్మణ్యం -
నవ్యాంధ్రతో నా నడక పుస్తకం ఆవిష్కరణ
-
పదేళ్ల పనులు నాలుగేళ్లలో అవుతాయా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా విభజన చట్టంలోనూ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటనలోనూ ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రానికి కొన్ని వాగ్దా నాలు చేయడమైనది. విద్య మౌలిక సదుపాయాల సంస్థల ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 93 సెక్షన్లో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ 13లో పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితిలో చేపట్టాలని పేర్కొన్నారు. తదనుగుణంగా 13వ షెడ్యూల్లో విద్యాపరమైన కొన్ని సంస్థలను మౌలిక సదుపాయాలకు సంబంధించి మరికొన్ని సంస్థలను ప్రస్తావించటం జరిగింది. విద్యాపరమైన సంస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, ఎన్.ఐ.టి, ఐసీఆర్, ఐఐఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఎన్.ఐ.డి.ఎం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి 13వ షెడ్యూల్లో పొందుపరచడమైనది. దీనికి అనుగుణంగా వేగవంతంగా ఈ సంస్థలో చాలా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలన్నీ 2015–16 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ, అధికారిక స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మాత్రం పూర్తి మౌలిక సౌకర్యాలు ఏర్పడిన తర్వాతనే అంటే నాలుగు లేక అయిదేళ్ల తర్వాత ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయపరంగా గట్టి ప్రయత్నం జరిపి తాత్కాలిక భవనాల్లోనైనా పర్వాలేదు త్వరగా ప్రారంభించండి అని అభ్యర్థించి ఈ సంస్థలను అనతికాలంలో సాధించుకున్నది. ఇతర రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ సంస్థలను స్థాపించడానికి గణనీయమైన సమయమే పట్టింది. కానీ సంస్థలు ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం. ఆరోజు తాత్కాలికమైన భవనాల్లో వెంటనే సంస్థలను ప్రారంభించమని ప్రాధేయపడి ఈరోజు అవి తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని అపవాదు వేయటం దురదృష్టకరం. అదే విధంగా ఈ సంస్థలన్నిటికీ 10 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయని ఇప్పుడున్న విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే పదిహేనేళ్లు పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన సహేతుకం కాదు. పూర్తిగా వాస్తవాలను వక్రీకరించి చేస్తున్న ఆరోపణ. ఏ సంస్థ అయినా ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఎక్కువ నిధులను ఖర్చు పెట్టలేదు. క్రమేణా పనులు వేగం పుంజుకుని నిర్ణీత కాలంలో పూర్తయ్యే క్రమంలో అన్ని సదుపాయాలు ఏర్పడతాయి. జాతీయ విద్యా సంస్థలను కేంద్రం అనేక ఇతర రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సంస్థకు ఒక డైరెక్టర్ ఉంటాడు. సదుపాయాల ఏర్పాటు పురోగతి తాను చూసుకుంటాడు. ఇటువంటి విధి విధానాలు ఉన్నప్పుడు తనకు సంబంధించని అంశాల్లో వాస్తవాన్ని వక్రీకరించి చూపెడుతూ ఈ సంస్థలు పూర్తవటానికి 15 ఏళ్లు పడుతుందని అసత్య ప్రచారం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇతర రాష్ట్రాల్లో పూర్తయిన విధంగానే నిర్ణీత కాలంలో ఈ సంస్థలన్నీ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో పని చేయడం జరుగుతుంది. ఇక రెండవ అంశం, 13వ షెడ్యూల్లోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంస్థలు. వీటిలో ప్రధానంగా విమానాశ్రయాల ఆధునీకరణ, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని నాకు అందిన సమాచారం. ఇక దుగరాజపట్నం నౌకాశ్రయం పర్యావరణ సమస్యల మూలంగా ముందుకు పోవటం లేదు. మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల సంస్థల విషయంలో చట్టంలో సాధ్యాసాధ్యాల పరిశీలన గురించి ప్రస్తావించడం జరిగింది గానీ వీటిని ఇదమిత్థంగా నెలకొల్పాలని పేర్కొనలేదు. ఈ సంస్థలన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కావాల్సిన వ్యవస్థలు. ఈ విషయం తెలిసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో వీటి సాధ్యాసాధ్యాల పరిశీలనను ప్రస్తావించి వదిలేసింది కానీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదు. పైపెచ్చు వీటిని ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల సమయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ఈ అంశాలన్నీ వివిధ దశల పురోగతిలో ఉన్నాయి. చట్టంలో అంశాలు పై విధంగా ఉండగా, 10 సంవత్సరాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న చాలా సంస్థలను రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పని కట్టుకుని ఈ వాస్తవాలన్నీ మరుగున పరుస్తూ ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం ఉన్న కొన్ని అంశాలను మాత్రమే భూతద్దంలో చూపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దోషి లాగా చూపెట్టాలనే ప్రయత్నాన్ని చేయడం దురదృష్టకరం. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
కేంద్ర సహాయంపై ఇంత వక్రీకరణా?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 46 కింద రెవె న్యూలోటు భర్తీ గురించి ఏమున్నది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వాస్తవానికి అపోహకు ఉన్న తేడా ఏంది అనే అంశాన్ని సాక్షి పత్రికలో ఇంతకు ముందు విశదీకరించటం జరిగింది. ప్రస్తుత వ్యాసంలో వెనుకబడిన ప్రాంతాలకు సహాయ సహకారం కింద పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏమున్నది కేంద్రం నుంచి ఎటువంటి సహా యం అందింది అనే అంశాన్ని పరిశీలిద్దాం. వెనుకబడిన ప్రాంతాలకు సహాయం చేయడం అనే అంశాన్ని పునర్విభజన చట్టంలో రెండు ప్రాంతాలకూ వర్తించి పేర్కొనడం జరిగింది. సెక్షన్ 46 కింద కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల వరకే ఈ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పరిమితం చేయడం జరిగింది. కానీ సెక్షన్ 94లో ఈ అంశాన్ని తెలంగాణలో, ఆంధ్రాలోని వెనకబడిన జిల్లాలలో భౌతిక సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయాన్ని అందించే విధంగా ప్రస్తావించారు. ఈ రెండు సెక్ష న్లలోని అంశాలను అన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఆరు సంవత్సరాల కోసం ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అలా గుర్తించిన 7 ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు, తెలంగాణలో గుర్తించిన 9 వెనకబడిన జిల్లాలకు ఈ అభివృద్ధి ప్రణాళిక వర్తిస్తుంది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగేళ్లకు ఆంధ్ర రాష్ట్రానికి మూడేళ్లకు ఏడాదికి 50 కోట్ల చొప్పున ప్రతి జిల్లాకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. అయితే కేంద్రం నుంచి ఏపీకి 4వ సంవత్సరానికి ఇచ్చిన గ్రాంట్ను కొన్ని విధానపరమైన అంశాల దృష్ట్యా వెనక్కు తీసుకున్నామని, తగిన సమయంలో తిరిగి ఇవ్వటం జరుగుతుందని ఈ మధ్యనే లిఖితపూర్వకమైన జవాబు ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్సభ సభ్యులు రామమోహన్ నాయుడికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చిన గ్రాంట్ల వినియోగ పత్రాన్ని సమర్పించినా దానికి సంబంధించిన కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని దీనిని బట్టి అర్థం అవుతుంది. ఈ ప్యాకేజీ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఆరేళ్లకోసం రూపొందించింది కనుక నాలుగేళ్లకు మాత్రమే కాకుండా మిగిలిన రెండేళ్ల మొత్తాలు కూడా కొన్ని రోజులు అటూఇటుగా రావటం అయితే తథ్యం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ విషయంలో విమర్శలు చేసే వారు ప్రధానంగా ప్రస్తావించే అంశం, పునర్ విభజన చట్టంలోని సెక్షన్లను ఆనాటి ప్రధానమంత్రి మన్మో హన్ సింగ్ పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలతో కలిపి చదవాలని, ఆయన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని పేర్కొన్నారని ఆ స్థాయిలో నిధులు విడుదల చేయాలని పేర్కొంటారు. వీరు ఇందులో ప్రధానంగా విస్మరించిన అంశం ఏమిటంటే బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీలలో ప్రభుత్వం అప్పటికే అమలు చేస్తున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాల మొత్తాన్ని కూడా భాగంగా చూపెడతారు. మహాత్మాగాంధీ ఉద్యోగ హామీ పథకం లాంటి పలు కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధులను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా చూపెట్టి ప్యాకేజీ స్థాయిని పెంచడం జరుగుతుంది. ఆ వివిధ కార్యక్రమాల కింద వచ్చే నిధులను కలపకపోతే ఆ రాష్ట్రాలకు కూడా ఈ స్కీమ్ కింద వచ్చే నిధులు మనకన్నా ఎక్కువ ఏమీ ఉండవు. దీన్ని విస్మరించి బుందేల్ఖండ్లాంటి ప్యాకేజీలకి విపరీత ప్రచారమివ్వటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. 94వ సెక్షన్లో పరిశ్రమల రాయితీలను కూడా పేర్కొనడం జరిగింది. తదనుగుణంగా పైన గుర్తిం చిన వెనకబడిన జిల్లాలకు 2015– 20 మధ్య పెట్టిన పరిశ్రమలపై అదనంగా 15 శాతం తరుగుదల (de- preciation) 15 శాతం ఏర్పాటుచేసిన యంత్రాల పైన పెట్టుబడి అలవెన్స్ పొందే అవకాశాన్ని కల్పిం చడం జరిగింది. ఇదే 94వ సెక్షన్లో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు రాజధానిలో అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, సెక్రటేరియట్ లాంటి భవనాలతో పాటు ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని పేర్కొనడం జరిగింది. దీనికనుగుణంగా రూ. 1,500 కోట్ల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో అసత్య ప్రచారాలతో ఏర్పడిన అపోహకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని సెక్షన్లతోపాటు ఆనాటి ప్రధాని మన్మో హన్ ప్రకటనకు అనుగుణంగా గత నాలుగేళ్లనుంచి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మాత్రం కేంద్రం ఇచ్చిన సహా యాన్ని పూర్తిగా విస్మరించి పరిశీలనలో ఉన్న అంశాలనే భూతద్దంలో చూపెడుతూ ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
‘పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తుందనీ, చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. శనివారం తాడేపల్లి గూడెంలోని డీఎస్ఆర్ కళ్యాణ మండపలంలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియా అంతా ఒకపైపే ఉండటం వల్ల ప్రజలకు నిజాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తటస్థ మీడియా లేకపోవడం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో నాయకులు మాట్లాడిన మాటలు కూడా ప్రజలకు పూర్తిగా చూపించడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని అనడంలో వాస్తవం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి లేదని, సెక్షన్ 94లో రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని మాత్రమే ఉందన్నారు. ఆ విధంగా ఏపీలో 7 జిల్లాలను గుర్తించి మూడు సంవత్సరాలకు రూ.350 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చిందని చెప్పారు. నాలుగో సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన డబ్బును మళ్లీ వెనక్కి తీసుకుందని, యూటిలైజెడ్ సర్టిఫికేట్ ఇచ్చాక వెనక్కి ఇస్తామని చెప్పిందన్నారు. ఏపీకి ఆర్థిక సహాయం కింద రూ. 5000 కోట్లు ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చింది కానీ, రూ. 16,500 కోట్లు నాబార్డ్ నుంచి కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిందన్నారు. దాని ప్రకారం రూ. 12,500 కోట్లు ఇచ్చెందుకు కేంద్రం అంగీకరించిందిని కానీ చంద్రబాబు రాజకీయ వ్యూహంతో దానిని వద్దని చెప్పారని ఆరోపించారు. కేంద్రం ప్యాకేజీకి మొదట అంగీకరించిన చంద్రబాబు.. రాజకీయ లబ్దికోసమే యు టర్న్ తీసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్ట పోతుందని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. -
ఏపీ రెవెన్యూ లోటు అంచనాలోనూ రాజకీయమే!
రాష్ట్ర విభజన అనంతరం 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ రెవెన్యూ లోటు వెలితిని ఆనాడు గవర్నర్ 16 వేల కోట్లుగా అంచనా వేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఆదాయం అంచనాల కన్నా ఎక్కువ పెరగటం వలన, ఖర్చు అదుపులో ఉండటం వలన 2014 డిసెంబర్ నాటికి ఈ రెవెన్యూ లోటు మూడు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఉండదని తేటతెల్లమైంది. కానీ 2015 జనవరి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు వెచ్చించి ఈ లోటును 16,078 కోట్లకు పెంచడమైంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చనే అవాస్తవిక ధీమాతో రెవెన్యూ లోటు పెంచి ఈ మొత్తాన్ని భర్తీ చేయవలసిందిగా కేంద్రాన్ని కోరటం జరిగింది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాల అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇది ఈ అంశంపై అపోహకు, వాస్తవానికి ఉన్న తేడా. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభజన ఆంధ్ర ప్రాంతంలోని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక వారిని శాంతపరచడానికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో కొన్ని హామీలను, మరికొన్ని హామీలను ఆ నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెం టులో చేసిన ప్రకటనలోనూ పొందుపరచటం జరి గింది. ఈ హామీల అమలు ఏ విధంగా ఉన్నది, ఇంకా ఏమేమి అమలు చేయాలనే అంశాలను పరిశీలిద్దాం. ఈ వ్యాసంలో రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 46 కింద పొందుపరిచిన విధంగాను, ప్రధాని మన్మో హన్ సింగ్ పార్లమెంట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేసిందనే అంశాన్ని పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46.. రెండు వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక వాటికి వేరువేరుగా తమ సిఫార్సు ఇవ్వవలసిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వం కోరాలని చెబుతుంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని అభ్యర్థించడం జరిగింది. ఈ రెండు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి ఆర్థిక సంఘం సిఫార్సులు ఇవ్వటానికి వెసులుబాటు కల్పిస్తూ వారి కాల పరిమితిని కూడా పొడిగించటం జరిగింది. తదనుగుణంగా 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తిరుపతిలోనూ తెలంగాణ రాష్ట్రంతో హైదరాబాద్లోనూ భేటీ అయింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21,113 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంటుగా సిఫారసు చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు కాకుండా ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు అయ్యే 5 సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంటు వచ్చిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ మిగులు కలిగే ఉండే రాష్ట్రంగా నిర్ధారించి ఆర్థిక సంఘం ఎటువంటి రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్లను తెలంగాణ రాష్ట్రానికి సిఫారసు చేయలేదు. 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 వరకు గల రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి సిఫార్సు చేసింది కనుక ఇక మిగిలిపోయింది 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటు భర్తీ. ఈ అంశం విభజన చట్టంలోని 46వ సెక్షన్లో ప్రస్తావించిన ఈ అంశాన్ని గురించి మరింత వివరణ...æ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనలో ఉంది. మొదటి సంవత్సరంలో వచ్చే నిధుల వెలితిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుం దని ఆయన ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా ఆనాడు గవర్నర్ మొదటి సంవత్సరంలో రెవెన్యూ పరంగా వచ్చే వెలితిని 16 వేల కోట్లుగా అంచనా వేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం అంచనాల కన్నా ఎక్కువ పెరగటం వలన, ఖర్చు అదుపులో ఉండటం వలన 2014 డిసెంబర్ నాటికి ఈ రెవెన్యూ లోటు మూడు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఉండదని తేటతెల్లమైంది. జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు వెచ్చించి ఈ లోటును 16,078 కోట్లకు పెంచడం జరిగింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చును అనే అవాస్తవిక ధీమాతో రెవెన్యూ లోటు పెంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మొత్తాన్ని భర్తీ చేయవలసిందిగా కోరటం జరిగింది. కాగ్ వారు కూడా నిర్ధారించారు గనుక ఈ మొత్తాన్నిభర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అనుకూలంగా మరిచిపోయినా ప్రధానమైన అంశం ఏమిటంటే కాగ్ వారు కేవలం లోటు ఎంత అనేది నిర్ధారిస్తారు కానీ దానిలో ఎంత భర్తీకి అర్హత కలిగి ఉంటుందనేది మాత్రం కేంద్రం నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పై విధంగా 16,078 కోట్లకు రెవెన్యూ లోటు కింద భర్తీ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ పంపిన ప్రతిపాదన క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం తాము కేవలం విభజన వలన ఏర్పడిన లోటును మాత్రమే భర్తీ చేస్తాం కానీ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ఏర్పడిన లోటును భర్తీ చేయమని ఆ రకంగా చేసేటట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. పంపిన ప్రతిపాదన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విభజన వలన ఏర్పడిన లోటును 4,117 కోట్లుగా నిర్ధారించి అంతవరకు నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయం గా కేంద్ర ప్రభుత్వం 2015–16 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిర్ధారించిన లోటు 6,609 కోట్లు కనుక దానిని ప్రాతిపదికగా తీసుకుని 2014 సంవత్సరంలో విభజన తరువాత పది నెలల సమయానికి అదే నిష్పత్తిలో నిధులు విడుదల చేయటానికి సంసిద్ధత తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న విధంగా 16 వేల 78 కోట్లు విడుదల చేయాలని వాదించడం మొదలెట్టింది. చివరికి విభజన అంశాల అమలు గురించి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా 2014–15 సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఇవ్వవలసిన మొత్తం రూ.4,117 కోట్లుగా పేర్కొనడం జరిగింది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాల అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇది ఈ అంశంపై అపోహకు, వాస్తవానికి ఉన్న తేడా. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
అంతా ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసమే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కావడం తృటిలో తప్పిపోయిందని ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు తాను సీఎస్ అవుతానని అనుకోలేదని వెల్లడించారు. కానీ తెలుగుదేశం పార్టీ వేసుకున్న సామాజిక వర్గాల లెక్కల వల్ల తనకు యాధృచ్ఛికంగా చీఫ్ సెక్రటరీ పదవి దక్కిందని తెలిపారు. ఈ పుస్తకంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇంకా ఏం ప్రస్తావించారంటే... ‘‘నేను సీఎస్ అయిన రెండు నెలల్లోనే నాకు, తనకు మధ్య భావసారూప్యత అంతగా లేదన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లున్నారు. గ్రహించిన తర్వాత కీలకమైన నిర్ణయాల్లో నన్ను విశ్వాసంలోకి తీసుకోవడం మానేశారు. నాకు తెలియకుండానే నిర్ణయాలు జరిగేవి. నేను కూడా నా స్థాయి తగ్గించుకుని కలిసిపోవాలని అనుకోలేదు. నాకు నేను ఒక పరిధి ఏర్పరచుకుని పనిచేయడం ప్రారంభించా. చంద్రబాబు సమీక్షించని ప్రాజెక్టులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టి చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ వ్యవస్థ సవ్యంగా సాగేలా చూసుకోసాగాను. తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు నేను అడ్డుగా ఉంటానని భావించారేమో నన్ను ఒకటి రెండు సార్లు తప్పించే అంశంపై అంతర్గతంగా చర్చించినట్లు తెలిసింది. ఇద్దరు అధికారులను నా స్థానంలో తీసుకోవాలని రెండు తడవలు ఈ చర్చలు జరిగాయని నా సమాచారం. కానీ, చివరకు తుది నిర్ణయం తీసుకునేలోపే నా పదవీ కాలం ముగిసింది. పదవీ విరమణ తర్వాత మరో పది, పదిహేనేళ్లు సమాజానికి సేవ చేయాలని అనుకున్నా. వేద మంత్రాలకు విలువ లేకుండా పోయింది నాకు చిన్నప్పటి నుంచీ నా సొంత సామాజికవర్గానికి సేవ చేయాలన్న ఆలోచన ఉంది. అన్ని వర్గాలకూ ఏదో రకంగా మేలు జరుగుతోంది. బ్రాహ్మణులకు మాత్రం ఆర్థికంగా, సామాజికంగా మేలు చేయాలని ఆలోచించేవారే లేరు. చాలామంది పేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న చిన్న గుళ్లలో అర్చకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వేద మంత్రాలకు విలువలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల బ్రాహ్మణుల కోసం క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నా. బ్రాహ్మణ కార్పొరేషన్కు అప్పటి వరకు చైర్మన్గా ఎవరినీ నియమించలేదు. దానికి సంబంధించిన ఫైల్ తీసుకెళ్లా. నాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి అక్కరలేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వండని అడిగా. ఆయన(చంద్రబాబు) సరేనని ఒప్పుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పటికే ఏర్పాటై పనిచేస్తోంది. దీని ఏర్పాటుకు ముఖ్యకార్యదర్శిగా నావంతు కృషి చేశా. తర్వాత దీనికి ఎండీని నియమించడానికి ప్రయత్నించా. బ్రాహ్మణులు, దళితుల ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి జరిగినప్పుడు నా అంతట నేను వెళ్లాను. ఈ సమావేశానికి నేను రావడంతో మంచి స్పందన లభించింది. గత చరిత్ర తవ్వుకుని ప్రయోజనం లేదు. ఇవాళ బ్రాహ్మణులు, దళితులు కలిసి సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మన ప్రయోజనాల మధ్య వైరుధ్యం లేదు. బ్రాహ్మణులు ఒక అడుగు వేస్తే దళితులు వంద అడుగులు వేస్తారు అని అన్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్ తర్వాతి కాలంలో అంబేడ్కర్ జయంతి, బాబూ జగ్జీవన్రాం జయంతి కూడా నిర్వహించాలన్నది నా భావన. బ్రాహ్మణ కార్పొరేషన్ సమన్వయకర్తలతో సమావేశాలు పెట్టాను. మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంజీకే మూర్తి లాంటి దళిత మేధావులతో ప్రసంగాలను ఇప్పించా. ఇది చంద్రబాబుకు ఇష్టం లేదు. నేను నాకిచ్చిన పరిమితికి మించి జనంలోకి వెళుతున్నాని అనుకుని ఉంటారు. నన్ను దూరం పెట్టడం ప్రారంభించారు. నాపై తప్పుడు ప్రచారం చేశారు ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ పని చేయిస్తున్నదనే విషయంలో సందేహం లేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించినప్పుడు కూడా అందులో చరిత్ర వక్రీకరించారని, దానికి పన్ను మినహాయించినందు వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో మిత్రులతో చర్చించాను. దీనిపై విజయకుమార్ స్పందిస్తూ ఐవైఆర్ తెలుగుదేశానికి వ్యతిరేకమన్నట్లుగా ప్రచారం చేశారు. మొదట్లో ఇదంతా విజయకుమార్ అనే వ్యక్తి చేశారని పొరపాటు పడ్డాను. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు శైలి ప్రతి చోటా కనిపిస్తుంది. అధికారులపై లీకులు ఇచ్చి వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఆపైన తన అనుకూల పత్రికల్లో్ల కథనాలు రాయించడం, చివరకు వేటు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ నోటిఫికేషన్పై సీఎం సంతకం పెట్టలేదు నేను బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు అర్చక సంక్షేమ ట్రస్టు చైర్మన్గా ఉన్నాను. 1987లో ఎన్టీఆర్ టీటీడీలో మిరాశీ వ్యవస్థను రద్దు చేయడం కోసం మొత్తం అన్ని ఆలయాల్లో వారసత్వ వ్యవస్థను రద్దు చేశారు. దీనివల్ల అర్చకులకే కాక వివిధ వర్గాలకు అన్యాయం జరిగింది. 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చాక చిన్న మందిరాల్లో అర్చక వ్యవస్థను పునరుద్ధరిస్తూ చట్టాన్ని సవరించారు. కానీ, దానికి సంబంధించిన నిబంధనలను రూపకల్పన చేయలేదు. అప్పుడు ఐవీ సుబ్బారావు దేవాదాయ విభాగం సెక్రటరీగా ఉన్నారు. సీఎస్గా ఉన్నప్పుడే ఈ విషయం నా దృష్టికి వస్తే నేను ఈ విషయం చేపట్టాను. చొరవ తీసుకుని నిబంధనలను రూపొందించి సీఎంకు పంపించాను. కానీ, చాలా రోజులు సీఎం దాన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. చేద్దాం, చూద్దాం అనేవారు. ఈ లోపు నేను పదవీ విరమణ చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యాను. ఎంతో కృషి చేశాక చంద్రబాబు అంగీకరించారు. అయితే, ఆ తరువాత కొందరు చంద్రబాబు చెవులు కొరికారు. దీనివల్ల మిరాశీ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించినట్లవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు వెనక్కి తగ్గారు. ‘కృష్ణారావు నన్ను తప్పుదోవ పట్టించారు. దీని పర్యవసానాలు ఉన్నాయి. నేను దీన్ని ముందుకు తీసుకెళ్లదలచుకోలేదు’ అని చెప్పారు. అర్చక వారసత్వానికి సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్పై ముఖ్యమంత్రి సంతకం పెట్టలేదు. ఆ సంతకం పెట్టించడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు’’ ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడాలట! బ్రాహ్మణ కార్పొరేషన్ బోర్డులో వ్యాపారవేత్తలు, మేధావులు ఉంటే బాగుంటుందని, వారిలో బ్రాహ్మణేతరులు కూడా ఉండడం మంచిదని భావించా. జీఎంఆర్, గల్లా రామచంద్రనాయుడు, కేఎస్ఎన్ రాజులతో మాట్లాడి ఒప్పించి వారితోపాటు ఎస్వీ రావు, సుందర్ లక్ష్మణ్లను సభ్యులుగా చేర్చి ఫైల్ పంపాను. ఎండీగా వెంకట్ చంగవల్లి పేరుతోపాటు ఈ పేర్లను చంద్రబాబు అనుమతి కోసం పంపించా. చాలారోజులైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. నేను స్వయంగా వెళ్లి వారిని ఎందుకు ప్రతిపాదించానో వివరించా. ‘లేదండీ మనం ఎవరిని నియమించినా పార్టీకి ఉపయోగపడే వారు కావాలి. మనకు కావాల్సింది జెండాలు మోసేవారు. వీళ్లందరినీ పెట్టుకుంటే ఎన్నికల్లో ఎలా ఉపయోగం?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. నేనేమీ మాట్లాడలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా, ఒక అత్యున్నత సంస్థగా కార్యకలాపాలు నిర్వహించడం కన్నా అది ఏదో సబ్సిడీలు పంచి పార్టీకి ఉపయోగపడే సంస్థగా మార్చాలన్నదే చంద్రబాబు ఉద్ధేశంలా నాకు కనిపించింది. బహుశా నేను బ్రాహ్మణ కార్పొరేషన్కు రావాలనుకోకపోతే ఆ సంస్థ చైర్మన్గా వేమూరి సూర్యనే పెట్టాలని చంద్రబాబు అనుకున్నట్లు తర్వాత తెలిసింది. మొదట్లో కొద్ది రోజులు నేను నా శైలిలో పనిచేస్తుంటే జోక్యం చేసుకోలేదు. కానీ, తర్వాత ఊరుకోలేకపోయారు. ఆయనకు(చంద్రబాబు) కార్పొరేషన్లో పార్టీ జెండాలు మోసేవారు, వారు విదిల్చే డబ్బుల కోసం తమను భుజాన వేసుకుని బ్రాహ్మణులను పార్టీకి దాసోహం చేసేవారు కావాలి. వారిది చాలా పరిమిత దృష్టి. బ్రాహ్మణులకు సాధికారికత కల్పించి, పార్టీతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణులందరి అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడడం, వారిని ఇతర పదవులు కూడా కోరేలా పైకి తీసుకురావడమే నా ఉద్దేశం. -
సోదిలా.. సమీక్షలు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సమీక్షలన్నీ నిష్ప్రయోజనంగా మారుతున్నాయని, గంటల తరబడి సమీక్షల వల్ల ఎటువంటి ప్రయోజనం ఒనగూరడం లేదని, ఇవన్నీ కేవలం బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడానికేనని రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహార శైలి గురించి ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇవీ... మిగతావారి పనులకు ఆటంకం... ‘చంద్రబాబు శైలి, వ్యక్తిత్వానికి సంబంధించి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి... తాను చాలా కష్టపడుతున్నానని, 24 గంటల పాటు పనిచేస్తున్నానని, తనలా పనిచేసేవారు ఎవరూ లేరని ప్రచారం చేసుకోవడం, అలా కనిపించేందుకు ప్రయత్నించడం చంద్రబాబు తరచూ చేస్తుంటారు. ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు దానికి అత్యధిక ప్రచారం ఇస్తుంటాయి. నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు 50 శాతం తక్కువ పనిచేస్తే రాష్ట్రం 200 శాతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కుటుంబం, మనవడితో గడిపేందుకు తీరిక లేదని ఆయన వాపోతుంటారు. అలా వాపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పనిచేయడం వల్ల అదనంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ఎటువంటి అదనపు విలువ చేకూర్చకుండా ఆయన అధికంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తే ఏం లాభం? నిజం చెప్పాలంటే మిగతావారు పనిచేయడానికి ఇది ఆటకంగా మారుతోంది. గంటసేపు ఉత్తినే చర్చ... ఇక రెండోది.. చంద్రబాబు ఆచరణీయమైన రీతిలో గడువులు నిర్దేశించుకోకపోవడం, చేయాల్సిన సమయం కంటే ముందుగా చేయాలంటూ అనవసరంగా హడావుడి చేస్తుంటారు. ఉదాహరణకు యూరోపియన్ సంస్థలు షెల్, ఎంజీ కాకినాడలో ఎఫ్ ఎస్ ఆర్ యు (ఫ్లోటింగ్ స్టోరేజి, రిగ్యాసిఫికేషన్ యూనిట్)లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. సముద్రంలోనే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను నిల్వచేసే తర్వాత సరఫరా చేస్తారు. ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఎన్ని రోజుల్లో మీరీ ప్రాజెక్టు పూర్తి చేస్తారు? అని అప్పుడు చంద్రబాబు అడిగారు. నేను మనసులో వీళ్లు రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేటట్లైతే నాలుగేళ్లు అని చెబితే బాగుండు అనుకున్నా. వెంటనే చంద్రబాబు రెండేళ్లలో చేయలేరా? అని అంటారని అనుకున్నా. కానీ ఆ కంపెనీ వాళ్లు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని సరైన సమయమే చెప్పారు. దీంతో ఏడాదిలో ఎందుకు పూర్తి చేయకూడదు? అని చంద్రబాబు అడిగారు. అంత తక్కువ సమయంలో వీలు కాదని వాళ్లు బదులిచ్చారు. దీనిపైనే గంటసేపు ఉత్తి చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టు ఇప్పటివరకూ ప్రారంభమే కాలేదు. తమకు లాభసాటి కాదని షెల్, ఎంజీ కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. వారానికి ఆరు గంటలు వృధా.. రాజధాని తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకు ఆరు నెలలు పడుతుందని కాంట్రాక్టు తీసుకున్న సంస్థ చెప్పింది. రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తాను ప్రతివారం వచ్చి తనిఖీ చేస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రతి వారం వెళ్లడం వల్ల అక్కడ జరిగే పనిలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. పైగా ఆయన చెప్పిన సమయానికి నాలుగు గంటలో ఐదు గంటలో ఆలస్యంగా వెళతారు. దీంతో అక్కడి వాళ్లంతా నాలుగైదు గంటలు ఆయన కోసం వేచి చూస్తూనే ఉంటారు. తర్వాత రెండు గంటల పాటు సమీక్ష జరుగుతుంది. అంటే ప్రతి వారం ఆరు గంటలు వృధా అవుతుంది. చివరకు తాత్కాలిక సెక్రటేరియట్ కాంట్రాక్టర్ తాను తొలుత చెప్పిన సమయానికే పని పూర్తి చేశారు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రతివారం రావడం వల్ల వచ్చిన ఉపయోగమేమిటో? ఎవరికీ అర్ధం కాలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై కూడా ఇదేవిధంగా సమీక్ష చేస్తున్నారు. పదేపదే అవే అంశాలు....! సమీక్ష చేయడంలో తప్పేమీ లేదు. కానీ చంద్రబాబు సరైన కాల పరిమితి ఇచ్చి పాత మినిట్స్ దగ్గర పెట్టుకుని హేతుబద్ధంగా సమీక్షించరు. తనను బిజీగా ఉంచుకునేందుకు సమీక్ష పేరుతో పనులు ఆలస్యమయ్యేందుకు కారణమవుతారు. చీటికిమాటికి ఒకే రకమైన సమీక్షలు, పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం సోదిలా అనిపిస్తుందని కూడా ఆయనకు తట్టదు. ఆయన వల్ల నిజంగా పనిచేసే చాలా మంది సమయం వృధా అవుతోంది. మండల స్థాయిలో ఉదయమే లేవడం. గంటలు గంటలు ఆయన చెప్పింది వినడం అలవాటైపోయింది. చంద్రబాబు తాను ఎంతో కష్టపడి చేస్తున్నాననే బిల్డప్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయనకు అర్ధం కాదు. అధికారం లేనప్పుడు తనకు సాయం చేసిన వారికి ఇప్పుడు మళ్లీ తగిన రీతిలో ప్రతిఫలాలు అందేలా చూడాలని భావించడం కూడా లక్ష్యాలను నీరు కారుస్తోంది. పుత్రుడి జోక్యం కొత్త పరిణామం.. చంద్రబాబు తొలివిడత పాలన సమయంలో ఆయన పుత్రుడి జోక్యం లేదు. ఇప్పుడు అది కొత్త పరిణామం. నేనున్నంత కాలం దాని ప్రభావం ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా అధికార యంత్రాంగంపై ఉంది. చంద్రబాబు తనకు అన్నీ తెలుసన్న అభిప్రాయంతో ఉండడం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ‘వాట్ ఏన్ ఐడియా సర్ జీ..!’ కృష్ణా జలాలను బకింగ్ హాం ద్వారా పైకి పంపించి పంపులు పెట్టి సోమశిలలో నింపుతాననో ఏదో చెబుతున్నారు. ఇది సాంకేతికంగా ఏమేరకు సాధ్యపడుతుందన్న విషయం మాత్రం ఎవరూ మాట్లాడరు. పైగా ఎలా తయారయ్యారంటే ఆయనను మెప్పించేందుకు ‘వాట్ ఎన్ ఐడియా సర్ జీ..’ అన్న స్థాయిలో ప్రశంసిస్తున్నారు. దీంతో తాను చెప్పింది కరెక్టని చంద్రబాబు అనుకుంటున్నారు. ‘‘గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపాం... ఎప్పుడూ ఇలా జరగలేదు. మేమే చేశాం. ఇదో పవిత్ర సంగమం..’’ అని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారో. ఎన్ని తడవలు ప్రారంభోత్సవాలు, పూజలు చేశారో! కానీ పవిత్ర సంగమం ఎప్పుడో జరిగిపోయింది. తెలుగుగంగ పేరుతో ఎన్టీఆర్ మొదలు పెట్టారు. సోమశిల ప్రాజెక్టులో కృష్ణా జలాలు కలిసినప్పుడే పవిత్ర సంగమం ఏర్పడింది. అది వదిలేసి ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నామని ప్రచార్భాటం చేస్తున్నారు. అందని పండ్ల కోసం రాళ్లు... నేను మొదట్లోనే చెప్పా. వెలగపూడి వద్ద రాజధాని ఏర్పాటు చేస్తున్నప్పుడు తొలి ప్రాధాన్యతగా విజయవాడను వెలగపూడితో రైల్వే లైన్తో అనుసంధానం చేయాలని. ఇది చాలా చిన్న అంశం. కృష్ణా కెనాల్ ద్వారా వెలగపూడికి రైల్వేలైన్ తెచ్చి గుంటూరు దగ్గర కలిపేయవచ్చు. రెండు లైన్లూ కలుస్తాయి. అది చిన్న ప్రాజెక్టు. గట్టిగా అడిగితే కేంద్ర ప్రభుత్వం ‘నో’ అనేది కాదు. ఆఫీసుకు వెళ్లే వారికి ఇబ్బందులు ఉండేవి కావు. తొలుత ఫోకస్ చేసి అది పూర్తి చేసుకోవచ్చు కదా.. కానీ అలా చేయకుండా విజయవాడ మెట్రో, హైపర్ లూప్ రైళ్లు, గూడూరు నుంచి విశాఖ వరకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు అంటూ ఆచరణీయం కాని వాటి గురించి మాట్లాడుతుంటారు. చెట్టు చిటారున ఉన్న పండ్లపై కంటే కిందికి వేలాడుతున్న పండ్లను ముందు తెంచుకోవాలని ఆయనే (చంద్రబాబు) ఎన్నోసార్లు అన్నారు. కానీ ఆయన దృష్టి ఎప్పుడూ అందని చిటారుకొమ్మపైన పండ్లపైనే ఉంటుంది. వాటి కోసం రాళ్లు విసురుతూ ఉంటారు’ -
లీకులతో షురూ!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విభజన అంశాలతోపాటు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఐవైఆర్ తాను రాసిన ‘నవ్యాంధ్రలో నా నడక’ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని కేటాయించారు. తాను పని చేసిన కాలంలో సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో అనుసరించిన విధానాలను ఆయన అందులో ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... అధికారులపైకి నెట్టేసి తప్పుకుంటారు.. ‘చంద్రబాబు ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తారు. వాటిని ఆయనకు అనుకూలంగా ఉండే పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది చంద్రబాబు సాధారణంగా అనుసరించే పద్ధతి. ఒకవేళ ఆ నిర్ణయం వివాదాస్పదంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరిపై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలాసార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. ఉదాహరణకు గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వాత ఆ కమిషనర్ను ఆ పదవి నుంచి తప్పించి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి అదనంగా మద్యం షాపులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబే.’ కావాలనే లీకులు.. ‘నన్ను సీఎస్గా నియమించే విషయంలో కూడా చంద్రబాబు అదే పద్ధతి అనుసరించారు. నన్ను చీఫ్ సెక్రటరీగా, రాముడును డీజీపీగా, మరొకర్ని ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించనున్నట్లు లీక్లు వచ్చాయి. ఈ జాబితా గవర్నర్కు అందచేసి ఆమోదం పొందాలి. రెండో రోజు జాబితాను పరిశీలించాక.. ‘‘ఆ ఇంటెలిజెన్స్ అధికారి పేరు తీసేయండి. ఆయనపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది...’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అదృష్టవశాత్తు నామీద వ్యతిరేక ఫీడ్బ్యాక్ రాలేదు. సాయంత్రం జరిగిన ఆంతరంగిక చర్చల్లో మీపట్ల ఏదీ వ్యతిరేక సమాచారం అందలేదనుకుంటా అని ఒక మిత్రుడు అనడంతో ఊపిరి పీల్చుకున్నా. ఈ పద్ధతి అజేయ్ కల్లాం విషయంలో కూడా జరిగింది. ఆయన్ను చీఫ్ సెక్రటరీగా మొదట నెల పాటు నియమించి తర్వాత ఆర్నెల్లు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. కానీ రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీగా దినేశ్కుమార్ను నియమిస్తున్నట్లు చెప్పారు. బహుశా రాత్రిపూట జరిగిన చర్చల్లో అజేయ్ కల్లాంను సీఎస్గా పంపకూడదని నిర్ణయించి ఉంటారు. కేంద్రం అజేయ్ కల్లాంకు ఆర్నెల్ల పొడిగింపునకు సుముఖంగా లేదని, ఈ నేపథ్యంలో నెల రోజుల కోసం సీఎస్గా నియమించే బదులు నేరుగా దినేశ్కుమార్కు ఇవ్వాలనుకుంటున్నామని లీకులు సృష్టించారు. దీంతో కల్లాం సీఎంను కలవడంతో ఆయనకు నెల పాటు సీఎస్గా అవకాశం ఇచ్చారు. అదే జీవోలో కల్లాం రిటైర్మెంట్ తర్వాత దినేశ్కుమార్ను సీఎస్గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతం బాబు పద్ధతిని స్పష్టం చేస్తోంది. ఇష్టంలేని వారి మనోస్థైర్యం దెబ్బతినేలా లీకులు ఇచ్చి చివరకు వేటు వేస్తారు’ అని పేర్కొన్నారు. -
నిశ్శబ్ధంగా సెక్షన్ 8 సమాధి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8కి కాలదోషం పట్టడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అనే విషయం లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో స్పష్టం చేశారు. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టిందనే అంశాన్ని అందులోని ఓ అధ్యాయంలో ఆయన వివరించారు. ఆ అంశాలు యధాతధంగా... ‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందున సెక్షన్ 8కి ప్రాధాన్యం ఏర్పడింది. సెక్షన్ 8 ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారి ప్రాణ, ధన, ఆస్తి పరిరక్షణకు ఉద్దేశించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వీయ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్కు సలహాదారులుగా ఇద్దరు అధికారులను నియమించే ఏర్పాటు కూడా సెక్షన్ 8లో ఉంది. ఈ చట్టం ప్రకారం అవసరమైన నిబంధనలను రూపొందించాలని, హైదరాబాద్లో శాంతి భద్రతలు, ప్రజల రక్షణ విషయంలో అధిక పాత్ర నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. సెక్షన్ 8 సమర్ధవంతంగా అమలు కావాలంటే హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో రెండు రాష్ట్రాల పోలీసులకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని మేమే కోరాం. కానీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించింది. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణలో ఉన్నందువల్ల శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ విషయంలో గవర్నర్కు ఎలాంటి నిర్దిష్టమైన పాత్ర లేదని పేర్కొంది. సెక్షన్ 8 విషయంలో అప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామితో నాకు వాగ్వివాదం జరిగింది. అనిల్ గోస్వామి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కనపడ్డారు. ఇతర ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తెచ్చిన సెక్షన్ 8ను ఎందుకు విస్మరిస్తున్నారని గోస్వామిని నిలదీశా. దీనిపై ఆయన తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. హోంశాఖ కార్యదర్శి విభజన అంశాల గురించి పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆసక్తి కనపరచలేదు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండి అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో పరస్పర సర్దుబాటు, కోర్టు ద్వారా సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇక ఏడాది తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈలోపు చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది? ఒకసారి రాజధానిని విజయవాడకు తరలించిన తర్వాత సెక్షన్ 8 అనే దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దానికి కాలదోషం పట్టింది. మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది? అనే వాదన కేంద్ర ప్రభుత్వంలో వినిపించింది. దీనిపై కేంద్ర హోంశాఖకు సరైన జవాబు చెప్పలేక ఆ అంశాన్ని నిశ్శబ్ధంగా సమాధి చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు ఆస్తులు, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఉండగలమన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. సెక్షన్ 8 అమలులో లేదన్న విషయమే అందరూ మరిచిపోయారు. సామాస్య ప్రజలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బ్లాకులు కేటాయించారు. గవర్నర్, ఆయన సలహాదారులు ఆంధ్రప్రదేశ్కు హెచ్, ఎల్, బ్లాకులు అలాట్ చేశారు. హెచ్ బ్లాకు ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించారు. కానీ వాస్తు ప్రకారం హెచ్ బ్లాకు సరైంది కాదని అన్నిటికన్నా ఎతైన ఎల్ బ్లాక్ 8వ అంతస్థు నుంచి పనిచేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎల్ బ్లాకులోని 8వ అంతస్తును అత్యాధునాతనంగా రూపొందించాం. దీనికి భారీ ఎత్తున ఖర్చు అయింది. -
‘ఓటుకు కోట్లు’ తర్వాత బాబు నోరు మెదపలేదు
సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారని రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లకుండా, బ్రీఫ్డ్ మి కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లకుండా పరస్పరం అంగీకారానికి వచ్చారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్ నరసింహన్ ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చారని, కేసీఆర్ షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన పుస్తకంలో ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’ అధ్యాయం పేరుతో అప్పటి పరిస్థితులను ఐవైఆర్ వివరించారు. అందులోని అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న సిరీస్ కథనాల్లో భాగమిది. గొంతు బాబుది కాదంటూనే ట్యాపింగ్ అక్రమమన్నారు.. ‘2015 జూన్ 1వతేదీ సాయంత్రం టీవీ చూస్తుండగా ‘‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’’ ఉదంతం ప్రసారమమవుతోంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సీఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, రుజువుగా గొంతు కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బ తింటుందనే అనిపించింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి.. స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వజూపినట్లు అప్పటికే టీవీల్లో చూపించారు. తరువాత ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్లో మాట్లాడినట్లు చూపించారు. సాయంత్రానికల్లా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. దీనిపై రాజ్యాంగపరమైన, చట్టపరమైన, న్యాయపరమైన, రాజకీయపరమైన అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు చంద్రబాబుది కాదన్నారు. ఒకవైపు స్టీఫెన్సన్తో మాట్లాడిన గొంతు చంద్రబాబుది కాదంటూనే మరోవైపు ట్యాపింగ్ అక్రమమని అన్నారు. ఇది జరిగిన రెండో రోజు జూన్ 2న విజయవాడలో మహాసంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్, పరకాల ప్రభాకర్తో కలసి ప్రత్యేక విమానంలో వెళ్లాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. విమానంలో పరకాలను లోకేశ్ అభినందించారు. అనంతరం మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న సీఎం పరధ్యానంగానే కనిపించారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లి అధికారులను కలిశాం. డీజీపీ, నేను, కొంతమంది ముఖ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా సీఎం ఇంకా తేరుకోనట్లు కనిపించారు. ఆయన ముఖంలో చాలా అలసట, బడలిక కనిపించాయి. అంతా కలిసి చర్చించిన తర్వాత తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై కేసు వేసి వారిని ముద్దాయిలుగా చేస్తే అవతలి పక్షం ఆత్మరక్షణలో పడుతుందని భావించారు. విజయవాడలో కేసు ఫైల్ చేయాలని నిర్ణయించారు. రెండు విషయాల్లో సీఎంల మధ్య అవగాహన.. మహా సంకల్ప దీక్ష బహిరంగ సభలో మాత్రం కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని, కేసులు పెడితే భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులాంటి మనిషినన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మర్నాడు కేసీఆర్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. కేసుల్లో చంద్రబాబును తాము ఇరికిస్తే ఇరికేంత అమాయకుడు కాదని, ఆయన గోతులు తీయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. ‘‘పట్టపగలు దొరికిన దొంగ.. నిన్నెవరూ కాపాడలేరు’’ అని చంద్రబాబును హెచ్చరించారు. ఇద్దరు సీఎంల మధ్య యుధ్ధం ఢిల్లీ దాకా వెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమమంటూ కౌంటర్ దాఖలు చేయడం, రచ్చ చేయడంతో చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని భావించడం వల్ల ఓటుకు కోట్లు కేసు ప్రాముఖ్యం కోల్పోయింది. విషయాన్ని అక్కడికక్కడే ముగించి ఇద్దరి మధ్య అవగాహన కుదర్చాలని కేంద్రం నిర్ణయించినట్లు కనిపించింది. గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన విషయాలను హోంమంత్రికి వివరించారు. సీఎంల మధ్య సంధి కుదర్చమని కేంద్రం కోరే ఉంటుంది. ఇద్దరి మధ్య రెండు విషయాల్లో మాత్రం అవగాహన ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు కొంత వెసులుబాటును కేసీఆర్ కల్పిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై చంద్రబాబు న్యాయస్థానంలో ముందుకు వెళ్లరు. కేసీఆర్ మరికొన్ని షరతులు కూడా విధించి ఉంటారు. ‘‘మీరు (టీడీపీ సర్కారు) హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి. మొత్తం సచివాలయాన్ని తరలించి కట్టుబట్టలతో వెళ్లాలి. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మిగిలినవి నేను చూసుకుంటా. వెళ్లిపోండి..’’ అని కేసీఆర్ చెప్పి ఉంటారు. కౌంటర్ కేసు వేయటం చంద్రబాబుకు ఉపయోగపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోలేదు. దానికి కాలదోషం పట్టింది. ఇక ఓటుకు కోట్లు కేసు కూడా తెరమరుగవుతుందనే అనుకుంటున్నా. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని కేసీఆర్ తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ బలపడేలా చేసుకున్నారు. ఇక ఆ తరువాత బాబు నోరు మెదపలేదు... ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. ఆయన మొదట్లో కేసీఆర్ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్ 2 తర్వాత ఇక నోరు విప్పలేదు. జూన్ 2కు ముందు చంద్రబాబు ఒక మనిషి కాగా ఆ తర్వాత ఆయన మరో మనిషిలా మారారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం, విషయాలను డీల్ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ఈ కేసులో విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. ఎక్కడి నుంచి ఎక్కడకు డబ్బు వెళ్లింది? ఎవరు విత్ డ్రా చేశారు? ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించారు? అనే విషయాలు అంతా తెలిసేవి. మనీ ట్రయిల్ కూడా బయటపడేది. ముఖ్యమంత్రిదే కాకుండా మరికొందరు ముఖ్యుల ఫోన్ సంభాషణలు కూడా రికార్డు చేశారని విన్నా. ఏమైనా విచారణ ఆగిపోయింది. ఫోరెన్సిక్ నివేదిక మాత్రం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించుకున్నారు. ఓటుకు కోట్లు కేసు వెలుగు చూసిన సమయంలోనే గాంధీ అవసరం ఎందుకు గుర్తుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి’ -
సెక్షన్ 6 తొలగింపుతోనే సీబీఐకి స్వేచ్ఛ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక తాత్కాలిక సంచలనాన్ని సృష్టిం చింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద íసీబీఐ పరిధిని రాష్ట్రానికి వర్తింపజేయడానికి అనువుగా సెక్షన్ 6 కింద ఇచ్చే అనుమతిని ఉపసంహరించుకుంది. సాధారణంగా ప్రత్యేకతలేని ఈ వార్త ముందుగానే అనుకున్న విధంగా కొన్ని పత్రికలలో విపరీత ప్రచారం చేయటం ద్వారా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పేరు ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టమని ఉన్నా ఇది పార్లమెంటు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ చట్టం. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 ఆగస్టులో సీబీఐ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలపై దర్యాప్తు చేసే అధికారాన్ని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 1994 నుంచి సీబీఐకి వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా దర్యాప్తు చేసే అధికారాన్ని కొనసాగిస్తూ వస్తోంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. 2016లో ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా ఈ అధికారాన్ని వినియోగించుకోవటానికి సీబీఐకి అనుమతిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలపైగానీ, శాఖలపైగానీ సీబీఐ ఏదైనా దర్యాప్తు చేయాలంటే ప్రతి ఒక్క కేసులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవటం తప్పనిసరి అవుతుంది. కానీ కొన్ని కేసుల్లో కేసు విస్తృతి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పుడు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల్లో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విశదీకరించబడింది. న్యాయపరంగా చూస్తే ఈనాడు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో ఉన్న సెక్షన్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టడానికి లేదు. ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలపై దర్యాప్తు చేయాలంటే చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. దర్యాప్తు జరిపే సంస్థ, దర్యాప్తు చేయబడే శాఖలు, సంస్థలు కేంద్ర ప్రభుత్వానివే అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనే నిబంధనను చట్టంలో ఎందుకు పెట్టారో కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. కానీ సీబీఐ దర్యాప్తు సంస్థగా పరిణతి చెందిన విధానాన్ని పరిశీలిస్తే ఈ ఆశ్చర్యం తొలగిపోతుంది. సీబీఐ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే అవకతవకలను పరిశోధించే సంస్థగా మాత్రమే ఏర్పడింది. ఆపైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు సంస్థగా ఉండాలని నిర్ణయించి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా దీనిని కొనసాగించారు. అప్పుడు చట్టంలో దీని పరిధిని కేవలం కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తింప చేస్తూ సెక్షన్ 5 కింద వివిధ రాష్ట్రాలకు దీనిని విస్తరించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా íసీబీఐకి ఉన్న పరిధి సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం విస్తరించడం వలన మాత్రమే కానీ స్వతహాగా చట్టంతో వచ్చిన అధికారం కాదు. సెక్షన్ 5 కింద దీని పరిధిని విస్తరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూనే సెక్షన్ 6 కింద అనుమతిచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దర్యాప్తు జరిపే సంస్థ, దర్యాప్తు జరుపబడే సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానివే అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవటం కొంత అసంబద్ధంగానే కనిపిస్తుంది. ఈ విచక్షణాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో ఉపయోగించినంత కాలం సమస్య ఉత్పన్నం కాలేదు. ఈనాడు కొన్ని రాష్ట్రాలు ఈ సాంకేతికమైన అంశాన్ని మౌలికమైన అంశంగా పరిగణిస్తూ తమ అధికారాలను ఉపయోగిస్తున్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చట్టంలోని ఈ ప్రకరణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాత్కాలికంగా కొన్ని సమస్యలతో íసీబీఐ కొట్టుమిట్టాడుతున్నా, దీర్ఘకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది ప్రధాన పరిశోధనా సంస్థ అనేది నిర్వివాదాంశం. అటువంటి సంస్థ ప్రతి ఒక్క దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తే సంస్థ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద కానీ, అధికారుల మీద గానీ సీబీఐ దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చర్చలో కొంత విపరీతమైన వాదనలను కొందరు లేవదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏసీబీ దర్యాప్తు చేయగలదు అనేది వీరి వాదన. ఇది సరికాకపోవచ్చు. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను దర్యాప్తు చేయడానికి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను దర్యాప్తు చేయడానికి ఏసీబీకి కేంద్రం అనుమతి అవసరం కదా. కేంద్ర సంస్థలలో నిధులు, పర్యవేక్షణ, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావు. అలాంట ప్పుడు దర్యాప్తు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేయాలనటం హాస్యాస్పదం. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు ,ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ :iyrk45@gmail.com -
కొందరికి లబ్ధి కోసమే రాజధానిపై లీకులు
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ అనే విషయంలో రోజుకో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లీకులు ఇచ్చారని, దీనివల్ల మధ్య తరగతి ప్రజలు మోసపోగా కొందరికి ప్రయోజనం చేకూరిందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. సింగపూర్ కంపెనీలకు స్టార్టప్ ఏరియా పేరుతో రాజధానిలో 1,691 ఎకరాలను ఇవ్వడంలో, రాజధానికి భూములు గుర్తింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన స్వార్థపూరిత వైఖరిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన తన పుస్తకంలో ఐవైఆర్ బహిర్గతం చేశారు. దీంతో రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తొలినుంచీ చెబుతున్న విషయాన్ని ఐవీఆర్ ధ్రువీకరించినట్లయింది. ఐవైఆర్ తన పుస్తకంలో రాజధాని రాజకీయం పేరుతో ఓ అధ్యాయం కేటాయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీని కాదని.. రాజధాని గుర్తింపునకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు నిపుణులతో కాకుండా వ్యాపారస్తులు, పార్టీ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్గా ఉన్న నన్ను తొలుత కమిటీకి సభ్య కన్వీనర్గా పెట్టారు. ఈలోపు ఎవరో వెళ్లి నేను దొనకొండను రాజధానికి ప్రతిపాదించినట్లు సీఎంకు చెప్పారు. దీంతో సీఎం నన్ను ఈ కమిటీ నుంచి తీసేశారు. రెండు, మూడు నెలల తర్వాత శివరామకృష్ణన్ అనుకోకుండా సీఎం దగ్గర తటస్థ పడ్డారు. మీ గురించి విన్నాను. మీ కాన్సెప్ట్ నోట్ చదివాను. చాలా బాగుందని శివరామకృష్ణన్ చెప్పారు. అప్పుడు సీఎం ముఖం చిన్నబోయింది. ఈలోపు చంద్రబాబు ఆలోచనలో ఉన్న రాజధానిని ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. నిజానికి ఆయన నియమించిన కమిటీ రాజధాని ఎక్కడనేది తేల్చలేదు. కానీ లీకులు రావడం ప్రారంభమయ్యాయి. నూజివీడు దగ్గర అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఒక రోజు, గుంటూరు–విజయవాడల మధ్య నాగార్జున వర్సిటీ భవనాల్లో రాజధాని పెడతారని మరో రోజు, మంగళగిరి వద్ద అటవీ భూములను డీనోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఇంకోరోజు లీకులు వదిలారు. మధ్య తరగతిని మోసం చేసి.. భూములు అమ్మకాల ద్వారా మధ్య తరగతిని మోసగించి కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆ లీకులు సృష్టించారు. తుళ్లూరు మండలంలో రాజధాని వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నవారు వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టి స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించేందుకు తోడ్పడేలా ప్రభుత్వం ఈ సయ్యాటలాడింది. చివరకు ఎటువంటి అధ్యయనం లేకుండా వెలగపూడిలో రాజధానిని నిర్ణయించారు. అమరావతి కోసం 32 వేల ఎకరాలను సేకరించారు. ల్యాండ్ పూలింగ్లో తీసుకుని ఆ రైతుల్లో ఎలాంటి భ్రమ కల్పించారంటే, వాళ్లందరికీ విపరీతమైన రేట్లు వస్తాయనే భ్రమలో తమ భూములు ఇచ్చేశారు. వాళ్లనుకున్న స్థాయిలో లాభాలు రావాలంటే ఇది ఏ హైదరాబాదో, మద్రాసు స్థాయి కావాలి. అలా కావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంతో చెప్పలేం. నాలుగున్నరేళ్ల తరువాత చూస్తే చిన్న స్థాయిలో తాత్కాలిక ఆఫీసు భవనాలు తప్పితే, పక్కాగా ఏమైనా వచ్చాయా? అది స్విస్ చాలెంజ్ కాదు అమరావతిలో సింగపూర్ టౌన్షిప్ పేరిట 1,691 ఎకరాలు కోర్ కేపిటల్ ఏరియా అభివృద్ధి అంటూ సింగపూర్ కంపెనీలకు ఇచ్చారు. దీని కోసం సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఆపై కోర్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత వెనక్కు తగ్గాయి. తమ కంపెనీలకు ప్రాజెక్టు ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. దాన్ని స్విస్ చాలెంజ్ కింద పెట్టారు. నిజానికి సింగపూర్ కంపెనీలకు భూములు అప్పచెప్పడం స్విస్ చాలెంజ్ కింద రాదు. స్విస్ చాలెంజ్పై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లో.. ఒక కంపెనీ తనంతట తాను అభివృద్ధికి ముందుకు రావాలి అని కచ్చితంగా చెప్పింది. అయితే సింగపూర్ ప్రభుత్వంతో తొలి నుంచీ తెలుగుదేశం ప్రభుత్వం అంటకాగింది. మాస్టర్ ప్లాన్ తయారు చేయించుకుంది. వాళ్ల కంపెనీలు సీఆర్డీఏతో సమాచారాన్ని పంచుకున్నాయి. స్విస్ చాలెంజ్ విధానమంటే ఎవ్వరైనా తమంతట తాము ప్రతిపాదన ఇవ్వాలి. ఇక్కడ సింగపూర్ కంపెనీలు అందుకు భిన్నంగా ప్రభుత్వ నోటిఫికేషన్కు అనుగుణంగా ప్రతిపాదన ఇచ్చాయి. చంద్రబాబు ఎంచుకున్న ప్రక్రియ చట్టరీత్యా, సాంకేతిక రీత్యా సరైంది కాదు. స్విస్ చాలెంజ్లో దరఖాస్తు చేసుకున్న ఇతర సంస్థలను అనర్హులుగా ప్రకటించేసి సింగిల్ బిడ్పై సింగపూర్ కంపెనీలకు ఇచ్చేశారు. సింగపూర్ కంపెనీల్లో అసెండాస్–సెమ్బ్రిడ్జి, సెమ్బ్కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఉన్నాయి. సెమ్బ్కార్ప్పై ఇప్పటికే అంతర్జాతీయంగా అవినీతి ఆరోపణలున్నాయి. కాల్మనీ అందుకే పుట్టిందంటారు.. నూజివీడు దగ్గర రాజధాని వస్తుందేమోనని వాళ్ల వాళ్లంతా ముందే భూములు కొనుక్కున్నారు. కానీ అక్కడేదో సమస్య వచ్చింది. దీంతో లీకులు ఇచ్చి అక్కడ భూమి రేట్లు పెంచి అమ్ముకునేలా చూశారు. నూజివీడు భూముల విక్రయం వల్లే విజయవాడలో కాల్మనీ రాకెట్ పుట్టిందంటారు. ఈ కాల్మనీతో విజయవాడ వాళ్లు అక్కడ భూములు కొనుక్కున్నారు. తర్వాత దాన్ని డబ్బులు చేసుకుని వెలగపూడిలో కొన్నారు. ఆ ఏడాది జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకూ రకరకాల పేర్లు వినిపించారు. దానికి నేను ఫ్లోటింగ్ క్యాపిటల్ అని పేరుపెట్టాను. సెప్టెంబర్ 3న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా విజయవాడ, దాని చుట్టుపక్కల అన్నారు కానీ ప్రాంతం ఏదో చెప్పలేదు. సెప్టెంబర్ ఆఖరున సేకరణ నియమాలను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించేంత వరకు విజయవాడ, చుట్టుపక్కల ఉన్నవారంతా రకరకాల ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టి బాగా దెబ్బతిన్నారు. ఈ దెబ్బతినడానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలపై ప్రభుత్వం చాలా అన్యాయంగా ట్రిక్కులు ప్లే చేసింది. మళ్లీ కేంద్రం నిధులివ్వాలంటే నిర్మాణాలేవీ? అక్కడ రాజధాని పెట్టడమే తప్పు అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాజేందర్ సింగ్ స్పష్టంగా చెప్పారు. రాజధాని విషయంలో కేంద్రం నిధులైతే ఇచ్చింది కానీ అక్కడ నిర్మాణాలు పూర్తిచేస్తే కదా మళ్లీ నిధులు అడిగేది. పరిస్థితి ఎలా ఉందంటే వచ్చే ఎన్నికల ఆరు నెలలు ముందు వాతావరణం తెలుసుకుని అమరావతి ప్రాంతంలో కొన్న భూములను అయినకాడికి అమ్ముకుని బయటపడాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఈ విషయం నాకు విజయవాడ విమానాశ్రయంలో ఒక తెలుగుదేశం నాయకుడే చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ అంశంపై ప్రస్తుతం వారు పరిశోధన చేస్తున్నారు. ఈ మొత్తం వచ్చేది అనుమానమే. కాని ఇన్ని అవకతవకలు, అస్తవ్యస్థ పరిస్థితులు, అక్రమాలను చూసిన తరువాత కేంద్రం ప్రపంచ బ్యాంకు సహాయానికి అంగీకరిస్తుందా? జరుగుతున్న విషయాలను కేంద్రం గమనించదనుకోవడం అమాయకత్వం కాదా? -
ప్రధాన న్యాయమూర్తులను ప్రశ్నించొద్దా?
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను సాధారణ పౌరులు సైతం ప్రశ్నిస్తున్నప్పుడు... నన్నెవరూ ప్రశ్నించజాలరు అని ప్రధాన న్యాయమూర్తులు అనుకోవడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. వాళ్లు(ప్రధాన న్యాయమూర్తులు) ఎందుకు అతీతులుగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టులో కూడా జవాబుదారీతనం కోసమే తాను ఆనాడు కొలీజియం గురించి ప్రశ్నించానన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకోవడం కొంచెం నయమని పేర్కొన్నారు. దేశంలో రోజుకొక గాంధీ పుట్టరని, మనకు మనమే బాధ్యతగా మెలిగితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. కాగా, రాజకీయాలు మరీ దారుణంగా ఉన్నాయని, పేకాట (జూదం) కంటే ఎక్కువ రిస్కుగా మారాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. ప్రజలకు డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం, ఆ పెట్టుబడిని మళ్లీ రాజకీయాల ద్వారా సంపాదించడమే పరిపాలనగా మారిందన్నారు. ఐవైఆర్, అజేయ కల్లం లాంటి వారు ప్రభుత్వంలో జరిగినవి చెప్పడం వల్లే జనానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయన్నారు. చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు తాను పుట్టుకతోనే గొప్పవాడిననే భావన సీఎం చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. పాలించే నాయకులపై గొప్ప నమ్మకంతో బ్యూరోక్రాట్లు వ్యవహరించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు. పాలకులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదన్నారు. ‘‘విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి’’ అనే విషయాలను ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తన తోటి ఐఏఎస్ అధికారి చందనాఖన్కు, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ మురళి సాగర్కు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చినట్టు ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి ప్రస్తుత పాలనలో ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు, పార్టీ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే వైరాగ్యం, విరక్తి కలుగుతున్నాయన్నారు. వ్యవస్థలన్నిటినీ కుప్పకూల్చారని వాపోయారు. నాకేమిటి, నా పార్టీకేమిటి అనే ఉద్దేశంతోనే పని చేస్తున్నారని విమర్శించారు. పౌరుల తీరులో మార్పు రావాలని, ప్రశ్నించే తత్వం చూపాలన్నారు. ప్రజల్లో మార్పు తేవడానికే ఐవైఆర్ ఈ పుస్తకాన్ని బయటకు తెచ్చారన్నారు. ఎక్కడకు వెళ్లినా రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడుగుతున్నారని, లోపాలను బహిర్గతం చేయడానికి రాజకీయాల్లోకే రావాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, చందనాఖన్, హన్స్ ఇండియా సంపాదకులు రాము శర్మ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రం బలి
సాక్షి, అమరావతి: ఓటుకు నోటు కేసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు జీరబోయిందని, ఆయన బలహీన పడి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చారని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీశారని విభజన అనంతరం రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరిట తాను రచించిన పుస్తకంలో ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. ఆదివారం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఇంకా ప్రస్తావించారంటే... ‘‘హైదరాబాద్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతానని తొలుత చెప్పిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ సర్కారును దెబ్బతీసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్ని దొరికిపోయారు. ఓటుకు నోటు వ్యవహారం బయటపడడంతో బతుకు జీవుడా అంటూ విజయవాడకు తరలివచ్చారు. తరువాత హైదరాబాద్కు వెళ్లడం తగ్గించేశారు. విజయవాడలో రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి, ఒక ఊపు సృష్టించి దానిపై బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. హైదరాబాద్లో ఉండలేని తన నిస్సహాయత బయటపడకుండా విజయవాడలోనే ఉండిపోవడానికి రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. ఒక ప్రతికూల పరిస్థితిని తన మీడియా సహాయంతో అనుకూలంగా మలుచుకున్నారు. ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సొంత గడ్డపై నుంచే పరిపాలన ఉత్తమం అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా ఓటుకు నోటు కేసు మహత్యమేనని వేరే చెప్పనక్కరలేదు. ఈ కేసు తరువాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడటంతో విభజన సమస్యలపై సీఎస్గా నేను ముఖ్యమంత్రికి పంపించిన ఫైళ్లు తిరిగి వచ్చేవి కావు. తెలంగాణ ప్రభుత్వంతో సంఘర్షణకు పూనుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని అప్పుడు నాకు తెలిసింది. ఒక వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించింది. ఓటుకు నోటు కేసుతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనూ ఏపీ ప్రభుత్వం చులకనగా మారింది. ఓటుకు నోటు కేసు తరువాత ముఖ్యమంత్రి ఆగమేఘాలపై విజయవాడకు వెళ్లిపోవడంతో సచివాలయ ఉద్యోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఓటుకు నోటు కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకు సమస్య వచ్చినందు వల్లే సచివాలయ ఉద్యోగులందరికీ తీవ్ర సమస్య తెచ్చిపెట్టారు. అసలు ఏమాత్రం సన్నాహాలు చేయకుండానే సచివాలయాన్ని అమరావతికి తరలించారు. ఇది మరీ ఘోరం. తెలంగాణకు విద్యుత్ను ఏకపక్షంగా నిలిపేశారు చంద్రబాబు తొలుత హైదరాబాద్లోనే ఉండిపోవాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రత్యర్థి వైఖరిని అవలంభించారు. రెండు రాష్ట్రాలకు వర్తించే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించే బదులు వాటిని రద్దు చేసి అదనపు విద్యుత్ను తెలంగాణతో పంచుకోకూడదని నిర్ణయించారు. ఒప్పందాలను రద్దు చేసి, ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా చూశారు. ఈ ఒక్క నిర్ణయమే రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువ అగాథాన్ని సృష్టించింది, సంబంధాలను దెబ్బతీసింది’’ అని ఐవైఆర్ కృష్ణారావు తన పుస్తకంలో వివరించారు. -
హైదరాబాద్ను ఎందుకు వదిలి రావాల్సి వచ్చిందో..
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదిలి హడావిడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశం కూడా ‘ నవ్యాంధ్రతో నా నడక’ అనే పుస్తకంలో ప్రస్తావించినట్లు ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎస్లు గోపాలకృష్ణ, అజయ్ కల్లాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. విభజనకు సంబంధించిన అంశాలు, లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఇప్పటికీ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాలు ప్రస్తావించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తనకు మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. విభేదాల వల్ల ఎలాంటి నష్టం వచ్చిందో కూడా పేర్కొన్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండో దశలో విఫలమయ్యారని విమర్శించారు. దానికి సంబంధించిన కారణాలు కూడా పుస్తకంలో రాసినట్లు తెలిపారు. నేను పుట్టుకతోనే గొప్పవాడిని అనే భావన చంద్రబాబులో ఉండటం వల్లే రెండో దశలో బాబు ఫెయిల్ అయ్యారని అన్నారు. రాష్ట్ర పాలనకు, విభజన చట్టానికి సంబంధించిన మరిన్ని విషయాలు, అంశాలు పుస్తకంలో ప్రస్తావించినట్లు వెల్లడించారు. -
దేశ చరిత్రలోనే మాజీ సీఎస్లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్..
రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీది. రాజధాని పేరుతో రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోంది. అందుకే ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. –ఐవైఆర్ కృష్ణారావు పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి సాగుతోంది. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తోంది. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లాం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన కంటే ముందు, రాష్ట్ర విభజన అనంతరం తొలి సీఎస్గా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు కూడా టీడీపీ సర్కారు అవినీతిని నిర్ధారిస్తూ పలుమార్లు ప్రకటనలు చేయడం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఉన్నతాధికారులే ధ్రువీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాలనపై ఇంతకన్నా వేరే చార్జిషీట్ అవసరమా? అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇవికాకుండా టీడీపీ సర్కారు రూ.లక్షల కోట్ల మేర లూటీకి పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఆరోపణలు చేసింది. అది చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణం.. ఐవైఆర్తో పాటు అజేయ కల్లాం కూడా సీఎస్లుగా పదవుల్లో కొనసాగినప్పుడే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సర్కారు దోపిడీకి, ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించటాన్ని తీవ్రంగా, స్పష్టంగా వ్యతిరేకించారు. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో... రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీదని ఐవైఆర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా అధికారులపైకి నెట్టేసి రాజకీయ నేతలను తప్పించారని, సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడాన్ని ఐవైఆర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోందని, లేదంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని వ్యాఖ్యానించారు. అంతులేని అవినీతి జరుగుతున్నప్పుడు కేంద్రం ప్రశ్నలు అడగడంలో తప్పులేదని, గుడ్డిగా ఈ అంచనాలను ఆమోదిస్తే కేంద్రం కూడా ఈ మహా స్కామ్లో కూరుకుపోవచ్చని ఐవైఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘నవ్యాంధ్రలో నా నడక’ పేరుతో పుస్తకాన్ని ఐవైఆర్ ఈ నెల 25 తేదీన విడుదల చేయనున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్గా ఉండగా సీఎంతో ఎదురైన పలు అంశాలతో పాటు విభజన సమస్యలపై సర్కారు వైఖరి, భూ కేటాయింపులు తదితర అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించనున్నారు. ప్రచారం కోసం ప్రజాధనం లూటీ... ఐవైఆర్ కృష్ణారావు 2013 మే నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ 2వ తేదీ నుంచి 2016 జనవరి నెలాఖరు వరకు ఏపీకి తొలి సీఎస్గా వ్యవహరించారు. అజేయ్ కల్లాం 2014 జూన్ 2 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా 2017 ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగారు. దీంతోపాటు రెవెన్యూ ప్రత్యేక సీఎస్గా కూడా కొన్నాళ్ల పాటు బాధ్యతలు పర్యవేక్షించారు. 2017 మార్చి 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అజేయ్ కల్లాం విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ చేసిన అనంతరం టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచకాలు, అవినీతి అంశాలను అజేయ కల్లాం బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి తీవ్రస్థాయికి చేరిందని, ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుతున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో సాగుతున్న అవినీతిని అజేయ కల్లాం ప్రధానంగా తప్పుబట్టారు. లీజుకు ఇవ్వకుండా కారుచౌకగా కట్టబెట్టారు.. సీఎం తనయుడు, మంతినారా లోకేశ్ సూచనల మేరకు విశాఖపట్టణంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా భూములను విక్రయించింది. ప్రభుత్వ ఐటీ విధానం మేరకు ఐటీ కంపెనీలకు భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలి. అయితే మంత్రి లోకేశ్కు కావాల్సిన వ్యక్తులు అందులో ఉండటంతో రూ.400 కోట్ల విలువ చేసే 40 ఎకరాలను కారు చౌకగా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున రూ.13 కోట్లకే సర్కారు విక్రయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా లక్ష్యపెట్టలేదు. అమెరికాలోని శాన్ ఫ్రాన్స్కోలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయం పది ఎకరాల్లో మాత్రమే ఉందని, అలాంటిది ఇక్కడ 40 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది. విశాఖ రూరల్ మండలం మధురవాడలో గతంలో ఈ 40 ఎకరాలను పర్యాటక శాఖకు కేటాయించారని, అయితే ఆ భూమి మార్కెట్ ధర ఎకరం రూ.10 కోట్లకు పైగా ఉందని, ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ఎకరం రూ. 2.70 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కోరినట్లుగా ఎకరం రూ.32.50 లక్షలకు కాకుండా కనీసం ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ప్రకారం ఎకరం రూ.2.70 కోట్ల చొప్పునైనా కేటాయించాలని, అది కూడా తొలుత కేవలం పది ఎకరాలనే ఇవ్వాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ గట్టిగా సూచించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఐటీ మంత్రి లోకేశ్ సీఎస్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు అమ్మేశారు. ఐటీ విధానం మేరకు లీజుకు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నా లోకేశ్ సూచన మేరకు విక్రయించారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా భూములను విక్రయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. దీన్నిబట్టి తమకు కావాల్సిన వారికి ఒక విధానం ప్రకారం, ఇతరుల పట్ల మరో విధానాన్ని అనుసరించడం ద్వారా దోపిడీ, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వమే ధ్రువీకరించినట్లైంది. స్విస్ ఛాలెంజ్ వద్దన్న కల్లాం రాజధాని అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో సంప్రదింపుల ద్వారా సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని టీడీపీ సర్కారు నిర్ణయించినప్పుడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లాం గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వడంపై కూడా ఆయన తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పర్యాటక విధానం మేరకు ప్రాజెక్టు వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించరాదని, అంతేకాకుండా సింగపూర్ సంస్థలకు ఇచ్చే భూముల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లు వ్యయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వివాదాలు తలెత్తితే లండన్ కోర్టులో పరిష్కరించుకోవాలనే షరతుతోపాటు ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగితే సింగపూర్ కంపెనీలకు పెనాల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చెల్లించాలనే షరతులను అంగీకరించరాదని కల్లాం లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు దీన్ని పెడచెవిన పెడుతూ సింగపూర్ కంపెనీలకు భారీ రాయితీలతో 1,691 ఎకరాలను కట్టబెట్టేశారు. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారుతుందని అజేయ కల్లాం బహిరంగంగానే హెచ్చరించారు. విరాళాలివ్వాలంటూ ‘ప్రత్యేక’ విమానాల్లో విహారాలా? సీఎం చంద్రబాబు ఒకపక్క రాజధాని నిర్మాణం పేరుతో విరాళాలు వసూలు చేస్తూ మరోపక్క రెగ్యులర్ ఫ్లైటున్నా సరే ప్రత్యేక విమానాల్లో విహరించడాన్ని అజేయ కల్లాం ‘మేలుకొలుపు’ పుస్తకంలో తప్పుబట్టారు. ఏటా రూ.15 కోట్లకుపైగా ప్రత్యేక విమానాలకు వ్యయం చేస్తున్నారని, రాష్ట్రం రెవెన్యూ లోటులో ఉండగా దుబారా వ్యయం సరికాదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని విధంగా రెండేసి క్యాంపు ఆఫీసులు, ఇళ్లు ఉండటం, వాటికి మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని కూడా అజేయ కల్లాం తప్పుపట్టారు. ‘హెచ్సీఎల్’ రాకుండా సీమకు అన్యాయం.. ‘హెచ్సీఎల్’ కంపెనీని తిరుపతిలో స్థాపించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడి అమరావతికి తరలించి రాయలసీమకు అన్యాయం చేశారని అజేయ కల్లాం పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తోందని, హెచ్సీఎల్ కంపెనీని తిరుపతిలో ఏర్పాటు చేయించాలని తాను మొత్తుకున్నా ప్రభుత్వం అంగీకరించలేదని అజేయ కల్లాం స్పష్టం చేశారు. ధర్మ పోరాటాలు, దీక్షలు పేరుతో ప్రభుత్వం నాటకాలు, డ్రామాలాడుతూ కాలం గడుపుతోందన్నారు. తాత్కాలిక భవనాలకు కళ్లు చెదిరే ఖర్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలకు వెచ్చించిన వ్యయం చూస్తే నివ్వెరపోవడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. వర్షం వస్తే కారిపోయే తాత్కాలిక సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11,666 చొప్పున వ్యయం చేసింది. ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.750 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన వినియోగ పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకన్నా దోపిడీ ఎక్కడైనా ఉంటుందా? అని సచివాలయ ఉద్యోగుల్లోనే చర్చ సాగుతోంది. సెట్టాప్ బాక్సుల పేరుతో దోపిడీ ప్రజలు తమ ఇష్ట్రపకారం కొనుక్కునే సెట్టాప్ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు సన్నిహితుడికి కట్టబెట్టారు. నాణ్యమైన సెట్టాప్ బాక్సులు రూ.1,500కే లభిస్తుండగా ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో సెట్టాప్ బాక్సుకు రూ. 4,000 చెల్లిస్తోంది. ఇందులో భారీ అవినీతి జరుగుతున్నట్లు తేలిపోతోంది. అంతే కాకుండా ఈ బాక్సుల కొనుగోలు కోసం రూ.4 వేల కోట్లు అప్పు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వమే గ్యారెంటీ కూడా ఇస్తోంది. సాగునీటిలో కమీషన్ల పర్వం.. సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వ పెద్దలు కమీషన్లు దండుకుంటూ సర్కారు ఖజానాను కొల్లగొడుతున్నారు. నీరు–చెట్టు పనుల పేరుతో ఉపాధిహామీ నిధులను మళ్లించి చెరువుల పూడికతీత పనుల్లో మట్టిని సైతం విక్రయిస్తూ అధికార పార్టీ నేతల జేబులను నింపుతున్నట్లు పలుమార్లు వెల్లడైంది. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీకి పాల్పడటంతో పాటు ఎక్కువ ధరకు బొగ్గు కొనుగోళ్లు, ఎక్కువ ధరకు సోలార్ విద్యుత్ కొనుగోళ్లు చేస్తూ జనం నెత్తిన భారం మోపుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం సెల్ఫోన్లు కొనుగోలు చేసి ఇస్తూ అందులోనూ భారీ అవినీతికి తెరతీసింది. తొలుత ఐదు లక్షల సెల్ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొన్నట్లు చూపిస్తూ రూ. 150 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సెల్ఫోన్ల కొనుగోళ్లకు మరో రూ.403 కోట్లు కావాలంటూ ఐటీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో ఇంకెంత దోపిడీ జరుగుతుందోనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ రాయితీల పేరుతో ప్రాజెక్టు స్థాపనకు అయ్యే వ్యయానికి మించిపోయి ఖజానా నుంచి రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటో తేలిగ్గానే ఊహించవచ్చని పేర్కొంటోంది. ప్రైవేట్ వ్యక్తులు చేయాల్సిన టవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేయటాన్ని తప్పుబడుతున్నారు. -
ఈ నెల 25న ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ
సాక్షి, విజయవాడ: తాను రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 25న జరగనుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎస్గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన పరిణామాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించానని పేర్కొన్నారు. అంతే కాకుండా సీఎం, చీఫ్ సెక్రటరీల మధ్య ఉండాల్సిన అదేవిధంగా ఉండే బాధ్యతల గురించి కూలంకషంగా వివరించానన్నారు. అనేక భూ సంబంధ అంశాలు, వాటి చర్యల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించానని తెలియజేశారు. ‘ఎవరి రాజధాని అమరావతి?’ గతంలో ‘ఎవరి రాజధాని అమరావతి?’ అంటూ రాసిన పుస్తకంలో కూడా ఐవైఆర్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపారు. ఇక ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ‘అమరావతి ఏ రకంగానూ ప్రజా రాజధాని కాదు. ఇది ఎక్లూజివ్ రాజధాని. తన జాతి బలమైన సమర్థన ఉండటం వల్లే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. ప్యూహాలు పన్ని కుటిలనీతి ఉపయోగించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రియల్ ఎస్టేట్ తరహా నమునాలా అమరావతిని ఎంపిక చేశారు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ దర్యాప్తు చేయవచ్చు
ఎవరైనా తప్పు చేస్తే.. ఆ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారుగానీ ఆ వ్యవస్థను రద్దు చేయరు. సీబీఐ దర్యాప్తును రాష్ట్ర సర్కారు అడ్డుకోలేదు. రాష్ట్రానికి చెందిన అంశాలపై సదరు రాష్ట్ర సర్కారు కోరితేనే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది.. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులు, పథకాల్లో అక్రమాలు, అవినీతి జరిగితే సీబీఐ దర్యాప్తు నేరుగా చేపడుతుంది, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఢిల్లీలోనే కేసు నమోదు చేసి ఏ రాష్ట్రానికైనా వెళ్లి దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంది. కేంద్ర అధికారులపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేకపోతే ఏసీబీకి ఎలా వస్తుంది? అలాగే న్యాయస్థానాలు సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇదంతా సంచలనం కోసం చేసినట్లుంది తప్ప.. దీనివల్ల సీబీఐ దర్యాప్తును నిలువరించడం సాధ్యం కాదు. ఓ ముసలమ్మ కోడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని ఇక తెల్లారదులే అనుకున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. – ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
ప్రకృతి వైపరీత్యాలను రాజకీయలబ్ధికి వాడొద్దు
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని, తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి స్థానిక అధికార యంత్రాగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దని ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం అన్నారు. జన చైతన్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ 2005లో ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టాన్ని కేంద్రం రూపొందించి అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడేళ్లుగా రూ.1,250 కోట్లను ప్రకృతి విపత్తుల నివారణ కోసం కేంద్రం ఇచ్చిందనీ, అయినా, తిత్లీతుఫాను విషయంలో కేంద్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం పంపిన బృందం నివేదిక అందగానే వెంటనే నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, తుఫాను సందర్భంగా కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ నిధులను పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలకు వెచ్చించడం విచారకరమన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం మాట్లాడుతూ సీఎం ఒకరోజు జిల్లాలో పర్యటిస్తే రూ.25 లక్షల ఖర్చువస్తుందని, తుఫాను వచ్చిన ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే ప్రజాధనం వృ«థా కావడమే కాకుండా పోలీసులు, అధికార యంత్రాంగం సీఎం చుట్టూ తిరుగుతారే కానీ, వరదబాధితులకు ఏం సాయం చేస్తారని ప్రశ్నించారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుఫాను గ్రామాలు విద్యుత్ లేకుండా చీకట్లో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. తిత్లీ తుఫాను ప్రభావం నుండి ఒడిశా వారంలో కోలుకుంటే హైటెక్ సీఎం గా చెప్పుకునే చంద్రబాబు పూర్తిగా విఫలమై ఆ లోపా న్ని కేంద్రంపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. -
అభివృద్ధి ఆర్థిక అసమానతలు
ఫోర్బ్స్ పత్రిక వారు ప్రతి ఏటా భారతదేశంలో అత్య ధిక సంపన్న వంతుల జాబితాను ఒక దానిని ప్రక టిస్తూ ఉంటారు. అందులో ప్రథమ స్థానంలో చాలా ఏళ్లుగా ముఖేష్ అంబానీ పేరు ఉంటున్నది. మొదటి వందమంది ప్రపంచ స్థాయి సంపన్నులలో ముఖేష్ అంబానీతోపాటు అజిత్ ప్రేమ్ జీ, శివ నాడార్ వంటి కొందరి పేర్లుఉంటాయి. భారతీయులుగా మనమంతా వారు సాధించిన విజయాలకు ప్రపంచస్థాయిలో వారి సంపద స్థాయికి గర్వపడుతుంటాము. అంత గర్వ పడవలసిన అంశం దీనిలో ఏమైనా ఉన్నదా? 2000–2014 మధ్య భారతదేశంలో పెరిగిన ఆదాయం ఎక్కువ భాగం అత్యున్నతంగా 10 శాతా నికి వెళ్లిందని మధ్యతరగతిగా పరిగణించబడే తరు వాతి 40 శాతం ఆదాయం 2000–2014 మధ్య గణ నీయంగా తగ్గిందని కాబట్టి మధ్యతరగతి వారి నుంచి బహుళజాతి సంస్థల వస్తువులకు భారతదే శంలో చైనాలోలాగా డిమాండ్ ఉండే అవకాశం లేదని అందువలన బహుళజాతి సంస్థలు వాటి కార్యక్రమాలు దేశంలో విస్తరించుకోవడం లాభదా యకం కాకపోవచ్చునని ఎకానమిస్ట్ పత్రికలోని వ్యాసం సారాంశం. ఆ విషయ వివరణకు వారు ఆధారపడిన గణాంకాలను చూస్తే మనకు ఇంకొక కోణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది దేశంలో 2000–2014 మధ్య వివిధ తరగతుల మధ్య ఆర్థిక అసమానతలు విస్తృతంగా పెరిగాయన్న విషయం. 2000 సంవత్సరంలో అత్యధిక సంపద కలిగిన 10 శాతం జనాభా చేతుల్లో దేశ ఆదాయం 40 శాతం ఉంది. వారి తరువాత ఉన్న 40 శాతం జనాభాకు కూడా దేశ ఆదాయంలో 40 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక మిగిలిన 50 శాతం జనాభాకు దేశ ఆదాయంలో 20 శాతం వాటా ఉంది. 2014 సంవత్సరానికి అత్యధిక 10 శాతం జనాభా వాటా దేశ ఆదాయంలో 40 శాతం నుంచి దాదాపు 60 శాతం దాకా పెరిగింది. మిగిలిన 40 శాతం మధ్య తరగతి వాట 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకానమిస్ట్ పత్రిక లోని వ్యాసంలో మధ్యతరగతి వారి జాతీయ ఆదా యంలో వాటా పెరుగుదల బదులు తరుగుదల ఉన్నది కాబట్టి భారత్లో భవిష్యత్తులో బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు తగిన గిరాకీ ఉండకపోవచ్చు ననే నిర్ధారణకు ఆ వ్యాసకర్త వచ్చాడు. కేవలం భారత్ను అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ఒక మార్కెట్ దృష్టితో చూశారు కాబట్టి ఆ వ్యాసకర్త దృష్టంతా మధ్యతరగతి వారి జాతీయ ఆదాయంలో వాటా తరుగుదల మీదనే ఉంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ ఆదాయ అభివృద్ధి పంపిణీలో మనదేశంలో ఉన్నంత అసమతౌల్యం కనిపించటం లేదని ఆ పత్రిక వారి అభిప్రాయం. కానీ ఆపై గణాంకాలు ఇంకొక ప్రమాదకరమైన ఆర్థిక అసమానతలను సూచిస్తున్నాయి. దేశ భవి ష్యత్తు దృష్ట్యా ఆ అంశంపై మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే 50 శాతం జనాభాకు జాతీయ ఆదాయంలో భాగం 2000 సంవత్సరంలో 20 శాతం ఉంటే 2014 సంవత్సరా నికి అది 15 శాతానికన్నా తగ్గింది. అంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంది. జాతీయాదాయంలో మధ్యతరగతి, చివరి తరగతి ప్రజల వాటా తగ్గి 10% సంపన్న వర్గం వాటా గణనీయంగా పెరిగింది. దీని ప్రభా వమే భారతదేశం అతి విలాసవంతమైన వస్తువుల డిమాండ్ కొనుగోలు కేంద్రంగా ఏర్పడింది. మధ్య తరగతి ఆదాయం గణనీయంగా పెరిగితే బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశ ముంది. కానీ క్రింది 50 శాతం జనాభా ఆదాయం గణనీయంగా పెరిగితే దేశీయ సంస్థల ఉత్పత్తులకు గణనీయంగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. పైగా, 10 శాతం అత్యున్నత జనాభా సంపద పెరిగితే వారు విహారయాత్రకు స్కాట్లాండ్ దేశానికి పోయే అవకాశం ఉంది. మధ్యతరగతి వారి ఆదాయాలు పెరిగితే శ్రీలంక లాంటి దేశాలకు వెళతారు. కానీ చివరి 50 శాతం వారి ఆదాయాలు పెరిగితే వారు సందర్శించే స్థలాలు భారతదేశంలోనే ఉంటాయి. వారు చేసే ఖర్చు దేశ సంపదను పెంచుతుంది. భారత్ వస్తువుల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ వస్తువులకు తగిన గిరాకీ ఏర్పడాలంటే 50 శాతం చివరి తరగతి జనాభా ఆదా యాలు గణనీయంగా పెరిగే విధానాలపై దృష్టి సారించాలి. అలా చేయనప్పుడు జాతీయ ఉత్పత్తి పెరుగుదల పేదరిక నిర్మూలనకు తోడ్పడకపోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక అసమానతలు సామాజిక ఉద్రి క్తతలకు దారి తీయవచ్చు. పై పది శాతం ఆదాయా భివృద్ధి విదేశీ వస్తువుల గిరాకీ పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియా విధానానికి తోడు పడకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
గురుకుల సంస్థలు మెరవాలంటే..?
పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో విద్యాశాఖ నిర్వహించారు. సీఎం అయ్యాక విద్యా రంగంలో ఉన్న అనుభవంతో కొన్ని వినూ త్న కార్యక్రమాలు చేపట్టారు. అలా మొదలైనవే రెసిడెన్షియల్ విద్యాసంస్థలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభా వంతులైన విద్యార్థులను ఒక చోట చేర్చి ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధించడమే వాటి ప్రధాన ఉద్దేశం. అందుకు అనుగుణంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపకారవేతనాల ద్వారా విద్యార్థులకు కల్పించారు. వారి దృష్టి చదువు మీద కేంద్రీకరించేట్లు చేయడమే ప్రధాన లక్ష్యం. ఈ విధా నానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలోని సర్వేల్, కోస్తా ప్రాంతంలోని తాడికొండ, రాయలసీమలోని కొడిగెనహళ్లిలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించారు. 1972లో స్వాతంత్య్ర రజతో త్సవాలను çసందర్భగా కర్నూలులో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలగా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుచేశారు. తర్వాత నాగార్జునసాగర్లో రెసి డెన్షియల్ జూనియర్ కళాశాల స్థాపనతో రాష్ట్రం లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు పూర్తయింది. పీవీ కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వీకరించాక దేశవ్యాప్తంగా నవోదయ స్కూళ్ల పేరుతో ఇలాంటి రెసిడెన్షియల్ సంస్థలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గ్రామీణ యువకులకు నాణ్యతతో కూడిన విద్య అందించడంలో ఈ సంస్థలు ముఖ్యపాత్ర పోషించాయి. 1972లో స్థాపిం చిన సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ప్రథమ బ్యాచ్ విద్యార్థుల్లో నేను ఒకడిని. అప్పటికే ఎస్సీ, ఎస్టీల కేకాక బీసీలకు రిజర్వేషన్లు వర్తింప చేయడంతో ఆ కాలేజీ విద్యార్థులు వివిధ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గల కుటుంబాల నుంచి వచ్చారు. విద్యా ర్థులను రాష్ట్రం లోని మూడు ప్రాంతాల నుంచి దామాషాలో తీసుకోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులతో కలిసి హాస్టల్లో నివసించే అవకాశం లభించింది. హాస్టల్లో నా గదిలో నాతోపాటు ఉన్న వారిలో కోయిలకుంట్లకు చెందిన గాబ్రియల్ సుధాకర్ ఒకరు. ఆయన తం్రyì గ్రామంలో పాస్టర్గా పనిచేసే వారు. కొడుకును చూడడానికి వచ్చినప్పుడు హాస్టల్ లో మాతో పాటే ఉండేవారు. ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు విద్యాశాఖ నిర్వహించేది. క్రమక్రమంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు మొదలైంది. వెనుకబడిన తరగతుల శాఖ, షెడ్యూల్ కులాల శాఖ కింద వేర్వే రుగా ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం మొద లైంది. నేడు మైనారిటీల కూడా ప్రత్యేకంగా రెసిడె న్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థల్లో కూడా ఇతరులకు కొన్ని సీట్లు కేటాయిం చినాగాని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఎంపికల్లో ఉన్న విశాలత వీటిలో లోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 842 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 3లక్షల విద్యార్థులతో మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ 454 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు రెండు లక్షల విద్యార్థులతో పదమూడు వందల కోట్లతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఏపీ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. రెసిడెన్షియల్ విద్యాసంస్థలు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ నిర్వహణలో మరో ప్రభుత్వ కార్యక్రమంలాగానే చాలా రోజులు నడిచాయి. వీటిపై శ్రద్ధ పెట్టిన నాథు డు లేక గణనీయ ఫలితాలను ఈ సంస్థలు సాధిం చలేకపోయాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మాత్రం 2012 తర్వాత ప్రవీణ్ కుమార్ ఈ సంస్థ కార్యదర్శి కావడంతో మంచి ఫలితాలు చూపించడం మొదలెట్టాయి. ఐపీఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ఇలాం టి విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసి అఖిలభారత సర్వీస్ అధికారిగా ఎదిగారు. సమాజానికి తన వంతు చేయాలనే సదుద్దేశంతో ఈ శాఖలో పని చేయడానికి వచ్చి గత ఆరేళ్ల నుంచి ఈ సంస్థల నిర్వహణలో గణనీయ మార్పు తెచ్చారు. ఈ సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు జేఎన్యూ వంటి ప్రసిద్ధ సంస్థల్లో సులభంగా సీట్లు సంపా దించు కుంటున్నారు. ఈమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి అగ్రవర్ణ పేదలకు ఇలాంటి రెసిడెన్షియల్ సంస్థలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వేరువేరుగా ఈ రెసిడెన్షి యల్ విద్యాసంస్థలను నిర్వహించడం వాంఛనీయం కాదు. అక్కడ చదివే విద్యార్థులకు వివిధ సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చే విద్యార్థులతో కలిసి మెలిసి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సంకుచిత ధోరణి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఒకే గొడుగు కింది కి తెచ్చి అన్ని వర్గాల విద్యార్థులు కలసి చదువుకునే విధంగా ఏర్పా టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న విద్యా సంస్థ్థలను సమగ్ర రెసిడెన్షియల్ విద్యా సంసలుగా మార్పు చేస్తే మంచిది. దీనివల్ల విద్యార్థుల ఎంపి కలో ఇప్పుడున్న దామాషా పద్ధతికి ఎలాంటి భంగం కలగదు. లేకుంటే ఈ విద్యా సంస్థలు విద్యార్థులకు విశాల దృక్పథం ఏర్పడడానికి దోహదం చేయవు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి yrk45@gmail.com -
బ్రాహ్మణులకు ఆర్థిక,రాజకీయ సాధికారత లేదు
సాక్షి, విశాఖపట్నం: బ్రాహ్మణులు పేరుకు ఉన్నత సామాజిక వర్గమే అయినప్పటికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారిత లేదు. గడిచిన 50 – 60 ఏళ్లలో ఏదైనా వర్గం బాగా నష్టపోయిందంటే అది బ్రాహ్మణ జాతే. బ్రాహ్మణుల్లో ఎంట్రప్రెన్యూర్స్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్పై ఆధారపడతారు. ఇప్పుడు వాళ్లకు ఆ అవకాశాలు కూడా లేవు. టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. రామాలయంలో పనిచేసే అర్చకుడు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఆరోజు ఆయన ఇంట్లో పరిస్థితి చూస్తే జాలేసింది. ఈ ఘటనతోనే అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రపోజల్ పెట్టా. దేవాలయాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చేలా చూశాం. ప్రధాన అర్చకులకు రూ.50 వేలు పెట్టాం. ఆ రోజు ఇప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సపోర్టు చేశారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాలకు నిధులు ఇచ్చి తద్వారా ఆ అర్చకులనూ ఆదుకోవాలి. ఇందుకోసం ఆనాడు నేను తీసుకొచ్చిన జీవో 76ను ఒక లెవల్కు తీసుకొచ్చాక ఆగిపోయింది. ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి : అర్చకుల పేరిట ఉన్న సర్వీస్ ఈనాం ల్యాండ్స్, దేవుని పేరిట ఉన్న ల్యాండ్స్ను కాపాడాలి. ఇదే ఆలోచనతో కార్పొరేషన్లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేశాను. రిటైర్డ్ ఎస్పీ, రిటైర్డ్ ఆర్డీవోను, ఒక ఎక్స్పర్ట్ లీడర్ను పెట్టాను. గుడవర్తి పద్మావతి కేసులో ఈ కమిటీ పర్ఫెక్ట్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టారని కేసు పెడతారా..? ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అర్చక వృత్తిలో బ్రాహ్మణులొక్కరే కాదు.. ఇతర కులాల వారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి. ట్రస్ట్ బోర్డులను ధార్మికచింతన ఉన్న వారికే అప్పగించాలి. 2007లో స్థానికంగా ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయడం, అర్చకులకు వారసత్వ హక్కులు పునరుద్ధరించేందుకు రాజశేఖరరెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ సాధికారత లేకపోవడం వలన చాలా నష్టపోతున్నాం. మా జనాభా మూడు శాతం ఉందనుకున్నా ఏడుగురు ఎమ్మెల్యేలుండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీ వారికి అవకాశాలు కల్పించాలి. చివరగా.. పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా. నేను పార్టీలోకి చేరడానికి ఇక్కడకు రాలేదు..నా వ్యూస్ను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చా. – ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
‘పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా’
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్ర్యం తర్వాత బ్రాహ్మణులు బాగా నష్టపోయారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో సోమవారం నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణులు పేరుకు ఉన్నత సామాజిక వర్గమే అయినప్పటికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారిత లేదు. గడిచిన 50 – 60 ఏళ్లలో ఏదైనా వర్గం బాగా నష్టపోయిందంటే అది బ్రాహ్మణ జాతే. బ్రాహ్మణుల్లో ఎంట్రప్రెన్యూర్స్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్పై ఆధారపడతారు. ఇప్పుడు వాళ్లకు ఆ అవకాశాలు కూడా లేవు. టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. రామాలయంలో పనిచేసే అర్చకుడు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఆరోజు ఆయన ఇంట్లో పరిస్థితి చూస్తే జాలేసింది. ఈ ఘటనతోనే అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రపోజల్ పెట్టా. దేవాలయాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చేలా చూశాం. ప్రధాన అర్చకులకు రూ.50 వేలు పెట్టాం. ఆ రోజు ఇప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సపోర్టు చేశారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాలకు నిధులు ఇచ్చి తద్వారా ఆ అర్చకులనూ ఆదుకోవాలి. ఇందుకోసం ఆనాడు నేను తీసుకొచ్చిన జీవో 76ను ఒక లెవల్కు తీసుకొచ్చాక ఆగిపోయింద’ని అన్నారు. ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి.. ‘అర్చకుల పేరిట ఉన్న సర్వీస్ ఈనాం ల్యాండ్స్, దేవుని పేరిట ఉన్న ల్యాండ్స్ను కాపాడాలి. ఇదే ఆలోచనతో కార్పొరేషన్లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేశాను. రిటైర్డ్ ఎస్పీ, రిటైర్డ్ ఆర్డీవోను, ఒక ఎక్స్పర్ట్ లీడర్ను పెట్టాను. గుడవర్తి పద్మావతి కేసులో ఈ కమిటీ పర్ఫెక్ట్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టారని కేసు పెడతారా..? ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అర్చక వృత్తిలో బ్రాహ్మణులొక్కరే కాదు.. ఇతర కులాల వారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి. ట్రస్ట్ బోర్డులను ధార్మికచింతన ఉన్న వారికే అప్పగించాలి. 2007లో స్థానికంగా ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయడం, అర్చకులకు వారసత్వ హక్కులు పునరుద్ధరించేందుకు రాజశేఖరరెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ సాధికారత లేకపోవడం వలన చాలా నష్టపోతున్నాం. మా జనాభా మూడు శాతం ఉందనుకున్నా ఏడుగురు ఎమ్మెల్యేలుండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీ వారికి అవకాశాలు కల్పించాలి. చివరగా.. పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా. నేను పార్టీలోకి చేరడానికి ఇక్కడకు రాలేదు.. నా వ్యూస్ను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చా’ -
బ్రాహ్మణుల్లో సాధికారత రావాల్సిన అవసరం ఉంది
-
అమరావతిలో ఒలింపిక్ క్రీడలు?
ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు ముంబై స్టాక్ ఎక్సే్చంజ్లో అమరావతి బాండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించడానికి వెళ్లి అక్కడ ముంబై స్టాక్ ఎక్సే్చంజ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భాగంగా, భారత్లో ఇంతవరకు ఒలిం పిక్ క్రీడలు నిర్వహించలేదని ఈ క్రీడలు అమరావతి నగరంలో నిర్వహించడానికి సిద్ధమని పేర్కొన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఒలింపిక్ క్రీడలు నిర్వహించకపోవడం మనమందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన వివిధ దేశాల అనుభవాలను పరిశీలిస్తే మనం ఈనాడు దేశానికి లాభసాటి అయ్యేవిధంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించుకునే పరిస్థితి ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది. గత నాలుగు ఒలిం పిక్ క్రీడలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్వహించారు. అవి గ్రీసు, చైనా, లండన్, బ్రెజిల్. వీటిలో ఇంగ్లండ్ను అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. చైనా ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న దేశం. గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడలు నిర్వహించక ముందు కూడా అభివృద్ధి చెందిన దేశమే. ఎటొచ్చీ ఒలింపిక్ క్రీడల అనంతరం ఆ దేశానికి సమస్యలు మొదలైనాయి. బ్రెజిల్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ప్రముఖ దేశం. అవినీతి, ఆర్థిక అసమానతలు ఈ దేశంలో కూడా మనకు కనిపిస్తాయి. ఈ నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రభావాన్ని పరిశీలించే ముందు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు అయ్యే ఖర్చు ఒకసారి చూద్దాం. ఒలింపిక్ నిర్వహణ ఖర్చులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. గ్రీసు దేశం ఖర్చు 65 వేల కోట్లుగా అంచనా వేసింది. అదే చైనా దేశంలో ఈ ఖర్చులు 3 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇంగ్లండ్ దేశం లక్ష కోట్ల రూపాయలు ఒలింపిక్ ఖర్చులుగా పరిగణించింది. బ్రెజిల్ దేశంలో ఖర్చు అన్ని మౌలిక సదుపాయాలను లెక్కలోకి తీసుకుంటే లక్షా 40 వేల కోట్లుగా లెక్కవేశారు. కనీస ఖర్చు ఇంగ్లండ్లో లాగానే లక్ష కోట్ల రూపాయలు. కాగా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లక్షా 30 వేల కోట్ల రూపాయలు. ఇది ఒలిం పిక్ నిర్మాణ ఖర్చుకు సమానంగా ఉంది. 25 లక్షల కోట్ల భారతదేశ బడ్జెట్లో 4% ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి కావాల్సి ఉంటుంది. ఇకపై నాలుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒలిం పిక్ క్రీడలు ఏవిధంగా ప్రభావితం చేశాయో పరిశీ లిద్దాం. ఇంగ్లండ్, చైనా దేశాల్లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు మరింత పుంజుకోవటానికి దోహదం చేశాయి. రెండు దేశాల్లోనూ క్రీడలు అయిన తర్వాత ఆ సదుపాయాలను ఎట్లా వినియోగించాలని ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి సదుపాయాలు నిరర్థకంగా ఉండిపోలేదు. ఉదాహరణకు ఇంగ్లండ్ దేశంలో ఒలింపిక్స్ కోసం నిర్మించిన ప్రధాన క్రీడా స్థలాన్ని ఫుట్బాల్ క్రీడాస్థలంగా వాడుకున్నారు. ఇక గ్రీసు దేశం విషయంలో ఆ దేశం అప్పుల ఊబిలోకి నెట్టబడటానికి ఒలింపిక్ క్రీడలు కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వారి జాతీయ స్థూల ఉత్పత్తిలో 4 శాతం నష్టం ఒలింపిక్ క్రీడల వల్ల ఏర్పడిందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త అంచనా వేశారు. ప్రాచీన కాలపు శి«థిలాలకు ప్రసిద్ధి చెందిన గ్రీసు దేశం ఒలింపిక్ క్రీడల తర్వాత ఒలింపిక్ క్రీడా ప్రాంగణాల రూపంలో ఆధునిక శిథిలాలకు ప్రసిద్ధి చెందిందని హాస్య పూర్వకంగా ఒకరు వ్యాఖ్యానించారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణ వలన భారీగా నష్టపోయిన దేశం బ్రెజిల్. క్రీడలు మొదలవటానికి ముందే దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. క్రీడలు పూర్తయిన తర్వాత దేశంలో ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. క్రీడల నిర్వహణలో లోటుపాట్ల మూలం గా దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు రాలేదు. భారతదేశ పరిస్థితి బ్రెజిల్ కన్నా భిన్నంగా ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈనాడు దేశంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ కన్నా చాలా ముఖ్యమైన ప్రాధాన్యాలు ఉన్నాయి. అభివృద్ధి రేటు పెంపు, మానవ అభివృద్ధి సూచికలో పెరుగుదల, శిశు మరణాలు అరికట్టడం, అక్షరాస్యత వంటి అంశాలలో గణనీయమైన అభివృద్ధి సాధించగలిగిన నాడు దానంతటదే ఒలింపిక్ క్రీడలు నిర్వహించే అర్హత భారతదేశానికి వస్తుంది. ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు క్రీడలు నిర్వహించటం చైనా, ఇంగ్లండ్ దేశాల లాగా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తుంది. అది కాదని తొందరపడితే బ్రెజిల్, గ్రీసు దేశాల అనుభవాలే మనకు ఎదురవుతాయి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అమరావతి బాండ్లు, టెండర్ల మతలబు!
నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేని, ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేని సీఆర్డీఏ ఎన్నికల సంవత్సరంలో రూ. 60వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ప్రకటించలేదు. అమరావతికి ప్రభుత్వ హామీ ఉన్నది. ఉండటమే కాదు ఈ రుణాన్ని నేరుగా గాని సీఆర్డీఏకు గ్రాంట్లు సమకూర్చిగానీ తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. అంటే పరోక్షంగా ఇది రాష్ట్రప్రభుత్వం అధిక వడ్డీ రేటుతో చేసిన అప్పు. అట్లాంటప్పుడు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అంశం దీనిలో ఏమున్నది? ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఒక మహానగరం ఏర్పడాలనే భావనతో ముందడుగు వేస్తే ఆ కార్యక్రమం అటు అమరావతికి, ఇటు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారుతుంది. ఈ మధ్య అమరావతి బాండ్లు పదమూడు వందల కోట్ల రూపాయ లకు విడుదలైతే రెండువేల కోట్ల రూపాయల విలువైన బాండ్లకు మద్దతు లభించిం దని, ఇది ‘బ్రాండ్ అమరా వతి’ ఘనవిజయమని రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని ప్రసార మాధ్యమాలు విజయోత్సవాలు జరుపుకుంటు న్నాయి. కేవలం అప్పు తీర్చాలి అన్న ఉద్దేశం లేని వ్యక్తులు మాత్రమే అప్పు పుట్టిందనే సంతోషంతో ఉత్సవాలు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణం తీర్చకపోయే సమస్య లేదు. రుణాల మార్కెట్లో అప్పు తీర్చాల్సిన బాధ్యత అది తీసుకున్న సంస్థ మీదనే ఉంటుంది. ఇక అమ రావతి బాండ్ల వ్యవహారానికి వస్తే ఫిబ్రవరి నెలలో ఈ విధమైన బాండ్ల ద్వారా అధిక వడ్డీ రేటుతో అప్పులు తీసుకునే విధానాన్ని పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకించాయి. 2018 ఫిబ్రవరి 8న నగర పాలక శాఖ విడుదల చేసిన జీవో 65లో ఈ అంశాన్ని పొందుపరిచారు. వడ్డీరేట్లు తగ్గుతున్న వాతావరణంలో స్థిర వడ్డీ రేట్లతో బాండ్ల ద్వారా దీర్ఘకాలిక రుణాలు సేకరించేటప్పుడు మార్కెట్ వడ్డీ రేటు కన్నా చెల్లించే వడ్డీ రేటు చాలా తక్కువ ఉన్నప్పుడు తిరిగి ముందుగానే చెల్లించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలోనే ఈ బాండ్ల సదుపాయాన్ని ఉపయోగించు కోవాలని ఆ జీవోలో సూచించారు. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందో కానీ 2018 ఆగస్టు 9న మరో జీవో (నంబర్ 266) జారీ చేశారు. దీని ద్వారా సీఆర్డీఏకు మార్కెట్ రేటుకు మించి 10. 32 శాతం వడ్డీ రేటుతో పద మూడు వందల కోట్లు బాండ్ల రూపంలో సేకరించడా నికి, మరో ఏడు వందల కోట్లు అదనంగా ఉంచుకునే అవకాశం ఉండేవిధంగా బాండ్లు జారీ చేయటానికి అనుమతి ఇచ్చారు. ఈ మొత్తం అప్పును రాష్ట్ర ప్రభు త్వమే తీర్చవలసి ఉంటుంది. ఒక ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు ద్వారా ముందుగానే ఈ చెల్లింపులకు కావ లసిన నిధులు ఆ ట్రస్టులోకి జమ చేసే విధానం కూడా రూపొందించారు. ఈ ట్రస్ట్లోకి జమచేసే సొమ్ము రాష్ట్ర బడ్జెట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఈ బాండ్ల జారీ ప్రక్రియ నిర్వహించినందుకు ఏకే క్యాపి టల్ సంస్థ వారికి 0.85 శాతం ఫీజు కింద చెల్లిస్తారు. ఈ ఫీజే దాదాపు 17 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లోని నగరపాలక సంఘాలు ప్రభుత్వ హామీ లేకుండానే చాలా తక్కువ వడ్డీ రేట్లకు ఇలాంటి బాండ్ల ద్వారా నిధులు సేకరిం చాయి. పుణే నగరపాలక సంస్థ 7.59 శాతం వడ్డీ రేటులో బాండ్ల ద్వారా నిధులు సేకరించగా, హైదరా బాద్ నగరపాలక సంస్థ ఒక విడతలో 8. 9 శాతం వడ్డీ రేటుకు, మరొక విడతలో 9. 38 శాతానికి నిధులు సేకరించింది. అమరావతిని వీటితో పోల్చ డం సరికాకపోయినా గమనించవలసిన ముఖ్య విష యం ఏమిటంటే– పైరెండు నగరపాలక సంస్థలు ప్రభుత్వ హామీ లేకుండా ఈ బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. అమరావతికి ప్రభుత్వ హామీ ఉన్నది. పైగా ఈ రుణాన్ని నేరుగా గాని సీఆర్డీఏకు గ్రాంట్లు సమకూర్చిగానీ తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. నాలుగేళ్ల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేని, ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేని సీఆర్డీఏ ఎన్నికల సంవత్సరంలో రూ. 60వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ప్రకటించలేదు. రూ. 20 వేల కోట్లు హడ్కో నుంచి, ఆరు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి, రూ.10 వేల కోట్లు ఇండి యన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ నుంచి, రూ.7 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మూలధన వాటా కింద, రూ. 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం మూలధన వాటా కింద వస్తాయని మదుపర్ల సమావేశాల్లో తెలిపారు. హడ్కో నుంచి 8 శాతం కన్నా తక్కువ వడ్డీకి వస్తేనే రుణం తీసుకోవా లన్న నిబంధన ను జనవరిలో నగర పాలక సంస్థ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో విధించారు. అంత పెద్ద మొత్తంలో రూ. 20 వేల కోట్లు ఒక సంస్థ ఇచ్చే అవ కాశం లేదు. నిరర్థక ఆస్తులతో సతమతమవు తున్న ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ పదివేల కోట్లు ఇస్తారనుకోవటం వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా కని పిస్తోంది. ఇక ప్రపంచ బ్యాంకు అంశం సరేసరి. ఎటు వంటి వెసులుబాటు లేని రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 7వేలకోట్లు మూల ధన వాటా రూపంలో ఎలా ఇస్తారో అర్థం కావడంలేదు. వాస్తవాలకు పూర్తి విరు ద్ధంగా నిధులను చూపెట్టి రూ. 60 వేల కోట్ల టెండర్లు పిలిచారు. ఇది ఎటు తిరిగి చాలా హెచ్చు వడ్డీరేట్లతో ఇటు ఆర్థిక సంస్థల నుంచి గాని, బాండ్ల రూపంలోగాని ప్రభుత్వ హామీ మీదనే సేకరించాల్సి ఉంటుంది. అంటే ఇది ప్రభుత్వం అదనంగా చేస్తున్న అప్పు. ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పుతో మూలు గుతున్న రాష్ట్ర ప్రజల మీద పడే అదనపు తాటికాయ అమరావతి అప్పులు. ఇవి రాజధాని కోసం చేస్తున్న అప్పులు కావు. కాలక్రమంలో పరిణతి చెందాల్సిన మహానగరాన్ని ఒకేసారి నిర్మించాలనే వాస్తవ దూర మైన ప్రాతిపదికపై జరుగుతున్న కార్య క్రమానికి చేస్తున్న అప్పులు. ఇక ఈ మహా నగర నిర్మాణ భారం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. రాష్ట్రంలో 2016–17 సంవత్సరం మూల ధన వ్యయం 15వేల కోట్ల రూపాయలు. ఈ మూలధన వ్యయం చేయడం కోసం రూ. 60 వేల కోట్ల అప్పులు చేశారు. భవి ష్యత్తులో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసే అవ కాశం లేదు కాబట్టి మూలధన వ్యయం సంవ త్సరానికి రూ. 10 వేల కోట్లకు మించకపోవచ్చు. అంటే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో ఒక్క అమ రావతి మహానగర టెండర్ల పనుల చెల్లింపులకు మాత్రమే మొత్తం మూలధనవ్యయం సరిపోతుంది. ఇప్పటికే నీటిపారుదల రంగంలో పూర్తి కాని ప్రాజె క్టుల కారణంగా 50 వేల కోట్ల రూపాయలు నిర ర్థకంగా ఉండిపోయాయి. ఇంకొక రూ. 60 వేల కోట్ల నిరర్థక ఆస్తులు దానికి జత కావచ్చు. ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. ఒక పరిపాలన రాజధానిని 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఒక మహానగరం ఏర్పడా లనే భావనతో ముందడుగు వేస్తే ఆ కార్యక్రమం అటు అమరావతికి, ఇటు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారుతుంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
జమిలి ఎన్నికలు సాధ్యమే!
2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. మళ్లీ లోక్సభకు 2019లో ఎన్నికలు. కానీ ఈ మధ్యకాలంలో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల హడావుడి, సందడి. 2014లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హరియాణా జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించారు. 2015లో ఒక రాష్ట్రంలో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. 2016లో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. 2017లో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా, 2018లో మరొక ఎని మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.. జరగనున్నాయి. ఇకపోతే, 2019లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 1967 వరకు చాలావరకు జమిలి ఎన్నికలు నిర్వహించారు. 1971 తర్వాత అప్పటిదాకా జమిలిగా జరుగుతున్న ఈ ఎన్నికలను వేరువేరుగా నిర్వహిం చడం మొదలైంది. దీనికితోడు 1970 దశకం నుంచి మొదలైన ఆయారాం గయారాం విధానాలు చాలా రాష్ట్రాలలో రాజకీయ అనిశ్చితికి దారి తీశాయి. క్రమంగా లోక్సభ స్థాయిలోనూ ఆయారాం గయారాం విధానం మొదలవటంతో అక్కడ కూడా అని శ్చిత పరిస్థితులు నెలకొని ఐదేళ్ల కాలపరిమితి కన్నా ముందే కొన్నిసార్లు లోక్సభ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు సార్వత్రిక ఎన్నికల మధ్యకాలంలో ప్రతి ఏడాది ఎన్నికలు ఉండే విధానం తయారైంది. ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.3,870 కోట్లు. లోక్సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు రూ. 900 కోట్ల దాకా ఖర్చవుతోంది. ఇక రెండు సార్వత్రిక ఎన్నికలకు మధ్యకాలంలో నిర్వహించే వివిధ రాష్ట్రాల ఎన్నికల ఖర్చు రూ.2,970 కోట్లు. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే అయ్యే ఖర్చును 50:50 దామాషాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిం చటం జరుగుతుంది. అలా కాక రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చునంతా రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికల విధానం రాష్ట్రాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. కానీ రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహిం చడం వలన ప్రయోజనం ఉన్నట్టయితే ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చైనా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఈనాడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుబారా ఖర్చుతో పోల్చుకుంటే ఈ రూ. 2,970 కోట్ల ఖర్చు ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ ఎటువంటి ప్రయోజనం ఒనగూరనప్పుడు ప్రత్యేక ఎన్నికలకు పోవడం వృథా శ్రమే అవుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన కారణాలు ప్రధానంగా రెండు. ప్రతి ఎన్నికకు ముందు వాటి తీవ్రతను బట్టి ఒక నెల ముందుగానో రెండు నెలల ముందుగానో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది. ఇక అప్పటి నుంచి ప్రధానమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నులవుతారు. దేశ పరిపాలన యంత్రాంగం ఒకరకంగా స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. 2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో 1/3 సమయం కేవలం ఎన్నికల ప్రచారానికి సరిపోయింది. సార్వత్రిక ఎన్నికల తరువాత కొలువుతీరిన ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ఐదేళ్లు పూర్తిగా మధ్యలో ఏ చికాకులు లేకుండా పరిపాలన పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉండాలి. జమిలి ఎన్నికలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించగలవు. కానీ అన్ని అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపటం ఇప్పుడు ఏ విధంగా సాధ్యమనేది ప్రధానాంశం. దీనికి మనకు కొంత వెసులుబాటు 74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు ఏర్పాటుచేసిన విధి విధానాలు కలుగజేస్తున్నాయి. పై రెండు రాజ్యాంగ సవరణలలో పొందుపరిచిన 343(ఇ)4, 343(యు) 4 ప్రకరణల ద్వారా ఐదేళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే, ఎన్నికైనవారు ఆ శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అలా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆయా సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవడమైంది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా కొన్ని శాసనసభల కాలపరిమితిని కుదించి జమిలి ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయవచ్చు. కానీ దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అయితే అపోహలతో, పరస్పర అపనమ్మకాలతో సాగుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఇది సాధ్యపడుతుందా అనేది సందేహాస్పదమైన అంశం. ఐవైఆర్ కృష్ణారావు (వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, iyrk45@gmail.com) -
‘అవసరం తీరిన తర్వాత కించపరుస్తారా?’
సాక్షి, అమరావతి : గత కొన్నిరోజులుగా బెజవాడ దుర్గమ్మ గుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అవసరం తీరిన తర్వాత అధికారులను కించపరచడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి చీరను దొంగలించింది పాలకమండలి సభ్యురాలైతే ఈవోపై వేటు వేయడమేమిటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖలో ఆర్థికంగా లాభదాయకమైన పోస్టుగా భావించే.. దుర్గ గుడి ఈవో పోస్టుపై చాలా మంది కన్ను ఉంటుందని, అస్మదీయులకు ఈ పదవిని కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం నాటకమాడినట్లుగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే అధికారులతో హుందాగా వ్యవహరించడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. కాగా ఇటీవల ఓ భక్తురాలు అమ్మవారికి సారెగా సమర్పించిన 18 వేల రూపాయల ఖరీదైన చీర కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో... ఆలయ ఈవో ఎం. పద్మపై బదిలీ వేటు వేశారు. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించారు. కాగా మాజీ ఈవో ఎం. పద్మను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పీడీ అకౌంట్ల వివాదం
ఈమధ్య పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నర సింహారావు పీడీ అకౌం ట్లలో 50 వేల కోట్ల రూపాయల దాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చ యిందని ఇది 2జీ స్కామ్ అంత పెద్ద కుంభకోణం అని పేర్కొంటూ ఒక తేనె తుట్టెను కదిపారు. రాష్ట్ర మంతా గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశంపై చర్చతోనే మారుమోగుతున్నది. పీడీ అకౌంట్లు పేరుకు వ్యక్తిగత ఖాతాలుగా పేర్కొన్నా వాస్తవానికి ఇవి అధికారిక ఖాతాలే. వివిధ ప్రభుత్వ సంస్థల కార్యనిర్వహణాధికారులు వివిధ ప్రభుత్వ శాఖాధిపతులు ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటారు. మార్చి నెల చివర కొత్త ఆర్థిక సంవత్సరానికి శాసన సభ బడ్జెట్ను ఆమోదిస్తుంది. దీంతో ద్రవ్య విని యోగ బిల్లును కూడా శాసనసభ ఆమోదించడం జరుగుతుంది. ఈ రెండూ జరిగిన తరువాతనే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖాతాలలో పరిపాలనా యంత్రాంగం ఖర్చు చేయడానికి వీలవుతుంది. ప్రభుత్వ వ్యయం ప్రధానంగా ఆర్థిక శాఖలోని రెండు శాఖాధిపతుల ద్వారా జరుగుతుంది. నీటి పారుదల, భవనాలు, రోడ్లు వంటి మూలధన ప్రాజె క్టుల ఖర్చు పనులు ఖాతాల శాఖాధిపతి ద్వారా జరు గుతుంది. ఇక సాధారణ పరిపాలన ఖర్చు జీతాలు వగైరా ఖజానా ఖాతాల శాఖాధిపతి ద్వారా జరుగు తుంది. ఈ సాధారణ పద్ధతిలో ప్రభుత్వ పద్దులలో ఖర్చు జరిగే విధానంలో నిధులు విడుదల చేసే ముందు బిల్లులను తనిఖీ చేసే విధానం ఉంటుంది. అన్నివిధాలా సరిగా ఉంటే చెల్లింపులు చేయడం లేనిచో లోపాలను ఎత్తిచూపుతూ బిల్లును తిరిగి పంపుతారు. ఈ విధానాన్ని ఆచరించకుండా బిల్లు లకు చెల్లింపు చేయటానికి ఏర్పరచిన వెసులుబాటు పీడీ అకౌంట్ విధానం. దీనిలో ఆమోదించిన మొత్తాన్ని ఏకీకృత నిధిలో ఖర్చు చూపి పీడీ అకౌంట్లో జమ చేస్తారు. ఆపైన అవసరాన్ని బట్టి శాఖాధిపతి ఈ ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు. ఇక 2016–17 సంవత్సరం కాగ్ రిపోర్ట్ పరి శీలిస్తే పీడీ అకౌంట్ల విషయంలో రెండు మూడు ప్రధాన అంశాలను లేవనెత్తారు. దాదాపు సంవత్సర కాలంలో పీడీ అకౌంట్లకు 51 వేల కోట్లు తరలించడం జరిగిందని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పద్దుల కింద 22 వేల కోట్ల నిధులు ఉండగా సంవత్స రాంతానికి 26 కోట్ల మిగులు ఉందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన విషయం. రాష్ట్ర బడ్జెట్ రూ. 1,32,000 కోట్లయితే అందులో ఎటు వంటి వెసులుబాటు లేని ఖర్చు 65వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని జీతా లమీద, పెన్షన్లమీద వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేస్తారు. ఇక మిగిలిన ఖర్చు 67 వేల కోట్లు. అందులో పీడీ అకౌంట్ల ద్వారా ఖర్చయిన మొత్తం 47 వేల కోట్లు. అంటే వెసులుబాటు ఉన్న ఖర్చులో 70 శాతం ఖర్చు పీడీ అకౌంట్ల ద్వారానే జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను బిల్లుల తనిఖీకి అవకాశమున్న సాధన విధానం ద్వారా కాకుండా పీడీ అకౌంట్ విధానం ద్వారా ఖర్చు పెట్టడం తప్పకుండా అను మానాలకు దారి తీసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడాల్సిన పీడీ అకౌంట్ విధా నాన్ని సింహభాగం చెల్లింపుల కోసం వాడటం సరైన విధానం కాదు. ఇక కాగ్ రిపోర్ట్లో పేర్కొన్న రెండో ప్రధాన అంశం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు వేల సంఖ్యలో ఉన్నాయని. మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు 58 వేల దాకా ఉండగా మిగి లిన రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి. దీనికి చాలా వరకు కారణం మన రాష్ట్రంలో స్థానిక సంస్థలను వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలను పీడీ అకౌంట్ల పరిధిలోకి తీసుకురావడమే. ఇది సరైన విధానం కాదు. ఆ సంస్థల నిధులను వారి సాధారణ ఖాతాలకు జమచేసి పీడీ అకౌంట్లను మూసివేయా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా చేసినా ఇంకా మన రాష్ట్రంలో పీడీ అకౌంట్ల సంఖ్య పదివేల దాకా ఉండే అవకాశముంది. కాగ్ రిపోర్టులో పేర్కొన్న మరొక ప్రధాన అంశం పీడీ అకౌంట్లలోనే కాకుండా సాధారణ బ్యాంకు ఖాతాలలో కూడా 19 వేల కోట్ల రూపా యల ప్రభుత్వ ధనం ఉన్నదని, దానిని రాబట్టుకుంటే ఆర్బీఐ నుంచి ఆ సంవత్సరం తీసుకున్న రుణానికి సమానం అవుతుందని పేర్కొన్నారు. బయట బ్యాంక్ అకౌంట్లలో ఎక్కువకాలం నిధులు ఉంటే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ. వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఆర్థిక శాఖ ఒక పెద్ద చొరవ తీసుకోవడం జరిగింది. కానీ అది ఏ కారణాల వల్లనో ఆగిపోయింది.స్థూలంగా పీడీ అకౌంట్లు శాఖాధిపతులకు కొంత వెసులుబాటు కల్పిస్తాయి. కానీ ఎప్పుడో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరిమితంగా వాడవలసిన ఈ పీడీ అకౌంట్ విధానాన్ని పరిపాటిగా అన్ని రకాల నిధుల వినియోగానికి ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
విశ్వసనీయత లేని అవిశ్వాసం
ఆ ముచ్చట కూడా తీరిపోయింది. కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనుకున్నట్లుగానే వీగిపోయింది. ఇంతకూ ఏమి ఆశించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నది. అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేది ముందే తెలిసిన విషయం. ఇక విభజన అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అన్ని అంశాల మీద నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పింది. అవిశ్వాసం వల్ల భయపడి వారి విధానంలో మార్పు వస్తుందని ఆశించే అవకాశం లేదు. ఇక ఎటు వచ్చి అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించగలిగిన ఒకే ఒక్క లక్ష్యం ప్రజల ముందు విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టటం. ఈ అంశం మిగిలిన రాష్ట్రాలకు ప్రధానమైన అంశం కాదు కనుక దీనిపై చర్చ కనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజలు స్పందించే అవకాశం ఎటు లేదు. ఇక మన రాష్ట్రంలో ప్రజలు స్పందించడానికి ఈ అవిశ్వాసం ఒక్కటే మార్గం కానక్కర్లేదు. పైపెచ్చు కేంద్రాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా నిలదీయటానికి తెలుగుదేశం పార్టీకి కొన్ని సహజమైన పరిమితులు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడం, దానికి చట్టబద్ధత కావాలని కోరడం, కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ప్యాకేజీ కింద నిధులు పొందే సమయంలో తీసుకోవాల్సిన తదనంతర చర్యలు ఆపేసి రాష్ట్ర ప్రభుత్వం హోదా బాటపట్టింది. ఈ అంశంపై జరిగే చర్చలో కేంద్రాన్ని టీడీపీ నిలదీసే బదులు తెలుగుదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసే అవకాశాలు జాస్తి. అటువంటి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో పోయి అవిశ్వాస తీర్మానం పెట్టడం సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. రెండో ముఖ్యాంశం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంతో కొంతలో కొంత సఖ్యత నిలుపుకుంటూ నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉన్నది. ప్రతిపక్షాల లాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే వెసులుబాటు అధికారంలో ఉన్న పక్షానికి ఉండకపోవచ్చు. ప్యాకేజి ద్వారా ఎస్పీవీ పెట్టుకుంటే నిధులు వస్తాయంటే మేముపెట్టుకోము మాకు హోదా కావాలని భీష్మించే అవకాశం ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకి ఉండదు. ఇక అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను పరిశీలిస్తే.. టీడీపీ ఎంపీలు తప్ప మిగిలిన పార్టీల తరఫున మాట్లాడిన సభ్యులెవరికీ విభజన సమస్యలు, ప్రత్యేకహోదా ప్రధానాంశాలు కాకుండా పోయాయి. అందువలన చాలావరకు అవిశ్వాస తీర్మానం సాధారణ రాజకీయ పరిస్థితులపై చర్చకే పరిమితం కావడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు అడిగినప్పుడు టీడీపీ ఎంపీలు తమ తీర్మానానికి మద్దతు మాత్రమే అడిగారా లేక వారు ప్రసంగించేటప్పుడు విభజన అంశాల గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థించారా? ఆవిధంగా అభ్యర్థించి ఉంటే తప్పకుండా విభజన అంశాల ప్రస్తావన మిగిలిన పార్టీల సభ్యుల ప్రసంగాల్లో కూడా ప్రధానంగా వినిపించి ఉండేది. ఏపీ విభజన చట్టం చర్చించే సమయంలో దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన టీఎంసీ పార్లమెంటు సభ్యులు సౌమిత్రి రాయ్ ఈసారి మాత్రం పెద్దగా స్పందించలేదు. ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా తీసుకు పోవటంలో టీపీపీ పూర్తిగా విఫలమైందని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శన చాలు. ఈ అవిశ్వాస తీర్మానం మోదీకి రాజకీయంగా విస్తృత అంశాలపై స్పందించటానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చిందే కానీ రాష్ట్ర విభజన అంశాలు కానీ ప్రత్యేకహోదా అంశం కాని కేంద్ర బిందువుగా చర్చజరిగే అవకాశం కల్పించలేదు. చర్చ ముగించే ముందు వచ్చిన అవకాశాన్ని కేశినేని సరిగా వినియోగించుకోలేదు. ప్రభుత్వం నుంచి వివరణ హామీ కోసం నిర్దిష్ట అంశాలను లేవనెత్తి ఉండాల్సింది. మొత్తం అవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో ఒక ప్రధానాంశాన్ని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ లేవనెత్తారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? పరిశ్రమ రాయితీలు హోదాలో భాగమా? అన్నారు. నా దృష్టిలో దీనిమీద ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అది గమనించలేకపోవడం మన అవగాహనా రాహిత్యంగా కనిపిస్తూ ఉన్నది. - ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
ద్రోహులెవరు?
-
కత్తి మహేష్ ఉదంతం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది!
సందర్భం ఈమధ్య కత్తి మహేష్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేసింది. ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై పరిపూర్ణానంద స్వామి తదితరులు తీవ్రంగా స్పందిం చడంతో పరిస్థితి కొంత చేయి దాటిపోయే ప్రమా దం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి సమస్య సమసిపోయేటట్లుగా చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్య దేశాలలో భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది. కానీ ఈ స్వాతంత్య్రం కొన్ని పరిమితులకులోనై మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే విషయం ఎవరూ మరువరాదు. అబ్రహాం లింకన్ చెప్పినట్టు ‘నీ పిడికిలి నా ముక్కు దగ్గర ఆగిపోతుంది.‘ అంటే పక్కవారిని భౌతికంగా గానీ మానసికంగా గానీ గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. ఈ సూత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే మూలం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) ప్రకరణలో పొందుపరచటం జరిగింది. కానీ దీనికి రాజ్యాంగబద్ధమైన పరిమితులను 19 (2)లో పొందుపరిచారు. ప్రజా నియంత్రణ, మర్యాద, నైతి కత, దేశ భద్రత వంటి మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఈ పై స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. కత్తి మహేష్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి ఏ విధంగా పరిశీలించినా రావు. ఇక ఈయన వ్యాఖ్యలను సమర్థించేవారు రెండు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా మంది నాయకులు, వ్యక్తులు చేశారు గానీ ప్రభుత్వం అప్పుడు ఈ విధంగా స్పందించలేదు. ఇతని ఒక్కని విషయంలో మాత్రం ఈ విధమైన స్పందన వివక్షా పూరితంగా ఉంది అని వీరంటున్నారు. ఇది చాలా సహేతుకమైన వాదన. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసినా అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అవసరముంది. ఇక వారు ప్రస్తావించే రెండవ ప్రధాన అంశం రామాయణం లాంటి పురాణాల మీద ఇంతకు పూర్వం రంగనాయకమ్మ, రామస్వామి చౌదరి, చలం లాంటి వారు చాలా వ్యాఖ్యానాలు చేశారు. వాటిని తప్పు పట్టనప్పుడు మహేష్ చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా తప్పు పడతారు? ఈ వాదన సరికాకపోవచ్చు. పురాణాలను విశ్లేషణాత్మకంగా పరిశీ లించి, విమర్శనాత్మక వ్యాఖ్యానం చేయటం ఒక వంతు కాగా, సభ్యసమాజం మనోభావాలు గాయపడే విధంగా విచక్షణ కోల్పోయి వ్యాఖ్యానించటం వేరొక వంతు. పైపెచ్చు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయటం కూడా సమర్థనీయం కాదు. అలాగే కత్తి మహేష్ కుటుంబంపై దూషణలకు దిగిన వారి చర్య కూడా గర్హనీయమైనది. హిందూ మతం ఏ ఒక్క ప్రవక్త బోధనలవల్ల ఏర్పడిన మతం కాదు. ఇది యుగాల కాలంలో పరిణతి చెందిన మత విధానం. ఆరాధనలో, నమ్మకంలో, ఆచరణలో భిన్నత్వం ఈ మత విధానానికి మూలస్థానం. ప్రకృతి ఆరాధన విధానాల నుంచి నిరాకార నిరామయ స్వరూపుడైన భగవంతుని ఆరాధించే విధానం వరకు అన్నీ ఈ మతంలో ఆరాధనా విధి విధానాలే. ఈ భిన్నత్వాన్ని గౌరవించి ప్రవర్తించాల్సిన బాధ్యత అందరిమీదా ఉంటుంది. ఇతర మత విధానాల పట్ల కూడా అదేవిధంగా మెలగాలి. ఇటువంటి వ్యాఖ్యలు గతంలో పరిమితంగా చర్చకు వచ్చేవి. కానీ ప్రస్తుతం మీడియా పుణ్యమా అని శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి అంశాలకు ప్రసార అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తే మంచిది. ఈ వివాదం ఇంతటితో సమసిపోవటానికి అందరూ ముఖ్యంగా మేధావి వర్గం వారి భావజాలం ఏదైనా కానీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అసమానతలను రూపుమాపటం, నిరుద్యోగ సమస్య, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన అంశాలను వదిలివేసి చరిత్రను తవ్వుకుని సమస్యను సృష్టించుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు. ఇందులో ఎంత చరిత్ర, ఎంత కవి కల్పన అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే చర్చించే అంశాలు చరిత్రకందని కాలం నాటివి. గత శతాబ్ది కాలంలో హిందూ సమాజానికి రామానుజాచార్యులవారి స్థాయి కలిగిన మత సామాజిక సంస్కర్త లేకపోవటం ఈ మతం చేసుకున్న గొప్ప దురదృష్టం. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మతంలో మార్పులు రాకపోతే మతానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. ఈ అంశంపై హైందవ సమాజం మొత్తం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ-మెయిల్ : iyrk45@gmail.com -
ఆ విషయం తెలియడంతోనే రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల ఉండదని తెలిసిన తర్వాతే ప్రత్యేక హోదా అంటూ రాష్ట్రపెద్దలు యూటర్న్ తీసుకున్నారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ విషయంలో బీజేపీ నిద్రలేచేసరికే అనుకూల మీడియా ద్వారా రాష్ట్ర పెద్దలు అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. గుంటూరు నగరంలో ఆదివారం నవ్యాంధ్ర మేధావుల ఫోరం సమావేశం జరిగింది. మోదీ నాలుగేళ్ల పాలన, ఏపీ విభజన చట్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన ఐవైఆర్ మాట్లాడుతూ.. విభజన చట్టం లోపభూయిష్టంగా మారిందన్నారు. విభజన చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజకీయ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, తప్ప కోర్టుకు వెళ్తే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అన్నారు. కేంద్రంలోని అధికారులు మనవారికంటే వెయ్యిరెట్లు జాగ్రత్తగా ఉంటారని, వారికి తప్పుడు రిపోర్టులు ఇస్తే పనులు కావని ఐవైఆర్ తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్లో ‘ఆపరేషన్ నంది’
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఆపరేషన్ నంది’ : ఐవైఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఇలాంటి వాటన్నింటి కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఆపరేషన్ నంది అమలవుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లేదా ఇబ్బందిపెట్టే అంశాలు తెరమీదకొచ్చినప్పుడు వాటినుంచి తప్పించుకోవడానికి జాతీయస్థాయి కుట్రగా అభివర్ణించడం వంటి చర్యలన్నీఈ ఆపరేషన్ నందిలో భాగమేనని వివరించారు. అధినేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి అంశాలు తెరమీదకొచ్చినప్పుడు అంతర్జాతీయ కుట్రలుగా అభివర్ణించి సీఐఏ హస్తముందని అభియోగం మోపే అవకాశం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరైనా నిజాలు మాట్లాడి ప్రజల్లోకి వెళినపుడు ప్రమాదమని గ్రహిస్తే చాలు... అలాంటి వారి విశ్వసనీయతను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి తెరవెనుక కుట్రలకు పాల్పడుతారని ఆయన ధ్వజమెత్తారు. నిజాలు వెలుగులోకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తే.. నీచస్థాయికి దిగజారి చిన్నచిన్న అంశాలపై భూతద్దంలో చూపిస్తూ వారిపట్ల అమానవీయంగా కుట్రలకు తెగబడుతున్నారని చెప్పారు. అందుకు వాటి అనుకూల ప్రసార మాధ్యమాలు, మేధావి వర్గాన్ని సైతం వాడుకుంటున్నారని తెలుగుదేశం అధినేతపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. -
బాబు లేఖపై తీవ్రంగా స్పందించిన ఐవైఆర్
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆభరణాల అంశంలో హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విచారణ అవసరం ఉందా.. లేదా అని నిర్ణయించుకోవాలని సూచించారు. శ్రీవారి ఆభవరణాల విషయంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిలపై పరువు నష్టం వేయడం అర్థరహితమని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ దుమారం నుంచి తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇది చేసి ఉంటే వారికి మంచిది కాదని హితవు పలికారు. న్యాయస్థానం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు, విజయసాయి గారి మీద పరువునష్టం దావాలు కూడా అర్థరహితం అవుతాయి’, ‘ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుందని’ ఐవైఆర్ కృష్ణారావు వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఐవైఆర్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు విజయసాయి గారి మీద పరువునష్టం దావా లు కూడా అర్థరహితం అవుతాయి. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం గా న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుంది. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 -
‘ప్రత్యేక హోదా వచ్చేదాక నిధులు తీసుకోరా’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ట్విటర్ వేదికగా తన దైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినకు పోవటం, రావటం జరిగిందని, కానీ ప్రజలకు కలిగిన అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రుణ సేకరణ సామర్థ్యం (ఎఫ్ఆర్బీఎం) పరిమితుల నుంచి మినహాయింపునివ్వాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం దానికి అంగీకరించి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని సూచించిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రావల్సిన 16 వేల కోట్లు రాబట్టుకుంటుందా లేక కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే దాక ఏ నిధులు తీసుకోమిన భీష్మించుకొని కూర్చుంటుందా వేచి చూడాలన్నారు. తన ఉద్దేశం ప్రకారం ఎస్పీవీ ఏర్పాటు చేసుకొని నిధులను సాధించి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించడమే ఉత్తమమని కృష్ణారావు సూచించారు. మరిఎస్.పీ.వీ.ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి రావలసిన 16 వేల కోట్లు రాష్ట్రం రాబట్టుకుంటుందా లేక ప్రత్యేక హోదా ఇచ్చిన దాకా ఏమీ ముట్టము అని భీష్మించుకొని కూర్చుంటుందా.నా దృష్టిలోఎస్.పీ.వీ. ఏర్పాటుచేసుకుని నిధులను సాధించి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించడమే ఉత్తమం. — IYRKRao , Retd IAS (@IYRKRao) 20 June 2018 -
చంద్రబాబు తీరుపై ఐవైఆర్ విమర్శలు
-
చెరువు మీద అలిగితే.. చెరువుకు నష్టం కాదు
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ పరిపాలనలో ఉండటం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఈ విధంగా ప్రభుత్వాలు నడిచాయని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా విభేదించినా ఒక తలుపు తెరిచి ఉంచి.. రాష్ట్ర ప్రయోజనాలను విపక్షాలు కాపాడుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకురావడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో టీడీపీ అస్మదీయ ప్రసార మాధ్యమాలు అగ్నికి ఆజ్యం పోసేవిధంగా ప్రవర్తిస్తున్నాయని ఐవైఆర్ విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించిందని, చెరువు మీద అలిగితే చెరువుకు నష్టం కాదని, అపార అనుభవం గల చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదని పేర్కొన్నారు. విపక్షంలో ఉంటూనే కరుణానిధి తమిళనాడుకు ప్రయోజనాలు కాపాడారని ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించారు.