రాజ్యసభ నిరవధిక వాయిదా | Rajya Sabha sessions july 3rd 2024 updates | Sakshi
Sakshi News home page

రాజ్యసభ నిరవధిక వాయిదా

Published Wed, Jul 3 2024 11:04 AM | Last Updated on Wed, Jul 3 2024 2:13 PM

Rajya Sabha sessions july 3rd 2024 updates

ఢిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై  ప్రధాని మోదీ సమాధాన ప్రసంగం ముగిసింది. అనంతరం రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభను నిరవధికంగా వాయిదా చేశారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు...

  • బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాం

  • మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం: మోదీ

  • ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీ
  • చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.
  • సభను విపక్షాలు అవమానిస్తున్నాయి.

  • నా సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదు.

  • విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.

 

  • సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్‌ ఎలాంటి పథకాలు తేలేదు: మోదీ
  • కిషాన్‌ సమ్మాన్‌ నిధి రైతులకు అండగా నిలిచింది.
  • వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.
  • రైతుల కోసం పంటలకు మద్దతు ధరను భారీగా పెంచాం

 

  • విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్‌ అసంతృప్తి
  • విపక్షాలు ఇలా చేయటం సరికాదు
  • విపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి.

 

  • నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదు: ప్రధాని మోదీ
  • విపక్షాలు అవమానిస్తున్నాయి.

 

  • రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్‌
  • విపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదని సభ నుంచి వాకౌట్‌

 

  • కిషాన్‌ సమ్మాన్‌ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
  • ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు
  • పదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం
  • ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగం
  • రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • ఈ ఎన్నికలో  దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నా
  • పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో  ముందు వెళ్లుతోంది.
  • అంబేద్కర్‌ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.
  • మా విజయాన్ని చూసి కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. 
  • రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు.

 

  • రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.
  • అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.
  • ఐదో అతిపెద్ద  ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది
  • ఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచి
  • కరోనా కష్టకాలంలో కూడా భారత్‌ ఆర్థికంగా  ముందుకు వెళ్లింది.
  • గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.
  • వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాం
  • ఆర్థిక వృద్ధిలో భారత్‌ను  ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాం
  • వచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం
  • విపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.
  • గతంలో రిమోట్‌ ప్రభుత్వం నడిచింది.
     
  • ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.
  • 60  ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసింది.
  • ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు.

 

  • హత్రాస్‌ సత్సంగ్‌ తొక్కిసలాట ఘటనపై  రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.
  • మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు  121 మంది భక్తులు మృతి చెందారు.

     

     

  •  ప్రారంభమైన రాజ్యసభ

  • రాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.

      

     

  • నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్‌ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

  • లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement