రజకుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రజకుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

Published Mon, Aug 26 2024 10:36 AM | Last Updated on Mon, Aug 26 2024 10:36 AM

-

ఒంగోలు సెంట్రల్‌: స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా సామాజిక సేవ వృత్తిగా నిర్వహిస్తున్న రజకులపై రాష్ట్రంలో దాడులు, హత్యాచారాలు, హత్యలు, అక్రమ కేసులు, గ్రామ సాంఘిక బహిష్కరణలు పెరిగిపోతున్నాయని ఏపీ రజక వృత్తిదారుల సంఘ ప్రధాన కార్యదర్శి మున్నూరి భాస్కరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో టంగుటూరి రాము అధ్యక్షతన వృత్తిదారుల, అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రజకుల సామాజిక రక్షణ చట్టం చేయడంతోపాటు 50 ఏళ్లు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్‌ మంజూరు చేయాలని, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తామన్న హామీలను అమలు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి రాయల మాల కొండయ్య మాట్లాడుతూ.. రజకుల సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు చొరవ చూపాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు, ఆవుల మంద రమణయ్య, డాక్టర్‌ కృష్ణయ్య, సహాయ కార్యదర్శి చిట్యాల కొండయ్య, సీహెచ్‌ శ్రీనివాసులు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement