సమస్యలపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై తక్షణమే స్పందించాలి

Published Mon, Aug 26 2024 10:38 AM | Last Updated on Mon, Aug 26 2024 10:38 AM

-

బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బత్తుల పద్మావతి

ఒంగోలు: పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. స్థానిక సమగ్రశిక్ష సమావేశ మందిరంలో జిల్లాలోని కేజీబీవీ, ఏపీ మోడల్‌ పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్‌ ప్రాసెస్‌ మెడికల్‌ ఉండాలన్నారు. విద్యార్థుల పరిస్థితులు, ఆర్ఫాన్స్‌, సెమీ ఆర్ఫాన్స్‌ ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిత్యం ఫిర్యాదుల పెట్టె ఉంచాలని, వచ్చిన ఫిర్యాదులపై ప్రిన్సిపాళ్లు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కేజీబీవీ విధానం ప్రకారం 18 రకాల రిజిస్టర్లను తప్పక నిర్వహించాలన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు కూడా ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని, అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన అంశాలను కూడా అజెండాలో పొందుపరచాలన్నారు. పిల్లలకు సంబంధించి ప్రహరీ క్లబ్బులు, చిల్డ్రన్స్‌ కమిటీలను కూడా అన్ని కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో వేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. మోడల్‌ పాఠశాలలల్లో నెలకు ఒకసారి మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారితో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆర్ఫన్స్‌ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారో మ్యాపింగ్‌ చేయాలన్నారు. బాలల హక్కులపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. బాల కార్మిక, బాల్య వివాహ రహితంగా జిల్లాను తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో డీఈవో డి.సుభద్ర, జీసీడీవో, సీడబ్ల్యూసీ, డీసీపీఓ, కేజీబీవీ ప్రిన్సిపాళ్లు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లు, డీవైఈవో సుబ్బారావు పాల్గొన్నారు.

351 : మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బత్తుల పద్మావతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement