ఎలీసా పరీక్షల ద్వారా డెంగీ నిర్ధారణ చేస్తారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీని నిర్ధారించి ట్రీట్మెంట్ ఇస్తూ ప్రజల నుంచి లక్షలు దోచేస్తున్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోకుండా వారి వ్యాపారానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. మొత్తం మీద ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే తేటతెల్లం. ఇప్పటికై నా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాల పట్ల ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను తెలుసుకుని తగిన చర్యలు తీసుకుని జ్వరాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment