ఒంగోలు:
పీఆర్సీ కమిటీని వెంటనే ప్రభుత్వం నియమించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లా శాఖ విస్తృత కార్యదర్శివర్గ సమావేశం స్థానిక యూటీఎఫ్ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఓవీ వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి .వీరాంజనేయులు మాట్లాడుతూ పని సర్డుబాటు ప్రక్రియలోని గ్రీవెన్స్ను వెంటనే పరిష్కరించాలని, ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేశారే తప్ప ఒక్క సమస్య పరిష్కరించినందున దశల వారీగా పోరాటానికి పిలుపునివ్వగా ఈ పోరాటాన్ని మున్సిపల్ ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెర లేపుతుందని, దీన్ని ప్రభుత్వం ఆపాలన్నారు. సహ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ సీపీఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. సహాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ప్రమోషన్ ప్రక్రియలు కొనసాగించాలని కోరారు కోశాధికారి ఎన్.చిన్నస్వామి సంఘ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. సమావేశంలో జిల్లా ఆఫీస్ బెరర్స్, రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడిట్ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment