చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎంజేపీటీబీసీడబ్లూ ఆర్ఈఐఎస్ జాయింట్ సెక్రటరీ మద్దిలేటి అన్నారు. మహాత్మ జ్యోతి బాయి పూలే వెనుకబడిన తరగతుల గురుకుల బాలికల విద్యాలయాల (ఖైరతాబాద్, చాంద్రాయణగుట్ట అండర్–14, అండర్–19) విద్యార్థులకు చర్లపటేల్గూడ పరిధిలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఎదుగుదలకు, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో మంచి ప్రావీణ్యాన్ని సాధించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ నెల 29 వరకు నిర్వహించే ఈ క్రీడల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, లాంగ్జంప్, హై జంప్, రన్నింగ్, షార్ట్పుట్ తదితర పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సంస్థ ఏజీఓ లక్ష్మయ్య, జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఆశన్న, హైదరాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ ఆధిత్యవర్మ, జిల్లా కో ఆర్డినేటర్ వెంకట్రావు, ఆయా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment