రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ గంజాయి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ గంజాయి

Published Sun, Oct 20 2024 7:10 AM | Last Updated on Sun, Oct 20 2024 7:10 AM

రోడ్డ

రామాయంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. పోలీసుల కథనం మేరకు.. రామాయపేటంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ కారు ప్రమాదవవశాత్తు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే కారు బోల్తా పడిన విషయమై స్థానికుల ద్వారా పోలీసులు ఘటనా స్థలి వద్దకు వెళ్లగా అక్కడ ఎవరూ లేదు. కారును పరిశీలించగా, డిక్కీలో దాచి ఉంచిన 32 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ప్రమాద సమయంలో కారులో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైనవారు తప్పించుకుపోయారు. ఎస్‌ఐ బాల్‌రాజు, వెంటనే క్లూస్‌టీంతోపాటు తహసీల్‌ కార్యాలయం నుంచి ఆర్‌ఐని పిలిపించి పంచనామా నిర్వహించి అక్కడే తూకం వేశారు. మొత్తం 32 ప్యాకెట్లలో 87 కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. కారు నంబర్‌ అసలుది కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ ప్యాకెట్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ వెంకట్‌ రాజాగౌడ్‌ వాటిని పరిశీలించారు. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

87 కిలోల ప్యాకెట్లు స్వాధీనం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

వాహనాన్ని వదిలి

పారిపోయిన నిందితులు

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ గంజాయి1
1/1

రోడ్డు ప్రమాదంలో బయటపడ్డ గంజాయి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement