ఆదివారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
మద్దూరు(హుస్నాబాద్): వడ్లపై కప్పిన టార్ఫాలిన్లు
మిరుదొడ్డిలో శనివారం సాయంత్రం అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన వడ్లను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. అప్పటికే ధాన్యం తడిసి ముద్దయింది. చేసేదేమి లేక నీటిలో కొట్టుకుపోయిన ధాన్యపు రాశులను ఎత్తిపోసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఆ మేరకు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ఇక మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోశారు. పొద్దంతా ఎండకు ఎండిన వడ్లు.. శనివారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో టార్ఫాలిన్ పట్టాలను కప్పి పంటను రక్షించుకున్నారు.
– మిరుదొడ్డి(దుబ్బాక), మద్దూరు(హుస్నాబాద్)
Comments
Please login to add a commentAdd a comment