పునరావాసం కల్పించండి
చిన్నకోడూరు(సిద్దిపేట): ‘అంతగిరి రిజర్వాయర్తో ఇళ్లలోకి నీరు వస్తోంది. అదనపు టీఎంసీ నిర్మాణం కోసం చేపట్టే బ్లాస్టింగ్లతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. గ్రామంలో ఉండలేకపోతున్నాం’ అని మండల పరిధిలోని చెలుకలపల్లి గ్రామస్తులు బుధవారం పంప్ హౌస్ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామానికి ఒక వైపు అంతగిరి రిజర్వాయర్ వల్ల ఇళ్లలోకి నీళ్లు, విషకీటకాలు వస్తున్నాయన్నారు. గ్రామానికి రావడానికి సరైన రోడ్డు మార్గం లేదని, గుంతల రోడ్డుతో అవస్థలు పడుతున్నామన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యన్నారు. మాకు ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధికార ప్రతినిధి సాయికిరణ్, నాయకులు అరుణ్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. విషయం ఉన్నతాధికారులకు తెలిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంలో ఉండలేకపోతున్నాం
చెలుకలపల్లి వాసుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment