● టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో
చేరిన గ్రామస్తులు
కందుకూరు: టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు సొంత గ్రామస్తులే షాక్ ఇచ్చారు. బడేవారిపాళేనికి చెందిన పలువురు తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటూరి సురేష్, పొడపాటి ప్రేమ్చంద్, గొట్టిపాటి కొండయ్య, నల్లూరి వెంకటేశ్వర్లు, పొడపాటి విష్ణు, కొల్లూరి రమేష్, కొల్లూరి లక్ష్మి, నరసింహం తదితరులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలానికి ఇది నిదర్శనమని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని బుర్రా దీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి ఆధిక్యం వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇంటూరి హరిబాబు, నలమోతు చంద్రమౌళి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.