విద్యార్థులు రోజూ బడికి వెళ్లాలంటే అహ్లాదకరమైన వాతావరణం, అన్ని మౌలిక సౌకర్యాలుండాలి. అందుకు తగినట్లే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులు కలలు కనే రోజుల నుంచి మా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే రోజులు ప్రస్తుతం వచ్చాయి.
● నాడు–నేడు ఫేజ్ –2 కింద కొత్త ఏసీఆర్లు, అంగన్వాడీ కేంద్రాలు, మరమ్మతులు, పునరుద్ధరణ, 47 పాఠశాలల కోసం రూ.31 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోంది. వీటితో పాటు 101 అదనపు తరగతి గదులు కూడా రూఫ్ స్లాబ్ పూర్తి చేయడం జరిగింది.