ఫుట్‌బాల్‌ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు

Published Fri, Sep 27 2024 12:54 AM | Last Updated on Fri, Sep 27 2024 12:54 AM

ఫుట్‌బాల్‌ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు

హిందూపురం టౌన్‌: రాష్ట్రస్థాయి సీనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ రన్నరప్‌గా జిల్లా జట్టు నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం, ఏపీ ఫుట్‌బాల్‌ సంఘం (ఏపీఎఫ్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో కానూరులోని అనుమోలు ప్రభాకర్‌ ఫ్లే ఫీల్డ్‌లో మూడురోజులపాటు అత్యంత రసవత్తరంగా జరిగిన ఈ పోటీల్లో 12 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. గురువారం తొలి సెమీ ఫైనల్‌లో కర్నూలుతో తలపడగా 0–0తో మ్యాచ్‌ డ్రా అయింది. పెనాల్టీ కిక్స్‌లో 5–4 తేడాతో కర్నూలుపై జిల్లా జట్టు విజయం సాధించింది. అనంతరం అనంతపురం జిల్లా జట్టుతో ఫైనల్‌లో తలపడిన శ్రీ సత్యసాయి జిల్లా జట్టు తలపడింది. 4–0తో ఓడిపోవడంతో రన్నరప్‌గా నిలిచింది. అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌ పోటీలను ఏపీఎఫ్‌ఏ కార్యదర్శి డానియేల్‌ ప్రదీప్‌ పర్యవేక్షించారు. విజేతలకు అనుమోలు ప్రభాకర్‌, కె.బాలకృష్ణ, ఏపీఎఫ్‌ఏ ఉపాధ్యక్షులు ముని శ్రీనివాసరావు, కోశాధికారి విజయ్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షకార్యదర్శులు శేషగిరిరావు, చక్రవర్తి ట్రోఫీలు అందజేసి అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement