ఫీజుల భారం తొలగించండి
టెక్కలి: డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫీజుల భారం లేకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు యు.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన నిధులు వచ్చే వరకు ఎటువంటి ఫీజులు చెల్లింపులు లేకుండా చూడాలని, స్పెషల్ ఫీజులను వసూలు చేయరాదని, కళాశాలల్లో విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు బి.హరి, డి.చందు, బి.హరీష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment