కబ్జా భూముల పరిశీలన
కోదాడ: కోదాడ పట్టణ శివారులోని తమ్మరబండపాలెం వద్ద ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను బుధవారం రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనవైఖరి ‘సాక్షి’ బుధవారం ‘ఫైల్ను బుట్టదాఖలు చేశారా’ శీర్షికన ప్రచురించిన ప్రత్యేకంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ భూమి విషయంపై తనకు సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో కోదాడ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది తమ్మరబండపాలెం వద్ద ఉన్న సర్వే నంబర్ 39 భూములను పరిశీలించారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. గతంలో అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి నివేదికను రూపొందించిన తరువాత మళ్లీ సర్వే చేస్తామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment