వంద చోట్ల పార్క్‌తో కూడిన గ్రంథాలయాలు | - | Sakshi
Sakshi News home page

వంద చోట్ల పార్క్‌తో కూడిన గ్రంథాలయాలు

Published Sat, Oct 19 2024 12:48 AM | Last Updated on Sat, Oct 19 2024 12:48 AM

వంద చోట్ల పార్క్‌తో కూడిన గ్రంథాలయాలు

విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌

తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాంతాల్లో పార్క్‌ తో కూడిన గ్రంఽఽథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సుమారు రూ.కోటి వ్యయంతో పా ర్క్‌, లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తయిన క్రమంలో శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రభుశంకర్‌ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేష్‌, విశిష్ట అతిథిగా మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్‌ హాజరయ్యారు. అనంతరం వారు పార్క్‌ను లైబ్రరీని పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి మంత్రి అన్బిల్‌ మహేష్‌ రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు. అనంతరం మంత్రి అన్బిల్‌మహేష్‌ మీడియాతో మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గ్రంథాలయాలను నిర్మించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి గ్రంథాలయంలోనూ కనీసం వంద మంది, పార్క్‌లో 50 మంది కూర్చుని చదువుకునేలా ని ర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 226 నియోజకవర్గాలో ఉన్న పాఠశాలలను తనిఖీ చేసి, అక్కడి సమస్యలను పరిస్కరిస్తున్నామని చెప్పారు. అనంతరం కుత్తంబాక్కంలో రూ.63.15 లక్షల వ్యయంతో నిర్మించిన మరో గ్రంథాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్‌, తిరుత్తణి చంద్రన్‌, గుమ్మిడిపూండి టీజే గోవిందరాజన్‌, పూందమల్లి కృష్ణస్వామి, పొన్నేరి దురైచంద్రశేఖర్‌, ఎంపీ శశికాంత్‌సెంథిల్‌, డీఆర్వో రాజ్‌కుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకుమార్‌, ఉపాధ్యాయ సంఘం నేతలు దాస్‌, అరుణన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement