శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్‌ | Airasia Flight Emergency Landing At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్‌

Published Sun, Mar 16 2025 10:00 AM | Last Updated on Sun, Mar 16 2025 10:50 AM

Airasia Flight Emergency Landing At Shamshabad Airport

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెనీ ల్యాండింగ్‌ అయ్యింది. కౌలాలంపూర్‌ ఎయిర్‌ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులకు పైలట్‌ సమాచారం ఇచ్చారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులు ఫైట్ ల్యాండింగ్‌ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు.

ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమానాన్ని డౌన్‌ చేశాడు. అయితే అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా.. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది.  పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement