Emergency
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్.. విమానం ఎమర్జెనీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెనీ ల్యాండింగ్ అయ్యింది. కౌలాలంపూర్ ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఏటీసీ అధికారులకు పైలట్ సమాచారం ఇచ్చారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.వారం క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా విశాఖపట్నం ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టులు ఫైట్ ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు.ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమానాన్ని డౌన్ చేశాడు. అయితే అప్పటికే రన్వేపై టేకాఫ్ తీసుకోవడానికి మరో విమానం రెడీగా ఉండగా.. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా' రాబోతున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రామం రాఘవం, ఏజెంట్, రేఖాచిత్రం, వనవాస్, పొన్ మ్యాన్ తదితర చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు కొత్త మూవీస్ కూడా వచ్చే అవకాశముంది.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (మార్చి 14న)సన్ నెక్స్ట్రామం రాఘవం - తెలుగు సినిమాసోనీ లివ్ఏజెంట్ - తెలుగు మూవీఆహారేఖాచిత్రం - తెలుగు సినిమాసీ సా - తమిళ మూవీఅమెజాన్ ప్రైమ్బీ హ్యాపీ - హిందీ సినిమాఒరు జాతి జాతకమ్ - మలయాళ మూవీనెట్ ఫ్లిక్స్ద ఎలక్ట్రిక్ స్టేట్ - ఇంగ్లీష్ మూవీకర్స్ ఆఫ్ ద సెవెన్ సీస్ - ఇండోనేసియన్ సినిమాఆడ్రే - ఇంగ్లీష్ మూవీఎమర్జెన్సీ - హిందీ సినిమాఆజాద్ - హిందీ మూవీలవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ సీజన్ 2 - స్వీడిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆడాలసెన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5వనవాస్ - హిందీ మూవీహాట్ స్టార్పొన్ మ్యాన్ - మలయాళ సినిమామోనా 2 - ఇంగ్లీష్ చిత్రంఆచారీ బా - హిందీ మూవీబుక్ మై షోమెర్సీ కిల్లింగ్ - తెలుగు సినిమాద సీడ్ ఆఫ్ సేక్రెడ్ ఫిగ్ - పెర్షియన్ మూవీకంపానియన్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్డోప్ థీప్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
వీడియో: న్యూయార్క్లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్చిర్చు అంటుకుంది. ఎత్తుపడుతున్న మంటల కారణంగా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్లోని హోంప్టన్స్లో ఈ మంటలు చెలరేగాయి. హోంప్టన్స్లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మోరిచెస్, ఈస్ట్పోర్టు, వెస్ట్ హోంప్టన్స్తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో, ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్లో 50 శాతం అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు.BREAKING: New York Governor Kathy Hochul has declared a state of emergency as wildfires continue to spread across New York. pic.twitter.com/gQJsHAS3tU— The General (@GeneralMCNews) March 8, 2025కార్చిర్చు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. అయితే, ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. 🚨Evacuations ordered as multiple wildfires erupt near Long Island, New York pic.twitter.com/51rH3AbjNE— H. Gökhan Güleç (@gokhangulec) March 9, 2025 -
కంగనా రనౌత్ ఎమర్జన్సీ.. చెత్తగా తీశారన్న ప్రముఖ కన్నడ నటి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్పై ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కంగనా నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పోలుస్తూ మాట్లాడారు. ఎమర్జన్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు వచ్చినప్పటికీ.. ఆ సినిమా నిర్మించిన తీరు బాగాలేదని ఆమె అన్నారు. కంగనా విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి అని కొనియాడింది. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య కామెంట్స్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.రమ్య మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ చిత్రం చెత్తగా నిర్మించారు. కంగనా రనౌత్ చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆ సినిమాతో కంగనాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా చెడుగా తీయడం వల్లే ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో కంగనా మణికర్ణికను కూడా నిర్మించింది ఆ మూవీ కంటెంట్ బాగుంది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.' అని తెలిపింది. కాగా.. కంగనా రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఎమర్జన్సీ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. -
వాళ్లు.. విందులు, వినోదాల్లో.. వీళ్లు.. వీధుల్లో, విధుల్లో..
రిషి.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. ప్రస్తుతం కోనసీమ కోళ్ల పందేల్లో బిజీబిజీగా ఉన్నాడు.. పండుగకు మూడ్రోజుల ముందే ఊరొచ్చేశాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రవీణ్.. ప్రభుత్వ ఉద్యోగి.. సొంతూరు జనగామ. భోగి ముందు రోజున వచ్చాడు. చెడ్డీ దోస్తులతో, బంధువులతో సంబరాలు చేసుకుంటున్నాడు.కిశోర్.. ప్రైవేటు ఉద్యోగి.. తూర్పుగోదావరి జిల్లా.. సేమ్ అందరిలాగే సంక్రాంతి వేడుకల్లో తలమునకలై ఉన్నాడు..ఇక్కడా కొందరు తలమునకలై ఉన్నారు.. విందులు, వినోదాల్లో కాదు.. వీధుల్లో.. విధులను నిర్వహిస్తూ తలమునకలై ఉన్నారు. నాన్నెప్పుడొస్తడా అంటూ ఇంట్లో ఎదురుచూస్తున్న పిల్లలను తలచుకుంటూ.. ఊర్లో ఉన్న అమ్మాబాపులను యాది చేసుకుంటూ.. పండుగ రోజున కూడా సెలవు తీసుకోని మన సంరక్షకులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అది ఉప్పల్లో ట్రాఫిక్ను నియంత్రిస్తున్న ఓ పోలీసు కావచ్చు.. గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్న ఒక వైద్యుడు కావచ్చు.. పతంగులు చిక్కుకోవడం వల్ల ఫీడర్లో అంతరాయాలు తలెత్తి.. మనకు కరెంట్ పోకుండా చూస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి కావచ్చు.. లేదా.. ఆర్టీసీ, వాటర్ బోర్డు, శానిటరీ సిబ్బంది, టీవీ రిపోర్టర్లు, అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు, మాల్స్లో పనిచేసేవారు, స్విగ్గీ, జొమాటో బాయ్స్.. వీళ్లెవరైనా కావచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ‘మన కోసం’ అలుపెరుగని వీరుల్లా పనిచేస్తూనే ఉన్నారు.పండుగ రోజు.. కరెంట్ పోకుండా..సంక్రాంతి పండుగ అంటే పతంగులు. ఎగరేసేప్పుడు గాలివేగానికి దారం తెగి పతంగులు అనేక చోట్ల విద్యుత్ లైన్ల మధ్య చిక్కుకుంటాయి. ఇదే సమయంలో పలు ఫీడర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వాటిని వెంటనే సరిచేసి సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రీన్లాండ్స్ డివిజన్ సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ)విభాగం ఏడీఈ చరణ్సింగ్ నేతృత్వంలోని బృందం ఫ్యూజ్ ఆఫ్ కాల్ సహా ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూం నుంచి వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు లైన్ల మధ్య చిక్కుకున్న గాలిపటాలను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది.ఇంట్లో ఉండాలంటారు.. నాకు వీలవదు..నాకు పండుగ పూట ఇంట్లో ఉండాలని ఉంటుంది. కానీ విధి నిర్వహణ తప్పదు. నాన్న వస్తాడంటూ ఎదురు చూడటం పిల్లలకు అలవాటైపోయింది. ఇంట్లో ఉండండి అని చాలా సార్లు అడిగారు. నాకు వీలవ్వదుగా.. ఈ మధ్య వాళ్లు అమ్మమ్మ వారింటికి వెళ్లిపోతున్నారు. నేను ఇలా డ్యూటీకి వచ్చేస్తున్నాను. – ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డిఈ సంతృప్తి ముందు ఏదీ సాటి రాదు..సొంతూరు వెళ్లి కుటుంబం, బంధువులతో సంక్రాంతి పండుగను జరుపుకోలేకపోతున్నామనే బాధ కొంత ఉంటుంది. అయితే విధి నిర్వహణలో రోగులకు సేవలు అందించడంలో ఉన్న సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. రోగులకు సేవలు అందించడం గర్వంగా ఉంది.– డాక్టర్ పీవీ శ్రీనివాసరావు, గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్మేం పనులు చేయకపోతే.. రోడ్లు అధ్వానమే.. మాది వరంగల్ దగ్గరి మైలారం. పండుగలప్పుడు మేం పనులు చెయ్యకపోతే రోడ్లు అధ్వానంగా అవుతయి. అప్పుడెలా? అందుకే మాకు పండుగలప్పుడు సెలవులుండవు. ఊరికి వెళ్లడం కుదరదు. –జి.బాబమ్మ, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలుఇలాంటి సంతృప్తి పోలీసు శాఖలోనే..పోలీసు ఉద్యోగంలోకి వచ్చి 30 ఏళ్లవుతోంది. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ఎన్నో పండుగల సమయంలో విధుల్లో ఉన్నాను. విధినిర్వహణలో ఎంతో మంది మమ్మల్ని కలిసి శుభాకాంక్షలు తెలుపు తారు. ఇలాంటి సంతృప్తి పోలీసుశాఖలోనే దొరుకుతుంది.తర్వాతి రోజు ఇంట్లో పండుగ జరుపుకొంటాం.– బి.యాదగిరి, హెడ్ కానిస్టేబుల్, బచ్చన్నపేట, జనగామ జిల్లా -
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్చిచ్చు చల్లారడంలేదు. ఈ కార్చిచ్చుకు ప్రభావితమైన పదివేల మందిలో నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోనికి రావడంలేదు. గడచిన 24 గంటల్లో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇళ్లను విడిచిపెట్టిన పదివేల మంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కాలిఫోర్నియా(California) ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు.అలాగే అనుభవం ఉన్న రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు. కాలిఫోర్నియా నగరం చుట్టూ చెలరేగిన మంటల కారణంగా వెయ్యికిపైగా భవనాలు కాలిబూడిదయ్యాయి. పదివేల మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్నంతా కమ్మేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.వందల మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వలుహాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ నేలమట్టమయ్యింది. బలమైన గాలులు మంటలను మరింతగా వ్యాపింపజేశాయి. వందల మీటర్ల మేరకు నిప్పురవ్వలు ఎగిరి పడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోనీ మర్రోన్ తెలిపిన వివరాల ప్రకారం మంటలు విస్తరిస్తున్న తీరు అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గక అగ్నికీలలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.చుట్టుపక్కల ప్రాంతాలకు అగ్నికీలలుపసిఫిక్ పాలిసాడ్స్లో చెలరేగిన మంటలు బుధవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 16 వేల ఎకరాలను దగ్ధం చేశాయి. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదాల్లో తొలుత ఇద్దరు మరణించారని, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సురక్షిత ప్రాంతాలకు నటులుహాలీవుడ్ ఈవెంట్లలో నిత్యం కళకళలాడే లాస్ ఏంజిల్స్(Los Angeles) లో పమేలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రముఖ గాయని, నటి మాండీ మూర్ ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో చాట్ చేస్తూ అల్టాడెనాలో వ్యాపిస్తున్న మంటలను చూసి తాను తన పిల్లలు, పెంపుడు జంతువులతో పాటు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లానని తెలిపారు. ఎమ్మీ విజేత, నటుడు జేమ్స్ వుడ్స్ తన ఇంటి సమీపంలోని చెట్లు దహనవడాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా చూపించారు. తాను తన ఇంటిని ఖాళీ చేశానని తెలిపారు.ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణ వాయిదా‘స్టార్ వార్స్’ స్టార్ మార్క్ హామిల్ తన ఇంటిని మంటలు చుట్టుముట్టే పరిస్థితులు ఉండటంతో తన భార్య, పెంపుడు కుక్కతోపాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లానని తెలిపారు. ఆస్కార్ విజేత జామీ లీ కర్టిస్ కూడా అయిష్టంగా తన ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. కాగా అగ్నిప్రమాదాల బారిన పడిన అకాడమీ సభ్యులు తమ బ్యాలెట్లను వేయడానికి మరింత సమయం ఇచ్చారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు -
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. -
త్వరలో ద.కొరియా అధ్యక్షుడి అరెస్టు..?
సియోల్:ఎమర్జెన్సీ వివాదం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను వెంటాడుతోంది. ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యోల్కు అరెస్టు ముప్పు పొంచి ఉంది. యోల్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరినట్లు సమాచారం.కోర్టు అంగీకరిస్తే త్వరలోనే యోల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యోల్ ఇటీవల దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు,రక్షణ మంత్రిత్వశాఖ,అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ కోరారని సమాచారం. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్షవిధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష అధికారాలను, ప్రధానమంత్రికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ కోర్టుకు పంపుతుంది. యూన్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది.ఇదీ చదవండి: నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
దక్షిణ కొరియాలో ట్విస్ట్.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు
సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్ను నియమించారు. South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024 -
దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ అంశం.. మాజీ రక్షణ మంత్రి అరెస్ట్
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటూ సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయన్ను ప్రశ్నించిన అధికారులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కిమ్ తనకుతానుగానే సియోల్ విచారణాధికారి కార్యాలయానికి వెళ్లారని, ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్ట్ చేశారని మీడియా అంటోంది. కిమ్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ తనిఖీలు చేపట్టారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ విధింపునకు దారి తీసిన పరిస్థితులపై కిమ్పై విచారణ కోసం 62 మంది సభ్యుల దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ ప్రాసిక్యూటర్ పార్క్ సె–హ్యూన్ వెల్లడించారు. గత వారం స్వల్ప కాల ఎమర్జెన్సీని, ఆ తర్వాత పార్లమెంట్ తొలగించడం తెలిసిందే. ఈ పరిణామానికి సంబంధించిన తొలి అరెస్ట్ ఇది. అధ్యక్షుడు యూన్పై శనివారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పక్ష సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. అయినప్పటికీ, త్వరలోనే మరోసారి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం పరిణామాలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న కిమ్ మంత్రి పదవికి గురువారమే రాజీనామా చేశారు.ఇదీ చదవండి: దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఉపశమనం -
ద.కొరియా అధ్యక్షుడికి ఉపశమనం
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు పదవీగండం కొద్దిలో తప్పింది. ఎమర్జెన్సీ(మార్షల్ లా) విధిస్తూ నిర్ణయం తీసుకుని దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు అంటే కనీసం 200 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. శనివారం చేపట్టిన ఓటింగ్లో అభిశంసనను సమర్థిస్తూ కేవలం 192 ఓట్లు పడ్డాయి. యూన్కు చెందిన పీపుల్స్ పవర్ పార్టీ ఓటింగ్ను బహిష్కరించింది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో మరోమారు అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని విపక్ష పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అంతకుముందు యూన్ మార్షల్ లా విధించడం తప్పేనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. -
నన్ను క్షమించండి: సౌత్కొరియా అధ్యక్షుడు
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం. ఇదీ చదవండి: నియంతకు పరాభవం -
అభిశంసనలు.. ఆత్మహత్య... జైలు శిక్షలు!
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!విద్యార్థుల తిరుగుబాటు దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.సైనిక తిరుగుబాటు మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.రాజద్రోహం, జైలు గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.అవినీతి, ఆత్మహత్య 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు. 15 ఏళ్ల జైలు శిక్ష 2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు! అధ్యక్షురాలికి అభిశంసన, జైలు దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణ కొరియాలో బిగ్ ట్విస్ట్.. ఎమర్జెన్సీ ఉపసంహరణ
సియోల్: దక్షిణ కొరియాలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమర్జెన్సీ విధించిన కొన్ని గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నట్టు మరో ప్రకటన చేశారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దీంతో, ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు గంట్లలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.స్థానిక కాలమానం ప్రకారం తెల్లావారుజామున 4:30 గంటలను అధ్యక్షుడు యూన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుండి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము. మార్షల్ లా కార్యకలాపాల కోసం జాతీయ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. కేబినెట్ సమావేశం ద్వారా ఎమర్జెన్సీని ఎత్తివేస్తాము అని ప్రకటించారు.South Korean President Yoon Suk Yeol said he will rescind his martial law decree, giving in to the parliament’s opposition just hours after his dramatic move imposing it that shook markets and surprised other world leaders.Listen to the story or get the full story in the 1st… pic.twitter.com/aKAvMczxqD— Bangkok Post (@BangkokPostNews) December 4, 2024అంతకుముందు.. అధ్యక్షుడి నిర్ణయాన్ని ఖండిస్తూ జాతీయ అసెంబ్లీ అర్ధరాత్రి సెషన్లో దక్షిణ కొరియా ఎంపీలు మార్షల్ లా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఓటు వేశారు. 300 మంది చట్ట సభ్యుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు 190 మంది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలో, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని డెమోక్రటిక్ పార్టీ సవాల్ చేసింది. మరోవైపు.. దక్షిణ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్న అమెరికా పేర్కొంది. ఎమర్జెన్సీ విధించిన అనంతరం.. దకక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేతలను ఆర్మీ.. అరెస్ట్ ప్రయత్నం చేసింది. దీంతో, తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇక, దాదాపు ఐదు దశాబ్దాలలో దక్షిణ కొరియా ఎమర్జన్సీని విధించడం ఇదే మొదటిసారి. కొరియాలో చివరిసారిగా 1980లో ఎమర్జెన్సీ లాను ప్రయోగించారు.🚨BREAKING - The moment South Korean Special Forces stormed the interior of the Parliament building pic.twitter.com/EhGEu2xzPW— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) December 4, 2024 ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. టీవీ చానెల్ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే పని చేస్తున్నాయవి. గత కొంతకాలంగా పార్లమెంట్ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం అని ప్రకటించారు.SHOCK VIDEO: South Korean Army Blocks National Assembly After Martial Law Declared By Yoon Suk Yeol pic.twitter.com/4krlonyiQ9— Alex Dickerson (@wangzai266687) December 4, 2024పార్లమెంట్ వద్ద ఉద్రిక్తతసైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. 2022లో పీపుల్ పవర్ పార్టీ తరఫున యూన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. -
తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్’ వేదికగా అన్నారు. ‘‘పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’అని పేర్కొన్నారు.పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..ప్రజాస్వామిక తెలంగాణలో..మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024 -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టు ఎయిరిండియా విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6— ANI (@ANI) October 11, 2024 There is no need to panic. Air India Express flight IX 613 is safely defueling by circling the airport, and once the fuel reaches the required level, a safe landing will be made. This is a standard safety procedure. #airindiaexpress #airindia #trichy #trichyairport pic.twitter.com/P8PDzhSfXJ— IOTA INFO (@iota_info) October 11, 2024అంతకు ముందు.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు. మిగతా విమానాలన్నీ ఇతర ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బందని ఏర్పాటు చేశారు.విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుచ్చి గగనతలంపై తిరుగుతున్న విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ వైఫల్యం గురించి పైలట్ తిరుచ్చి ఎయిర్ స్టేషన్ను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు.#WATCH | Tamil Nadu: Air India flight from Trichy to Sharjah faced a technical problem (Hydraulic failure) and is rounding in air space to decrease the fuel before landing at Trichy airport. More than 20 Ambulances and fire tenders are placed at the airport to make sure no big… pic.twitter.com/rEiF6mSZz2— ANI (@ANI) October 11, 2024 -
దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్పై కంగన మండిపాటు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్ నటి, మండి లోక్సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.భారత్లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇదొక భారీ బడ్జెట్ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్పై ఉంది’’ అని ఆమె చెప్పారు. -
మరోసారి వాయిదా
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
Emergency: కంగనాకు బాంబే హైకోర్టు షాక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ) సినిమాకు ఎదురుదెబ్బ తగలింది. ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)ని ఆదేశించలేమని బాంబే హైకోర్టు బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలాతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ చిత్ర సహ నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారనను 19వ తేదీకి వాయిదా వేసింది.కాగా ఎమర్జెన్సీ చిత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కాలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. ముఖ్యంగా 1975లో ఆమె విధంచిన ఎమర్జెన్సీ కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగనా నటించడమే కాకుండా, దర్శకత్వం, నిర్మతగానూ వ్యవహరించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమాను వ్యతిరేకిస్తూ అనేక సిక్కు సంస్థలు ఆందోళనలు చేయడంతో వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎమర్జెన్సీ విడుదలను నిలిపివేయాలంటూ సిక్కు సంస్థలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సిక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి వ్యతిరేకంగా జబల్పూర్ హైకోర్టులో(మధ్యప్రదేశ్) పిటిషన్ దాఖలు చేసి, దాని ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరారు. దానిని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ‘ఎమర్జెన్సీ’ని విడుదల చేయాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంగనా, చిత్ర సహ నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. . ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది. -
'అలాంటి వారు ముందుగా సినిమా చూడండి'.. ఎమర్జన్సీపై ఆదిపురుష్ రచయిత!
ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమర్జన్సీ చిత్రానికి ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీకి సిక్కు కమ్యూనిటీ ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ మూవీ రిలీజ్ను అడ్డుకోవద్దని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాపై కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చంపింది నిజం కాదా? అని వారిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదా? అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పంజాబ్లోని అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్ సమయంలో మరణించిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే గురించి రచయిత ప్రస్తావించారు. ఈ చిత్రంలో జర్నైల్ సింగ్ను ఉగ్రవాదిలా చూపిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన అతను ఉగ్రవాది కాదా? అని ముంతశిర్ ప్రశ్నించారు. దయచేసిన భింద్రావాలేను హీరోగా గుర్తించవద్దని సిక్కు సమాజాన్ని కోరాడు.ఎమర్జన్సీ కంటెంట్పై అభ్యంతరం చెప్పే ముందు సినిమాను చూడమని వారిని కోరారు. ధైర్యమైన సిక్కు సమాజం సినిమా విడుదలకు భయపడుతుందని తాను నమ్మడం లేదన్నారు. వారు భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. అలాంటి ధైర్యం కలిగిన వారు కేవలం సినిమాకే భయపడుతారంటే ఎవరు నమ్ముతారని మనోజ్ అన్నారు. కాగా.. ఎమర్జన్సీ మూవీ రిలీజ్ను అడ్డుకోవాలంటూ సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని హితవు పలికారు. ఇది పూర్తిగా భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమేనని తెలిపారు. సినిమాపై నిరసనలు తెలిపే వారు.. ముందుగా థియేటర్లలో విడుదలై చూసిన తర్వాత.. అందులో తప్పులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా రనౌత్కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు: కంగనా రనౌత్
‘‘నేనెంతో ఆత్మగౌరవంతో ఈ సినిమాని రూపొందించాను. కత్తెర లేని వెర్షన్నే రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నాను. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అన్కట్ వెర్షన్నే విడుదల చేస్తాను’’ అని కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. గత ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.ఈ నెల 6న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది ఘోరమైన పరిస్థితి. మన దేశం విషయంలో చాలా నిరాశగా ఉన్నాను. ఓటీటీలో హింస, అశ్లీలం వంటివి చూపించినా అభ్యంతరం చెప్పరు. ఓటీటీకి అంత స్వేచ్ఛ ఉంది.నా సినిమా విషయంలో ఇందిరా గాంధీ హత్యను చూపించకూడదనీ, భింద్రన్వాలేను చూపించవద్దనీ, పంజాబ్ అల్లర్లను చూపించవద్దనే ఒత్తిడి ఉంది. ఇవేవీ చూపించొద్దంటే ఇక చూపించడానికి ఏం మిగిలి ఉంటుందో? కొన్ని సినిమాలు రూపొందించడానికి కొందరికి మాత్రమే సెన్సార్షిప్ ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు. -
వారంలో రెండో సారి.. జేపీ నడ్డాతో కంగనా భేటీ
రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఏం చర్చ జరింగిందన్న అంశంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వారం ప్రారంభంలో కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. రైతుల నిరసనపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ ఖండించింది.అదే సమయంలో ఆమె స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) పేర్కొంది.ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కంగనా జేపీ నడ్డాతో భేటీ అవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.दिल्ली: जेपी नड्डा के आवास पहुंचीं कंगना रनौत, किसान आंदोलन पर कंगना ने बयान से बीजेपी पार्टी के नेता नाराज़ थे। जिसके चलते बीजेपी ने पार्टी लाइन से हटकर बयानबाजी न करने की नसीहत भी दी थी। #Delhi @JPNadda #KanganaTeam pic.twitter.com/9r6nxypRnx— Ashutosh Tripathi (@tripsashu) August 29, 2024 -
విజృంభిస్తున్న మంకీఫాక్స్..డబ్లుహెచ్ఓ మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ!
ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్ వేగంగ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిది కూడా. డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్I తో ప్రారంభమై.. క్లాడ్Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు. ఇది ఇంతవరకు లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు ప్రజల ప్రాణాలను కాపాడేలా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన కూడా అవసరమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. కాగా, ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత మంకీఫాక్స్ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
అన్నీ తానై.. కంగన 'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటి కంగన రనౌత్.. ప్రస్తుతం బీజేపీ తరఫున ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇప్పుడు ఈమె ఒకప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రని పోషిస్తూ ఓ సినిమా చేసింది. అదే 'ఎమర్జెన్సీ'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మూవీని రిలీజ్కి సిద్ధం చేశారు. సెప్టెంబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)ట్రైలర్ విషయానికొస్తే.. 1971లో మన దేశంలో జరిగిన ఎమర్జెన్సీ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ అంతా ఆసక్తిగా ఉంది. కంగన.. ఇందిరా గాంధీ, శ్రేయస్ తల్పడే.. వాజ్పేయి, అనుపమ్ ఖేర్.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రల్లో కనిపించారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!) -
శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్చేస్తే..!
అత్యవసర శస్త్ర చికిత్స చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ భయానక ఘటన యూఎస్లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..యూకేకి విశ్వవిద్యాలయ విద్యార్థి చార్లీ విన్సెంట్ యూఎస్లో న్యూ హాంప్షైర్లోని వేసవి శిబిరంలో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆరోజు అధిక సూర్యరశ్మీ అతని కాళపై పడటంతో కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి వడదెబ్బకు ురై ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ వైద్య పరీక్షలో అతడికి న్యూమోనియా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్ రావడం ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది. వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చిన పనిచేయడం ప్రారంభమయ్యింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. దీనిని కార్డియోమొగలీ అని పిలుస్తారని వైద్యులు అన్నారు. అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడిపోయారు. ఎందుకంటే.. ఇక్కడ ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు. అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకుని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఈ మేరకు అతడి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..ఒకానొక సమయంలో చార్లీ బతికే అవకాశాలు లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అతడు అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిదని అన్నారు. సదరు బాధితుడు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
Bangladesh: వర్శిటీ అధికారులతో పీఎం హసీనా భేటీ
బంగ్లాదేశ్లో విద్యార్థుల రిజర్వేషన్ ఆందోళలను అదుపుచేసేందుకు ఆ దేశ ప్రధానిషేక్ హసీనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. పీఎం హసీనా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వ్ చేసే కోటా వ్యవస్థను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో ఇటీవల పోలీసులు- విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలను చోటుచేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని సమావేశమయ్యారని పీఎంవో ప్రతినిధి తెలిపారు. శనివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.దీనిముందు పీఎం హసీనా వివిధ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతూ ఈ విషయంలో చర్చల కోసం ఎవరైనా తన వద్దకు రావచ్చని, విద్యార్థులు తమ తల్లిండ్రులను కూడా తీసుకుని రావచ్చన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని విద్యార్థి ఉద్యమ నేతలు మీడియాకు తెలిపారు. -
ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లోకి నెట్టారు.. కానీ: ఎమర్జెన్సీపై లాలూ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీపై శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేకమంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవరిని హింసించలేదని పేర్కొన్నారు.ఈ మేరకు లాలూ, జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టికల్ను ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు."అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను. నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర బీజేపీ మంత్రుల గురించి నాకు, నా సహచరులకు తెలియదు. వారి గురించి మేము అసలు వినలేదు.ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివారని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేదని విషయాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఖండించారు. -
స్పీకర్ అలా మాట్లాడాల్సింది కాదు: శరద్పవార్
ముంబై: ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. స్పీకర్ స్థాయికి తగినట్లు సభలో మాట్లాడలేదని విమర్శించారు. శనివారం(జూన్29) మీడియా సమావేశంలో పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. లోక్సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారన్నారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోందని, ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారని పవార్ ప్రశ్నించారు.లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఎన్నికను పవార్ స్వాగతించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. -
ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్సభ స్పీకర్గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.పరీక్షల విధానంలో సంస్కరణలున్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.‘‘లోక్సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి. ⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్గా మారనుంది. ⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి. ⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి. ⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది. ⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది. ⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి. ⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు. ⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది. ⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు. ⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక చర్యలుంటాయి. -
ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు.. స్పీకర్ను కలిసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ోక్సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తాజాగా పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ సమా బీజేపీ నేతలంతా ఆ కాలం ప్రజలకు చీకటి రోజులుగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,, లోక్సభ స్పీకర్ సైతం ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు.అయితే దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ సభ్యులు గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎమర్జెన్సీని చీకటి రోజులుగా స్పీకర్ పార్లమెంటులో ప్రస్తావించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓం బిర్లా చర్యలు పార్లమెంట్ విశ్వసనీయతను ప్రభావితం చేసే తీవ్రమైన విషయంగా కాంగ్రెస్పేర్కొంది పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఓ ప్రటకటన విడుదల చేసింది కాంగ్రెస్. "26 జూన్ 2024న మీరు లోక్సభ స్పీకర్గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సమయంలో సభలో సాధారణ స్నేహభావం ఏర్పడింది. అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. కానీ తీరువాత సభా వతి నుంచి ఎమర్జెన్సీ ప్రకటన రావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో అసహజమైనది. కొత్తగా ఎన్నుకైన స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. పార్లమెంట్ పనితీరు గురించి చాలా విషయాలు చర్చించారు. దీనిని స్పీకర్ మమాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఓం బిర్లాను సూచించారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రస్తావన అని, తప్పకుండా ఖండిచాల్సిందని కేసీ వేణుగోపాల్ పేరుతో ప్రకటన విడుదలైంది.ఇందిరా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని దూషిస్తూ తీర్మానాన్ని చదివిన ఓం బిర్లా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. -
సెప్టెంబరులో ఎమర్జెన్సీ
భారతదేశంలో ఏర్పడ్డ ఎమర్జెన్సీ (25 జూన్ 1975 – 21 మార్చి 1977) పరిస్థితుల ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో భారతదేశ దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, అశోక్ చబ్రా, మహిమా చౌదరి ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను కంగనా రనౌత్, పి. రేణు నిర్మించారు.ఈ సినిమాను తొలుత గత నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 14న రిలీజ్కు ప్లాన్ చేశారు. ఆ తేదీకి కూడా రాలేదు. తాజాగా ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘‘భారతదేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడి జూన్ 25 నాటికి 49 సంవత్సరాలు పూర్తయి, 50వ ఏడాదిలోకి అడుగుపెట్టాం. నాటి పరిస్థితుల నేపథ్యంలో తీసిన ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నాం. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని ఈ వివాదాస్పదమైన ఎపిసోడ్ను మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ట్రెండింగ్లోకి ఎమర్జెన్సీ.. 50 ఏళ్లు పూర్తి (ఫొటోలు)
-
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పదేళ్లపాటు మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి అమలుచేస్తే, గత పదేళ్లలో నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేశారని విమర్శించారు. మోదీ విధించిన అప్రకటిత అత్యవసర పరిస్థితికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయినప్పటికీ మోదీలో అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీక్ కావడంతో యువత నష్టపోయారని, ప్రధాని మోదీ కనీసం సానుభూతి తెలపడం లేదని తప్పుపట్టారు. బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై మాట్లాడడం లేదని ఆక్షేపించారు. -
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
ఎమర్జెన్సీ వాయిదా
భారతదేశంలో అమలు చేయబడిన ఎమర్జెన్సీ కాలం (1975 జూన్ 25–1977 మార్చి 21) నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది.హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం దేశంలో జరగుతున్న ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. దాంతో కంగనా రనౌత్ రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!
న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అత్యవసర సేవల కోసం ఏడాది పొడవున తెరచి ఉంటుందని పేర్కొంది. ఇది ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడానికి వారాంతాల్లో, ఇతర సెలవులతో సహా ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని భారత కాన్సులేట్ ప్రకటించింది. మే 10 నుంచి అమలులోకి వచ్చే అన్ని సెలవు దినాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మే 10, 2024 నుంచి సాధారణ ప్రజల అత్యవసర అవసరాలను తీర్చేందుకు అన్ని సెలవు దినాల్లో(శనివారం/ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలతో సహా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సులేట్ తెరిచి ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం అని, సాదారణ కాన్సులర్ సేవల కోసం కాదని తెలిపింది. అలాగే ఏదైనా అత్యవసర సేవ కోసం కాన్సులేట్కు వచ్చే ముందు అత్యవసర హెల్ప్లైన్ నంబర్: 1-917-815-7066కు కాల్ చేయాలని భారతీయ కాన్సులేట్ దరఖాస్తుదారులకు సూచించింది. ఈ సేవలు అవసరమైన డాక్యుమెంట్ల ఆవశక్యతకు సంబంధించి, అలాగే తదుపరి పని దినానికి వాయిదా వేయలేని అత్యవసర పనులు., వంటి వాటికి వర్తిస్తాయి. ముఖ్యంగా అత్యవసర వీసా, ఎమర్జెన్సీ సర్టిఫికేట్(అదే రోజు భారతదేశానికి ప్రయాణించడం కోసం) అదే రోజు పంపబడే మృతదేహాలను రవాణా చేయడం వంటి ప్రయాణ పత్రాల అత్యవసర అవసరాల కోసం మాత్రమే. దరఖాస్తుదారు నుంచి అత్యవసర సేవా రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అత్యవసర వీసా సేవలు కూడా ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ పేర్కొంది. 📣New announcement Consulate General of India, New York to remain open 365 days for emergency services.@binaysrikant76 @MEAIndia @IndianEmbassyUS @IndianDiplomacy @ANI @PIB_India @ITVGold @tvasianetwork @CPVIndia @Newsweek pic.twitter.com/1FFvgOxiFC— India in New York (@IndiainNewYork) May 10, 2024 (చదవండి: డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం) -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్సభ కాలం సాక్షిగా నిలిచింది... సాక్షి, నేషనల్ డెస్క్: నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. విపక్షాలు గుంపుగా వచ్చిన... ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్ బచావో’ నినాదమూ సూపర్హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది. విశేషాలు... ► ఐదో లోక్సభ ఎన్నికల పోలింగ్ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. ► 1952 నుంచి లోక్సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. ► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. ► 1971లో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్ పీచమణిచాయి. పాక్ ► ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. ► డిసెంబర్ 16న బంగ్లాదేశ్ అవతరించింది. ► 1974 మే 18న రాజస్తాన్లోని పోఖ్రాన్లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్ అవతరించింది. చెరగని మరక... ఎమర్జెన్సీ 1975 జూన్ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ప్రకటించారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్భద్రకు ఆయన కన్వీనర్గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
Liquor Case: సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను స్పెషల్ మెన్షన్ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్ శ్రేణుల్లో నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ చట్టవిరుద్ధం కాదు కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024 Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu — Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024 -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు. నాయకురాలిగా ఆమె విధానం.. 1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది. ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్గా ఏర్పరిచి పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టింది. అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి. (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
సౌత్ పాపులర్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం. కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్తో పాటు విజయ్సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్తోపాటు మెసేజ్లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్లు కూడా స్మార్ట్ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్లు వచ్చాయి. -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. . ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు. బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire. You can always count on Biden to tell a story that didn’t happened. “I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR — Collin Rugg (@CollinRugg) August 22, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్బెర్గ్కు పయనమైన ప్రధాని మోద -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..
అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. -
అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే.. మీ ఇష్టమున్నట్టు కాదు..
హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం -
ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates. — Narendra Modi (@narendramodi) June 25, 2023 భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. Torture , imprisonment, murder , stifling the voice of free press - 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR — Smriti Z Irani (@smritiirani) June 25, 2023 వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం -
చరిత్ర చెప్పడానికి రెడీ అవుతున్న రెండు సినిమాలు
డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ‘బాఘా జతిన్’, డైనమిక్ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్గా దేవ్ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్డేట్స్ ఈ విధంగా... అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది ‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్ అధికారి తాజా లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) బయోపిక్గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్’. ఈ చిత్రంలో బాఘా జతీన్గా నటించి, నిర్మించారు దేవ్ అధికారి. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, జతీంద్రనాథ్కి బాఘా జతీన్ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్ పేరు ‘భాఘా జతీన్’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో ‘భాఘా జతీన్’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్ 20న ‘భాఘా జతీన్’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్ అధికారి. భారత్ అంటే ఇందిరా...! ‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్స్తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా టీజర్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్ 25 తేదీతో టీజర్ ఆరంభమవుతుంది. ‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్ ఈ టీజర్ని షేర్ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఒదిగిపోయినట్లు ఆమె లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
ఎమర్జెన్సీ.. ఒక చీకటి యుగం
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్కీ బాత్ ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్లో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం నుంచి కచ్ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్పోర్ట్లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్ని ప్రకటించి కొలంబస్లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్పోర్ట్ తెరిచే ఉందని జాన్గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్పోర్ట్లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు. Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7 — CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023 (చదవండి: నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు) -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు రాహుల్ నానమ్మ(ఇందిరా గాంధీ) చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 356ని 150 సార్లు ప్రయోగించారన్నారు. అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది. (చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్పై సుప్రీం చీఫ్ జస్టిస్ మండిపాటు) -
కాలిఫోర్నియాలో వరదల బీభత్సం..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్
ఎడతెగని వర్షాల కారణంగా కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కొండ చరియలు విగిగిపడి చెట్లుకూలడం, హిమపాతం వెల్లువలా రావడం తదితర కారణాలతో రహాదారులన్ని తెగిపోయి నీళ్లతో దిగ్బంధమయ్యి. దీనికి తోడు సమీపంలోని పజారో నదిపై కట్ట తెగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. దీంతో అధ్యక్షుడు జోబైడెన్ అత్యవసర పరస్థితిని ప్రకటించారు. పజారో నది సమీపంలో సుమారు 17 వందల మందికి పైగా నివాసితులు ఉన్నారని, వారిలో చాలమంది లాటినో వ్యవసాయ కార్మికులే. ఇప్పటి వరకు అధికారులు ఆ నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 8 వేల మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈ పంజారో వ్యాలీ ప్రాంత స్ట్రాబెర్రీలు, యాపిల్స్, కాలీప్లవర్, బ్రోకలీ, ఆర్టిచోక్లను పండించే తీర ప్రాంతం. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ..సంఘటనా స్థలానికి చేరుకున్న డజన్ల కొద్ది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 96 మందిని రక్షించి కౌంటీ షెల్టర్లో ఉంచారు. ఈ వరదలు కారణంగా వేలాది మంది నిరాశ్రయులైనట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ఈ వరదల బీభత్సం కారణంగా కాలిపోర్నియా రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని, మళ్లీ యాథాస్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు పజరా నది సమీపంలోని ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు గవర్నర్ గావిన్ న్యూసోమ్ కార్యాలయం పేర్కొంది. అలాగే రోజలులు సియెర్రా నెవాడా, గోల్డ్ కంట్రీకి దక్షిణంగా ఉన్న ఫ్రెస్నో కౌంటీ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Mandatory Evacuation orders issued for the Community of #Pajaro due to a #LeveeBreak. Please heed evac warnings/orders. Pajaro River levee broke early this morning resulting in active flooding. #Evacuate if told. #TurnAroundDontDrown @Cal_OES @CaltransHQ @CAgovernor pic.twitter.com/tDttiTcaC0 — California Governor's Office of Emergency Services (@Cal_OES) March 11, 2023 (చదవండి: ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు.. కీలక పదవులు) -
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు! -
'దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. ఆయన చెప్పిందే వేదం..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. 'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు అధికారులు. అసోంలోని గువాహటి లోక్ప్రియా గోపినాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. త్రిపురలోని అగర్తలాకు వెళ్లున్న హోంమంత్రి అమిత్ షా విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. విమానం అత్యవసర ల్యాండింగ్ చేపట్టిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుని బుధవారం రాత్రి బస చేశారు అమిత్ షా. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత గురువారం ఉదయం అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపట్టనున్న రథయాత్రను ప్రారంభించేందుకు వెళ్తున్నారు షా. ఈ రథయాత్రతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: రామ్పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద -
అమెరికాను గజగజలాడిస్తున్న బాంబ్ సైక్లోన్
చలికాలంలో వణుకు సహజం. కానీ, ఆ వణుకు ప్రాణంపోయేలా, క్షణాల్లో మనిషిని సైతం గడ్డకట్టించేదిగా ఉంటే!. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం.. తన దేశ పౌరులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలపు తుపాను వేగంగా వస్తున్నందున క్రిస్మస్కు కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించడానికి వెళ్లాలనుకునే అమెరికన్లు వెంటనే బయలుదేరాలని ఆయన హెచ్చరించారు. మంచు తుపాను బలం పుంజుకోవడంతో.. అత్యంత అరుదైన పరిణామం ‘బాంబ్ సైక్లోన్’గా బలపడొచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా మంచు తుపాన్తో వణికిపోతోంది. -39(మైనస్) డిగ్రీల సెల్సియస్కు మెర్క్యూరీ మీటర్లు పడిపోతున్నాయి. అర్కిటిక్ బ్లాస్ట్.. విపరీతమైన చలిని, హిమపాతాన్ని, చల్లని గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటిదాకా ఐదుగురు మృత్యువాత చెందారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థతి ఎదుర్కొలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలు సైతం మంచు ప్రభావానికి గురికాగా.. క్రిస్మస్పై ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇది ప్రమాదకరమైనది. మీరు చిన్నప్పుడు చూసిన మంచులాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు కలిగించేది. చాలా తీవ్రమైన వాతావరణం.. ఓక్లహోమా నుంచి వ్యోమింగ్, మైనే వరకు కొనసాగనుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ దయచేసి స్థానిక హెచ్చరికలను పట్టించుకోవాలని ఒవల్ కార్యాలయం నుంచి జాతిని ఉద్దేశించి బైడెన్ కోరారు. మధ్య అమెరికా నుంచి తూర్పు వైపు వీచే ఈ శీతలగాలుల ప్రభావంతో.. 135 మిలియన్ల(సుమారు పదమూడు కోట్ల మంది) జనాభాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే.. 60 మిలియన్ల మందిపై ఇది ప్రభావం చూపెట్టింది. బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే.. ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చట. అలాగే గాలి పీడనం 1003 మిల్లీబార్ల నుంచి 968 మిల్లీబార్లకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ . బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాలకు తీసుకొస్తుంది. 1979 నుంచి 2019 మధ్య.. ఉత్తర అమెరికాలో ఏడు శాతం మంచు తుపానులు బాంబ్ సైక్లోన్లుగా మారాయి. 1980లో బాంబ్ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించారు. బాంబ్ సైక్లోన్ స్థితి చలికాలంలోనే కాదు.. అరుదుగా సమ్మర్లోనూ నెలకొంటుంది. వీటి ప్రభావంతో ఇప్పటిదాకా వందల నుంచి వేల మంది మరణించారు!. బాంబు సైక్లోన్ తుపాను అనేది.. చల్లని గాలుల తీవ్రతను బట్టి ఉంటుంది. దీంతో అమెరికాలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి మరింత దిగజారవచ్చు. టెంపరేచర్లు.. సున్నా కంటే చాలా తక్కువ ప్రమాదకరమైన కనిష్ట స్థాయికి పడిపోవచ్చు. అంటే.. ఏదైనా సరే నిమిషాల్లో గడ్డకట్టుకుపోతుంది. క్రిస్మస్ తర్వాత నుంచి నెమ్మదిగా మొదలై.. కొత్త సంవత్సరం మొదటిరోజు నాటికి ఈ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు(Snow), చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. క్రిస్మస్ దగ్గర పడుతున్న వేళ.. ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. గురువారం ఒక్కరోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. కెంచుకీ, జార్జియా, నార్త్ కరోలినా, ఒక్లాహోమాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మేరీల్యాండ్, మిస్సోరీలు.. అత్యవసర పరిస్థితులకు సిద్దంగా ఉనన్నాయి. మిన్నెసొటాలో జంట నగరాలు స్నో ఎమర్జెన్సీలను ప్రకటించుకున్నాయి. ఈశాన్య వాతావరణంతో పోలిస్తే.. బాంబ్ సైక్లోన్ ప్రభావం మరీ ఘోరంగా ఉంటుంది. -
గుడ్న్యూస్.. అందుబాటు ధరల్లోకి క్యాన్సర్ మందులు
సాక్షి, న్యూఢిల్లీ: యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్ సహా 34 డ్రగ్స్ను జాతీయ అత్యావశ్యక ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)లోకి కేంద్రంచేర్చింది. దాంతో వీటి ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు 384 జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం విడుదల చేశారు. ఐవర్మెక్టిన్, అమికాసిన్, బెడాక్లిలైన్, డెలామనిడ్, ముపిరోసిన్, మెరోపెనెమ్ వంటివి వీటిలో ఉన్నాయి. బెండామస్టీన్ హైడ్రోక్లోరైడ్, ఇరినోటెకాన్ హెచ్సీఐ ట్రైహైడ్రేడ్, లెనాలిడోమైడ్, లియూప్రోలైడ్ ఎసిటేట్ వంటి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ, బుప్రినోరిఫెన్ వంటి మానసిక చికిత్స ఔషధాలనూ జాబితాలో చేర్చారు. ర్యాంటిడిన్, సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలియం, ఎటినోలోల్, మెథైల్డోపా సహా 26 డ్రగ్స్ను తొలగించారు. 1996 నుంచి ఈ జాబితాను కేంద్రం అమలుచేస్తోంది. 2003, 2011, 2015ల్లో దీన్ని సవరించారు. ఆరోగ్య సంరక్షణలో అన్ని స్థాయిల్లోనూ సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడంలో ఎన్ఎల్ఈఎంది పెద్ద పాత్ర అని మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఎండోక్రైన్ మెడిసిన్, కాంట్రాసెప్టివ్స్ ఫుడ్రోకార్టిసోన్, ఓర్లీలోక్సిఫిన్, ఇన్సులిన్ గ్లార్జైన్, టెనిలిగ్లిటిన్, శ్వాస వ్యవస్థ సంబంధ మోంటేలూకాస్ట్, నేత్ర సంబంధ లాటనోప్రోస్ట్లనూ జాబితాలో చేర్చారు. 384 ఔషధాలు NLEM, 2022లో 34 ఔషధాల జోడింపుతో చోటు దక్కించుకున్నాయి. ఈ మొత్తం ఔషధాలను 27 చికిత్సా విభాగాలుగా వర్గీకరించారు. ఇదీ చదవండి: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్ -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్లాక్లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి
పోర్చుగల్లోని లిస్బన్లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది. వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు. (చదవండి: వాషింగ్టన్లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు) -
పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి
ఇస్లామాబాద్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. ఈ వరద బీభత్సానికి పాకిస్తాన్లో దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. ఈ విపత్తులో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం కోల్పోయినట్లు పేర్కొంది. జాతీయి విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ) ప్రకారం.. సింధూ ప్రావిన్స్లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అలాగే బలోచిస్తాన్లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్లో 165 మంది ఖైబర్ పంక్త్వులలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని వెల్లడించింది. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్లో తొమ్మిది చనిపోయినట్లు పేర్కొంది. అంతేకాదు ఆగస్టులో పాకిస్తాన్లో 166.8 మి.మీటర్ల వర్షం కురిసిందని, సగటున 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఎన్వెఎండీఏ వెల్లడించింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్లోని దాదాపు 23 జిల్లాలో బాగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు దేశంలోని పలుప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయి, కమ్యూనికేషన్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పైగా వేలాది మంది నిరాశ్రయులయ్యరాని, తినేందుకు ఆహారం లేక అల్లాడిపోతున్నట్లు చెప్పారు. తమకు అంతర్జాతీయ దాతల సాయం అవసరమని నొక్కి చెప్పారు. ప్రస్తుతం పాక్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆశ్రయం, తక్షణ సహాయ చర్యలు ఆవశక్యత చాలా ఉందని పేర్కొన్నారు. (చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్) -
డెంగ్యూతో ఉక్కిరిబిక్కిరి, అయినా సెట్స్కు వచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డెంగ్యూబారిన పడింది. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ ఆమె సెట్స్లో అడుగుపెట్టడం విశేషం. ఇప్పటివరకు హీరోయిన్గా అలరించిన ఆమె ఎమర్జెన్సీ మూవీతో దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే కదా! ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె ఇటీవల అస్వస్థతకు లోనైంది. పరీక్షలు చేయించుకోగా సోమవారం నాడు ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా తను సినిమా పనుల్లో నిమగ్నమైంది. ఈమేరకు కొన్ని ఫొటోలను ఆమె సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలింస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'డెంగ్యూ వచ్చి తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్నా మీరు మాత్రం పని చేయడం ఆపడంలేదు. దీన్ని ప్యాషన్ కాదు పిచ్చి అంటారు. కంగనా రనౌత్ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం' అని రాసుకొచ్చింది. దీనిపై సదరు కథానాయిక స్పందిస్తూ.. 'థ్యాంక్ యూ టీమ్.. అయినా బాడీకి జబ్బు వచ్చింది కానీ నా ఆశయానికి కాదు' అని రిప్లై ఇచ్చింది. కాగా కంగనా ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించనుంది. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ డేవిడ్ మలినోస్కి ఈ సినిమాకు పని చేస్తున్నాడు. చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? -
పక్షి ఎంత పని చేసింది.. విమానాన్ని ఢీ కొట్టడంతో.. !
గాంధీనగర్: గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానం జీ8911కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్ మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది. దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గత ఆదివారం పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. గడిచిన 16 రోజుల్లో అంతర్జాతీయ విమానాల్లో సైతం 15 సాంకేతిక లోపాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన సంఘటనలు ఎదురైనట్లు గుర్తు చేశారు. Go First flight G8911 operating on 4th August from Ahmedabad to Chandigarh diverted to Ahmedabad after bird hit: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/zVRG2evG8g — ANI (@ANI) August 4, 2022 ఇదీ చదవండి: ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్ -
అమెరికాలో మంకీపాక్స్ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు
న్యూయార్క్: అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్(డీఓహెచ్ఎంహెచ్) కమిషనర్ అశ్విన్ వాసన్ ప్రజారోగ్య దృష్ట్యా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు త్వరితగతిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ తక్షణమై అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో డీఓహెచ్ఎంహెచ్ న్యూయర్క్ సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వ్యాధిని నియంత్రణలోకి తెచ్చేలే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అదీగాక గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ పరంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అంతేకాదు ఇది ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగిస్తుందో లేదో అంచనా వేయడం కోసం గత నెలలోనే ఘెబ్రేయేసస్ అత్యవసర కమిటీని సమావేశ పరిచారు. ఆ సమయంలోనే సుమారు 47 దేశాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చిందని, ప్రస్తుతం ఇది కాస్త 75 దేశాలకు వ్యాపించి సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
లంకలో సంచలన ఆదేశాలు: కనిపిస్తే కాల్చివేతే
కొలంబో: రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం(జులై 13న) ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం(జులై 13) అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటబయ రాజపక్స.. దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో.. ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు నిరసనకారులు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్కే మొగ్గు చూపారు. ఈ సాయంత్రంలోగా అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమారు 22 మిలియన్ల(2 కోట్ల 10 లక్షల దాకా) జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు. -
Digital Emergency: కనెక్షన్ కట్.. 2012 నుంచి 665 సార్లు.. టాప్ ప్లేస్లో భారత్!
డిజిటల్ ఎమర్జెన్సీ. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం. ఈ ధోరణి భారత్లో రానురాను బాగాపెరిగిపోతోంది. ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్య నెట్ కనెక్షన్ కట్ చేయడమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్ ప్లేస్లో ఉంది! అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్ షట్డౌనే. ఇంటర్నెట్ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపేస్తున్నాయి. శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది. 6 నెలల్లో 59 సార్లు... భారత్లో ఇంటర్నెట్ షట్డౌన్స్పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పౌర హక్కులకు భంగమేనా? ఇలా చీటికీమాటికీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన. ప్రభుత్వాలేమంటున్నాయి... సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం, వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ ప్లాట్ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగానూ ప్రభావమే... ఇంటర్నెట్ షట్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది కూడా. అంతేకాదు, ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినప్పటికీ తాత్కాలికం అన్న పేరు చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నాయి. అలా పొడిగించుకుంటూ వెళుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పైస్ జెట్లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఐతే స్పైస్జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా ఇండికేటర్ని చూపించడంతో, పైలట్లు ఇంధనం లీకేజ్ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది. (చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి) -
తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూణేకి చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను వృద్ధి చేసింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కమిటీ(SEC) ఈ వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతూ.. అత్యవసర వినియోగం శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. డీసీజీఐ మంగళవారం రాత్రి అనుమతులు జారీ చేసింది. రెండు డోసులతో పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు.. 28 రోజుల టైంతో ఈ వ్యాక్సిన్ను తీసుకోవచ్చు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్కు ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్ను స్టోరేజ్ చేయొచ్చు. దేశంలోనే ఈ తరహా వ్యాక్సిన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. సాధారణంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను.. అత్యంత లో-టెంపరేచర్లలో(సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటిది జెన్నోవా వ్యాక్సిన్కు అలాంటి ఆటంకాలేవీ లేవని కంపెనీ చెబుతోంది. పూణేకు చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్.. దేశంలోనే తొలి కొవిడ్-19 m-RNA వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. మూడు దశలుగా ఈ వ్యాక్సిన్ టెస్టింగ్లకు సంబంధించిన నివేదికలను డ్రగ్ రెగ్యులేటరీకి సమర్పించింది కూడా. ఫేజ్2, 3లను నాలుగు వేలమందిపై ప్రయోగించింది కంపెనీ. జెన్నోవా వ్యాక్సిన్తో పాటు సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి (ఏడు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు) డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ ఇచ్చింది. చదవండి: వైరస్ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! -
Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి 47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చివరికి గాయకుడు కిశోర్ కుమార్ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు. -
అత్యాచార పర్వం.. ఎమర్జెన్సీ విధింపు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితి విధించారు. మహిళలపై చిన్నారులపై అఘాయిత్య ఘటనలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలకు, పిల్లలకు భద్రతగా కూడా పోలీసులు వెళ్తుండడం కనిపిస్తోంది అక్కడ. సమాజంలో ఇలాంటి(అఘాయిత్యాలు) ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ ప్రకటించారు. పంజాబ్లో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారాయన. మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను రక్షించుకోవడం మీద దృష్టి సారించాలని పేర్కొంటోంది. కరోనా టైం నుంచి పాక్లో మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. -
శ్రీలంక: ఐదు వారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ విధింపు
కొలంబో: శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదువారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అధ్యక్షుడు గొటబయా Gotabaya Rajapaksa తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు. చదవండి: అప్పుల కుప్ప .. అంతా రాజపక్సల మాయ! -
4,800 కోట్ల డాలర్లతో జపాన్ అత్యవసర ప్యాకేజీ
టోక్యో: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న చమురు, తిండి గింజల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు 4,800 కోట్ల డాలర్ల అత్యవసర ప్యాకేజీని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీతో చమురు సబ్సిడీలు, చిన్న వ్యాపారాలకు, అల్పాదాయ కుటుంబాలకు ఊతం అందిస్తామని ప్రధాని తెలిపారు. కాగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలకు గట్టిగా సమాధానం చెబుతోంది. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది. చదవండి: (పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?) -
మైనార్టీలో ప్రభుత్వం.. ఎమర్జెన్సీ ఎత్తివేత!
శ్రీ లంకలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక్కో వ్యవస్థ దారుణంగా పతనమైపోతోంది. తాజాగా ఎమర్జెన్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రకటించడంతో పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చాక శ్రీ లంకలో ఈస్థాయి సంక్షోభం తలెత్తడం ఇప్పుడే కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో మొదలై.. ప్రజలను ఆగమాగం చేస్తోంది. ప్రజా నిరసనలతో దేశం అట్టుడికి పోతుండగా.. మరోవైపు మంత్రుల రాజీనామా, మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వంతో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. ఈ తరుణంలో మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించాడు. ► ప్రభుత్వం నుండి చట్టసభ సభ్యులు వాకౌట్ కావడంతో శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీ ఆర్డర్ను రద్దు చేశారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రేట్లు ఆకాశాన్ని అంటాయి. చివరకు టీవీ ఛానెళ్లను, పత్రికలను సైతం మూసేశారు. శ్రీ లంకలో ఐపీఎల్ టెలికాస్టింగ్ ఆపేశారు. ► మందుల కొరతతో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు ప్రాణాప్రాయ స్థితిలో ఉపయోగించే మందులకు సైతం కొరత ఏర్పడింది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతీ తెలిసిందే. ► ఇంకోవైపు ప్రభుత్వ కూటమి నుంచి మంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో 225 మంది సభ్యులున్న సభలో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన 113 మ్యాజిక్ ఫిగర్కు మహీంద రాజపక్స ప్రభుత్వం దూరమైంది. ప్రభుత్వం మైనార్టీలో పడింది. ► శ్రీ లంక పరిస్థితులను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో పాటు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఘటనపై దర్యాప్తు శ్రీ లంక పార్లమెంటు దగ్గర పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో ముసుగులు ధరించిన సైనికుల బృందం.. బైక్లపై గుంపు గుండా వెళ్లడంపై శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా విచారణకు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలో జరిగిన నిరసనలో బైక్లపై వచ్చిన ఆర్మీ సైనికులకు, పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు దృష్టికి రావడంతో ఆర్మీ కమాండర్ శవేంద్ర సిల్వా, ఐజిపిని ఘటనపై విచారణకు అభ్యర్థించినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ ఉంటుందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్కు లక్నో, గుజరాత్..! -
శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో రాజపక్సే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీంతో శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఇదిలా ఉండగా లంకలో ఇంకా ఆందోళనలు కొనసాగుతుండటంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. కాగా, దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేదుకే ఇలా చేసినట్టు వివరణ ఇచ్చింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియా నిషేధంపై ఆదేశాలు జారీ చేసింది. ఇక, అంతకు ముందు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. 🇱🇰 Colombo: Defying national Protests, the Rajapaksa ruling dynasty declares a 36-hour nationwide curfew Saturday and deployed troops with sweeping new powers under a State of Emergency to halt protests against the Presidential family #GotaGottaGo #SkiLankaEconomicCrisis pic.twitter.com/JkONn02oJj — Anonymous (@YourAnonNews) April 2, 2022 -
లంకకు భారత్ ఆపన్నహస్తం
కొలంబో: ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. 36 గంటల కర్ఫ్యూ ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఆరింటి వరకు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించారు. ఆదివారం జరగనున్న దేశవ్యాప్త నిరసనలను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కన్పిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అన్ని పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఆర్థిక సంక్షోభం ముగిసి పరిస్థితి చక్కబడాలంటే అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు ఫ్రీడం పార్టీ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించకపోతే అధికార కూటమి నుంచి తప్పుకుంటామని తేల్చిచెప్పింది. 🇱🇰 #SriLankaEconomicCrisis #GoHomeGota pic.twitter.com/gx5yQYyob7 https://t.co/ZmEsprNC7T — Anonymous (@YourAnonNews) April 2, 2022 -
శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్సే
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. Sri Lanka: లంక ఘోర ఆర్థికసంక్షోభం.. అర్ధరాత్రి అధ్యక్ష భవనం ముందు హింస! -
ఉక్రెయిన్ లో భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు
-
దేశంలో12-18 ఏళ్ల పిల్లలకు కొత్త కోవిడ్ వ్యాక్సిన్..
-
కెనడాలో ఎమర్జెన్సీ.. వారిపై కఠిన చర్యలు..
ఒట్టావా: కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర అధికారాల చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం ప్రకటించారు. దీనిప్రకారం నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే దీన్ని పరిమిత కాలం పాటు, కొద్ది ప్రాంతాల్లో, అవసరం మేరకే ఉపయోగిస్తామని ట్రూడో చెప్పారు. సైన్యాన్ని ప్రయోగించబోవడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లు రెండు వారాలకు పైగా సరిహద్దులను, ఒట్టావా వీధులను వాహనాలతో దిగ్బంధించారు. చదవండి: (ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు సిద్ధం: రష్యా) -
సింగిల్ షాట్ ‘స్పుత్నిక్’కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం ట్విటర్లో ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్ రెగ్యులేటర్లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్ లైట్తో భారత్లో వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India. This is the 9th #COVID19 vaccine in the country. This will further strengthen the nation's collective fight against the pandemic. — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022 చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్.. మనదేశంలోనే! -
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
అమెరికాలో మంచు తుఫాన్.. వందేళ్ల రికార్డు బ్రేక్.. అంధకారంలో ప్రజలు
మంచు తుఫాన్ దాటికి ఉత్తర అమెరికా గడ్డకట్టుకుపోతుంది. చలి గాలుల తీవ్రత, భారీగా కురుస్తున్న మంచుతో వందళ ఏళ్ల రికార్డులు బ్రేకవుతున్నాయి. జనజీవనం ఎక్కడిక్కడ స్థంభించిపోయింది. అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న పది రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కిటీకీలు, తలుపులు తెరవడానికి వీలులేనంతగా మంచు పేరుకుపోయి గడ్డకట్టిపోతుంది. చలి గాలులు బలంగా వీస్తుండటంతో సముద్రం పోటెత్తుతోంది. చాలా వరకు తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి తోడు ఉత్తర అమెరికాలో చాలా చోట్ల కరెంటు కోత కూడా మొదలైంది. దీంతో సహాయం చేయాలంటూ ఎమర్జెన్సీ సర్వీస్లకు కాల్స్ పోటెత్తుతున్నాయి. మసాచుసెట్స్ ఏరియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. – న్యూయార్క్ సెంట్రల్ పార్కులో వందేళ్ల రికార్డు బద్దలైంది. ప్రసిద్ది చెందిన ఈ పార్కులో గతంలో అత్యధిక మంచు 1904 జనవరి 29న 4.7 అంగులాల మందం కురిసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్గా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత మంచు తుఫాను దాటికి ఇప్పటికే 7.3 ఇంచుల మందంతో మంచు పేరుకుపోయింది. – న్యూజెర్సీలో 1987లో అత్యధికంగా 20.3 అంగులాల మంచు కురిసింది. ఆ తర్వాత 2014లో 7.4 ఇంచులు మంచు కురిసింది. ఈసారి ఏకంగా 33.2 ఇంచులు మందంతో మంచు పేరుకుపోయింది. న్యూజెర్సీలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. – ఫిలడేల్ఫియాలో 1904లో 5 ఇంచుల మంచు కురవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉండగా తాజాగా 5.8 ఇంచుల మంచుతో పాత రికార్డుకు పాతర పడింది. ⚡️More than 114,000 people are reported to be without power after a severe storm in Massachusetts, USA. New York City: According to a storm warning issued by the National Weather Service shortly before, the city could receive between 20 and 30 centimeters of snow@TheDailyHint pic.twitter.com/7nYtwiHDXZ — 🇺🇸Texas Tweetheart🇺🇸 (@MechelleChristy) January 30, 2022 మంచు తీవ్రత దాటికి పొలాలు, ఊర్లు, చెరువులు, గుట్టలు అంతా తెల్లగా మారిపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్లైట్అవేర్ డాట్ కామ్ అందించిన వివరాల ప్రకారం ఇప్పటికే 5000లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చదవండి:నార్త్ అమెరికాలో మంచు తుఫాను.. ప్రమాదకరంగా మారిన పరిస్థితులు -
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అమెరికాలో మంచు తుపాను విలయంతో నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. తూర్పు కోస్తా రాష్ట్రాలైన న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రహాదారులపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది. తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచులో నిండిపోయాయి. రోడ్లపై రెండు అడుగులకు పైగా మంచు పేరుకు పోవడంతో అక్కడి రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. మంచు కారణంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. -
మంచు తుఫానుకు గజగజ వణికిపోతున్న ఉత్తర అమెరికా
మంచు తుఫానుతో నార్త్ అమెరికా గజగజమణి వణికిపోతుంది. నార్త్ ఈస్ట్, మిడ్ అట్లాంటిక ప్రాంతాల్లో ఊర్లు, పొలాలు, రోడ్లు, వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది. రెండు అడుగుల మేర మంచు పేరుకు పోవడంతో రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. అత్యవసర పనుల మీద రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి శీతలగాలుల తీవ్రతతో కరొలినాస్, అప్పలాంచియా ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. బహిరంగ పార్కింగ్లను నిషేధించారు.ప్రయాణాలకు మానుకోవాలని సూచించారు. జనవరి ఆరంభంలో వర్జీనియాలో వచ్చిన మంచు తుఫాను సందర్భంగా జరిగిన వందలాది రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరికలు జారీ చేశారు. మంచు తుఫాను ధాటికి ఏకంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దవగా మరో 2500 విమానాలు రీ షెడ్యూల్ అయ్యాయి. న్యూయార్క్, షికాగో, బోస్టన్ ఎయిర్పోర్టులు మంచు తుఫానులో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో నిత్యవసర వస్తువులు నిండుకున్నాయి. సూపర్ మార్కెట్లు సైతం అవసరమైన వస్తువులే కొనండి.. మిగిలిన వాళ్లకు మిగల్చండి అంటూ కస్టమర్లకు సూచిస్తున్నాయి. -
Novak Djokovic: జొకోవిచ్కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్వన్కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్సీడ్ ‘డబుల్ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్స్లామ్ కెరీర్లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
కరోనా కష్టకాలంలో.. ఈపీఎఫ్వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. కరోనా కష్టకాలంలో అకౌంట్ నుంచి లక్షరూపాయలు అడ్వాన్స్గా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ అవకాశం కల్పించింది. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు అకౌంట్ నుంచి రూ.1లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఖతాదారులు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లక్ష వరకు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు షరతులు ►వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి/సీజీహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాలి. ►ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే.., ఆస్పత్రిలో చేరేముందే విత్ డ్రా చేసుకోవచ్చు. ►పీఎఫ్ ఆఫీస్ వర్కింగ్ డే రోజు దరఖాస్తు చేస్తే, ఆ మరుసటి రోజే డబ్బు అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది ►డబ్బును ఉద్యోగి పర్సనల్ అకౌంట్ లేదంటే ఆసుపత్రి బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఇలా డ్రా చేయండి ►పీఎఫ్ అకౌంట్ నుంచి లక్షరూపాయిల విత్ డ్రా ఎలా అంటే? ►ముందుగా అధికారిక వెబ్సైట్ www.epfindia.gov.inను సందర్శించాలి. ►వెబ్ పోర్టల్లో 'ఆన్లైన్ సేవలు'పై క్లిక్ చేయండి ►అనంతరం 31, 19, 10C మరియు 10D ఫారమ్లను పూర్తి చేయాలి ►ధృవీకరించడానికి మీ బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలను ఎంట్రీ చేయాలి ►తర్వాత 'ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి ►డ్రాప్-డౌన్ మెను నుండి ఫారమ్ 31ని సెలక్ట్ చేసుకోవాలి ►డబ్బును విత్ డ్రా ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలి. ►అనంతరం ఆసుపత్రి బిల్లు కాపీని అప్లోడ్ చేయండి ►మీ ఇంటి అడ్రస్ ను ఎంట్రీ చేసి 'సబ్మిట్' బటన్ పై పై క్లిక్ చేయండి. దీంతో పీఎఫ్ విత్ డ్రా ప్రాసెస్ పూర్తవుతుంది. మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. చదవండి: ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త..! భారీగా పెరగనున్న పెన్షన్..! ఎంతంటే..? -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇక అవసరమైతేనే ఆఫీస్కి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్ ఫ్రమ్ హోమ్/డబ్ల్యూఎఫ్హెచ్) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అత్యవసరమైతేనే ఆఫీసుకు.. ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మాలిక్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్ వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. ప్రాంతాల వారీగా విధానం.. చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. హైదరాబాద్లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు. ఉద్యోగులకు టీకా క్యాంపులు ‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్ విధానంలో హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజేష్ ఉప్పల్ తెలిపారు. స్టార్టప్లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్ అయితే ఉద్యోగులకు హెల్త్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతించింది. సంబంధిత వార్త: డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్న ‘మోల్నుపిరావిర్’ను ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్ ఫార్మా గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్ హోటల్ పార్క్హయత్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. మోల్నుపిరావిర్ 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందన్నారు. 5 రోజుల్లోనే వైరస్లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందన్నారు. మోల్ను పిరావిర్ టాబ్లెట్లను ఆవిష్కరిస్తున్న ఆప్టిమస్ ఫార్మా సీఎండీ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఒక్కో ప్యాకెట్లో 5 స్ట్రిప్లు ఉంటాయని, వీటిలో 40 మా త్రలు ఉంటాయన్నారు. ఒక్కో మాత్ర 200 ఎంజీ డోసుతో తయారైందని వెల్లడించారు. ఈ మాత్ర రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని తెలిపారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఈ మందులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆప్టిమస్ ఫార్మా జీఎం శ్రీధర్, మేనేజర్ అంకూర్, డాక్టర్ ముఖర్జీ పాల్గొన్నారు. చదవండి: చాలా మంది అగ్ర సీఈవోల వేతనం ఒక డాలరే.. ఎందుకు? -
Omicron: న్యూయార్క్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529 హడలెత్తిస్తోంది. ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఈ వేరియంట్లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’గా నామకరణం చేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూహెచ్ ఒమిక్రాన్ని అత్యంత ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ జాబితాలో చేర్చింది. చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది? అయితే ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్లో ఇప్పటివరకు కొత్త వేరియంట్కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. చదవండి: Omicron: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. హడలిపోతున్న ప్రపంచ దేశాలు -
లండన్ - హైదరాబాద్ ఫ్లైట్ ఫ్యూయెల్ ట్యాంక్లో లీక్.. అత్యవసర ల్యాండింగ్..
లండన్ నుంచి హైదరాబాద్కి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో దారి మళ్లించారు. విమానాన్ని టర్కీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి అక్కడ నుంచి మరో విమానంలో ప్రయాణికులను సురక్షితంగా ఇక్కడికి తీసుకువచ్చారు. గత వారం ఈ ఘటన జరగగా వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తి వేయడంతో ఇండియా ఇంగ్లండ్ల మధ్య మళ్లీ విమాన సర్వీసులు ఇటీవల మొదలయ్యాయి. నవంబరు 11న లండన్ నుంచి హైదరాబాద్కి బయల్దేరిన ఎయిర్ ఇండియాకి చెందిన ఏఐ 148 విమానం బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో ఆకాశంలో ఉండగా విమానం ఫ్యూయల్ ట్యాంకులో లీకేజీలు ఉన్నట్టు పైలట్లు గుర్తించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాలను వెంటనే సమీపంలో ఉన్న ఎయిర్పోర్టు అధికారులకు పైలెట్లు చేరవేశారు. దీంతో టర్కీలోని అంకారా ఎయిర్పోర్టులో ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను అక్కడి నుంచి మరో విమానంలో భారత్కి తరలించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఇంజనీర్ల బృందం అంకారా బయల్దేరి వెళ్లింది. సమస్యను సరి చేసి ఫ్లైట్ని ఇండియాకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. చదవండి: ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు -
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
ఐఫోన్ 13లో సరికొత్త ఆప్షన్.. ఆపదలో ఆదుకునేలా!
సరికొత్త ఫీచర్లతో టెక్ యూజర్లను ఆకట్టునేలా ఫోన్లను తీసుకువచ్చే యాపిల్ కంపెనీ ఈ సారి మరో కొత్త ఆప్షన్తో ముందుకు రానుంది. ఈ నెలాఖరుకల్లా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఐ ఫోన్ 13ని ఆపదలో ఆదుకునే పరికరంగా కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్ యాపిల్ సంస్థ నుంచి త్వరలో మార్కెట్కి రాబోతున్న ఐఫోన్ 13లో ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు చేసే సమయంలో నెట్వర్క్ పని చేయని సందర్భంలో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా ఈ ఫీచర్ పని చేస్తుందని బ్లూమ్బర్గ్ టెక్ నిపుణుడు మార్క్ గుర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యవసర సమయంలో ఎస్వోఎస్ మేసేజ్లు చేసే వీలున్నా ఇవన్నీ పరిమితంగానే పని చేస్తాయి. యాపిల్ అందించే ఎమర్జెన్సీ ఫీచర్లో తమ చుట్టు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఎస్ఎమ్మెస్లను పంపే వీలుంటుంది. దీని వల్ల ఎమర్జెన్సీ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మరింత మెరుగ్గా స్పందించే వీలు కలుగుతుంది. లియో ఆధారంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీగా చెబుతున్న లో ఎర్త్ ఆర్బిన్, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్ పని చేస్తుందని చెబుతున్నారు. మొబైల్ నెట్వర్క్ పని చేయని చోట తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పరిమితంగా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. అక్కడ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్ పని చేస్తుంది. ప్రస్తుతం అనేక సంస్థలు లియో టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఇండియాలో టాటా , ఎయిర్టెల్ సంస్థలు లియో టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫీచర్ ఇప్పుడే కాదు ఐ ఫోన్ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుందని, మొబైల్ నెట్వర్క్తో పని లేకుండానే కాల్స్, మేసేజ్ చేసుకోవచ్చనే వార్తలు మొదటగా వచ్చాయి. అయితే లియో టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు తయారు చేసేందుకు అవసరమైన హార్డ్వేర్ ఇంకా భారీ స్థాయిలో అందుబాటులోకి రాలేదు, పైగా అన్ని దేశాల్లోనూ లియో టెక్నాలజీ కమర్షియల్ స్థాయిని అందుకోలేదు. దీంతో లియో టెక్నాలజీని తెచ్చేందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యాపిల్ సొంతంగా టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్ సంస్థ లియో పైనా కన్నేసింది. అయితే ఇతర సంస్థలకు చెందిన శాటిలైట్లను ఉపయోగించుకోవడానికి బదులుగా తానే స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అందువల్లే ఐఫోన్ 13లో లియో టెక్నాలజీ వాడలేదని చెబుతున్నారను. కానీ యాపిల్ సంస్థ ఇంటర్నల్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం లియో ఆపరేషన్స్ సొంతంగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: టెక్ దిగ్గజం ఆపిల్ను దాటేసిన షియోమీ -
న్యూయార్క్లో తుపాను బీభత్సం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్లను రద్దుచేశారు. సబ్వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. సెంట్రల్ పార్క్లో రికార్డుస్థాయి వర్షపాతం ‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది. సబ్వే స్టేషన్లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం -
భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ
భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి మృతుల సంఖ్య 724 కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. వందల్లో భవనాలు కుప్పకూలగా.. శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Viewer Discretion: First heart-stopping images of children, babies being rescued by caring Good Samaritans, stepping up to save their neighbor. 💔 #Haiti #earthquake pic.twitter.com/1pYiyZ6Bdx — Calvin Hughes (@CalvinWPLG) August 14, 2021 రాజధాని పోర్టౌ ప్రిన్స్కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెలపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాకే .. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు. Self-organized community brigades in Okay, #Haiti continue to search for survivors in rubble in wake of 7.2 earthquake that struck the region earlier today. pic.twitter.com/i1M6nlUzr5 — HaitiInfoProj (@HaitiInfoProj) August 14, 2021 కాగా, 2010లో హైతీలో సంభవించిన భారీ భూకంపం కారణంగా.. మూడు లక్షల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజా భూకంప పరిణామాల నేపథ్యంలో అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, మరింత సమాచారం అందాల్సి ఉంది. My biggest concern is not just for the country but the safety and well being of my momma and papa. Please keep Aiyti in your thoughts and prayers during these times 🇭🇹❤️💙 #Haiti #Tsunami #Ayiti pic.twitter.com/BCTweHve1h — Hustling & Healing (@HustlinNHealin) August 14, 2021 -
‘సింగిల్ డోస్తో వైరస్ కట్టడి.. మా టీకాకు అనుమతివ్వండి’
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే మన దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను 18 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇవన్ని రెండు డోసులు తీసుకోవాలి. కానీ త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అత్యవసర వినియోగ ప్రామాణీకరణ అనేది మూడో దశ క్లినికల్ ట్రయల్కు సంబంధించిన అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన డాటా మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం మా వ్యాక్సిన్ పంపిణీ చేసిన అన్ని ప్రాంతాల్లో సింగిల్ డోస్ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమైనదని నిరూపితమైంది. అంతకాక వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత మరణాల రేటును తగ్గించడంలో, కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే కేసులను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్ డాటా వెల్లడిస్తుంది’’ అని పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బయోలాజికల్ ఈ తమ గ్లోబల్ సప్లై చైన్ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అధికారులు తెలిపారు. తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన మైలురాయి అని.. బయోలాజికల్ ఈ సహకారంతో భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని ప్రజలందరికి తమ సింగిల్-డోస్ కోవిడ్-19 టీకాను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. అయితే.. గతంలో ఈ సంస్థ భారత్లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను వినియోగిస్తున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను.. ట్రయల్స్ నిర్వహణ అవసరం లేకుండానే నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
ఒలింపిక్స్ రాష్ట్రంలో కరోనా కల్లోలం.. ఎమర్జెన్సీ విధింపు
టోక్యో: విశ్వ క్రీడా సంబురం ఒలింపిక్స్ పోటీలు జపాన్లో హోరాహరీగా సాగుతున్నాయి. అంతేస్థాయిలో ఆ దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయిలో ఉండడంతో జపాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పటిష్ట చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని టోక్యోతో పాటు సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి సుగ ప్రకటించారు. ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హొక్కయిడో, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక, ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. ప్రయాణాలు విరమించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరించింది. ఆగస్ట్ నెలాఖరు వరకు 40 శాతం ప్రజలకు రెండు డోసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఆ దేశంలో గతవారంతో పోలిస్తే పది శాతం మేర కేసులు పెరిగాయి. ఏప్రిల్, జూన్ నెల మధ్యలో నెమ్మదించిన కరోనా జూలై తీవ్రమైంది. ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్లో పెరుగుతున్న కరోనాతో ఇతర దేశాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. తమ క్రీడాకారుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. PM Suga: For the period until August 31, we have decided to apply the declaration of a state of emergency to Tokyo, Saitama, Chiba, Kanagawa, Osaka, and Okinawa Prefectures, and to apply priority measures to prevent the spread of disease to Hokkaido, Ishikawa, Kyoto, (1/4) pic.twitter.com/W3n8GAzvX7 — PM's Office of Japan (@JPN_PMO) July 31, 2021 -
ఒలింపిక్స్ ముంగిట టోక్యోలో ఎమర్జెన్సీ..
టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభానికి మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా.. జపాన్ ప్రధాని యొషిహిదె సుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని తెలిపారు. ఒలింపిక్స్ జరగనున్న టోక్యోలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, నగరంలో బుధవారం ఒక్కరోజే 920 కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు డెల్టా, లాంబ్డా దేశంలోని ప్రవేశించే ఆస్కారం ఉన్నందున ఒలింపిక్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్కు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్కు అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా అత్యయిక స్థితిని విధించిన జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మహమ్మారి మరోసారి విరుచుకుపడటంతో ఈ ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. భారత అథ్లెట్లు అయోమయం.. టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రయాణానికి సంబంధించిన తేదీల విషయాల్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి వేర్వేరు ప్రకటనలు రావడమే ఇందుకు కారణం. ఒలింపిక్స్కు సెలెక్ట్ అయిన అథ్లెట్లలో ఫస్ట్ బ్యాచ్ 17వ తేదీన టోక్యో బయలుదేరుతుందని ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వస్తే 14వ తేదీనే ప్రయాణముంటుందని ఐఓఏ నుంచి అథ్లెట్లకు ఇటీవల మెసేజ్ వచ్చింది. -
ఆ చీకటి రోజులను మర్చిపోలేం: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర స్థితి విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నాటి దురాగతాలను, దారుణ పరిస్థితులను గుర్తు చేశారు. ఆ చీకటి రోజులను మర్చిపోలేమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రతినబూనుదామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషి చేసిన మహనీయులను గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణ చర్యలకు సంబంధించిన ఒక లింక్ను కూడా ప్రధాని పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం. 1975 నుంచి 1977 వరకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమబద్ధంగా నాశనం చేశారు’అని పేర్కొన్నారు. ఇతర బీజేపీ నేతలు కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ‘అధికార దాహంతో 1975లో ఇదే రోజున కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అణచివేసేందుకే ఎమర్జెన్సీ విధించారు. భారత చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయం’అని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గుర్తు చేసుకున్నారు. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర స్థితిని విధించారు. ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించారు. వ్యతిరేకులను, విపక్ష నాయకులను జైళ్లలో బంధించారు. చివరకు, 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. -
ఎమర్జెన్సీ చీకటికి 46 ఏళ్లు
దేశ ప్రజలు నిద్రిస్తున్న వేళ 1975 జూన్ 25 నాడు∙లోక్ నాయక్ జయప్రకాష్ నారా యణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీ లాంటి అగ్రశ్రేణి నాయకులను రాత్రికి రాత్రే జైళ్లలో నిర్బంధించారు. ఆరెస్సెస్పై నిషేధం విధించి, వారి కార్యాలయాలను సీజ్ చేశారు. వార్తా పత్రికల కార్యాలయాలకు కరెంట్ కోత విధించి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా సెన్సార్ కత్తిని ఎత్తి బెది రించారు. ప్రజలకు ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపే మొత్తం దేశాన్ని బందీఖానాగా మార్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. 1973లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా గాంధీ అక్రమాలకు, అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైనందున ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. అదేరోజు వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడినట్టు తేలింది. ఆరోజే ఇందిరకు అత్యంత సన్ని హితుడు డి.పి. ధార్ గుండె నొప్పితో చనిపోయాడు. పిడుగుపాటు లాంటి ఈ మూడు వార్తలు ఒక వైపు, అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి మరోవైపు రావడంతో ఆమెలోని వికృత రూపం జడలు విప్పింది. అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వాల అక్రమా లకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఆధ్వ ర్యంలో ప్రారంభమైన నవ నిర్మాణ్ సంఘర్ష సమితి ఉద్యమంలో నాటి జనసంఘ్ నాయకులు, విద్యా ర్థులు పాల్గొని దాన్ని బిహార్ నుండి గుజరాత్ వరకు విస్తరింపజేశారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రజలను ప్రేరేపిస్తున్నారని దుష్ప్రచారం చేసి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కీలుబొమ్మ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గుడ్డిగా సంతకం చేశారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సిగ్గు లేకుండా ఎమర్జెన్సీని సమర్థించింది. విప్లవ కవి త్వంలో అగ్రగణ్యుడైన శ్రీశ్రీ ఇందిరమ్మ నియంతృ త్వాన్ని స్వాగతించారు. తర్వాతి కాలంలో తప్పు చేశామని చెంపలేసుకున్నారు, అది మరో కథ. 18 నెలల పాటు నిరంకుశత్వం స్వైరవిహారం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని సుప్రీం కోర్టులో వాదించారు. ఆనాటి అమానుషమైన స్థితికి ఒక ఉదాహరణ కేరళ విద్యార్థి నాయకుడు రాజన్ను పోలీసులే అపహరించటం. ఆ అపహరణ కేసులో ప్రభుత్వం పక్షాన వాదించిన అటార్నీ జనరల్ ‘అపహ రించడమేకాదు, ఒక పౌరుణ్ని చంపినప్పటికీ ప్రశ్నించే అధికారం ఏ కోర్టుకు కూడా లే’దని వాదించాడంటే ఆనాటి కిరాతక స్థితి ఎలా ఉందో ఊహించొచ్చు. నియంతృత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ఉద్య మాలకు, సత్యాగ్రహాలకు రూపకల్పన జరిగింది. తమకు ఎదురేలేదని విర్రవీగుతున్న నియంతకు హఠా త్పరిణామంతో దిమ్మ తిరిగింది. ఎక్కడికక్కడ అరె స్టులకు పూనుకుంది. స్కూళ్లు, కాలేజీ భవనాలను జైళ్లుగా మార్చవలసి వచ్చింది. ఎన్నికలకు ఇదే అదను అని ఆంతరంగికులు సలహా ఇచ్చారు. ప్రజలు బ్రహ్మ రథం పడతారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పాయి. ఎన్నికలు జరిపిస్తే అంతర్జాతీయంగా వచ్చిన చెడ్డపేరు పోయి ప్రజాస్వామ్యంలో నిబద్ధత కలిగిన నాయకురా లిగా మంచిపేరు వస్తుందని ఊహించారు. ప్రతిపక్షా లకు ఊపిరిపీల్చే సమయం ఇవ్వకుండా తక్షణమే ఎన్నికల ప్రకటన చేయించారు. నాయకులందరూ నిర్బంధంలో ఉన్నప్పటికీ ప్రజలు నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. తల్లీ కొడుకులు ఇద్దరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా, వాజ్పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతే లాంటి హేమాహేమీలు మంత్రు లుగా జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పునాదులను కదిలించగలిగిన స్థాయిలో సత్యాగ్రహోద్యమం నడిపించగలిగిందంటే ఆరెస్సెస్ నెట్వర్క్ ఎంత పటిష్టమైనదో ప్రజలకు తెలి సొచ్చింది. ఆనాడు పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులకు, ఇంతమందిని కదిలించిన ఆరెస్సెస్ కార్యదక్షతకు జోహార్లు అర్పిం చాలి. ఎమర్జెన్సీ నేర్పిన గుణపాఠాలను రానున్న తరాలకు భద్రంగా అందించాలి. అయితే ఇందిరా గాంధీకి కొమ్ముకాసిన కమ్యూనిస్టులే నేడు బీజేపీ రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని గగ్గోలు పెడుతుండటం గమనార్హం. వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే మొబైల్ : 98663 26248 -
ఇందిరా గాంధీ పాత్ర కోసం కంగనా ‘ఎమర్జెన్సీ’ మేకప్
కెరీర్లో మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించనున్నారు. సాయి కబీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి తన లుక్, మేకోవర్ పనులను మొదలు పెట్టారు కంగన. లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ చేయించుకుంటున్నారు. ఈ చిత్రానికి కంగన కూడా ఓ నిర్మాత కావడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో టైటిల్ రోల్ చేసిన కంగనా రనౌత్ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. ఈ సినిమాలు కాకుండా కంగన ‘ధాకడ్’, ‘తేజస్’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
కోవిడ్ ఔషధం అనుమతికి బయోఫోర్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిడ్ సీరియస్ కేసుల్లో తాము రూపొందించిన ‘అవిప్టడిల్’ అనే ఔషధం అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుక్రవారం తెలిపింది. డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొంది. తమ ఔషధ వినియోగంతో కోవిడ్ సీరియస్ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపింది. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో యాంటీ వైరల్ ఔషధం ‘ఫావిఫిరవిర్’ ఉత్పత్తికి అనుమతి పొందిన అతికొద్ది కంపెనీల్లో హైదరాబాద్కు చెందిన బయోఫోర్ ఒకటి. చదవండి:Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! -
Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్తో ప్రతిపాదనలను బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాగ్జిన్ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. అయితే ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. కోవాగ్జిన్కు సంబంధించిన మాస్టర్ ఫైల్ను అందజేయాలని ఎఫ్డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్ను యూఎస్కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెన ఆక్యుజెన్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అయితే మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ యూఎస్ఎఫ్డీఏ దీన్ని తిరస్కరించింది. ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇండియాలో మూడో దశ క్లినికల్ ప్రయోగాల జూలైలో ఈ డేటాను కంపెనీ అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. మూడో దశ పరీక్షల డేటాను పరిశీలించిన మీదటే డబ్ల్యూహెచ్వో గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను గుర్తించలేదు. అంతేకాదు డబ్ల్యూహెచ్వో గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్వాక్సినేటెడ్” గానే పరిగణిస్తారు. భారత్ బయోటెక్స్పందన: అమెరికాలో తమ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తిరస్కరణపై భారత్ బయోటెక్ స్పందించింది. అమెరికా ఎఫ్డీఏకు పూర్తిస్థాయి క్లినికల్ డేటా ఆక్యూజెన్ అందించిందని వివరించింది. అయితే మరింత సమాచారం అందించాలని ఎఫ్డీఏ కోరిందని తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్ పూర్తిస్థాయిలో ఆమోదం పొందేందుకు బయోలాజిక్ లైసెన్స్ అప్లికేషన్ అనుమతి కూడా అవసరమని భారత్ బయోటెక్ తాజా ప్రకటనలో వెల్లడించింది. చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు! oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్ -
శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?!
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్కు తగినంత సరఫరా లేక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ ఊరట నందించే కబురు చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ `జైకోవ్-డి` భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతులకు దరఖాస్తు చేయనుంది. అంతేకాదు త్వరలోనే అనుమతులు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది. తమ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి భారతదేశంలో ఆమోదం పొందే సమయం చాలా దగ్గరలోనే ఉందని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ తెలిపారు. ఈ నెలలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఈ నెలలోనే లభించనున్నాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పెయిన్లెస్ కోవిడ్ -19 వ్యాక్సిన్కు అనుమతి లభిస్తే నెలకు కోటి మోతాదులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని పటేల్ తెలిపారు. ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ ద్వారా అందించే ఈ వ్యాక్సిన్ 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ చేయవలసి ఉన్నప్పటికీ, 25 డిగ్రీల సెల్సియస్ రూం టెంపరేచర్ వద్ద కూడా స్టోర్ చేయవచ్చని, నిర్వహించడం చాలా సులభమని పటేల్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై `జైకోవ్-డీ’ వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను సంస్థ ప్రారంభించిందనీ, ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయని చెప్పారు. అంతేకాదు 12-17 ఏళ్లలోపు పిల్లలను కూడా ఇందులో చేర్చినట్టు తెలిపారు. ఈ మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది. మేడిన్ ఇండియా టీకా ఉత్పత్తికి ఇప్పటికే మరో రెండు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. తద్వారా నెలకు 3-4 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యం. దీనికి అమోదం లభిస్తే జైకోవ్-డీ దేశంలో నాలుగో వ్యాక్సిన్ అవుతుంది. చదవండి : కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! -
1975 ఎమర్జెన్సీ కాల దోషం పట్టిన అంశం
ముంబై: ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి అంశం కాలదోషం పట్టిన అంశమని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అప్పటి పరిస్థితులే నయమనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పేనంటూ రాహుల్ గాంధీ ఇటీవల ఒప్పుకోవడంపై శివసేన పత్రిక సామ్నాలో ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితి విధించినందుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆమెకు ఒక గుణపాఠం చెప్పారు. అదే ప్రజలు ఆమెను క్షమించి తర్వాత తిరిగి అధికారం కట్టబెట్టారు. ఎమర్జెన్సీ విషయం అంతటితో ముగిసిపోయింది. మళ్లీ ఎందుకు గుర్తు చేయడం?అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూటిగా, స్పష్టంగా మాట్లాడే వ్యక్తి అంటూ కితాబునిచ్చారు. మీడియా సంస్థలపై ఆధిపత్యం చెలాయించడం, ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ వ్యూహాలు పన్నడం, ప్రతిపక్షాల్లో విభేదాలు పెంచడం, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వంటివన్నీ 1975లో మాదిరిగానే ఇప్పుడూ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు. చదవండి: బెంగాల్ టైగర్లా గాండ్రిస్తూ మమతా బెనర్జీ -
ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: 1975లో దేశంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం పొరపాటేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన నానమ్మ(ఇందిరాగాంధీ)కు ఆ విషయం తరువాత అర్థం అయిందన్నారు. ‘అప్పుడు జరిగింది పొరపాటే. కచ్చితంగా అది తప్పే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే అప్పుడున్న పరిస్థితి మౌలికంగా వేరైనది. కాంగ్రెస్ ఏ సమయంలోనూ దేశ మౌలిక వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు’ అన్నారు. కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో సంభాషణ సందర్భంగా మంగళవారం రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తాను కోరుకుంటున్నానని, అందువల్లనే యూత్ కాంగ్రెస్లో, విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐలో ఎన్నికలకు పట్టుబట్టానని రాహుల్ వివరించారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, సమానత్వం కోసం నిలిచిన పార్టీ అని గుర్తు చేశారు. ‘దేశ వ్యవస్థీకృత విధి విధానాలను మార్చే ప్రయత్నం, వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ శక్తి కూడా కాంగ్రెస్కు లేదు. మా పార్టీ రూపుదిద్దుకున్న విధానం కూడా అందుకు అంగీకరించదు. అందువల్ల మేం చేయాలనుకున్నా.. ఆ పని చేయలేం’ అని విశ్లేషించారు. అందుకు వ్యతిరేకంగా, ప్రాథమికంగానే వేరైన విధానాలను అధికార బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అవలంబిస్తోందన్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) (నరేంద్ర మోదీని నాగపూర్కు తరిమేద్దాం: రాహుల్ గాంధీ) -
మంచు గుప్పిట్లో అమెరికా.. ముప్పులో 15 కోట్ల మంది
టెక్సాస్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో ఉన్నట్టుగా ది నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ నేషనల్ గార్డ్ సాయం కోరారు. కన్సాస్ గవర్నర్ కరెంట్ పొదుపుగా వాడుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నార్త్ కరోలినాలో టోర్నడోలకు ముగ్గురు మరణించారు. చదవండి: (పార్లమెంట్ హౌజ్లోనే అత్యాచారం) -
కరోనా వ్యాక్సిన్: ఫైజర్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. (షాకింగ్: కరోనాలో 4 వేల రకాలు) భారత్లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం శుక్రవారం తెలిపింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్ అదనపు సమాచారాన్ని కోరడంతో ఫైజర్ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. -
మయన్మార్లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ
సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్వర్క్లు కూడా పనిచేయడంలేదు. సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
కరోనా పేరిట సంక్షోభం.. ఎమర్జెన్సీ
కౌలాలంపూర్: రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో మహమ్మారి కరోనా వైరస్ పేరు చెప్పి మలేషియాలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రధానమంత్రి విధించారు. ఆ వైరస్ పంజా విసురుతున్నా వాస్తవంగా మలేషియాలో పది నెలలుగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం ఉప ఎన్నికలు.. మరికొన్నిచోట్ల సాధారణ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వస్తుందనే భావనతో కరోనా పేరు చెప్పి దేశంలో అత్యవసర పరిస్థితిని మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసీన్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ దేశ రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వ్యతిరేకించారు. దీంతో ఇప్పుడు మలేషియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీన్ని కారణంగా చూపి అత్యవసర పరిస్థితి విధించడం సరికాదని కొట్టి పారేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితంతో ఏర్పడిన పరిస్థితుల వలన ప్రస్తుతం అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని ఆ దేశంలోని మీడియా ఆరోపిస్తోంది. అత్యవసర పరిస్థితి విధింపుతో ఆ దేశంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదు. అయితే అత్యవసర పరిస్థితి విధించడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు ‘చీకటి రోజు’గా అభివర్ణించాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1 లక్ష 38 వేల కరోనా కేసులు నమోదవగా, 555 మరణాలు సంభవించాయి. -
బైడెన్ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారని వైట్హౌస్ ప్రెస్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్ మద్దతుదారలు క్యాపిట్ల హిల్పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది. (చదవండి: యూఎస్లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. (చదవండి: చివరి రోజుల్లో.. అవమానభారంతో...) జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు ఈ వీకెండ్, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్ వాషింగ్టన్ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది. ట్రంప్కు మరో షాకిచ్చిన ట్విట్టర్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంది. ఎఫ్బీలో 'ఆమోదాన్ని ఆపండి' అనే పోస్టుపై ట్రంప్ మద్దతుదారలు పోస్టులు పెడుతున్నారు. దాంతో ఎఫ్బీ ‘ఆమోదాన్ని ఆపండి’ అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగించింది. -
వూహాన్లో అత్యవసర వ్యాక్సినేషన్
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు స్థానమైన వూహాన్లో చైనా ప్రభుత్వం ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది. కోటి మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలోని 15 జిల్లాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలైనట్లు సమాచారం. నగరంలో 48 కేంద్రాలను ఏర్పాటు చేసి 18–59 మధ్య వయస్సు వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులు ఇస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ హి ఝెన్యు తెలిపారని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. -
క్రిస్మస్కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విషయంపై భారీ ఆసక్తి నెలకొంది. ఎపుడెపుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో సీరంకు యూకే డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కీలకంగా మారనుంది. యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇండియాలో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్కు ముందే దేశీయంగా కూడా అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. (కోవిడ్-19 వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్జెట్) తాజా నివేదికల ప్రకారం మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఎ)ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తోంది. దీంతో క్రిస్మస్కు ముందే ఎంహెచ్ఆర్ఎ ఆమోదం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వెంటనే దేశీయంగా కూడా అనుమతి లభించనుందని రెగ్యులేటరీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు. యూకే బ్రెజిల్లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా ప్రతిపాదన ఉంటుందనీ, అంతేకాకుండా, టీకా ఇంకా ఏ దేశంలోనూ ఆమోదించబడలేదు. ఇది సున్నితమైన విషయమన్నారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి పేర్కొన్నారు. మరోవైపు కరోనావైరస్ వ్యాక్సిన్లను పరిశీలించే ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇమ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది. భారతదేశంలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే ఎంహెచ్ఆర్ఎ ఆమోదానికి సంబంధించిన వివరాలను సీరం సంస్థ తప్పనిసరిగా అందించాలని ప్యానెల్ స్పష్టం చేసింది. -
మంచం మీది నుంచే తాళి తంతు
-
గర్భిణికి పురుడు పోసిన ఎమ్మెల్యే
ఐజ్వాల్: ప్రసవ వేదనతో బాధపడుతున ఓ మహిళకు మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు పురుడుపోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో శాసనసభ్యుడు, డాక్టర్ జెడ్ఆర్ థియామ్సంగ పర్యటించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థియామ్సంగ చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. (మెసేజ్ చూశారని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య!) అయితే గతంలో కూడా థియామ్సంగ మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. కాగా.. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నారు. -
ఉత్తర కొరియాలోకి కరోనా
సియోల్: కరోనా వైరస్ భయంతో ఉత్తర కొరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొలి కరోనా కేసు నమోదైనట్టుగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ కొరియా నుంచి ఇటీవల కైసాంగ్ నగరానికి వచ్చిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వెల్లడించింది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకి పారిపోయి వెళ్లిన ఆ వ్యక్తి జూలై 19న అధికారుల కన్నుగప్పి సరిహద్దు నగరమైన కైసాంగ్లోకి ప్రవేశించినట్టు కేసీఎన్ఏ తెలిపింది. రక్త పరీక్షల్లో ఆ వ్యక్తికి వైరస్ సోకినట్టు తేలడంతో దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కైసాంగ్లో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఆ రోగిని క్వారంటైన్లో ఉంచడమే కాదు, అతడిని కలుసుకున్న వారిని, అయిదు రోజులుగా కైసాంగ్ నగరానికి వెళ్లి వచ్చిన వారందరినీ క్వారంటైన్లో ఉంచింది. తొలిసారిగా అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇన్నాళ్లూ ఉ. కొరియా చెబుతూ వస్తోంది. అయితే చైనాతో విస్తృతమైన సరిహద్దుల్ని పంచుకున్న ఆ దేశంలో కరోనా లేదంటే నమ్మశక్యం కావడం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ బట్టబయలైన తొలిరోజుల్లో ఉత్తర కొరియా కరోనా లక్షణాలున్న కొందరిని క్వారంటైన్లో ఉంచినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఇలా ఒక నగరాన్ని పూర్తిగా మూసేయడం ఇదే తొలిసారి. ఆరోగ్య రంగంలో అంతంత మాత్రంగానే ఉండడంతో రెండు లక్షల జనాభా ఉన్న కైసాంగ్లో తొలి అనుమానాస్పద కేసు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. -
కాంగ్రెస్పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్ ట్రస్ట్కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కాంగ్రెస్కు ధీటుగా బదులిస్తున్నారు. (చదవండి : ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) మరోవైపు ఎమర్జెన్సీకి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై రవిశంకర్ ప్రసాద్ పలు విమర్శలు చేశారు. ‘1975 జూన్ 25 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని సీటును కాపాడుకోవడానికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, అటల్బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, చంద్రశేఖర్ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారు. కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే రోజు ఇది. వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో బిహార్ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం నా అదృష్టం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. On 25th June 1975 draconian Emergency was imposed by the Congress Govt led by PM Indira Gandhi. Major opposition leaders including Lok Nayak Jai Prakash Narayan, Bharat Ratna Atal Behari Vajpayee, L. K. Advani, Chandrashekhar and lakhs of people of India were arrested. — Ravi Shankar Prasad (@rsprasad) June 25, 2020 -
కాంగ్రెస్ని వెంటాడుతున్న చేదు జ్ఞాపకం..
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యంపై జరిగిన హేయమైన దాడి. ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం. కాంగ్రెస్ పార్టీని నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం. దేశ ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించిన ఆ ‘అత్యవసర పరిస్థితి’ విధించి నేటికి 45 ఏళ్లు. ఆనాడు తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలు పాలయ్యారు. చిత్రవధ అనుభవించారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిణామాలను పరిశీలించినట్లయితే.. గూంగీ గుడియా నుంచి ఐరన్ లేడీగా కాంగ్రెస్ పార్టీ 1971 సాధారణ ఎన్నికల్లో 352 సీట్లు కైవసం చేసుకుంది. అప్పటికే బ్యాంకులను జాతీయం చేయడం, లౌకికవాదిగా.. పేదల పెన్నిధిగా ప్రజాభిమానం చూరగొని.. ప్రియతమ ప్రధానిగా పేరొందిన ఇందిరా గాంధీ.. భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు(పాకిస్తాన్తో యుద్ధం)లో ప్రధాన పాత్ర పోషించి తిరుగులేని నేతగా ఎదిగారు. తనను విమర్శించిన వాళ్లతోనే అపరకాళిక అవతారమంటూ ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇందిరకు ఉన్న గూంగీ గుడియా(మూగ బొమ్మ) అనే ఇమేజ్ తొలగిపోయి దుర్గామాత, ఐరన్ లేడీగా అత్యంత శక్తిమంతురాలైన మహిళగా ఆమె అవతరించారు.(ఇందిరా గాంధీపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు) అయితే నాలుగేళ్ల తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. దేశంలో కరువు, కాటకాలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాస్తవానికి జూన్ 25 అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధించినట్లు కనిపించినా.. అంతకు దాదాపు 10 రోజుల ముందు అంటే జూన్ 12నే ఇందుకు బీజం పడిందని సీనియర్ పాత్రికేయులు, జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరి అభిప్రాయపడ్డారు. దేశంలోని పరిస్థితులకు తోడు ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.(కాంగ్రెస్లో ఎమర్జెన్సీ పోకడలు.. అమిత్ షా ఫైర్) ఆరేళ్ల పాటు దూరంగా ఉండాలి.. 1971 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్ సోషలిస్టు పార్టీ తమ అభ్యర్థిగా రాజ్నారాయణ్ను నిలబెట్టింది. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇందిర తన పదవి, పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడి, ఓటర్లకు లంచాలు ఇచ్చి విజయం సాధించారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 1975, జూన్ 12న తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా.. ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందిర ఎన్నికను రద్దు చేయడమే గాక.. మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీర్పునిచ్చారు. దీంతో ప్రధాని పదవి నుంచి ఇందిర దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నిక చెల్లదు కానీ.. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు 1 సఫ్దార్జంగ్ రోడ్లోని ప్రధాని అధికార నివాసంలో ఇందిర అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తనకు విశ్వాసపాత్రులైన నాయకులు, సన్నిహితులను సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అప్పుడు ఇందిర తనయుడు సంజయ్ గాంధీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్దామని ఆమెకు చెప్పారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అనుసరించి ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు ఒక ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇందిర వ్యతిరేక, అనుకూల నిరసనలు మిన్నంటాయి. అందుకే ఎమర్జెన్సీ.. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్గత కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందిగా ఇందిర అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ను కోరారు. ఆయన ఆమోదంతో భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణ ప్రకారం జూన్ 25న అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నాయకులు జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మొరార్జీ దేశాయ్ అరెస్టయ్యారు. అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా దాదాపు 11 లక్షల మందిని జైళ్లల్లో నిర్బంధించారు. అదే విధంగా భావప్రకటనా స్వేచ్చను హరిస్తూ అన్ని వర్గాలను అణగదొక్కారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలను సెన్సార్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో ఇందిర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల నేపథ్యంలోనే ఎమర్జెన్సీ విధించామంటూ తనను తాను సమర్థించుకున్నారు. వాస్తవానికి అప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి గాక ప్రధాని నివాసం నుంచి పాలన కొనసాగింది. నాలుగుసార్లు ఆరు నెలల చొప్పున ఎమర్జెన్సీ పొడిగిస్తూ.. ఎట్టకేలకు 1977, మార్చి 21న ఎత్తివేశారు. కానీ నాయకుల స్వప్రయోజనాలకు బలైన ప్రజలు మాత్రం తమ స్వేచ్ఛను హరించిన.. ఎమర్జెన్సీకి కారణమైన వారిని అంతసులువుగా మర్చిపోలేదు. 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పారు! -
‘కాంగ్రెస్లో ఎమర్జెన్సీ పోకడలు’
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈరోజుతో 45 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఎమర్జెన్సీ రోజుల తరహా మనస్తత్వానే కలిగిఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రతినిధి సంజయ్ ఝా తొలగింపు వంటి ఘటనలు దీనికి సంకేతమని అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ సభ్యులు, యువ సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తగా వారి గొంతు నొక్కారని, పార్టీ ప్రతినిధి ఒకరిపై అనవసరంగా వేటువేశారని కాంగ్రెస్ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. విపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ తనకు తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ తరహా మనస్తత్వం ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగుతోందని, పార్టీలో ఇతర నేతలను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎందుకు ఇమడలేకపోతున్నారనేది తెలుసుకోవాలని సూచించారు. 45 ఏళ్ల కిందట దేశం ఇదే రోజున (జూన్ 25) ఓ కుటుంబం అధికార దాహంతో రెండేళ్ల పాటు దేశం ఎమర్జెన్సీలోకి వెళ్లిందని రాత్రికి రాత్రే దేశం జైలుగా మారిందని పేదలు, అణగారిన వర్గాల వారిపై వేధింపులు సాగాయని అమిత్ షా గుర్తుచేశారు. లక్షలాది ప్రజల ఆందోళనలతో ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని అన్నారు. కాంగ్రెస్లో మాత్రం ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శించారు. పార్టీ, దేశ ప్రయోజనాల కంటే ఓ కుటుంబ ప్రయోజనాలే అధికమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్లో పరిస్థితి అలాగే ఉండటం బాధాకరమని అమిత్ షా వ్యాఖ్యానించారు. చదవండి : చైనా నిర్మాణం కంటే 10 రెట్లు పెద్దది! -
ఆయుధాల కొనుగోలు : ఆర్మీకి గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దీటుగా స్పందించేందుకు రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించింది. 500 కోట్ల రూపాయలలోపు ఎలాంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు రక్షణ దళాలకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టింది. అత్యవసర విధానాల కింద ఆయుధ సామాగ్రి కొనుగోలు కోసం త్రివిధ దళాలకు ఆర్థిక స్వేచ్ఛను ప్రభుత్వం సమకూర్చిందని, దీనికింద 500 కోట్ల రూపాయల లోపు ఎలాంటి నూతన ఆయుధాల కొనుగోలునైనా వారు స్వయంగా చేపట్టవచ్చని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తమ ఇన్వెంటరీలో లేనిపక్షంలో ఈ ప్రాజెక్టు కింద రక్షణ బలగాలు సైనిక వ్యవహారాల విభాగంతో సంపద్రింపుల ద్వారా ఆయా ఆయుధాలను నేరుగా కొనుగోలు చేయవచ్చని తెలిపాయి. త్రివిధ దళాలు ఇప్పటికే తమకు అవసరమైన ఆయుధాలు, పరికరాల జాబితాను రూపొందించి వాటిని అతితక్కువ సమయంలో సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నాయి. చదవండి : అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ -
వణికిస్తున్న రాకాసి మిడతలు
రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ డైరెక్టరేట్కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది. -
76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయపెడుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో అవన్నీ హద్రోగులు, క్యాన్సర్ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో అవన్ని కిక్కిర్సి పోయి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆస్పత్రి చూసినా అత్యధికంగా హృద్రోగులు, ఆ తర్వాత క్యాన్సర్ రోగులతో కిటకిటలాడుతుండేవి. కరోనా కేసుల తీవ్రత పెరిగినప్పటి నుంచి ఆ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. మూడోవంతు నుంచి సగం వరకు కేసులు తగ్గాయని అంతర్జాతీయ డేటాలు తెలియజేస్తున్నాయి. (ఇటలీ : కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశాం!) ఎందుకు? గుండె జబ్బులతో బాధ పడుతున్నవారు ఆస్పత్రుల్లో చేరకుండా ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? ఇంటి వద్దనే ప్రాణాలు విడుస్తున్నారా? అలాంటిదేమీ లేదని డేటాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్లోని 71 కార్డియాక్ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం హద్రోగులకు స్టంట్లు వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయడం 81 శాతం తగ్గిపోయాయి. వాటిలో స్టంట్లు వేయడం 40 శాతం తగ్గగా, గుండె జబ్బులు రాకండా ముందు జాగ్రత్తతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య 48 శాతం తగ్గింది. మొత్తంగా హద్రోగ సంబంధిత పరీక్షలు నిర్వహించడం 57 శాతం తగ్గింది. (విదేశాల నుండి విమానాలు.. ప్రణాళిక విడుదల) అమెరికాలోని 9 ప్రధాన కార్డియాక్ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం తీవ్రమైన గుండె జబ్బులతో (ఆపరేషన్ అవసరం లేని కేసులు) ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య 38 శాతం తగ్గింది. కోవిడ్ సమస్య వచ్చినప్పటి నుంచి హద్రోగ పరీక్షలు నిర్వహించడంలో, రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో తీవ్ర జాప్యం జరగుతున్నట్లు హాంకాంగ్ నుంచి అందిన డేటా తెలియజేస్తోంది. భారత్లో ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెలల మధ్య గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్, లంగ్స్ సహా 825 రకాల చికిత్సలకు సంబంధించిన తీవ్రమైన కేసుల సంఖ్య 20 శాతానికి తగ్గిందని ‘నేషనల్ హెల్త్ అథారిటీ’ సేకరించిన డేటా ప్రకారం స్పష్టం అవుతోంది. అదే ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సలు 76 శాతం తగ్గాయి. తీవ్రమైన గుండె కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆస్పత్రుల డేటాలు తెలియజేస్తున్నాయి. ఇవి కారణాలు కావచ్చు! 1. కోవిడ్ కారణంగా అనారోగ్యానికి చెందిన స్వల్ప లక్షణాలతో ఆస్పత్రులకు పరుగెత్తక పోవడం, 2. కరోనా వైరస్ను దష్టిలో పెట్టుకొని గుండె రక్త నాళాల్లో పేరుకు పోయిన రక్తాన్ని తొలగించేందుకు వైద్యులు సర్జికల్ పద్ధతులను అనుసరించక పోవడం. బ్లడ్ క్లాట్స్ను కరగించేందుకు ట్యాబ్లెట్లను సిఫార్సు చేయడం. క్లాట్స్ను కరిగించేందుకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉండడంతోపాటు ‘కీలేషన్ థెరపి’ లాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. 3. గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం తగ్గిపోవడం. 4. ఇళ్ల నుంచి పని చేసే సౌకర్యం లభించడంతో వత్తిపరమైన ఒత్తిళ్లు తగ్గిపోవడం. గుండె జబ్బులు కలిగిన వారిలో 50 శాతం మందికి వత్తిపరమైన ఒత్తిళ్ల వల్లనే గుండె జబ్బులు వస్నున్నాయన్నది తెల్సిందే. 5. ప్రయాణ బడలికలు కూడా తగ్గిపోవడం. 6. వేళకు నిద్రపోయే వెసలుబాటు లభించడం. 7. ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానం అందుబాటులో లేకపోవడం. 8. లాక్డౌన్ కారణంగా వాటిల్లుతోన్న ఆర్థిక నష్టం ముందు స్వల్ప అనారోగ్య సమస్యలను పట్టించుకోక పోవడం. 9. కరోనా కారణంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం. 10. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. -
ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్
-
దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కరోనా మహమ్మారి విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తరణ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. షికాగో బిజినెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా ఉన్న రాజన్ దేశం స్వాతంత్ర్యం తరువాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. 'ఇటీవలి కాలంలో భారతదేశపు గొప్ప సవాలు' అనే పేరుతో తన బ్లాగులో ఈ విషయాలను పేర్కొన్నారు. ( కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు) ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు తీవ్రంగా వుంది. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. మన దేశానికి సంబంధించి పలు సంస్థలు బలమైన వృద్ధిని సాధించాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంక్షోభంపై పోరాడటానికి సాధ్యమైన చర్యలను కూడా ఆయన సూచించారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని రాజన్ బ్లాగులో పేర్కొన్నారు. భౌతిక దూరం లాంటి కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని సూచించారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికి, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రణాళికలను రూపొందించడం, ఆమోదించడంతో పాటు సమర్ధవంతంగా అమలయ్యేలా పరిపాలన విభాగం చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, మానవత్వంతో వారిని ఆదుకోవడం సరైన పని అని రాజన్ ప్రధానంగా సూచించారు. చదవండి : కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
కువైట్లో అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్ (బాల్కొండ): కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కువైట్ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికోసం వివిధ దేశాలవారికి వేర్వేరు తేదీలను కేటాయించగా, భారతీయులకు 11 నుంచి 14వ తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారత్లో 14వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక అనుమతి కోసం భారత ప్రభుత్వంతో కువైట్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. -
'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి'
ఢిల్లీ : దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19ను కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ గురించి బయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రసుత్తం ఉన్న పరిస్థితులను ఎమర్జెన్సీగా భావించి టాస్క్ఫోర్స్ విభాగం పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లేడీ హార్డింగ్ ఆసుపత్రి, ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా సోకిన వ్యక్తితో పాటు అతనితో వచ్చిన 88 మందిని అధికారులు గుర్తించారని, వారందరికి కరోనాకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు ఇండియాలో 28 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ('ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!') (కరోనా ఎఫెక్ట్ : హోలీకి వారు దూరం) Delhi Chief Minister Arvind Kejriwal: A state-level task force has been constituted to control the situation arising due to #CoronaVirus. It will be chaired by me. It includes members from several agencies, departments & corporations. Each member has been assigned a role. pic.twitter.com/hlK92RpO1P — ANI (@ANI) March 4, 2020 -
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ యుద్ధం
బీజింగ్: చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మహమ్మారి నావల్ కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. భారత్ సహా ఇప్పటికే 20 దేశాలకు ఈ వ్యాధి త్వరితగతిన విస్తరిస్తోంది. తాజాగా బ్రిటన్లో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు జెనీవాలో అత్యవసరంగా సమావేశమై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా, ఈ వైరస్ సోకిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్రిశూర్ వైద్యులు తెలిపారు. చైనాకు బయల్దేరిన విమానం కరోనా వైరస్ భయంతో వూహాన్లో బిక్కుబిక్కు మంటూ ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా బీ746 విమానం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చైనాకు బయల్దేరి వెళ్లింది. ఈ విమానంలో ఐదుగురు వైద్యులు అయిదుగురు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. 400 మంది భారతీయుల్ని తీసుకొని శనివారం మధ్యాహ్నం వెనక్కి వస్తుంది. మరోవైపు సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ ఢిల్లీలో 600 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచింది. అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ అంటే.. ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి ఏదైనా వ్యాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉంటే అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడడానికి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనినే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ) అని అంటారు. పీహెచ్ఈఐసీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై సంయుక్తంగా పోరాటం చేయాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తారు. ఇప్పటివరకు గ్లోబల్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయిదు సార్లు విధించారు. 2009 – స్వైన్ ఫ్లూ; 2014 – ఎబోలా 2014 – పోలియో మళ్లీ పడగ విప్పినప్పుడు 2016– జికా వైరస్ 2019– ఎబోలా -
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తెగువ
లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, గురువారం జరిగిన మరో దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా, ఇటీవల బెయిల్పై విడుదలైన నిందితులు దారికాచి, దగ్గర్లోని పొలంలోకి ఈడ్చుకెళ్లి మరి నిప్పంటించారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్కు ఏర్పాట్లు చేస్తోంది. (లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..) -
‘1976’ నాటి పరిస్థితి పునరావృతం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ‘ఎమర్జెన్సీ’ కొనసాగుతున్నందున ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ను కొద్దికాలం రద్దు చేస్తున్నట్లు 1976లో సుప్రీం కోర్టు ప్రకటించింది. చట్టం కింద అరెస్ట్ చేసిన వారిని కోర్టు ముందు హాజరు పర్చాల్సిందిగా కోరుతూ దాఖలు చేసే పిటిషన్ ‘హబియస్ కార్పస్’ పిటిషన్ అంటారన్న విషయం తెల్సిందే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కొన్ని వందలాది మందిని నాడు ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన నేపథ్యంలో దాఖలైన హబియస్ కార్పస్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ పిటషన్ హక్కును రద్దు చేస్తున్నట్లు ఆసాధారణ తీర్పును వెలువరించింది. మాజీ ఐఏఎస్ అధికారి షా ఫాజల్ నిర్బంధంపై నాడు ఈ పిటిషన్ దాఖలయింది. కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగం 370వ అధికరణను ఎత్తివేసిన నేపథ్యంలో నిలిపివేసిన మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ‘కశ్మీర్ టైమ్స్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ ఆగస్టు 16వ తేదీన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ కాలం నాటి లాంటి ప్రకటనే చేసింది. అక్కడ పరిస్థితి మెరగు పడడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరుతున్నందున ‘కమ్యూనికేషన్ల పునరుద్ధరణ’పై మరికొంతకాలం నిరీక్షిద్దామని సుప్రీం చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ (ప్రైవసీ)కూడా ప్రాథమిక హక్కే అంటూ 2017లో కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు అదే వ్యక్తిగత స్వేచ్ఛకు నేడు భంగం కలిగితే ప్రభుత్వ పక్షాన మాట్లాడం ఆశ్చర్యంగా ఉంది. (చదవండి: కశ్మీర్లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!) -
1975 జూన్ 25.. అప్పుడేం జరిగింది?
భారతదేశ చరిత్రలో చీకటి రోజు అది. ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు. సరిగ్గా 44 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారంకోసం యావత్ జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించిన రోజు. అప్పటి ఇందిర ప్రత్యర్థి రాజ్ నారాయణ్ తరఫున వాదించిన లాయర్లలో ఒకరైన జేపీ గోయెల్ అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజు జరిగిన ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. గోయెల్ చెప్పిన ఆ విషయాలను ఆయన కుమార్తె రమా గోయెల్ ‘సేవింగ్ ఇండియా ఫ్రం ఇందిర’పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అందులోని వివరాల ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలుపు సాధించేందుకు ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నారాయణ్ ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఇందిర రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 25వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని బయటకు చదివి వినిపించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని కానీ, తుది తీర్పు వెలువడే వరకు ఆమె ఎంపీగా కొనసాగరాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇందిర మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని ఆ తీర్పులో పేర్కొ న్నారు. తీర్పు కాపీతో నేను బయటకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఆవరణ ఒక జనసంద్రంగా మారింది. పత్రికా విలేకరులు, ఇతర లాయర్లందరినీ దాటు కొని చాంబర్కు వెళ్లడానికి గంటకు పైగా పట్టింది. ప్రతిపక్షాల తీర్మానం చాంబర్లోకి వెళ్లిన కాసేపటికే రాజ్ నారాయణ్ ఆయనకు ఫోన్ చేశారు. అలహాబాద్ ఉత్తర్వులపై సుప్రీం పూర్తిస్థాయిలో స్టే విధించకపోవడంతో ఇందిర దిగిపోవాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థమయ్యేలా చెప్పాలంటూ అభ్యర్థించారు. అప్పటికే విపక్ష నేతలందరూ మొరార్జీ దేశాయ్ నివాసానికి చేరుకున్నారు. నేను అక్కడికి వెళ్లేసరికి జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ కలిసి కూర్చొని కనిపించారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ తన తీర్పులో ఇందిర ప్రధాని పదవిలో ఉండాలని తీర్పు ఇచ్చినప్పటికీ ఆమె దోషి అన్న అర్థం వచ్చేలా రాజకీయ పరమైన ఆస్తులు, ప్రజాస్వామ్య ధర్మాలు వంటివి ప్రస్తావించారు. దీంతో ఇందిర దిగాల్సిందేనంటూ కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్దళ్, జన్సంఘ్, సోషలిస్టు పార్టీ, అకాలీదళ్లతో కూడిన అయిదు పార్టీలు తీర్మానించాయి. అదే రోజు సాయంత్రం జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ప్రసంగించారు. ఇందిర వెంటనే గద్దె దిగకపోతే అయిదు విపక్షాల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులందరూ శాంతియుతంగా సత్యాగ్రహానికి దిగుతామని ప్రకటించారు. ఆ సభలో రాజ్ నారాయణ్ కూడా మాట్లాడారు. సభ ముగిసేసరికి రాత్రి 9.30 గంటలైంది. రాజ్ నారాయణ్ వాళ్లింటికి రమ్మని కోరడంతో వెళ్లాను. జరగరానిదేదో జరగనుందని అనుమానించిన రాజ్.. అక్కడే ఉండాలని కోరడంతో అక్కడే ఉండిపోయా. క్లైమాక్స్ ఎలా మారిందంటే.. నాకింకా నిద్ర పట్టలేదు. అప్పట్లో రాజ్ నారాయణ్ కార్యదర్శిగా ఊర్మిలేశ్ నన్ను లేపారు. ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్నారు. అప్పటికే జయప్రకాశ్ నారాయణ్ని అరెస్ట్ చేశారని సమాచారం అందినట్టు తెలిపారు. నేను హుటాహుటిన రాజ్ నారాయణ్ గదిలోకి వెళ్లేసరికి పోలీసులు ఆయనను అంతర్గత భద్రతా వ్యవహారాల చట్టం, 1971 (మిసా) కింద అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మాకు అర్థమైంది ఇందిర రాత్రికి రాత్రి ఎంతకి తెగించారో. అన్నింటికీ సిద్ధపడిన రాజ్ నారాయణ్ స్నానం చేసి కొన్ని పుస్తకాలు తీసుకువచ్చేవరకు పోలీసులు ఎదురు చూశారు. తర్వాత ఆయనను అరెస్ట్చేసి తీసుకువెళ్లిపోయారు. ది స్టేట్స్మన్, హిందూస్తాన్ టైమ్స్ మరో రెండు పత్రికలు తప్ప మిగతావేవీ మర్నాడు రాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్352 ప్రకారం అంతర్గత భద్రత ముప్పుగా మారడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినట్టు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఉత్తర్వులే అన్ని పత్రికల్లో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత హిందూస్తాన్ టైమ్స్ పత్రిక నా స్పందన కోరితే నేను చెప్పింది ఒక్కటే. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి కాదు. తన పదవి కాపాడు కోవడానికి ఇందిర విధించిన వ్యక్తిగత అత్యవసర పరిస్థితి. ఈ దేశంలో ప్రజాస్వామ్యమే నశించింది. అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇందిర పదవి దిగిపోయి ఉంటే హుందాగా ఉండేది.. అని లాయర్ జేపీ గోయల్ ముక్తాయించారు. ‘ఎమర్జెన్సీ హీరో’లకు ప్రధాని సెల్యూట్ న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిని ఎదురించి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ప్రధాని మోది నివాళులర్పించారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన మహనీయులందరికీ దేశం సెల్యూట్ చేస్తోంది. నియంతృత్వ విధానాలపై భారత దేశ ప్రజాస్వామ్య విలువలు విజయం సాధించాయి. 1975లో ఇదే రోజు అధికారం కోసం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఎందరో భారతీయ జన్సంఘ్, ఆర్ఎస్ఎస్ నేతలు ముందుండి పోరాడారు’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటిరోజులుగా మిగిలిపోయాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వారందరికీ నివాళులర్పించారు. ఐదేళ్లుగా సూపర్ ఎమర్జెన్సీ:మమత అప్పటి ప్రభుత్వం ఇదే రోజు 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి దాదాపు రెండేళ్లు కొనసాగిందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం హయాంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
‘మోదీ హయాంలో సూపర్ ఎమర్జెన్సీ’
కోల్కతా : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంను 44 ఏళ్ల కిందట ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోల్చారు. ఎమర్జెన్సీ పాఠాల నుంచి దేశం గుణపాఠాలు నేర్చుకుని, ప్రజాస్వామ్య వ్యవస్ధలను కాపాడుకోవాలని ఆమె హితవు పలికారు. ‘ఇవాళ మనం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భం గుర్తుచేసుకుంటున్న క్రమంలో గత ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోందని, చరిత్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పరిరక్షణకు పోరాడా’లని ఆమె ట్వీట్ చేశారు. కాగా గత కొన్నేళ్లుగా పలు అంశాలపై మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను మమతా బెనర్జీ ఎత్తిచూపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్లో ఎన్నికల అనంతర హింసాకాండలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు మరణించడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు తారాస్ధాయికి చేరాయి. -
ఎమర్జెన్సీ ప్రకటనకు 44 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎమర్జెన్సీ విధించడం ఓ చీకటి అథ్యాయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 1975లో జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి నేటికి 44 సంవత్సరాలైన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మంగళవారం ట్వీట్ చేశారు. 44 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున సమాజంలో పౌర, రాజకీయ అశాంతిని కారణాలు చూపుతూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారని, పెద్దసంఖ్యలో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించారని గుర్తుచేశారు. మీడియాపై అణిచివేత వైఖరి ప్రదర్శించారని దుయ్యబట్టారు. భారత్లో ఎమర్జెన్సీ ప్రకటన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు భారత చరిత్రలో చీకటి అథ్యాయమని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. భారత పౌరులుగా నేడు మనం దేశ సమగ్రత, మన వ్యవస్థలు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కట్టుబడాలని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ధ్వజమెత్తారు. అధికారం కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను పణంగా పెట్టారని, ప్రజలు అమితంగా గౌరవించే రాజకీయ నేతలను జైల్లో పెట్టారని, కేవలం గాంధీ కుటుంబ ప్రయోజనం కోసమే ఇదంతా చేశారని ప్రధాని మండిపడ్డారు. -
శ్రీలంక అనూహ్య నిర్ణయం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 21 ఉగ్రదాడి అనంతరం దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేటి (జూన్ 22) తో ముగియనున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ డిక్రీ జారీ అయ్యింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంకా అత్యవసర పరిస్థితి ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజా భద్రత చట్ట నిబంధనలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దేశ రాజధాని కొలంబో నగరంలో ఈస్టర్ సండే రోజు హోటళ్లు, చర్చిలపై దాడులు నేపథ్యంలో శ్రీలంక అతలాకుతలమైంది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 258కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల సంఘటన తరువాత దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ : కొలంబోలో 87 బాంబులు లభ్యం
కొలంబో : వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందనే సంకేతాలు పంపారు. ఎమర్జెన్సీపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటన చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. కొలంబో మెయిన్ బస్టాండ్ వద్ద సోమవారం పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. భారీ పేలుళ్లకు కుట్ర జరిగిందని అధికారులు వెల్లడించారు. 24 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు దాడి వెనుక నేషనల్ తౌహీత్ జమాద్ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు. ఇక శ్రీలంక వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 300కు చేరువైంది. మరో బాంబు పేలుడు శ్రీలంకను వరస బాంబు పేలుళ్లు వణికిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కొచ్చికేడ్లోని సెయింట్ ఆంథోనియా చర్చి వద్ద మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. తాజా పేలుడుతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొలంబోలోని హోటళ్లన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. -
ఆపద వాహనానికి నీటి కష్టాలు
సాక్షి, వేములవాడరూరల్: ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే గుర్తుకు వచ్చేది అగ్నిమాపక వాహనం. అదే వాహనానికి నీరు లేకపోతే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేములవాడ మండల కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నీరు లేక అక్కడ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్షరాలా సత్యం. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో మంచినీటి కొరకు బోరు వేయగా ప్రస్తుతం ఆ బోరు నీరు లేక అడుగంటుకుపోయింది. ఇక వాహనంలో నీరు నింపడానికి చెరువులు, బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అక్కడ సిబ్బందికి ఏర్పడుతోంది. అసలే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతీరోజు ఎక్కడో ఒక్కచోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఈ వాహనంలో 24 గంటలు నీరు ఉండాల్సి ఉండగా నీటి సమస్య ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి చెరువు లేక మల్లారం వెళ్లే బావి వద్ద నీరు తప్పా వారికి ఎలాంటి నీటి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం కల్పించాలంటూ మున్సిపాలిటీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సమయంలో ఇలాంటి కష్టం ఉంటే మరికొన్ని రోజుల్లో ఎండలు తీవ్రత పెరిగిన తరువాత ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఇప్పటి నుండి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని ఆకాశగంగ పైప్ లైన్ సౌకర్యం అగ్నిమాపక కేంద్రానికి కల్పించాలని వారు కోరుతున్నారు. 6 మండలాలకు ఇదే ఆధారం వేములవాడ ఫైర్ స్టేషన్ వాహనం 6 మండలాలకు ఆధారంగా ఉన్నది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా వేములవాడ నుండే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాహనంలో నీరు అందుబాటులో ఉండాలి. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో సంఘటన జరిగినా వేములవాడ నుండి వెళ్లాల్సిందే. ఇక్కడ నీరు అందుబాటులో 24 గంటలు ఉండాలి కానీ నీరు లేకపోవడంతో వారు ఉన్న 10 మంది మంది సిబ్బంది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫైర్స్టేషన్ ఇన్చార్జి సతీష్కుమార్ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో అదే కార్యాలయంలో పని చేస్తున్న పవన్కుమార్ నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమర్జెన్సీ హెల్ప్లైన్ @ 112
న్యూఢిల్లీ: ఏకీకృత అత్యవసర హెల్ప్లైన్ నంబర్ ‘112’ను మంగళవారం 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఎఆర్ఎస్ఎస్) కింద ప్రవేశపెట్టిన 112 హెల్ప్లైన్ కింద ప్రస్తుతం పోలీసు (100), ఫైర్ (101), మహిళల హెల్ప్లైన్ (1090)లను అనుసంధానించగా, త్వరలోనే హెల్త్ హెల్ప్లైన్ (108)ను కూడా చేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. -
ఫ్రాన్స్లో ఆందోళనలు హింసాత్మకం
పారిస్: ఫ్రాన్స్లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా రెండువారాల నుంచి జరుగుతున్న ఆందోళనలు శని, ఆదివారాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్లో అత్యవసర స్థితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి బెంజమిన్ గ్రైవాక్స్ వెల్లడించారు. జీ–20 సమావేశాల కోసం అర్జెంటీనా వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకుని ప్రధాని, హోం మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హింస చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. పెట్రోల్, డీజిల్లపై పన్నులు తగ్గించాలని కోరుతూ నిరసనకారులు నవంబర్ 17 నుంచి రాజధాని పారిస్తోపాటు పలుచోట్ల ‘యెల్లో వెస్ట్’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్లోనే 133 మంది గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన యువకులు ఇనుప రా డ్లు, గొడ్డళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రయోగించే బాష్పవాయువు నుంచి రక్షించుకునేందుకు కొందరు ఆందోళనకారులు గ్యాస్ మాస్క్లను, ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం చర్చలకు రావాలి: ప్రభుత్వం ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా చర్చలకు రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. ‘హింసను నేను ఎన్నటికీ అనుమతించను. అధికార భవనాలపై దాడులు చేయడం, వాణిజ్య సముదాయాలను కొల్లగొట్టడం, రోడ్లపై వెళ్తున్న వారిని, విలేకరులను బెదిరించడం వంటి చర్యలకు ఏ కారణమూ సమర్థనీయం కాదు’ అని మేక్రాన్ చెప్పారు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి ఓ నాయకుడు, నేతృత్వం వహించే పార్టీ/సంస్థ అంటూ ఏదీ లేదు. దీంతో ఎవరితో చర్చలు జరపాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. పన్నులు పెంచి, డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణహిత ఇంధనాలవైపునకు ప్రజలను మళ్లించేందుకేననీ, ఈ విషయం వారికి సరిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయామని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూలుడిగా పేరున్న మేక్రాన్ ఇప్పటివరకు పన్నులను తగ్గించేందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే మేక్రాన్ అధికారంలోకి వచ్చాక కంపెనీలపై పన్నులను తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇవి అవసరమని ఆయన వాదన. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వమే కారణమని పలువురు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మేక్రాన్ -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోలకతా: ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. గువహటికి వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్నకొన్నినిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కాక్పిట్లో పొగ అలారం మోగడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగానికి సమాచారం అందించారని తెలిపారు. పొగలను గుర్తించినట్టు చెప్పారు. అయితే పైలట్ అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు, సిబ్బందితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఢిల్లీ కాలుష్యానికి ఎమర్జెన్సీ ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా చెత్త తగలబెట్టడాన్ని నిలిపివేయటం, ఇటుక బట్టీలు, పరిశ్రమల వద్ద వాయు కాలుష్య నిబంధనలను అమలు చేయడం, అత్యాధునిక యంత్రాల ద్వారా రోడ్లను శుభ్రం చేయటం వంటి చర్యలు తీసుకోనున్నారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించనున్నారు. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. విద్యుత్ సమస్య దృష్ట్యా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో మాత్రం నిషేధం లేదు. గాలి నాణ్యత ఇంకా దిగజారితే పార్కింగ్ ఫీజును 3–4 రెట్లు పెంచటం, బస్సులు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతారు. మరోవైపు.. పంజాబ్, హరియాణాల్లో రైతులు గోధుమ గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలను నాసా శాటిలైట్ చిత్రీకరించింది. అక్టోబర్, నవంబర్లో పంజాబ్, హరియాణాల్లో గోధుమ గడ్డిని తగులబెట్టడంతో చెలరేగే పొగకు తోడు దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరిగింది.