ప్రజలందరికీ మేలు చేశాం | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ మేలు చేశాం

Published Wed, May 8 2024 5:15 AM

ప్రజలందరికీ మేలు చేశాం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో దాదాపు 33 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాం. అందులో చాలా మందికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వమే పూర్తి సహకారం అందించింది. కులం, మతం, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి, సొంత ఇంటి కల నెరవేర్చాం. సంక్షేమం విషయంలో అయితే ప్రతీ మండలానికి దాదాపు రూ.20 కోట్లకు పైగానే లబ్ధి చేకూరింది. అభివృద్ధి విషయంలో దాదాపు రూ.400 కోట్ల పైగా నిధులతో ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాం. రైతు భరోసా కేంద్రాలు, రోడ్లు, అర్బన్‌/రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లు, గ్రామ సచివాలయాలు, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి, ఇతరాత్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాం. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం అందించిన సహకారంతో పాటు నా సొంత నిధులు రూ.3 కోట్లకు పైగా వెచ్చించి ప్రజలను అన్ని విధాల ఆదుకున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహకారం అందించాను. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.

– అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, ఎమ్మెల్యే, పెందుర్తి

 
Advertisement
 
Advertisement