ఆదివారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2024
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నా యక్ అన్నారు. ఓటరు చైతన్యంపై శనివారం స్వీప్ ఆధ్వర్యాన కలెక్టరేట్ నుంచి అదాలత్ కూడలి వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ నాగ పద్మజ, మెప్మా పీడీ భద్రునాయక్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్