సందేహాల నివృత్తికే పెన్షన్ జీపీఎఫ్ అదాలత్
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్
కడప సెవెన్రోడ్స్: ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్లకు సంబంధించి వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకే పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సభా భవన్లో అకౌంటెంట్ జనరల్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్, అకౌంట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో ఉన్న ఉద్యోగుల జీపీఎఫ్, పెన్షన్ సమస్యలపై పెన్షన్/జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళిసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అయిన మరుసటి రోజునే పెన్షన్ మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు.
అందుకు సంబంధించి ప్రతి ఉద్యోగి ఆరు నెలల లోపుగా పెన్షన్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి ద్వారా పంపించాలన్నారు. ప్రభు త్వ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే సమయానికి సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ ఉండేలా చూసుకోవడం ఉద్యోగి బాధ్యత అన్నారు. సర్వీస్ రిజిస్టర్లో అన్ని ఎంట్రీస్ కరెక్ట్గా ఉండేలా సరిచూసుకోవాలన్నారు. పెన్షన్ డాక్యుమెంట్స్ తమకు అందిన వెంటనే ఏజీ నియమ నిబంధనల ప్రకారం వేగవంతంగా పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సదస్సు అనంతరం జిల్లా వ్యాప్తంగా పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీఓ)లను అందజేశారు. అలాగే 30 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ పత్రాలను అందించారు. ఈ సదస్సులో డైరెక్టరేట్ ఆఫ్ ఆడిటర్ జనరల్ లలిత్ కుమార్, ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహ న్ రావు, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్లు సునీత, చంద్రశేఖర్, భవాని ప్రసాద్, విజయ్ కుమార్,కడప ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, సబ్ ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు, ఇతర ట్రెజరీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment