-
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
సాక్షి,పాడేరు: జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెల్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. బుధవారం 1676 మంది ఓటుహక్కును వినియోగించుకోగా, ఈ ఐదు రోజులకు గాను 9188 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టు తెలిపారు. బాధితులు ఆధారాలు చూపిస్తే నష్ట పరిహారం జి.మాడుగుల: జాతీయ రహదారి 516ఈ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు, షాపులు, భూములు తదితర ఆస్తులు కోల్పోతున్న బాధితులు వాటి ఆధారాలు చూపిస్తే తగిన నష్టపరిహారం చెల్లిస్తామని హైవే నిర్మాణ విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లంబసింగి నుంచి జి.మాడుగుల మీదుగా పాడేరు వరకు హైవే 516ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, షాపులు కోల్పోతున్న వారు అపిడవిట్ చేయించి ఆధార్కార్డు, రేషన్, బ్యాంకు పాస్ పుస్తకం, కరెంట్ బిల్లు తదితర పత్రాలు సిద్ధంగా ఉంచాలని వారు తెలిపారు. త్వరలో వీటిని పరిశీలించి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. జి.మాడుగుల మండల కేంద్రంలో ఉరుము జంక్షన్ నుంచి పీహెచ్సీ జంక్షన్ వరకు 130 మంది బాధితులు ఉన్నారని.. వీరందరికీ నష్టపరిహారం అందిస్తామని వారు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా 12 మీటర్ల మేర వెడల్పు చేస్తామని వారు తెలిపారు. -
కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
మోతుగూడెం: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాయని రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో బుధవారం వై.రామవరం మండలం సింధువాడ, మంగంపాడు, బచ్చులూరు, డొంకరాయి వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్షో, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఆయనతో మాత్రమే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని ఆమె కోరారు.గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన అమలు చేయలేదన్నారు. డ్వాక్రా రుణ మాఫీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ విజయం తథ్యం ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ముంచంగిపుట్టు: సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ కుమిడిపుట్టులో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి మత్స్యలింగం, ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజరాణిని గెలిపించాలని కోరారు. భారీగా రోడ్షో, బైక్ ర్యాలీ నిర్వహణ ప్రచారం నిర్వహించిన రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులివీ..
● పెదలబుడులో రూ.89 లక్షలతో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ నిర్మాణం. ● అరకులోయలో రూ.2.55 కోట్లతో అందుబాటులోకి వచ్చిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అగ్రిటెస్టింగ్ ల్యాబ్, ప్రాంతీయ పశుసంవర్ధకశాఖ భవనం నిర్మాణం. ● పానిరంగినిలో రూ. 68 లక్షలతో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు ● పానిరంగిని వద్ద రూ.12 కోట్లతో మహిళ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి ● ఐటీఐ నుంచి ఎండపల్లివలస వరకు రూ. 14కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ● ఐటీఐ నుంచి ఎండపల్లివలస వరకు రూ.14కోట్ల రోడ్డు విస్తరణ పనులతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరింది. ● పెదలబుడు పంచాయతీ కేంద్రంలో సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్సెంటర్ భవనాల సుమారు రూ.89 లక్షలతో పనులు జరుగుతున్నాయి. రూ.45లక్షలతో సచివాలయం పనులు జరుగుతున్నాయి. ● శ్మశాన వాటికకు రూ.20లక్షలు పంచాయతీ నిధులు వెచ్చించి, సీసీరోడ్డు వేశారు. అదే గ్రామంలోని రచ్చబండని రూ.4లక్షలతో నిర్మించారు. -
No Headline
పథకం లబ్ధిదారుల నగదు సంఖ్య (రూ. కోట్లలో) రైతు భరోసా 39,937 207.48 అమ్మ ఒడి 93,947 108.18 చేయూత 15,505 78.49 వైఎస్సార్ ఆసరా 53,222 125.46 వైఎస్సార్ పెన్సన్లు 38,370 10.31 మనబడి నాడునేడు 158 37.74 కాపు నేస్తం 12,027 18.04 వాహన మిత్ర 8,984 8.98 ఆరోగ్యశ్రీ 19,094 41.01 జగనన్న హౌసింగ్ 6,901 69.70 సున్నా వడ్డీ 53,207 16.08 జగనన్న చేదోడు 5,516 5.51 విద్యా దీవెన 19,375 45.56 ఇవి కాకుండా... పాస్టర్లు, ఇమామ్ 59 రూ.11,58,000 ఈబీసీ నేస్తం 411 రూ.65,39,763 మత్స్యకార భరోసా 423 రూ.42,30,000 -
ఇవీ అభివృద్ధి పనులు
● అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి మరమ్మతు పనులను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి నిధులను మంజూరు చేయించారు. ● ప్రస్తుతం పనులు జోరుగా సాగుతున్నాయి. ఇది యాభై గ్రామాలకు సంబంధించిన సమస్య. ● మునగపాక–పెదపాడు–కశింకోట రహదారుల అనుసంధానం ● మునగపాక–రాజుపేట రహదారి మరమ్మతులు ● యలమంచిలిలో దీర్ఘకాలిక సమ స్య అయిన ఫ్లై ఓవర్ పనుల పూర్తి ● పూడిమడక ఫిషింగ్ హార్బర్కు సంబంధించి రహదారి పనులు ● కొండకర్ల ఆవలో పర్యాటకుల సౌకర్యార్థం ఎంపీ సత్యవతి సహకారంతో ఫైబర్ జెట్టీ నిర్మాణానికి చొరవ ● ఏసియన్స్ పెయింట్స్ సహ కారంతో అచ్యుతాపురం, మున గపాక మండలాల్లో చెరువుల తవ్వకం, సాగునీటి వనరుల అభివృద్ధి ● యలమంచిలిలో చెరువుల అభి వృద్ధి ● అగ్రి ల్యాబ్కు కోటి రూపాయల నిధులు, హెల్త్ క్లినిక్ల నిర్మాణం ● సెజ్ పునరావాల కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులు -
గ్రామాల్లో ప్రచార హోరు
అరకులోయ రూరల్/అనంతగిరి/పెదబయలు: అరకు నియోజకవర్గంలో అరకులోయ, అనంతగిరి, పెదబయలు మండలాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలోనే మన్య ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. గిరిజనుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.. జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్కమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అరకులోయ మండలంలోని ఎన్నికల ప్రచారంలో పీఏసీఎస్ డైరెక్టర్ మాదల పుష్ప, సర్పంచ్లు సుస్మిత, కళావతి, బొజ్జ, భాస్కరరావు, రాధిక, జ్యోతి, రమేష్, బుట్కి, ఎంపీటీసీ సభ్యులు రాములమ్మ, లలితదేవి, ఆనందకుమార్, రామచందర్, వైస్ ఎంపీపీ సుమాంజలి, రామన్న, పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కిరణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి శ్రీను, సాంబ, సుంక్ర, అర్జున్, తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి మండలంలోని ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, సర్పంచ్లు సీతయ్య, పాంగి అప్పారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్యనారాయణ, నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు.పెదబయలులోని ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు వంతాల ఆనందరావు , రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, ఎంపీపీ బొండా వరహాలమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు బొంజుబాబు, అగ్రో డైరెక్టర్ సన్యాసి. మాజీ జెడ్పీటిసీలు గంగాభవాని, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగుల/జీకే వీధి/కొయ్యూరు/చింతపల్లి రూరల్: పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జి.మాడుగుల, జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి మండలాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. జగనన్న పాలన దేశానికి మార్గదర్శకంగా మారిందన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజును గెలిపించాలని కోరారు. జి.మాడుగులలోని ఎన్నికల ప్రచారంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బాడి సన్యాసిదొర, సర్పంచ్లు హనుమంతరావు, రాంబాబు కొండబాబు, మాజీ సర్పంచ్ పండుదొర తదితరలు పాల్గొన్నారు.గూడెం కొత్తవీధిలోని ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ బోయిన కుమారి, మండల పార్టీ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ , వైస్ ఎంపీపీలు ఆనంద్, దేవుడు, సర్పంచ్లు లక్ష్మి, సుభద్ర, కాసులమ్మ, ఎంపీటీసీలు నాగమణి, కృష్ణమూర్తి నేతలు అంజీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. య్యూరులో ఎంపీపీ బడుగు రమేష్, వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలు, చింతపల్లి ఏఎంసీ చైర్మన్ రాజులమ్మ, సచివాలయ కన్వినర్ సుధాకర్, పార్టీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ జల్లి హాలియారాణి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం/మారేడుమిల్లి/గంగవరం/అడ్డతీగల/చింతూరు/వీఆర్ పురం/రాజవొమ్మంగి: రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, చింతూరు, వీఆర్ పురం, రాజవొమ్మంగి తదితర మండలాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమైందన్నారు. పోడు భూములపై హక్కులు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. జగనన్న పాలన దేశానికి ఆదర్శమన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనూజారాణి, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. రంపచోడవరంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, సర్పంచ్ బొజ్జయ్య, పార్టీ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు కాపారపు రూతూ, అన్నవరం డైరెక్టర్ కారుకోడి పూజ, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, ఉప సర్పంచ్ కన్నబాబు, అనిల్కుమార్, వేము తదితరులు పాల్గొన్నారు. మారేడుమిల్లి మండలంలోని ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె బాలాజీ బాబు, ఎంపీపీ సార్ల లలిత కుమారి, పార్టీ మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అనిల్ ప్రసాద్ (బాబీ), కో–ఆప్షన్ సభ్యుడు ధర్మరాజు, ఏఎంసీ డైరక్టర్ దూడ స్మిత్, వైస్ సర్పంచ్ వీరబాబు, సత్తి సునీల్, విక్టర్ బన్ను, అనిధీప్, సురేష్ తధితరులు పాల్గొన్నారు. గంగవరంలోని ఎన్నికల ప్రచారంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అడ్డతీగల మండలంలో ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చింతూరు మండలంలోని ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్, కో–ఆప్షన్ మెంబర్ ఎండీ అక్బర్అలీ, సర్పంచ్లు కన్నారావు, సత్తిబాబు, పీఏసీఎస్ చైర్మన్ విజయ్రెడ్డి, కన్వీనర్లు రామలింగారెడ్డి, కృష్ణ, ఎండీ జిక్రియా, రాజు, మురళి, రాంప్రసాద్, సత్యనారాయణ, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ పురం మండలంలోని ఎన్నికల ప్రచారంలో మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు,మాజీ కన్వీనర్ పొడియం గోపాల్ , జేసీఎస్ మండల ఇన్చార్జి సత్యనారాయణ, సర్పంచ్ రామారావు, ఎస్సీఎస్టీ విజిలెన్స్ అండ్ మానీటరింగ్ కమిటీ సభ్యుడు చిక్కాల బాలు, నాయకులు మాచర్ల గంగులు, జయరాజ్, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి మండలంలోని ఎన్నికల ప్రచారంలో వైస్ ఎంపీపీ చప్పా చంద్రరాణి, దుర్గాప్రసాద్, వెంకటరమణ, కుశరాజు, సురేష్కుమార్, శాంతకుమారి, మూర్తి, రమణ, వీరబాబు, సత్తిబాబు, బాబి తదితరులు పాల్గొన్నారు. -
పాడేరు..విలక్షణ తీరు
ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు : 2,41,445 పురుషులు : 1,17, 530సీ్త్రలు : 1,23, 909ఇతరులు : 6నియోజకవర్గ స్వరూపం● పర్యాటకంగా ప్రత్యేక గుర్తింపు ● అల్లూరి పేరిట జిల్లాగా ఖ్యాతి ● వైఎస్సార్సీపీ వైపే గిరిజనంజిల్లాల పునర్విభజనతో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా కేంద్రంగా పాడేరు అవతరించింది. రెండేళ్ల క్రితం వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 1967లో ఆవిర్భవించింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాడేరు నియోజకవర్గంలో కొన్ని మండలాలను వేరు చేసి, మరికొన్నింటిని కలిపారు. అంతకుముందు పాడేరుతోపాటు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట మండలాలు ఈ నియోజకవర్గంలో ఉండేవి. 2009లో అరకులోయ నియోజకవర్గం ఏర్పడగా హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలను అందులో కలిపారు. చింతపల్లి నియోజకవర్గాన్ని రద్దు చేసి చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాలను పాడేరులో ఉంచారు. 2009 సాధారణ ఎన్నికల్లో పాడేరు శాసనసభ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చింతపల్లి నియోజకవర్గంలో అంతకు ముందున్న రోలుగుంట మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో చేరింది. కొత్తగా ఏర్పడిన పాడేరు నియోజకవర్లంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ● పాడేరు నియోజకవర్గంలోని సామాజిక వర్గాల్లో మొదటి స్థానంలో భగత, రెండో స్థానంలో కొండదొర, మూడవ స్థానంలో వాల్మీకి, తరువాత స్థానంలో ఆదివాసీ (పీవీటీజీ)లున్నారు. 2014, 2019 ఎన్నికల్లో భగత కులానికి చెందిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు గిడ్డి ఈశ్వరి (చివర్లో టీడీపీకి మారారు), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. పాడేరు: జిల్లా కేంద్రంగా పాడేరు ఏర్పాటైన నాటి నుంచి ఊహించని స్థాయిలో గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం వల్ల మెజారిటీ ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు. చంద్రబాబు హయాంలో విడుదలైన బాకై ్సట్ తవ్వకాల జీవోపై పోరాటానికి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసి గిరిజనుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుచేసి కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేశారు. ఇలాంటివి ఎన్నో శాశ్వత ప్రయోజన కార్యక్రమాలు చేపట్టి గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. నియోజకవర్గ ప్రత్యేకతలు ● ఏటా మేలో నిర్వహించే పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. ● పాడేరు మండలం వంజంగిలో మేఘాల కొండ విశ్వవ్యాప్తి పొందింది. ● జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ● చింతపల్లి మండలం లంబసింగి, చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏటా చలికాలంలో ఒక్కసారైనా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ● సీలేరు జలవిద్యుత్ కేంద్రం డ్యామ్, గాదిగుమ్మి జలపాతం, అల్లూరి నడయాడిన మంప ప్రాంతాలు పర్యాటకంగా గుర్తింపు పొందాయి. 1967లో నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 5సార్లు, జనతా పార్టీ ఒకసారి, బీఎస్పీ ఒకసారి, టీడీపీ మూడు సార్లు, వైఎస్సార్సీపీ రెండు సార్లు విజయం సాధించాయి. ● 1978తో జనతా పార్టీ తరఫున గిడ్డి అప్పలనాయుడు కాంగ్రెస్కు చెందిన తమర్భ చిట్టినాయుడుపై 2507ఓట్లతో గెలిచారు. ● 2004లో బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)తరఫున లకే రాజారావు విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సమ్మెట రవిశంకర్పై 7555 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా బహుజన సమాజ్ వాదీ పార్టీ పాడేరు నియోజకవర్గంలో విజయం సాధించడం విశేషం. ● 2009 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పసుపులేటి బాలరాజు ప్రత్యర్థి అభ్యర్థి గొడ్డేటి దేముడుపై 587 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ● 2014లో ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ప్రత్యర్థి గొడ్డేటి దేముడుపై 26,243 ఓట్లతో గెలిచారు. అనంతరం 2018లో ఆమె టీడీపీలో చేరారు. ● 2019లో జరిగిన ఎన్నికలో వైఎస్సార్సీపీ తరఫున కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ట మెజారిటీతో విజయం సాధించారు. ● ఐదు మండలాలు ఉండగా అన్నిస్థానాల్లో జెడ్పీటీసీ, జి.మాడుగుల మినహా మిగతాఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.రాజకీయ పోరు -
జగనన్నతోనే పేదల జీవితాల్లో వెలుగులు
హుకుంపేట: మండలంలోని మట్టుజోరు, తీగలవలస, తడిగిరి పంచాయతీల్లో పలు గ్రామాల్లో అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం బుధవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో, చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్నతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. మరింత సంక్షేమం, అభివృద్ధి పొందేందుకు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.నియోజకవర్గ ప్రాంతాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యురాలు మత్యరాస వెంకటలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు గెమ్మెలి కొండబాబు, జేసీయస్ మండల ఇన్చార్జి కె.రామకృష్ణ, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి బూషణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండలరావు, సర్పంచ్లు ఎస్.సాంభ, పి.బేసు, ఎంపీటీసీ సభ్యులు నాగరాజు, భీమలింగేశ్వరరావు, నాయకులు కాసులమ్మ, రవిప్రసాద్, చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సారథి జగనన్నకు పట్టం కడదాం చింతపల్లి రూరల్: వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్య్సరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మండలంలో గొందిపాకల పంచాయతీ సమ్మగిరి, తోట మామిడి, తాటి బంద, గొందిపాకలు, రాజుపాకలు,చింతల వీధి, రాజుపాకల గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సంక్షేమ సారథి జగనన్నకు పట్టం కడదామన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు, కో–అప్షన్ సభ్యులు నాజర్వలీ, జేసీఎస్ కన్వీనర్ గణబాబు, ఎంపీటీసీలు జయలక్ష్మి, మీనాకుమారి, రూతు, మోహన్రావు,మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణ పాల్గొన్నారు. -
యలమంచిలి.. ప్రగతి లోగిలి
వసతులపల్లి రాంబిల్లిఎన్నో ప్రత్యేకతలున్నా దశాబ్దాలుగా వెనకబడి ఉన్న యలమంచిలి నియోజకవర్గం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక దినదినాభివృద్ధి చెందుతోంది. హస్తకళల కాణాచిగా, పరిశ్రమల హబ్గా మరింత ప్రగతి సంతరించుకుంది. సంక్షేమానికి, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు నేతృత్వంలో రూ.కోట్లాది నిధులతో పర్యాటకంగా, మౌలిక వసతుల పరంగా, ఉపాధి పరంగా ముందడుగు వేస్తోంది. మెలిపాకలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకంఅచ్యుతాపురం : సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న యలమంచిలి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలవతో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత యలమంచిలి నియోజకవర్గం అందరి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో యలమంచిలి ప్రగతిపథంలో విరాజిల్లుతోంది. పర్యాటక పరవళ్లు, ఏటికొప్పాక ఘన వారసత్వానికి గుర్తింపు, తీర ప్రాంత మత్స్యకారులకు ఉపాధి, ఊతమిచ్చే ఫిషింగ్ హార్బర్తో పాటు అనేక విప్లవాత్మక మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిశ్రమల హబ్గా నిరుద్యోగులకు వరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ, నీటి వనరుల్ని ఒడిసిపడుతూ ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు నెలవై అభివృద్ధి బాటన పయనిస్తోంది. నాడు శిథిల మైన సర్కారు బడుల స్థానంలో నేడు కా ర్పొ రేట్ హంగులతో చక్కని పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. విద్యా రంగంలో చక్కని మార్పు రాగా, ప్రభు త్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజావైద్యానికి బాసటగా నిలిచాయి. సీఎం జగన్ పాలన ఈ నియోజక వర్గంలో ఒక సువర్ణ యుగంగా చెప్పుకోవచ్చనడంలో ఎటువంటి సందేహం లేదు. యలమంచిలి : యలమంచిలి పట్టణంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. దీంతో పట్టణ ప్రజలు రైల్వే గేట్ వద్ద ఎక్కువ కాలం పాటు నిరీక్షించే సమయం ఇక ఆదా అవుతంది. యలమంచిలి ఆస్పత్రిని మరింత అప్గ్రేడ్ చేసి అనేక వసతులు కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అఽధికారం చేపట్టాక సీఎం వై.ఎస్. జగన్మోహనరెడ్డి పలు అభివృద్ధి పనులు చేయడమే గాక సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల లబ్ధిదారులకు ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నారు. అంతేగాక నాడు–నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారు. పీహెచ్సీలను అధునాతనంగా నిర్మించి ఇద్దరేసి వైద్యులను నియమించారు. పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు. సంక్షేమ పథకాల వివరాలుఅభివృద్ధికి ఏరువాక మునగపాక మండలంలోని కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మండల వ్యాప్తంగా 21 సచివాలయాలకు గాను రూ.8.8 కోట్లను కేటాయించారు. అలాగే 21 ఆర్బీకేలకు ఒక్కో ఆర్బీకేకు రూ.22 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం 5 ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చాయి. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా 39 పనులకు గాను రూ.17 కోట్ల కేటాయించింది. అలాగే నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 24 పాఠశాలలకు గాను రూ.10 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతగా 18 పాఠశాలలకు గాను రూ.8 కోట్లు కేటాయించారు. అలాగే 23 ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.16.5 కోట్లు ఖర్చు చేశారు. మౌలిక వసతుల పెంపుఐదేళ్లలో రూ.కోట్లాది అభివృద్ధి పనులు రహదారులు, చెరువుల అభివృద్ధి పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు -
లోయలోకి దూసుకెళ్లిన ఆటో
● 9 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషయం ● క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన వైఎస్పార్సీపీ నాయకులు పెదబయలు : మండలంలోని పెదకోడాపల్లి ఘాట్లో గురువారం సాయంత్రం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో 9 మంది గాయపడ్డారు. ప్రయాణికులు అందించిన వివరాలివి. హుకుంపేట మండలం చిలకలమామిడి గ్రామానికి చెందిన 8 మంది ఆటోలో పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ బంగారుమామిడి గ్రామానికి తమ బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పెదకోడాపల్లి ఘాట్లో మలుపు వద్ద ఆటో, ఎదురుగా వస్తున్న బైకు ఢీకొన్నాయి. దీంతో ఆటో 20 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కుంతుర్ల పంచాయతీ ఉరుగొండ గ్రామానికి చెందిన వంతాల కొండబాబు(37)కు తలకు తీవ్రగాయమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న పాంగి బుట్టోలు, మర్రి జంబో, మర్రి ఈశ్వరరావు, మర్రి మార్కిడి, మర్రి హెలీషా, మర్రి ప్రసాద్, వంతాల బొంజు , మర్రి సంజు గాయపడ్డారు. బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తప్పించే క్రమంలో ఆటో లోయలోకి దూసుకెళ్లి తుప్పల్లో బోల్తాపడింది. ఇదే రోడ్డులో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తున్న జెడ్పీటీసీ బొంజుబాబు, మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గంపరాయి సూరయ్య, సందడి కొండబాబు, మాజీ ఎంపీపీ ఉమామహేశ్వరరావు, నాయకులు రూడ లక్ష్మణరావు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించి ఆస్పత్రి వైద్యాధికారులతో మాట్లాడారు. అందరూ ప్రస్తుతం పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదబయలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పారిశ్రామికవాడగా అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందింది. 134 పరిశ్రమలు ప్రస్తుతం తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో బ్రాండిక్స్, ఆసియన్ పెయింట్స్, ఎకోహమా వంటి కంపెనీలు నిరుద్యోగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. పూడిమడకలో రూ.346 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి చేరుకునేందుకు రహ దారి నిర్మాణం పురోగతిలో ఉంది. కొండకర్ల ఆవకు మరిన్ని అదనపు హంగులు కల్పించే విధంగా పర్యాటక శాఖ కృషి చేస్తుంది. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
పాడేరు: మండలంలోని తుంపాడ, గుజ్జెలి, కించురూ పంచాయతీల పరిధిలోని టీడీపీ పార్టీ చెందిన పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వార్డు మెంబర్లు ఈశ్వరనాయుడు, ప్రేమ్కుమార్, చిట్టిబాబు, బుజ్జిబాబుతో పాటు వందమంది కార్యకర్తలకు అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్య్సరాస విశేశ్వరరాజు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు రాంబాబు, నేతలు మంగ్లన్నదొర, చిట్టిబాబు, ఏఎంసీఛైర్మెన్ సూరిబాబు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బసవన్నదొర, వాణిజ్య విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. మన్యంలో టీడీపీ ఖాళీ ముంచంగిపుట్టు: మండలంలోని జర్జుల పంచాయతీ సింధిపుట్టు, మాకవరం పంచాయతీ గుర్రాలబయలులో జెడ్పీ చైర్పర్సన్, అరకు పార్టీ పరిశీలకురాలు జల్లిపల్లి సుభద్ర బుధవారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు, మేనిఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో టీడీపీ పంచాయతీ కన్వీనర్లు కె.లోక్నాథ్, ,కె.కామేశ్వరరావు, కె.మల్లేశ్వరరావు, బి.మన్మధరావుతో పాటు 8 కుటుంబాలు ఆమె సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఆశయాలు, పరిపాలన నచ్చి వైఎస్సార్సీపీలోకి చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజరాణి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యలింగంలను గెలిపించాలని అభ్యర్థించారు. మండల పార్టీ అధ్యక్షులు పద్మారావు,మండల నేతలు మత్స్యలింగం, మూర్తి, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ సీకరిపుట్టు, తొరంగులు, సీకరి గ్రామాలకు చెందిన బీజేపీ పార్టీ నాయకులు వనకుం ఆనందరావు ,వంతాల చిట్టిబాబు, వనుకుం గోవిందరావు, పాంగి సింహాచలం, పాంగి సింహాద్రి, పాంగి గాసన్న, చిన్నయ్యతో పాటు 25 కుటుంబాలు మండల పార్టీ అధ్యక్షుడు వంతాల ఆనందరావు, ఎంపీపీ బొండా వరహాలమ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అరకు ఎంపీ అభ్యర్థి తనూజారాణి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగ గెలుపునకు తామంతా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆగ్రో డైరెక్టర్ వనల్భ సన్యాసి, వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, మాజీ జెడ్పీటీసీలు గంగాభవాని, సూర్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు పాంగి సింహాచలం, మాజీ ఎంపిటిసి కృష్ణారావు, నాయకులు ఆనంతరావు, కనకరాజు, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: మండలంలోని కాశీపట్నం పంచాయతీ తట్టవలస గ్రామంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మండల కో–ఆప్షన్ సభ్యుడు మదీనా, కన్నమ్మ, సత్యవతి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీని నమ్మితే నట్టేట మునిగినట్టేనని, గ్రహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని మదీనా చెప్పారు. -
నా ఓటు పథకాలిచ్చే ప్రభుత్వానికే..
మాది ఏఎస్ఆర్ జిల్లాలోని కూనవరం మండలంలో గల టేకులబోరు గ్రామం. నా పేరు జక్కు మధుమతి. వయసు 20 సంవత్సరాలు. నా తండ్రి అనారోగ్యంతో మరణిచాడు. నేను, నా తల్లి అనురాధ అమ్మమ్మ చెంతనే ఉంటున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు లభించింది. నా విద్యాభివృద్ధికి దోహదపడిన పథకాలకే వేయాలని నిర్ణయించుకున్నాను. సంక్షేమ ఫలాలు ఇస్తున్న ప్రభుత్వం వస్తే వృద్ధులు, పిల్లలు, వితంతువులు, వికలాంగులు ఇలా ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. -
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
● టీడీపీ హయాంలో యలమంచిలి నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడింది, ● పనులన్నీ అర్థంతరంగా నిలిచిపోయాయి. ● అచ్యుతాపురం–అనకాపల్లి మార్గ విస్తరణను నిలిపివేశారు. ● యలమంచిలిలో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాలేదు. ● మండలానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించి ఎంపీపీ, జెడ్పీటీసీలను డమ్మీలుగా మార్చారు. ● కొండల్ని పిండి చేసి, గ్రావెల్ దందా నిర్వహించారు. ● పూడిమడక మత్స్యకారులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. ● తంతడి, రాజన్నపాలెం గ్రామాలకు ఆనుకొని ఉన్న భూమిని బార్క్ కోసం కేటాయించగా, లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు ఉన్నందున పరిహారం లేకుండానే కాలం గడిపారు. ● కొండకర్ల, తంతడి తీరాల పర్యాటక అభివృద్ధిని గాలికొదిలేశారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
సాక్షి,పాడేరు: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పటివరకు పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,512 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పాడేరులో 2,297 మంది, అరకులోయ నియోజకవర్గంలో 2,242 మంది, రంపచోడవరంలో 2,973 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. హోం ఓటింగ్ను మంగళవారం జిల్లాలో 202 మంది వయో వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ పరిశీలన రంపచోడవరం: స్థానిక ఏపీఆర్ బాలికల పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం పరిశీలించారు. రంపచోడవరం ఆర్వో ప్రశాంత్కుమార్, చింతూరు పీవో చైతన్యతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అరకులోయ రూరల్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం 987 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ తెలిపారు. 7,512 మంది ఉద్యోగులు వినియోగం కలెక్టర్ విజయసునీత -
అల్లూరికి ఘన నివాళి
సాక్షి.పాడేరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గిరిజన చరిత్రలో అల్లూరి సీతారామరాజుకు ఉన్న ప్రాధాన్యంతోనే సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నరసింగరావు,చింతపల్లి ఎంపీపీ, జడ్పీటీసీలు కోరాబు అనుషాదేవి, పోతురాజు బాలయ్యపడాల్, మండల అధ్యక్షుడు మోరి రవి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, ఎంపీటీసీ నరసింహమూర్తి,సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకుగిడ్డి ఈశ్వరి ప్రచారం
కొయ్యూరు: పాడేరు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అర్ధరాత్రి వరకు ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. మంగళవారం కంఠారం, బాలారం, పాత బాలారం గ్రామాల్లో ఆమె రాత్రి పొద్దు పోయే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన్యంలో సాయంత్రం ఐదు దాటిన తర్వాత ప్రచారం చేయరాదు. అయినా నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట టీడీపీ నుంచి పోటీ చేస్తారని మొదట ప్రకటించిన రమేష్నాయుడు వేళ దాటేక ప్రచారం చేస్తే రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మౌనం వహించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. నిబంధనలు కొందరికేనా అని ప్రశ్నిస్తున్నారు. -
బీజేపీ అభ్యర్థులను ఓడించండి
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అరకులోయ రూరల్: బీజేపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం అరకు పార్లమెంట్ సీపీఎం అభ్యర్థి అప్పలనరస, అరకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామి ఆధ్వర్యంలో ప్రచారర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పార్టీ శ్రేణలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయంతోనే గిరిజన హక్కులు చట్టాలను పరిరక్షించు కోగలమన్నారు. రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే హింసాకాండ మొదలు అవుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు లోకనాథం, సురేంద్ర, బాలదేవ్ పాల్గొన్నారు. -
డోలీ కష్టాలు లేనట్టే..
ఒకప్పుడు గిరి శిఖరంలో ఉన్న ఆ గ్రామాలకు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.9.17 కోట్లతో చేపట్టిన రింగ్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల్లో వినియోగంలోకి రానుండటంతో లంగుపర్తి పంచాయతీలోని తొమ్మిది గ్రామాల గిరిజనుల్లో ఆనందం నెలకొంది.అనంతగిరి: మండలంలోని లంగుపర్తి పంచాయతీ పరిధిలోని రాళ్లవలస, కరకవలస, కుంభర్తి, దింశవలస, చీడివలస, ఎగువపట్టి, దిగువపట్టి, ఎగువపాడు లంగుపర్తి గ్రామాలు కొండల మీద ఉన్నాయి. ఇవి మండల కేంద్రానికి పంచాయతీ కేంద్రమైన లంగపర్తి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఈ పంచాయతీ పరిధిలో శివారు గ్రామాలన్నీ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండల మీద ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లాలి. రూ.7 కోట్లతో రోడ్డు నిర్మాణం.. అత్యవసర పరిస్థితుల్లో డోలీలపై ఆధారపడాల్సిందే. వీరి సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రధా నమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో గిరి శిఖర గ్రామాలకు 10.5 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇదే మార్గంలోని లుంగపర్తి గెడ్డపై 2.17 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కానుండటంతో తొమ్మిది గిరి శిఖర గ్రామాల పరిధిలోని సుమారు 15వేల మంది గిరిజనుల్లో ఆనందం నెలకొంది.నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల కిత్రం నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే పనులు ప్రారంభించాం. నాణ్యత ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే శిఖర గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పనున్నాయి. – విజయ్, ఏఈ, పీఆర్ ప్రాజెక్ట్స్లంగుపర్తి సమీపంలోని గెడ్డపై రూ.2.17 కోట్లతో నిర్మించిన వంతెన లంగుపర్తి పంచాయతీ కొండల్లోని గ్రామాలకు రింగ్ రోడ్డు సౌకర్యం రూ.9.7 కోట్లతో నిర్మాణం చివర దశలో పనులు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు మంజూరు 15 వేల మంది జనాభాకు తప్పనున్న అవస్థలు మేలు చేసిన ప్రభుత్వం రోడ్డు లేకపోవడం వల్ల శివారు గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలమీదకు వస్తే డోలీలో మోసు కుని రావాల్సిందే. ప్రభుత్వం చొరవతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తమ పంచాయతీలోని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. మేమంతా సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – జన్ని సన్యాసిరావు, సర్పంచ్, లంగుపర్తి -
టీడీపీ కనుమరుగవడం ఖాయం
అనంతగిరి: సార్వత్రిక ఎన్నికయ్యేలోపు అరకు నియోజకవర్గంలోని టీడీపీ కనుమరుగవడం ఖాయమని, అరకు అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్య్సలింగం అన్నారు. మండలంలోని పాతకోట, రేగం, నందిగుమ్మి, మద్దిగరువు, ఊట గెడ్డ, పుట్టపాడు, పోర్లుబంద, కరకవలస, నిమ్మల పాడు, గ్రామాల నుంచి టీడీపీ, సీపీఎంలకు చెందిన నాయకులతో పాటు 200 కుటుంబాల గిరిజనులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి అరకు ఎమ్మె ల్యే అభ్యర్థి రేగం మత్య్సలింగం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఎంకి చెందిన వైస్ సర్పంచ్ పాంగి అర్జున్, టీడీపీకి చెందిన మాజీ వార్డు మెంబర్లు కలీమ్మ, భీమరాజు, చంద్రన్నతో పాటుగా పలువురు చేరారు. ఈ సందర్భంగా రేగం మత్య్సలింగం మాట్లాడుతూ గతంలోనే టీడీపీ మెనిఫెస్టోని నమ్మి ప్రజలు మోసపోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. శివారు గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయన్నారు. గిరిజనుల ఆర్థిక స్థితిగతులు మారాయని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో చేరిన పలువురు టీడీపీ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరామన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఎవరూ నమ్మవద్దన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి ఎస్వీ సుబ్బారెడ్డి, ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ గంగన్నదొర, వైస్ ఎంపీపీ దూరు జయవర్ధిణి, మండల కన్వీనర్ నవీన్, ప్రధాన కార్యదర్శి డానియేలు, సర్పంచ్లు అప్పారావు, సన్యాసిరావు, చిరంజీవి, పెంటమ్మ, రాములమ్మ, ఎంపీటీసీలు జయశ్రీ, అశోక్, మధుసూదన్, కష్ణమూర్తి, గంగరాజు పాల్గొన్నారు. -
అదుపుతప్పి వాహనం బోల్తా
హుకుంపేట: వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఇంజినీర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో తాడిపుట్టు జంక్షన్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి (హైవే–516ఈ)లో కొట్నాపల్లి నుంచి హుకుంపేట వైపు వస్తున్న వాహనం గడుగుపల్లి సమీపాన తాడిపుట్టు జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హైవే అథారిటీలో పని చేస్తున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామానికి చెందిన ఇంజినీర్ వలసంగారి పవన్ (28) తలకు బలంగా దెబ్బలు తగిలాయి. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక కూర్చున్న ఆఫీస్ బాయ్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ పొన్నం సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇంజినీర్ దుర్మరణం -
జగన్తోనే జనరంజక పాలన
అనంతగిరి: జగనన్నతోనే గిరిజన గ్రామాల్లో జనరంజకపాలన సాధ్యమని అరకు అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్య్సలింగం అన్నారు. మండలంలోని అనంతగిరి, గుమ్మ, పెదబిడ్డ, లంగుపర్తి, వాలసీ, వేంగడ, పైనంపాడు పంచాయతీల్లో పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు 2019 ఎన్నికల్లో జగనన్న నాయకత్వాన్ని కోరుకున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీలను నేరవెర్చడంతో గిరిజనులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి ఎస్వీ సుబ్బారెడ్డి, ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, వైస్ ఎంపీపీ దూరు జయవర్ధిణి, మండల కన్వీనర్ నవీన్, ప్రధానకార్యదర్శి డానియేలు సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
గడప గడపకు ఎన్నికల ప్రచారం
● 1021 పోలింగ్ కేంద్రాల పరిధిలో ముమ్మరం ● చేపట్టిన వైఎస్సార్సీపీ బూత్ కమిటీల ప్రతినిధులు సాక్షి,పాడేరు: పోలింగ్ తేదీ గడువు దగ్గరపడుతుండటంతో వైఎస్పార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. అరకు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, నాగులాపల్లి ధనలక్ష్మి విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ బూత్ కమిటీ ప్రతినిధులు ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లాలో 1021 పోలింగ్ కేంద్రాల పరిధిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమం, ప్రగతిని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు ప్రజలను కోరుతున్నారు. -
టీడీపీ, జనసేన నుంచి భారీగా చేరికలు
జి.మాడుగుల: రాష్ట్రంలో సీఎం జగనన్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీ, జనసేన పార్టీల నాయకులు భారీగా తమ పార్టీలో చేరుతున్నారని పాడేరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. జి.మాడుగులలో మంగళవారం ఆయనతోపాటు రిటైర్డ్ జీసీసీ డీఎం కురుసా పార్వతమ్మ సమక్షంలో పెదలోచలి, కోరాపల్లి పంచాయతీల్లోని గొడుగుమామిడి, జర్రాయి, గనెల్భ గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీకి కండువాలు వేసి ఆహ్వానించిన అనంతరం విశ్వేశ్వరరాజు మాట్లాడారు. ప్రజారంజకపాలన అందిస్తున్న జగన్మోహన్రెడ్డికి ఏ ఒక్కరు సాటి కారని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పాడేరు అసెంబ్లీకి పోటీ చేస్తున్న తనను, అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణిని గెలించాలని ఆయన కోరారు. సర్పంచ్లు రాంబాబు, గంగరాజు, వైస్ఎంపీపీ సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మత్స్యకొండంనాయుడు, మైనారిటి సెల్ జిల్లా అధ్యక్షుడు నాగూరుబాబు పాల్గొన్నారు. -
No Headline
పాడేరు/అనంతగిరి/రంపచోడవరం: గతంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగగా మార్చి.. అన్నదాతను విస్మరించింది.. కనీసం విత్తనాలు కూడా అందించలేదు.. వ్యవసాయానికి తోడ్పాటు లేక రైతులు అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు.దీంతో రైతులు అన్ని విధాలుగా చితికిపోయారు..కొంతమంది వ్యవసాయానికి దూరమయ్యారు..అదంతా గతం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయాన్ని పండగగా మార్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. సాగు పెట్టుబడి నుంచి పంట కొనుగోలు వరకు అన్నదాతకు అండగా నిలిచారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రూ.20లక్షలతో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. రైతుల చెంతకే సేవలందుతున్నాయి. రైతులకు సాగుకి సూచనలు, సలహాలను కేంద్రాల్లో ఉన్న సిబ్బంది అందిస్తున్నారు. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను సబ్సిడీ ధరలకు అందజేయడంతో పాటు కస్టమర్ హైరింగ్ ద్వారా వ్యవసాయ యంత్రాలు వంటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాఫీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయనికి ఉతమివ్వడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని, ఆయనకే పూర్తి మద్దతు తెలియజేస్తామని గిరిజన రైతులు బాహాటంగానే చెబుతున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement