-
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు
ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయపడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోం ఓటింగ్ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్ సీపీకి చెందిన షేక్ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి.శరత్బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్పై వెళ్తున్నవైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జుల నగేష్పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం జగన్పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు. ‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?. .. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు... ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు. -
హోం ఓటింగ్ వినియోగించుకున్న వృద్ధులు
చీరాల టౌన్: ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజులు హోం ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. చీరాల రూరల్, మున్సిపాలిటీ, వేటపాలెం మండలంలో మొత్తం 225 మందికి హోం ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొదటిరోజు మంగళవారం 103 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆర్వో వెల్లడించారు. చీరాల మండలంలోని గవినివారిపాలెంలో జరుగుతున్న హోం ఓటింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలానే మున్సిపాలిటీలో జరుగుతున్న ఓటింగ్ను మున్సిపల్ కమిషనర్ కె.చక్రవర్తి, ఏఈఆర్వో పి.చక్రవర్తి పరిశీలించారు. బుధవారం హోం ఓటింగ్ జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న ఓటర్లు విధిగా వారి నివాస గృహాల్లో అందుబాటులో ఉండాలని కోరారు. నియోజకవర్గంలో హోం ఓటింగ్కు ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశామని ఆర్వో తెలిపారు. -
మళ్లీ నువ్వే రావాలి..
నరసరావుపేట రూరల్: దొండపాడులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగనన్న నువ్యే మళ్లీ రావాలి అంటూ ప్లకార్డు పట్టి ప్రచారంలో పాల్గొన్నారు. ప్యాను గుర్తుకే మీ ఓటు.. అంటూ బొమ్మలతో ఆకట్టుకున్నారు. జగన్ మామయ్య మళ్లీ వస్తేనే అమ్మ ఒడి, విద్యా కానుక వస్తాయని, గోరుముద్ద అందుతుందని చిన్నారులు చెప్పడం అందరిని ఆలోచింపజేసింది. కదలిన నారీ లోకం నరసరావుపేట రూరల్: ఎన్నికల ప్రచారంలో నారీ లోకం కదిలింది. మండలంలో పర్యటించిన వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి.అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికింది. దొండపాడులో అధిక సంఖ్యలో మహిళలు వారికి హారతులు పట్టి, విజయ తిలకం దిద్దారు. కేసానుపల్లిలో గుమ్మడి కాయలతో దిష్టితీశారు. -
నీ అభిమానం చల్లగుండా..
● ఐస్క్రీమ్ బండి నిర్వాహకుడే స్టార్ క్యాంపెయినర్ ● జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ బైక్పై ప్రచారం యడ్లపాడు: సాధారణ ప్రజలే వైఎస్సార్ సీపీకి ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. నవరత్నాలు పథకాలతో తమకు ఎంతో ఇచ్చిన సీఎం జగనన్నకు అందులో కొంతైనా తిరిగివ్వాలని నిర్ణయించుకున్నారు. తమ ఊరి బడి రూపురేఖలు మార్చి, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇంగ్లిష్ మీడియం తెచ్చిన.. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఇలా బండి కట్టుకుని ఉప్పరపాలేనికి చెందిన విప్పర్ల జాన్సన్ ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తను ఐసీక్రీమ్ బండి నిర్వహిస్తూ జీవిస్తున్నానని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక తన బిడ్డల చదువులకు భరోసా లభించిందని చెప్పుకొచ్చాడు. ఇంకా కొన్ని జాన్సన్ మాటల్లోనే...‘ మా గ్రామంలోని పాఠశాలకు ఐదేళ్ల కిందట ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. నాడు–నేడు కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలు మారాయి. ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఉన్నారు. మా పిల్లలే కాదు ఊరిలోని పేదలందరి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివే గొప్ప అవకాశం కలిగింది. ఇవన్నీ నాకు స్ఫూర్తిని రగిల్చాయి. నేను ఎందుకు వైఎస్సార్ సీపీ స్టార్ క్యాంపెయినర్ కాకూడదని భావించాను. అందుకే నా సొంత వాహనానికి ప్రచార సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాను. సమావేశాలు, సభలకు, నామినేషన్ల సమయంలో విస్తృతంగా పాల్గొన్నా.. సీఎం జగన్ పథకాలు, వివిధ సభల్లోని ఆయన ప్రసంగాలను ఊరూరా వినిపిస్తున్నాను. చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్కుమార్ యాదవ్ను ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాను.’ -
దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంది
ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోన రఘుపతి పాల్గొని, మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమ భవన నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ట్రై సైకిళ్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేయటం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య, మల్లెల మౌనిక, గుంజి ఏడుకొండలు పాల్గొన్నారు. -
ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్
జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు గుంటూరు ఎడ్యుకేషన్: పట్టభద్రులైన విద్యావంతులు ఉపాధి కల్పన కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఆన్లైన్ విధానంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.రఘు తెలిపారు. మంగళవారం గుజ్జనగుండ్ల సర్కిల్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో మాట్లాడారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు www.empoyment.ap.gov.in సైట్కు మొబైల్, ఆధార్ నంబరు, ఈ–మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు జాబ్మేళాలను నిర్వహించే సమయంలో వాటి సమాచారం నేరుగా చేరుతుందని చెప్పారు. రెన్యువల్ను ఆన్లైన్ పోర్టల్లోనే చేసుకోవచ్చునని సూచించారు. ఎంప్లాయిమెంట్, రెన్యూవల్ కోసం ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్న 48 గంటల లోగా ఎంప్లాయిమెంట్ కార్డు జనరేట్ అవుతుందని తెలిపారు. జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఎంప్లాయింట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతదేహం తెనాలి రూరల్: తెనాలి మండలం కఠెవరం పొలాల్లో జార్ఖండ్ వాసి మృతి చెంది ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో రూరల్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, సిబ్బంది ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. మృతదేహం వద్ద సెల్ఫోన్ ఉండడంతో దాని ద్వారా అతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోరెన్ విజయ్(39)గా గుర్తించారు. తన తోటి కూలీలతో కలసి చైన్నెలో పనులకు వెళ్తూ ఆదివారం తెనాలిలో రైలు దిగి అది కదిలే లోపు ఎక్కలేకపోయాడు. సోమవారం ఉదయం పట్టాల వెంబడి నడుచుకుంటూ కఠెవరం పొలాల వైపు వచ్చి బహిర్భూమికి వెళ్లి రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎంత కుట్ర పన్నారన్నా..!
హన్నన్నా..అన్నాబత్తునిపైతెనాలి: ఆంధ్రా పారిస్ తెనాలిలో వైఎస్సార్ సీసీ తరగని ఆదరణ ప్రతిపక్ష కూటమి పార్టీలకు కంటగింపుగా మారింది. ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉండటం, రోజురోజుకీ కూటమి పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతుండటంతో ఏకంగా అవినీతి ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అయితా నగర్లో జరిగిన రోడ్ షో విజయోత్సవాన్ని తలపించింది. దీంతో రోడ్ షోను లీడ్ చేసిన పార్టీ నేత, ఒకటో వార్డు కౌన్సిలర్ను టార్గెట్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా కాకతాళీయంగా జరిగిన ఒకటి రెండు ఘటనలను చిలవలు పలవలు చేస్తూ ఎల్లో మీడియాలో వండివార్చారు. తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రెండోసారి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో శివకుమార్ తనదైన శైలిలో ముందంజలో ఉంటున్నారు. స్థానికంగా నివాసముండే ఆయన కరోన వంటి విపత్కర రోజుల్లోనూ అందించిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఇక్కడ పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ తర్వాత పదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారనీ.. శివకుమార్ గుర్తుచేస్తున్నారు. కరోనా రోజుల్లో ఇటు కనీసం తొంగి చూడలేదని ప్రజలకు వివరిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా చేసిన మనోహర్ ఏ పరిశ్రమను తెచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో? చెప్పాలంటూ నిలదీస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన నాలుగు లేన్ల రోడ్డు పూర్తికాకపోవటం, పర్యవేక్షించిన మంచినీటి పథకంలోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఎమ్మెల్యే శివకుమార్ను తన స్నేహితుడిగా సంభోదించారు. అక్కడి నుంచి శివకుమార్పై అవినీతి ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రతిపక్ష నేతలు చూస్తున్నారు. తెనాలి పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ముగించాక, స్థానిక నేతలు ఆయన చేత కావాలనే శివకుమార్పై అవినీతి ఆరోపణలు చేయించటం స్థానికులంతా గమనించారు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం పట్టణ అయితా నగర్లో ఎమ్మెల్యే శివకుమార్ నిర్వహించిన రోడ్ షో అద్భుతంగా సాగటంతో మరింత గంగవెర్రులెత్తారు. ఫలితంగా ఎల్లో మీడియాలో కుట్ర పూరిత కథనానికి తెరతీశారు. రోడ్ షోను లీడ్ చేసిన అయితా నగర్కు చెందిన పార్టీ నేత, ఒకటో వార్డు కౌన్సిలరు గెడ్డేటి సురేంద్రను రౌడీషీటర్గా పేర్కొనటం, గతంలో సురేంద్ర గ్యాంగ్ అరాచకం చేసిందంటూ ఆరోపించటం బరితెగింపునకు నిదర్శనమంటూ పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. వాస్తవానికి సురేంద్రపై రౌడీ షీట్ లేదు. అయినప్పటికీ కావాలనే దుష్ప్రచారం చేయటం వెనుక ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ను అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశం స్పష్టమని అంటున్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న సురేంద్ర ఇటీవల పార్టీలో చురుకుగా ఉన్నారు. రోడ్షోతో సత్తాను చాటటంతో రానున్న ఎన్నికల్లో అయితానగర్లో భంగపాటు తప్పదని ఆందోళనతోనే కుట్రకు తెరతీసినట్టుగా చెప్పుకుంటున్నారు. వీటికి ఇటీవల కాకతాళీయంగా జరిగిన ఘటనలను కూడా ముడిపెట్టి తెనాలిలో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై డ్యూటీకి వెళ్తున్న ఏఎస్ఐను డిగ్రీ విద్యార్థులు టీజ్ చేశారు. హెచ్చరించి వెళ్లిపోతున్న అతడి పక్కనే బైక్లను పరుగుతీయించటంతో బైక్ స్కిడ్ అయ్యి పడిపోయిన ఏఎస్ఐ గాయపడ్డాడు. దీనిపై పోలీసులు ఆ విద్యార్థిని పోలీస్స్టేషన్కు పిలిపించారు. ఏం జరిగిందో ఆ విద్యార్థి గుంటూరు జీజీహెచ్లో చేరాడు. దీనిని కూడా రాజకీయానికి ముడిపెట్టారు. తెనాలిలో ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాన్నీ, ఎమ్మెల్యేని డామేజ్ చేసే ప్రయత్నాలు గత రెండేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు వచ్చేసరికి అవి తారస్థాయికి చేరుకున్నాయి. ఏదొకటి చేసి ప్రజలను మభ్యపెట్టాలని, పోలీసులను భయభ్రాంతులను చేసి పోలింగ్ రోజున తమ పబ్బం గడుపుకోవాలనేది కూటమి నేతల వ్యూహమని భావిస్తున్నారు. ఎన్నడూ లేనిది ఎన్నికల ముందు అవినీతి ఆరోపణలు.. బోడిగుండుకు, మోకాలికి ముడేస్తూ.. ‘పచ్చ’ వార్తా కథనాలు ప్రజాభిమానం చూసి కూటమి నేతలు కుట్రపన్నారంటున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు -
అధికారంలో ఉంటే అలా.. లేకుంటే ఇలా
● 2015లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతల బరితెగింపు ● ఎమ్మెల్సీగా ఏఎస్ రామకృష్ణ గెలుపు కోసం అధికార దుర్వినియోగం ● టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థినే గెలిపించాలని ఉపాధ్యాయులకు బెదిరింపులు ● టీడీపీ అభ్యర్థి గెలుపు కోసమే పని చేసిన అప్పటి మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ ● పొరపాటున మళ్లీ బాబు వస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ● ప్రస్తుత బ్యాలెట్ ఓటింగ్లోనూ టీడీపీ నాయకుల ప్రలోభాలు గుంటూరు ఎడ్యుకేషన్: అధికారం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చే చంద్రబాబు... అధికారంలో ఉంటే హిట్లర్ మించిన నియంతను తలపింపజేస్తాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేసినా గెలవాలనే తాపత్రయంలో ఉన్న చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పిస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉపాధ్యాయులను బెదిరించిన ఘటనలను ఉపాధ్యాయ లోకం ఎప్పటికీ మరువదు. 2015 మార్చి 22న జరిగిన గుంటూరు, కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును ఓడించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సాక్షాత్తూ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. పార్టీ మద్దతు ఇచ్చిన ఏఎస్ రామకృష్ణను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించుకునే క్రమంలో టీడీపీ నేతలు ఎంతగా బరితెగించారంటే, ఉపాధ్యాయ వర్గాల్లో బలమైన నేతగా ఉన్న లక్ష్మణరావు వెంట మద్దతుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను మంత్రులు స్వయంగా తమ కార్యాలయాలకు పిలిపించుకుని బెదిరింపులకు దిగారు. లక్ష్మణరావుకు మద్దతుగా ఉన్న యూటీఎఫ్ సహా అనేక ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులను పిలిపించుకుని టీడీపీ మద్దతు ఇచ్చిన ఏఎస్ రామకృష్ణను ఎమ్మెల్సీగా గెలిపించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్న మీరందరు(టీచర్లు) తాము చెప్పిన అభ్యర్థికే ఓటు వేయాలని బెదిరింపు ధోరణిలో మాట్లాడిన సందర్భాలను ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎప్పటికీ మరచిపోలేరు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, శిద్ధా రాఘవరావు తాము చెప్పినట్లు నడుచుకోకుంటే గ్రాంటు, జీతాలు నిలిపివేస్తామని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలను, టీచర్లను బెదిరించారు. రెండు జిల్లాల్లోనూ టీడీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు సాగించిన దందా, అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని అధికారులపైనా తీవ్ర ఒత్తిడి తేవడంతో పాటు సీఎం హోదాలో చంద్రబాబు నేరుగా సంఘాల నాయకులతో ఫోన్లో మాట్లాడి హుకుం జారీ చేశారు. చంద్రబాబు పాలనలోని చీకటి రోజులను గుర్తు చేసుకుంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పొరపాటున మళ్లీ బాబు వస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత బ్యాలెట్ ఓటింగ్లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు టీడీపీ నాయకులు తీవ్ర ప్రలోభాలు గురి చేస్తుండటంపై టీడీపీ దౌర్జన్యకాండ అప్పుడే మొదలైందని ఆందోళన చెందుతున్నారు. హుందాగా జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధికార, ధనబలంతో కలుషితం చేసిందని అప్పట్లో ఓటమి పాలైన కేఎస్ లక్ష్మణరావు బహిరంగంగా ఆరోపించారు. నైతిక విలువలను పాతరేసి డబ్బు విరజిమ్మి ఓట్లు కొనుగోలు చేశారని టీడీపీపై మండి పడ్డారు. -
నూతన పద్ధతిలో నగదు పంపిణీకి ప్రయత్నం
రెంటచింతల: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పద్దతిలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేయడానికి ప్రయత్నించగా స్థానికి వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు.. విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే పోలీసులకు విషయం తెలిపారు. గుంటూరు నంచి మాచర్లకు వస్తున్న యామిని ట్రావెల్ బస్సులో టీడీపీకి చెందిన నగదు పెద్ద మొత్తంలో తరలిస్తున్నట్లు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులకు తెలియడంతో.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురజాల డీఎస్పీ పల్లపురాజు నేతృత్వంలో రెంటచింతల ఎస్ఐ కె. వెంకట నారాయణరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ పగిడి అనీల్కుమార్రెడ్డి సిబ్బందితో కలిసి మాచర్లకు వస్తున్న ఈ ట్రావెల్ బస్సును గురజాల శివారులోని గొట్టిముక్కల మేజర్ కాల్వ సమీపంలో నిలిపి సోదాలు చేపట్టారు. విషయం బయటకు రావడంతో.. వైఎస్సార్ సీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. బస్సులోని లగేజ్ స్టోర్లో సుమారు 15 అట్ట పెట్టెలు, 10 తెల్లగోతాల్లో ఓటర్ స్లిప్లు, ఓటర్ జాబితాలు ఉండటం పోలీసులు గమనించారు. అనుమానం వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు బస్సులో నగదు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేయడంతో వెంటను ఆ బస్సును మాచర్ల పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ శ్యామ్ప్రసాద్కు అప్పగించారు. ఓటర్ల స్లిప్లపై బార్కోడ్తో ఉన్న హోలో గ్రామ్ ఉండటంతో ఇది కొత్త పద్దతిలో ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి ఉపయోగపడుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఓటర్లకు నేరుగా ఈ స్లిప్లు అందచేసి తరువాత ఈ స్లిప్లు ఆదారంగా నగదును పంపిణీ చేయవచ్చని దీంతో ఎవరికీ అనుమానం వచ్చే అవకాశం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. మాచర్ల నియోజకవర్గం గ్రామాల్లోని స్థానిక నాయకుల వల్ల ఓటర్లకు చేరాల్సిన నగదు పక్కదారి పట్టకుండా నూతన పద్దతిలో ఈ విధానం అమలుచేయడానికి టీడీపీ వారు ప్రత్నించినట్లు చర్చించుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలో ఈ విషయంపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో బస్సులో రూ. 20 కోట్లు నగదు దొరికినట్లు పుకార్లు షికార్లు చేయించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఓటరు స్లిప్పులు, జాబితా ఓటరు స్లిప్పులపై బార్కోడ్తో ఉన్న హోలోగ్రామ్.. సమాచారం మేరకు అడ్డుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు తనిఖీ చేసి, ఆర్వో కార్యాలయానికి తరలించిన పోలీసులు -
No Headline
● పోస్టల్ బ్యాలెట్ సందడి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, అత్యవసర సిబ్బంది కోసం పోస్టల్ ఓటింగ్ మంగళవారం కూడా కొనసాగింది. గుంటూరు తూర్పులో అత్యధికంగా 952 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు పశ్చిమలో 12 మంది, ప్రత్తిపాడులో 78 మంది, తెనాలిలో 28 మంది, పొన్నూరులో 27 మంది, మంగళగిరిలో 30 మంది, తాడికొండలో 20 మంది మొత్తం 1,147 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. – గుంటూరు వెస్ట్ -
రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే
తెనాలిఅర్బన్: రాష్ట్రంలో రెండోసారి ఫ్యాన్ ప్రభంజనం కొనసాగనుందని, ప్రజల నుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 26, 27, 28 వార్డుల్లో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 26వ వార్డు పినపాడు గేటు వద్ద వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ ఇస్మాయేల్, పార్టీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అక్కడి నుంచి పాండు రంగపేట మీదుగా రోడ్డు షో కొనసాగింది. 27వ వార్డులోని చేరుకోగానే భారీ గజమాలలతో సన్మానించారు. చెంచుపేట నుంచి 28వ వార్డుకు రోడ్డు షో చేరుకోగానే అక్కడ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ యాతాటి అనీల్, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా పేదలకు సంక్షేమం అందించడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలకు తమ ప్రభుత్వం ఎంతో అండగా ఉందని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు చెందిన మహిళ ను మొట్టమొదటిసారి తెనాలి మున్సిపల్ చైర్మన్గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా వారి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైఎస్సార్సీపీ తెనాలి పట్టణ క్లస్టర్ అధ్యక్షులు షేక్ దుబాయ్బాబు, మద్దాలి శేషాచలం, నాయకులు ఆశ్రున్, జాకీరా, సెల్వీ, యలవర్తి గీతాదేవి, కొడాలి క్రాంతి, కోలా వాసు, షేక్ మీరావళి, అవుతు రాజశేఖర్రెడ్డి, పెసర్లంక రమణ, బొమ్ము నాగిరెడ్డి, కుక్కల వాసు, మట్లపూడి రాజేశ్వరరావు, యలవర్తి సాంబశివరావు, అక్కిదాసు కిరణ్కుమార్, ఉడుముల మహేష్రెడ్డి, కాళిదాసు వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పట్టణంలో రోడ్డు షోకు విశేష ఆదరణ -
ఇంగ్లిష్ మీడియం తెచ్చిన ఒకే ఒక్క సీఎం జగన్
సినీ రచయిత కోన వెంకట్ కర్లపాలెం: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బాపట్ల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కోన రఘుపతి, నందిగం సురేష్కు మద్దతుగా మంగళవారం ఆయన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సమ్మెటవారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేసి, తమ మద్దతు తెలపాలని కోన వెంకట్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బెనర్జి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఆ..1,219 మంది ఉద్యోగులు మళ్లీ ఓటేయండి
చిలకలూరిపేట: నరసరావుపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ బుధ, గురు వారాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. చిలకలూరిపేట తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ నెల 5న గణపవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోస్టల్ పోలింగ్ ప్రక్రియ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి నిర్వహించినట్లు చెప్పారు. అయితే సిబ్బంది తప్పిదం కారణంగా నరసరావుపేట లోక్ సభ స్థానానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు బదులు, ఈవీఎం బ్యాలెట్లు ఓటర్లకు అందజేయడం జరిగిందన్నారు. ఈ పొరపాటు నేపథ్యంలో 1,219 లోక్ సభ స్థానానికి వేసిన ఓట్లు చెల్లవని వెల్లడించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానం వదిలివేసి కేవలం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరిగి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ గణపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కలిగి కేవలం ఐదో తేదీన ఓటు వేసిన ప్రతి ఒక్కరూ తిరిగి నిర్వహిస్తున్న ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని, వారి ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి అతి తక్కువ సమయంలో ఓటు హక్కు ఉపయోగించుకొని నిమిషాల వ్యవధిలో వెళ్లిపోయే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పొరపాటు ఘటనకు బాధ్యుడైన ఏఆర్వో వరకుమార్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. 5న పోస్టల్ బ్యాలెట్కు బదులు, ఈవీఎం బ్యాలెట్లు పంపిణీ సిబ్బంది పొరపాటు నేపథ్యంలో అవి చెల్లని ఓట్లుగా వెల్లడి నరసరావుపేట లోక్సభకు రేపు, ఎల్లుండి పోస్టల్ పోలింగ్ చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వారికి మాత్రమే పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ లోతేటి -
టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా
అమరావతి: మండల కేంద్రమైన అమరావతి టీడీపీ కార్యాలయం ముందు మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు భారతీయ జనతాపార్టీలో చేరారు. మంగళవారం కూటమిలో పార్టీ నాయకుడైన మేకల హనుమంతరావు ఇంటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్ది భాష్యం ప్రవీణ్ వెళ్లి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో అమరావతి గోపాల్నగర్లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 150 మంది వచ్చి స్థానిక టీడీపీ ఎన్నికల కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మండల స్థాయి నాయకులు ఎంత సర్ధి చెప్పినా వారు వినలేదు. తాము గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించామని, అర్దికంగా కూడా నష్టపోయి కేసులు పెట్టించుకున్నామని వారు వాపోయారు. తమపై కేసులు పెట్టి అరెస్టులకు తాళలేక ఊరు వదిలి వెళ్లామని, మా బాధలు ఇలా ఉంటే మీరు వెళ్ళి కలవటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్యకర్తలు బిగ్గరగా కేకలు వేశారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్
మంగళగిరి: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ధ్యేయమని మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధి నవులూరులోని మక్కువారిపేట వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ఎన్నికల ప్రచారం మంగళవారం ప్రారంభించారు. ఆమెకు స్థానిక ప్రజలు పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. లావణ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి అవకాశం కల్పించారన్నారు. పేదలు సైతం విదేశీ విద్యను అందుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులకు అందించి భరోసా కల్పించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ అసెంబ్లీ అభ్యర్థి మురుగుడు లావణ్య, ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, నాయకులు పచ్చల శ్యామ్బాబు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య నవులూరులో ఎన్నికల ప్రచారం -
సంక్షేమానికి ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరికలు
పెదకాకాని: వడ్డెరలను చంద్రబాబు నాయుడు కేవ లం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. పెదకాకాని గ్రామంలోని కార్యాలయంలో మంగళవా రం స్థానిక వడ్డెర కాలనీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీ వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. సేవాదళ్ మండల అధ్యక్షుడు ముడియాల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి హాజరై పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్గాల్లో ఉన్న పేదల అభివృద్ధి – సంక్షేమమే లక్ష్యంగా పని చేసిందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 99 శాతం హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ను ధైర్యంగా ఎదుర్కోలేని టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ మద్దతుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని, ప్రజలు కూటమి బూటకపు హామీలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.. 2019 ఎన్నికలకు మించిన మెజారిటీ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధిస్తుందని స్పష్టం చేశారు.. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసరావు, డేవిడ్, ఓర్సు శ్రీనివాసరావు, వేముల బుడ్డ అబ్బాయి, నరసయ్య, ఏసుబాబు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వీరాంజనేయులు, కృష్ణారెడ్డి, ఆలపాటి రాఘవ, నర్సిరెడ్డి, నజీర్, గౌస్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వడ్డెరలకు ప్రాధాన్యం ఘనత సీఎం వైఎస్ జగన్దే -
సంక్షేమ పథకాలను ఆపేసే కుట్ర
పట్నంబజారు: సంక్షేమ పథకాలను ఆపేసే కుట్రలను తెలుగుదేశంపార్టీ యథేచ్ఛగా కొనసాగిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని పేర్కొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి పలు చేరికలు జరిగాయి. స్థానిక శ్యామలానగర్ రెండోలైనులోని మంత్రి నివాసానికి చేరుకుని వీరంతా పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయే గత ఎన్నికల్లో ఆయన్ను భారీ తేడాతో ఓడించారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురేయడం ఖాయమని చెప్పారు. 37వ డివిజన్ నుంచి.. టీడీపీ నుంచి 20 మందికిపైగా కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరంతా 37వ డివిజన్, చంద్రమౌళినగర్ నుంచి వచ్చారు. పార్టీ యువజన విభాగం నాయకుడు గూడపాటి వెంకటసుభాష్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. చేరిన వారిలో శ్రీలక్ష్మి, అలేఖ్య, రఘు, సుభాని, దివ్య, భార్గవి, రవి ఉన్నారు. 44వ డివిజన్ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కాకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేనకు చెందిన పలువురు నాయకులు చేరారు. ముళ్లపూడి రామబ్రహ్మం (బుల్లి), నగరం శంకరరావు పార్టీలో చేరిన వారిలోఉన్నారు. పార్టీ 20వ డివిజన్ అధ్యక్షుడు ఖాజా మొయిద్దీన్ ఆధ్వర్యంలో 15 మంది టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. షేక్ అతిక్, మున్నా, సాదిక్, సలాం, ఖాజా, మోహన్ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. వైఎస్సార్ చేయూతను అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటు వచ్చే ఎన్నికల్లో బాబుకు మరోసారి బుద్ధి చెప్పాలి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక -
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం
ఫిరంగిపురం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు. మండలంలోని వేములూరిపాడు, ఫిరంగిపురంలోని విజ్ఞానపురం, క్రీస్తునగర్, ఎస్టీ కాలనీ, ఆరోగ్య నగర్ ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్పాలనలో అందిన పథకాలు గు రించి వివరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించేలా కృషి చేసినట్లు తెలిపారు. నాడు– నేడు ద్వారా గ్రామంలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పాఠశాలల స్థానంలో నూతన భవనాలు, అన్ని వసతులు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిని మించేలా పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చదువులు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరాలన్నా మళ్లీ మనం వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని కోరారు. తొలుత వేములూరిపాడు ఆర్సీఎం చర్చి వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలోని లూథరన్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం సునీత, పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, నాయకులు చిట్టా అంజిరెడ్డి, కె.చిన్నప్పరెడ్డి, సయ్యద్ హబీబుల్లా, పి.జేమ్స్ ఇన్న య్య, షేక్ సుభానీ, మీరావలి, పి.చిన్న, పి.రఘు, ఎం.సుధాకర రెడ్డి, పి.జోసఫ్, చంద్రశేఖరరెడ్డి, కె.ఆనంద్, ఎ.రత్నం, ఎ.అనూరాధ, ఎస్.లక్ష్మి, గాంధీబుడే, బి.శ్రీనివాసరెడ్డి, బి.అంజిరెడ్డి, డి.మెల్కియా, పి. విజయకుమార్, పి.రాజు, ఎస్కే బాజి, అమానుల్లా, ఎస్కే గఫార్, వై.యల్లారెడ్డి, వై. శ్రీనివాసరెడ్డి, టి.డేవిడ్, లూథర్పా ల్, హేమలతారెడ్డి, ఐజాక్, విజయచందర్, బిక్షాలు, ఇద్రీస్, పి.చిన్న, నరేంద్రకుమార్, పి.బాబూరావు, సాంబశివరావు, రాజమ్మ పాల్గొన్నారు.తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
నరసరావుపేట టౌన్: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కిడ్నాప్తో పాటు దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సిహెచ్.కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణ రెడ్డి స్నేహితుడు (ప్రభుత్వ ఉద్యోగి) పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల వద్ద దిగబెట్టాలని కోరగా వెళ్లాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాలపై వచ్చి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకునేందుకు కళాశాల గేటు తోసుకుని బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ ప్రత్యేక బలగాలు లోపలికి అనుమతి లేదని వారితో హిందీలో వారించారు. విషయాన్ని గమనించిన సత్యనారాయణ రెడ్డి కలుగచేసుకుని లోపలికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నట్లు వారికి చెప్పాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు నువ్వు ఎవర్రా..మాకు చెప్పేదంటూ సత్యనారాయణరెడ్డి పై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. అతని జేబులో ఉన్న సెల్ఫోన్ను లాక్కుని బలవంతంగా కారులో ఎక్కించుకుని కొట్టుకుంటూ కళాశాల వెనుక ప్రాంతానికి తీసుకెళ్లారు. తాను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగినని ప్రాధేయ పడడంతో విడిచి వెళ్లారు. తనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు క్రాంతి ట్రా న్స్పోర్టు శివ, బీసీ కాలనీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ రమేష్, ఇస్లాంపేట బాబులతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పిడుగుపాటుతో నలుగురు మృతి క్రోసూరు/నరసరావుపేట రూరల్/ముప్పాళ్ల: పిడుగు రెండు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మంగళవారం మృతి చెందారు. వివరాలు.. క్రోసూరు మండలంలోని ఊటుకూరు ఎస్సీ కాలనీకి చెందిన బొందెల నాగేంద్రమ్మ(53), కూతురు నాగరాణి(33)తో కలసి మొక్కజొన్న పనులకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వీఆర్వో మస్తాన్వలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల కాపరులు.. పిడుగుపాటుతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన నరసరావుపేట మండల పరిధిలోని ములకలూరు గ్రామ సమీపంలో జరిగింది. ముప్పాళ్ల మండలం కుందురువారిపాలేనికి చెందిన ఆవుల కోటేశ్వరరావు(42), మేనల్లుడు జమ్ముల గోపి(35)తో కలసి జీవాలు మేపుకునేందుకు ములకలూరు సమీపంలోని పొలాలకు వెళ్లారు. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్టు కిందకు చేరారు. పిడుగు చెట్టుపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రెండు కుటుంబాల్లోను విషాదం : ఆవుల కోటేశ్వరరావుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవటంతో జీవాలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజులాగే వెళ్లిన వ్యక్తి శవమై ఇంటికి వచ్చాడయ్యా..మా బాగోగులు ఎవరు పట్టించుకుంటారంటూ భార్య బుజ్జాయి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన జమ్ముల గోపి నాలుగు నెలల క్రితం కుందురువారిపాలెం గ్రామానికి వచ్చి కోటేశ్వరరావుకు అండగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మావయ్య తో కలసి జీవాలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గోపికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పిడుగుపాటుకు గురై ఇరువురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరి కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రోశయ్య తెలిపారు. -
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
నగరంపాలెం: ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయవాడలో రోడ్ షో సందర్భంగా గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీస్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలు బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, చందోలు చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని జాతీయ రహదారి –16 వైపు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. మహంకాళీ దేవస్థానానికి రూ.లక్ష విరాళంతాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండల పరిధిలోని కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి దాత మంగళవారం రూ.1,01,116లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ చేబ్రోలు వాస్తవ్యులు చిన్నంశెట్టి పోతురాజు, పార్వతి దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం ఈ విరాళాన్ని అందజేశారని వెల్లడించారు. అనంతరం దాతలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ మెంబర్లు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. యార్డుకు 70,843 బస్తాల మిర్చి రాకకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 70,843 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా ,776 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 55,550 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. నిమ్మకాయల ధరలుతెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5500, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. -
టీడీపీ ప్రలోభాల పర్వం
పట్నంబజారు: ఎన్నికల వేళ టీడీపీ నేతలు మరోసారి ప్రలోభాలకు తెరదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలకు తిలోదలికాలిచ్చారు. ఇంత జరుగుతున్నా.. అక్కడ ఉన్న కొంతమంది అధికారులు మాత్రం వారికి వంతపాడడం స్పష్టంగా కనపడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల, ఏసీ కళాశాలల్లో జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. నేరుగా ఓటర్ లిస్టు, బ్యాలెట్ ఓట్లు లిస్ట్ తీసుకుని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద డబ్బు సంచులతో రంగంలోకి దిగారు. ఓటుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే నేరుగా కార్లలో వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగులతో మాట్లాడి ప్రలోభ పరిచేందుకు యత్నాలు చేశారు. అక్కడే ఎన్నికల అధికారులు, పోలీసులు ఉన్నప్పటీకీ కొంత మంది అధికారులు మాత్రం వారికి సహకరించటం కొసమెరుపు. నిబంధనలు మరిచి... ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ వద్ద ప్రచారం నిర్వహించకూడదన్న విషయాన్ని మరిచిన టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. టీడీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్ అహ్మద్, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రయ్యలు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దే ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతూ కనిపించారు. టీడీపీ నేతల వ్యవహార శైలి నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకపోవటంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం నిర్వహించటంపై మండిపడటంతో అధికారులు అక్కడకు చేరుకుని, టీడీపీ నేతలను పంపించి వేశారు. అయినప్పటీకీ బయట సైతం ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా డబ్బు పంపిణీ నిబంధనలకు తిలోదకాలు పోలింగ్ కేంద్రాల వద్దే ప్రచారం టీడీపీ నేతలకు వంతపాడిన కొంతమంది అధికారులు గుంటూరులో ఇదీ పరిస్థితి స్క్వాడ్ అధికారి ఓవర్ యాక్షన్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద నగదు, ఇతరత్రా పంపిణీ జరుగుతుంటే పట్టుకునేందుకు వచ్చిన స్క్వాడ్ అధికారి ఓవర్యాక్షన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారైన ఆయన తన కింద సిబ్బందికి టీడీపీ నేతలకు సంబంధించిన డబ్బులు పట్టుకోవద్దంటూ హుకుం జారీ చేశారని సమాచారం. స్క్వాడ్ సిబ్బంది డబ్బులు పంపిణీ జరుగుతున్న అంశం ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కళ్లు చల్లబడ్డాయా.. బాబు!
తాడేపల్లిరూరల్: తెలుగుదేశం పార్టీ నీఛ రాజకీయాలకు మరో పండుటాకు ప్రాణం గాల్లో కలిసిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కలిసి కుట్ర చేసి, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెలలో సైతం బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమకావడంతో వృద్ధులు అవస్థలు పడుతుండడం మనం చూస్తున్నాం. తాజాగా నులకపేటకు చెందిన ఓ వృద్ధుడు పెన్షన్ కోసం రెండు రోజుల బ్యాంకు చుట్టూ తిరిగి వడదెబ్బ తగిలి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకుమాను బండి విన్నయ్య (72) నులకపేటలో నివాసముంటున్నాడు. తాడేపల్లి చైతన్య గ్రామీణ బ్యాంకు ఖాతాలో మే నెలకు సంబంధించి పెన్షన్ జమ కావడంతో వరుసగా 2, 3 తేదీల్లో బ్యాంకు వద్దకు వెళ్లాడు. రెండుసార్లు తిరిగినా పెన్షన్ మాత్రం రాలేదు. ఇంటికి వచ్చిన విన్నయ్యకు వాంతులు, విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వడదెబ్బ తగిలిందని వైద్యులు తెలియజేశారని, 3వ తేదీ ఆసుపత్రిలో చేర్పించామని, నాలుగు రోజుల చికిత్స అనంతరం విన్నయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇంటికి వచ్చి ఇస్తున్న పెన్షన్ను ఆపివేయడం వల్లే విన్నయ్య మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. విన్నయ్యకు స్నేహితులైన పలువురు వృద్ధులు మాట్లాడుతూ తాము పింఛన్ కోసం ఇలాంటి అగచాట్లు పడి.. ప్రాణాలు వదిలితేనే చంద్రబాబు కళ్లు చల్లబడతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పింఛన్ కోసం బ్యాంకు చుట్టూ తిరిగి వడదెబ్బతో వృద్ధుడి మృతి -
శిక్షణలో నేర్పించే అంశాలు
● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement