-
ఉపాధి కూలీలకు అవగాహన కల్పించాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు వడదెబ్బ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్యాధికారి రణధీర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి డీఎంహెచ్ఓ అప్పయ్య హాజరై మాట్లాడారు. ఉపాధిహామీ కూలీలు వడదెబ్బకు గురికాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని కూలీలకు సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ పవన్ కుమార్, డీపీఎంఓ సంజీవరావు, సీహెచ్ఓ శకుంతల, పల్లె దవాఖాన వైద్యాధికారులు స్వాతి, శ్యామ్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తాం
ఏటూరునాగారం: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేసి మి ల్లర్లకు తరలిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి రాంపతి అన్నారు. సోమవారం సాక్షిలో అకాల వర్షం.. రైతుల ఆగమాగం శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఏటూరునాగారంలోని జీసీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆదివారం వచ్చిన అకాల వర్షానికి రైతులు ధాన్యంపై పరదాలను కప్పారని తెలిపారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు చర్యలు చేపడుతామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు ఎప్పుడూ ఉండాలని, ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని వివరించారు.జిల్లా పౌరసరఫరాల అధికారి రాంపతి -
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పాలి
వెంకటాపురం(ఎం): మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నేరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500, వివాహం చేసుకునే మహిళలకు తులం బంగారం అంటూ తదితర ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, నాయకులు పోరిక గోవింద్నాయక్, గై ఆశోక్, పోరిక హర్జినాయక్, పోశాల వీరమల్లు, తండా రమేష్, మేడబోయిన ఆశోక్, ఆశాడపు దేవేందర్, భాషబోయిన పోశాలు తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు -
రామప్పలో అర్చకుల సమావేశం
వెంకటాపురం(ఎం): దేవాదాయ ఽశాఖ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సోమవారం జిల్లాకు చెందిన ధూపదీప ఆలయాల అర్చకులు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను రిజిస్ట్రేషన్ చేపించాలని, దేవాలయాల పేరిట భూములు ఉంటే వాటి వివరాలను ఎండోమెంట్ శాఖలో నమోదు చేయించాలని డివిజనల్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, రామప్ప ఈఓ బిల్లా శ్రీనివాస్ అర్చకులకు సూచించారు. దేవాలయాల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ముడుంబా రఘునాథచార్యులు, హరీశ్శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది మార్క సంతోష్, అవినాష్రెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
వైన్స్లో బీర్లు కరువు
ములుగు: ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగాయంటే ఎకై ్సజ్ శాఖకు బీరు రూపేణ డిమాండ్ పెరగడం సర్వసాధారణం. దీనికితోడు యువత చల్లనిబీర్లంటే పడిచస్తుంటారు. అలాంటి వారిని క్యాష్ చేసుకొని సొమ్ముచేసుకుంటుంది ఎకై ్సజ్ శాఖ. గత కొన్ని రోజులుగా ఎండపూట తాగడానికి చల్లనిబీర్లు దొరకడం లేదనే గోల వినిపిస్తోంది. ఎకై ్సజ్ అధికారులు వైన్స్ షాపుల యజమానులతో కుమ్మకై ్క డిస్టలరీల నుంచి వస్తున్న బీర్లను చడిచప్పుడు కాకుండా గ్రామాల్లోని బెల్టు షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినవస్త్తున్నాయి. ఎండాకాలం ప్రవేశించినప్పటి నుంచి ములుగు సబ్ డివిజన్లో ఈ రకం ఉమ్మడి దందా మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందాన నడుస్తోంది. ఒక్కో బీరుపై రూ. 50 అదనం ఉదాహరణకు వైన్స్లో ప్రభుత్వ రేటు ప్రకారం కింగ్ఫిషర్ లైట్ బీరు రూ.150. అదే బీరు రేటుకు గ్రామాల్లోని బెల్టు షాపులకు వచ్చే సరికి రెక్కలు వస్తున్నాయి. ఏకంగా ఒక్కో బీరును రూ. 200లకు అమ్ముతున్నారు. ఇలా అన్ని రకాల కంపెనీల బీర్ల ధరల పరిస్థితి అంతే. ఇదేంటని బెల్టుషాపుల వ్యా పారులను అడిగితే తమకు ఒక్కో బీరుకు రూ. 20 అదనంగా ఇస్తున్నారని, కూలింగ్ ఛార్జీలు, సిట్టింగ్ వంటివి చూసుకొని రూ. 50 అదనంగా అమ్ముకుంటున్నామని దర్జాగా చెబుతున్నారు. బీరుతో పోలిస్తే లిక్కర్, విస్కీ ధరలు కాస్తంత తక్కువగా ఉన్నాయి. వాటిని క్వార్టర్పై రూ.40 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అంటే ఫుల్ బాటిల్ తీసుకుంటే రూ.160 అదనం అన్నమాట. ఈ లెక్కన మద్యం బాబులకు రోజువారీగా వందల నుంచి వెయ్యి వరకు జేబులకు చిల్లు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో.. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామాల్లో మద్యం అమ్మకాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికారులు నిమ్మకునీరెత్తనట్లుగా నడుచుకుంటున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై దాడులు చేయ డం , టార్గెట్ పూర్తి కావాలనే ఉద్దేశ్యంతో గతంలో గుడుంబా కాసిన వారిని పట్టుకొని స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం పరిపాటిగా మారింది. ప్రతి రోజూ గ్రామాల్లో తిరిగే ఎకై ్సజ్ అధికారులు, సిబ్బందికి బెల్టు షాపులు కనిపించడం లేదా అనేది మొదటి ప్రశ్న. అధికారులు తిరుగుతున్నారని తెలిసి దర్జాగా విక్రయిస్తున్న బెల్టు షాపుల వ్యాపారులను చూస్తే వీరికి ఇంత ధైర్యమెక్కడిదబ్బా అన్నట్లుగా వచ్చే రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అధి కారులు ఎవరు ఏమనుకుంటే మాకేంటి అన్నట్లుగా నవ్వుకుంటూ కనిపిస్తున్నారని బయటగుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వివరణకు ములుగు ఎకై ్సజ్ సీఐ సుధీర్ని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా సమాధానం ఇవ్వలేదు.బెల్ట్ షాపులకు తరలుతున్న వైనం ఒక్కో బీరుపై రూ.50, క్వార్టర్పై రూ.40 అధికం పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు -
ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించాలి
ములుగు: ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే క్రమంలో ఎక్కువ వాహనాలను అందుబాటులో ఉంచాలని కోరారు. విధులు నిర్వహించే చోట కూలర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని నీరు ఉండే విధంగా చూడాలని విన్నవించారు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత సిబ్బంది ఇంటికి వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని వివరించారు. బలరాంనాయక్కు మంత్రి పరామర్శ ములుగు: మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తల్లి లక్ష్మీబాయి అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ధనసరి సీతక్క సోమవారం హనుమకొండలోని తన స్వగృహంలో బలరాంనాయక్ను కలిసి పరామర్శించారు. లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి సీతక్క వెంట డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఎల్డీఎం కో ఆర్డినేటర్ పులి అనిల్కుమార్ ఉన్నారు. 10న జాతర వేలం పాటలు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 8న నిర్వహించాల్సిన జాతర వేలం పాటలను అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా పడినట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎస్.మహేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా నెల రోజుల పాటు వివిధ రకాల వ్యాపారాల నిర్వహణకు ఈ నెల 10న ఉదయం 11గంటలకు ఆలయ ప్రాంగణంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల మేరకు షరతులతో కూడిన బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పరిధిలో కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే పుట్టు వెంట్రుకలు(తలనీలాలు) పోగు చేసుకునేందుకు రూ.2లక్షలు, పూలు, పూలదండలు అమ్ముకునేందుకు రూ.5వేలు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ.5వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని వివరించారు. ‘అక్షర ఐకేర్’లో నకిలీ వైద్యులు? ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అక్షర ఐకేర్ ఆస్పత్రిలో ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే చికిత్సలు చేస్తున్నట్లు స్థానిక అఫ్తాల్మిక్ అసిస్టెంట్ దిలీప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర ఐ కేర్ ఆస్పత్రిలో ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా వైద్యం, కంటి అద్దాలు ఇస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులు తనిఖీలు చేసి నకిలీ వైద్యులు, షాపులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి అప్పయ్యను సాక్షి వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయంపై ఆరాతీసి చర్యలు తీసుకుంటామని వివరించారు. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ రెండు, ఆరో సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి సందర్శించారు. ఆయన వెంట నర్సింహాచారి, తిరుమలాదేవి ఉన్నారు. నేడు వరంగల్ నగరంలో సీఎం రోడ్షోలు హన్మకొండ చౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం వరంగల్ నగరంలో రోడ్షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ తూర్పులోని పోచమ్మమైదాన్ జంక్షన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 6గంటలకు వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్షో నిర్వహిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారని తెలిపారు. -
కుష్ఠు వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దు
వెంకటాపురం(ఎం): కుష్ఠువ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా మందులు అందిస్తామని జిల్లా డీపీఎంఓ సాంబయ్య తెలిపారు. లెప్రసీ సర్వేలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని సబ్సెంటర్లో 15మందిని పరీక్షించగా అందులో ఒకరికి కు ష్ఠు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశ వర్కర్లు మాధవి, సౌజన్య, సరోజన, శోభ, ఇందిర, కవిత, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మసిస్ట్లకు త్వరలోనే మంచి వేతనాలు
ఎంజీఎం: ఫార్మసిస్టులకు త్వరలోనే మంచి వేతనాలు అందుతాయని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ అన్నారు. సోమవారం సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందకట్ల శరత్బాబు అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 ఏళ్లుగా పీఆర్సీలలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్లకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్హతలు, విధులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని పీఆర్సీ కమిటీ విన్నవించామని, దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం సుదర్శన్గౌడ్ను సన్మానించారు. సమావేశంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు దేవంభట్ల ప్రకాశ్రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుధాకర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్, నాయకులు నార్ల వేణు, సూరయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు. పీఎం సెక్యూరిటీ ట్రయల్రన్ ఖిలా వరంగల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 8న(బుధవారం) లక్ష్మిపురం మైదానంలో నిర్వహించే సభకు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతాధికారులు(సెక్యూరిటీ) సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మామునూరు విమానాశ్రయానికి వచ్చారు. హెలిపాడ్ నుంచే అధికారులు విమానాశ్రయం పరిసరాలను పరిశీలించారు. భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. -
ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా పూర్తిచేయాలి
ములుగు: ఈవీఎంల కమిషనింగ్ను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల స్ట్రాంగ్ రూంలో నిర్వహిస్తున్న ఈవీఎం, వీవీప్యాట్, సీయూల కమిషనింగ్ ప్రక్రియను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ములుగు అసెంబ్లీ సెగ్మెంట్కు కేటాయించిన 768 బ్యాలెట్ యూనిట్లు, 384 కంట్రోల్ యూనిట్స్, 430 వీవీప్యాట్లను 25 టేబుళ్ల ద్వారా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కమిషనింగ్ ప్రక్రియను చేపడుతామని కలెక్టర్ వివరించారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి ఓటుహక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. స్విప్ నోడల్ అధికారి డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సోమవారం ఓటర్ అవగాహన సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. దీనిలో భాగంగానే స్విప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో ఓటు హక్కుపై చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భారత రరాజ్యంగం కల్పించిన ఓటు హక్కును నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, నేను అనే నినాదం ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. పోలింగ్ శాంతంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడి తుల రవి, డీపీఆర్ఓ రఫిక్, డీపీఎం సతీష్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గుడిసైపె పిడుగు
వాజేడు: మండల పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన గాలి ఆదివారం సాయంత్రం వచ్చింది. ఈ క్రమంలో బొల్లారం గ్రామానికి చెందిన కంతి నాగేశ్వరరావు కొత్తగా ఇల్లు కట్టుకుంట్టుండడంతో కుటుంబ సభ్యులతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గాలిదుమారం ఎక్కువ కావడంతో వారు కొత్త ఇంట్లోకి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ గుడిసైపె పిడుగు పడింది. దీంతో వారికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోపడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.త్రుటిలో తప్పిన ప్రమాదం -
బీరన్న కల్యాణ మహోత్సవం
ములుగు: జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బీరన్న బోనాలు కార్యక్రమంలో భాగంగా మూడో రోజు స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం యాదవులు ఘనంగా జరుపుకున్నారు.తొలుత బైకాని మల్లయ్య ఇంటి వద్ద సుంకుపట్టి కులస్తులకు బియ్యం అందజేశారు. పట్టణంలోని యాదవులు ప్రతీ ఇంటి నుంచి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో తరలివెళ్లారు. బీరన్న పూజారులు యాదవ సాంప్రదాయం ప్రకారం బోనాల చుట్టూ గొర్రెను గావుపట్టి పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా డోలివాయిద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలనీలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కులపెద్దలు గొర్రె కొంరయ్య, సారిగొల్ల ఇమ్మడి భిక్షపతి, గోపు చంద్రమల్లు, ఎల్లావుల సమ్మయ్య, గుండెబోయిన కుమార్, కొనుపుల కుమార్, సంపత్, కృష్ణ, గోపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. బొడ్రాయి వార్షికోత్సవ పూజలు వాజేడు: మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి కొత్తూరులో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. బొడ్రాయి ఏర్పాటు చేసి ఏడాది కావడంతో గ్రామస్తులు అందరు కలిసి పూజారి అనికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలను జరిపించారు. వేణుగోపాల స్వామికి వైద్యరత్న అవార్డుగోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు కల్యాణపు వేణుగోపాల స్వామి కరోనా సమయంలో ప్రజలకు అందించిన వైద్య సేవలు గుర్తించి వైద్యరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో కల్యాణపు వేణుగోపాల స్వామి ఎంపికై నట్టు ప్రకటించి ఆయనను అభినందించారు. జూన్ 10న మహారాష్ట్రలోని పూనేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా వేణుగోపాల్ స్వామికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం.గౌతం, రాష్ట్ర కో ఆర్డినేటర్ హనుమండ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు తాటికొండ ఐలయ్యలు, వేణుగోపాల స్వామి హజరుకానున్నారు. విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు కాటారం: అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చరించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో వన్యప్రాణుల వేట నిర్మూలన, అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల వేట చట్టరీత్య నేరం అన్నారు. ఎవరైనా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు అమర్చడం కారణంగా వన్యప్రాణులు, మూగజీవాలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జెట్ విమానం చక్కర్లుకాళేశ్వరం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దు గ్రామాల్లో జెట్ విమానం చక్కర్లు కొడుతోంది. మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, కాటారం తదితర గ్రామాలపై నుంచి తరుచూ జెట్ విమానం చక్కర్లు కొడుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జెట్ విమానం ఎక్కడి నుంచి వస్తుంది..? ఎందుకు సంచరిస్తుంది..? ఎవరి కోసం చక్కర్లు కొడుతుందో అంతు చిక్కడం లేదు. ఆదివారం కాళేశ్వరం, పలుగుల, మద్దులపల్లి, అన్నారం ప్రాంతంలో జెట్ విమానం తిరిగింది. కాగా, ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టారనే అనుమానంతో పోలీసులు జెట్ విమానంతో జల్లెడ పడుతున్నారని సమాచారం. ఈ విషయమై పోలీసులు మాత్రం ఎలాంటి వివరాలు తెలుపడం లేదు. -
కరపత్రాల ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లి పట్టణంలో ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ కర్నాటకపు సమ్మయ్య మాట్లాడారు. పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలన, అవినీతిని ప్రజలు ప్రశ్నించా లన్నారు. సమావేశంలో నాయకులు పీక కిరణ్, యుగేందర్, శ్రీనివాస్, జై రమేష్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. రైతుల ఆగమాగం
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. వివిధ గ్రామాల్లోని రైతులు కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మిరప కల్లాల వద్ద కూడా కొంతమేర కాయలు తడిసిపోయాయి. అదే విధంగా గాలి దుమారానికి కోత దశకు వచ్చిన వరిపంట నేలమట్టమైంది. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పలు చోట్ల చెట్లు విరిగిపడిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు గంటల తరబడి శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.దావూద్ డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఆరబెట్టిన, కుప్పలు పోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వర్షం వచ్చిందన్నారు. దీంతో పలువురు రైతులు ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలిపారు. కోతకు వచ్చిన ధాన్యం కూడా నేలవాలిందని వివరించారు. పంటల పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చిన రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం కుప్పలు -
నాయకుల అప్రమత్తం
సాక్షి, మహబూబాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజార్టీ వచ్చింది.. మాకు ఎదురు లేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పెట్టినా గెలుస్తారు.. మా అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే’ అని ఎన్నికల ప్ర చారాన్ని పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నాయకులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేదని పార్టీ రాష్ట్ర నాయకులు అసంతృప్తి వెల్లగక్కినట్లు ప్రచారం. అయితే ఈ షాక్ నుంచి తేరుకోకముందే కేసీఆర్ రోడ్షోకు జనం కిక్కిరిసిపోయి సక్సెస్ కావడంతో.. అసలు ఏం జరుగుతుందో అని కాంగ్రెస్ నాయకులు డైలమాలో పడినట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చగా మారింది. దీనికి తోడు నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారంతో మానుకోట పార్లమె ంట్లోని ప్రజాప్రతినిధులు ప్రచార తీరు మార్చుకోవాలని అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయి నాయకులు గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రచారం ముమ్మురం చేశారు. కేసీఆర్ రోడ్షోను చూసిన తర్వాత.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఫ్యూహం మార్చుకొని అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు జిల్లా ప్రజలు నీరాజనం పట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో మానుకోట వీధులు గులాబీమయంగా మారాయి.జనాన్ని చూసిన కేసీఆర్ మురిసిపోయారు. ఎన్నడు లేని విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ బస్సుపై వేసిన నృత్యాలు వారి సంతోషానికి అద్దం పట్టాయి. ఇదంతా చూసిన కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైంది. నిన్నటి వరకు నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి ఊపులో ఉన్న సమయంలో సీఎం సభకు జనం వచ్చిన తీరు.. కేసీఆర్ సభకు జనం వచ్చిన తీరుపై బేరీజు వేసుకొని ఖంగుతిన్నట్లు తెలిసింది. బల నిరూపణ అంటే ఓట్లు వేయించడమే.. జిల్లాలోని జరిగిన పరిణామాలు, సీఎం, మాజీ సీఎం సభలు జరిగిన తీరు, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ సునాయసంగా గెలుస్తారనే చర్చ నుంచి.. ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ పార్లమెంట్ నియోకవర్గంపై ప్రత్యేక చర్చ కూడా పెట్టినట్లు తెలిసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ తుమ్మల నాగేశ్వర్రావు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తారో.. తెలియదు.. మీకు వచ్చిన మెజార్టీని మళ్లీ తీసుకురావాలి.. మీ బలం నిరూపించుకోవడం అంటే.. ఓట్లు వేయించడమే...దీనిని బట్టే పార్టీలోని మీ ప్రాధాన్యత, నామినేటెడ్, ఇతర పదువుల అప్పగించడంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో ఉన్న నాయకులు సీరియస్గా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి వరకు పార్టీలో చేరికలపై ఉత్సాహం చూపని నాయకులు ఇప్పుడు చేరికలు కూడా మొదలు పెట్టారు. జిల్లాలోని ఓ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడిని చేర్పించుకొని ఆ మండలాన్ని క్లీన్స్వీప్ చేయాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అర్థం అవుతుంది. అదేవిధంగా ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నించాలని నాయకులనుఆదేశించినట్లు తెలిసింది. ఇలా ఏ అవకాశాన్ని కూడా విడిచి పెట్టకుండా.. ఓటు బ్యాంకు ‘చెయ్యి’ జారకుండా అప్రమత్తం అవుతున్నారు. కేసీఆర్ రోడ్షో సక్సెస్తో కాంగ్రెస్ నేతల అలర్ట్ ప్రచారంలో నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు మళ్లీ చేరికలపై దృష్టి పెట్టిన నాయకులు ఎవరికి వారుగా మెజార్టీ చూపించుకోవాలని టార్గెట్ -
రక్తమోడుతున్న రహదారులు
ఏటూరునాగారం: ఏజెన్సీ గ్రామాలు, రహదారులు ఇసుక లారీలతో రక్త మోడుతున్నాయి. జిల్లాలో రోజుకు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగి అమాయకులు మృత్యువాత పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఇసుక లారీల రవాణా కొనసాగుతోంది. రోడ్డు మీద ప్రయాణించాలంటే వాహనదారులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిబంధనలు నిల్ జిల్లాలో వన్యప్రాణుల సంచారం ఉన్నప్పటికీ రాత్రి వేళలో ఇసుక రవాణా చేయొద్దని నిబంధనలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాత్రి 9 దాటిన తర్వాత భారీ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే అనుమతి లేదు. కానీ ఇష్టానుసారంగా ఇసుక లారీలు చీమల వరుసను తలపించే విధంగా ఒకదాని వెనుక మరొకటి రోడ్డు పొడువునా గంటల తరబడి లారీలు ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. వాజేడు, వెంకటాపురం(కె), ఏటూరునాగారం, మంగపేట, పినపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు ఇటు బూర్గంపాడు– ఏటూరునాగారం, 163 జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ – ఏటూరునాగారం, వరంగల్– ఏటూరునాగారం రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు, లారీలు ప్రయాణిస్తున్నాయి. ఇక రాత్రి వేళలో ప్రయాణించాలంటే ఇంటి దగ్గర మళ్లీ వస్తానో రానో అని చెప్పి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్న స్థానిక, జిల్లా పోలీస్ అధికారులు, పరిపాలన అధికారులు సైతం వీటిపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యలపై నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు ప్రయాణికులు వెళ్లి వస్తుంటారు. ఈ సమయంలోనే ఇసుక లారీలు రహదారి పొడవునా విస్తరించి ఉండడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కార్లలో ప్రయాణించే వారు, ద్విచక్ర వాహనదారులు ఇసుక లారీ డ్రైవర్ల ఆగడాలకు బలైపోతున్నారు. రాత్రి వేళ నివారించాలి రాత్రి వేళలో ఇసుక లారీలను నివారించాలి. ఉద యం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్ర మే రవాణా జరిగేలా చూడాలి. పగలురాత్రి ఇసుక లారీలు నడుపుతుండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. – ఈసం రామ్మూర్తి, ఏటూరునాగారం మాజీ సర్పంచ్ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇసుక లారీలు మద్యం మత్తులో లారీ డ్రైవర్లు పట్టించుకోని పోలీసు అధికారులువారంలో నలుగురి మృతి ఇసుకలారీలతో జిల్లాలో వారంలో నలుగురు మృతి చెందారు. గురువారం జీడివాగు వద్ద ఫొటోగ్రాఫర్ సాంబయ్యను ఇసుక లారీ బలి తీసుకుంది. ఏప్రిల్ 24న ఇదే జీడివాగు వద్ద సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనిల్ సుర్వేసిని సైతం ఇసుక లారీ కబలించింది. తాడ్వాయి వద్ద ఏప్రిల్ 30న ములుగులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి వస్తున్న క్రమంలో ఇసుక లారీలు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుక లారీల డ్రైవర్లు మద్యం సేవించి అతివేగంగా నడపడం, నిద్రలేని రాత్రులు గడపడం, విశ్రాంతి లేక అలసటతో లారీలు నడుపుతుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక లారీల డ్రైవర్లకు కావాల్సినంత విశ్రాంతి, మద్యం సేవించకుండా చర్యలు తీసుకుంటే ప్రమాదాల నివారణకు కొంతమేర అవకాశం ఉంటుందని అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం మేలుకొని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇసుక లారీలతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం: కాకతీయుల కట్టడమైన కోటగుళ్లు శిల్పసంపద మహా అద్భుతమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె.జయరాం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాంచంద్రారావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను ఆదివారం వారు కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. మొదట ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు. కాకతీయులు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి కట్టడాలు, శిల్పసంపద ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. ఈ అద్భుత కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఏటూరునాగారం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ అప్పయ్య అధికారులకు హెచ్చరించారు. మండల పరిధిలోని చెల్పాకలో రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్పయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా మొదటగా హాజరు పట్టికను పరిశీలించి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ సంతకాలు లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్ సుమలతను ప్రశ్నించారు. ఫార్మాసిస్ట్ ఈ రోజు టీకాల సరఫరాకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి వెళ్లారని బదులిచ్చారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గురించి అడగగా ఈ రోజు సెలవుల్లో ఉన్నారని వివరించారు. అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్, ఫార్మసిస్టులు గైర్హాజర్ కావడంతో వారికి మోమోలు జారీ చేశామన్నారు. అలాగే కుక్క, పాము కాటు వ్యాక్సిన్ల గురించి ఆరా తీయగా 35 నిల్వ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా వడదెబ్బపై గ్రామాల్లోని ప్రజలకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కల్పించాలని సిబ్బందిని సూచించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
సఖి సెంటర్ను సందర్శించిన జడ్జి
ములుగు: జిల్లాకేంద్రంలో సఖి వన్స్టాఫ్ సెంటర్ను శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి టి.కన్నయ్యలాల్ సందర్శించారు. సఖి సెంటర్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయం, చైల్డ్లైన్, బాలల సంక్షేమ సమితి కార్యాలయాలను పరిశీలించారు. బాలలకు ఉన్న సమస్యలు, వస్తున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య తదితరులు ఉన్నారు. -
రోడ్డుపైనే ఇసుక లారీలు
● ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులుమంగపేట: మండల పరిధిలోని గంపోనిగూడెం– కమలాపురం మధ్య ఏటూరునాగారం–బర్గంపాడు ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలు నిలిపి వేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంపోనిగూడెం మార్కెట్ యార్డు సమీపంలోని గోదావరి ఇసుక క్వారీకి వచ్చే వందలాది లారీలు రోడ్డుపైనే నిలిపి వేస్తున్నారు. దీంతో తరచుగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. ప్రధాన రోడ్డు ఇరుకుగా ఉండటంతో రోడ్డుపైనే ఇసుక లారీలు నిలపడం మూలంగా వచ్చి వెళ్లే ద్విచక్రవాహనదారులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంటొంది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారిణి స్వర్ణలత లెనినా అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయో వృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. నడవలేని వారి కోసం పోలింగ్ రూంలోకి తీసుకెళ్లడానికి వీల్చైర్లతో పాటు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదే విధంగా వీరికోసం ప్రత్యేకమైన క్యూలైన్లు, తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లతో పాటు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బధిరులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంతరం ఏటూరునాగారం ఎంపీడీఓ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కుపై పలు సూచనలు చేశారు. అనంతరం ఓటర్లతో ఓటు నమోదుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయం లోని ఉద్యోగులందరికీ ఎస్వీఈఈపీ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ వద్ద ఏపీఓ వసంతరావుతో కలిసి ఓటర్ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, దివ్యాంగుల సంఘం నాయకులు పొన్నం సంతోష్, మాణిక్యరావు, స్థానిక బీఎల్ఓలు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో ఓటర్లకు అవగాహన మంగపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారి స్వర్ణలత లెనినా, ములుగు అసెంబ్లీ నోడల్ అధికారి సతీష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై వారు వివరించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యంతో పాటు తదితర అంశాలపై వివరించారు. -
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి
వెంకటాపురం(ఎం): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని మాజీ రాష్ట్రమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మండల పరిధిలోని వెంకటాపురం, లక్ష్మీదేవిపేట గ్రామాలలో బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడారు. ఎంపీగా కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమిలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపించి కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం నల్లగుంట గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు పోరిక హర్జినాయక్ తండ్రి వాగ్యానాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ అభ్యర్థి కవిత, బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, నాయకులు పోరిక గోవింద్నాయక్, మల్క రమేష్, అశోక్, రమణారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ షురూ..
ములుగు/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించనున్న 199 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా శనివారం తొలిరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 30మంది హోం ఓటింగ్ వేశారు. ఈ సందర్భంగా తొలిరోజు ఫెసిలిటేషన్ సెంటర్ను అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీజతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న పోస్టల్ బ్యాలెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి చిన్నచిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఏపీఓలు, పీఓలు, మైక్రో అబ్జర్వర్లు, అత్యవసర విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది 2,364 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లో 16 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన వారి కోసం 7టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన హోం ఓటింగ్ ఓటర్లు 6వ తేదీ వరకు అధికారుల సమక్షంలో ఓటు వేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ రామకృష్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజ్ప్రకాష్, తదితరులు ఉన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐదుగురు హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు టీం సభ్యులు పీడబ్ల్యూడీ నోడల్ అధికారి స్వర్ణలత, స్థానిక సీడీపీఓ హేమలత, ప్రిసైడింగ్ అధికారి అశ్విన్ ఓటర్ల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కిరణ్, స్థానిక పంచాయతీ కార్యదర్శి రమాదేవి, బీఎల్ఓలు ఇర్సవడ్ల సరోజ, ఎం. లలితకుమారి, తరంగిణి, శ్రీలత పోలింగ్ సిబ్బంది లక్ష్మీనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు ఓటేసిన 199మంది ఉద్యోగులు ములుగులో 30, ఏటూరునాగారంలో ఐదుగురు హోం ఓటింగ్ -
కల్వర్టుల తనిఖీ
వెంకటాపురం(ఎం): మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం మండల పరిధిలోని కల్వర్టులతో పాటు, పోలింగ్ కేంద్రాలను బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసినట్లు వెంకటాపురం ఎస్సై చల్లా రాజు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన గోవిందరావుపేట: పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్ శనివారం పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మండల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన రంగాపూర్, ముత్తాపూర్, ప్రాజెక్ట్ నగర్ తో పాటు సమస్యాత్మకమైన చల్వాయి, పస్రా గ్రామాల పోలింగ్ కేంద్రాలను పస్రా సీఐ శంకర్, ఎస్సై కమలాకర్ లతో కలిసి ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరగటానికి డీఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందని బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తలు నిరంతరం సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అట్లూరి రఘురామ్, జాడి లక్ష్మి, త్రీనాధ్, లక్ష్మిపతి పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్ షిఫ్ట్ సమయాలు మార్చాలి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్కాస్ట్ గనుల్లో పని వేళలు మార్చాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గని మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల పని సమయాలను మార్చాలని కోరారు. ఓపెన్కాస్ట్ ఉద్యోగులు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట రామచందర్, ఎండీ కరిముల్లా, అల్లి చేరాలు, కృష్ణ, మధు, విజేందర్, కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షల్ని వాయిదా వేయాలని వినతి! కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 6 నుంచి నిర్వహించే డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2,4,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు విద్యార్థులు శనివారం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిసి విన్నవించినట్లు సమాచారం. ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని, వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయ మై రిజిస్ట్రార్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు సకాలంలో నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు. ముఖ్యంగా టీఎస్ఐసెట్, పీజీసెట్ తదితర ప్రవేశ పరీక్షలు ఉంటాయని అందువల్ల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈనెల 6 నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. -
కారుకొండ సడాలమ్మ వనప్రవేశం
ఎస్ఎస్తాడ్వాయి: గద్దెలపై నుంచి కారుకొండ సడాలమ్మను శనివారం పూజారులు, వడ్డెలు వనప్రవేశం చేశారు. మండల పరిధిలోని భూపతిపూర్లో మూడు రోజులపాటు కారుకొండ సడాలమ్మ జాతరను పూజారులు ఘనంగా నిర్వహించారు. గంగస్నానం నుంచి మొదలుకుని గుట్ట పైనుంచి తీసుకొచ్చి సడాలమ్మను గద్దైపె ప్రతిష్టించారు. ఈ క్రమంలో భూపతిపూర్తో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సడాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గద్దైపె నుంచి పూజారులు, వడ్డెలు డోలివాయిద్యాలతో వనప్రవేశం చేశారు. -
హోం ఓటింగ్ షురూ
ములుగు/ఏటూరునాగారం: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఫారం 12 డి ద్వారా 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఓటర్లు మొత్తం 78 మంది పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేయగా శుక్రవారం 44 మంది ఓటర్లు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా మే 13న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు పూర్తి స్థాయిలో పోల్ చిటీలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని బీఎల్ఓలు ఎండను సైతం లెక్కచేయకుండా పోల్ చిటీలను పంపిణీ చేస్తున్నారు. పోల్ చిటీలో పోలింగ్ స్టేషన్ అడ్రస్, వరుస సంఖ్యతోపాటు రూట్ మ్యాప్ కూడా పొందుపర్చారు. అలాగే నియోజకవర్గంలో 9 మండలాల్లో 307 పోలింగ్ స్టేషన్లో 2,33,191 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అందులో ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఒక మహిళా పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 44 మంది సద్వినియోగం జిల్లాలో 78 మంది వృద్ధులు, దివ్యాంగులు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement