రోడ్డుపైనే ఇసుక లారీలు | Sakshi
Sakshi News home page

రోడ్డుపైనే ఇసుక లారీలు

Published Sun, May 5 2024 2:40 AM

రోడ్డుపైనే ఇసుక లారీలు

ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు

మంగపేట: మండల పరిధిలోని గంపోనిగూడెం– కమలాపురం మధ్య ఏటూరునాగారం–బర్గంపాడు ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలు నిలిపి వేస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంపోనిగూడెం మార్కెట్‌ యార్డు సమీపంలోని గోదావరి ఇసుక క్వారీకి వచ్చే వందలాది లారీలు రోడ్డుపైనే నిలిపి వేస్తున్నారు. దీంతో తరచుగా ట్రాఫిక్‌ జామ్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రధాన రోడ్డు ఇరుకుగా ఉండటంతో రోడ్డుపైనే ఇసుక లారీలు నిలపడం మూలంగా వచ్చి వెళ్లే ద్విచక్రవాహనదారులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంటొంది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement