సెమీస్‌లో ముంబై | Mumbai Garuda beat Dilli Veer to storm into semis of Pro Wrestling League | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ముంబై

Published Tue, Dec 22 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

Mumbai Garuda beat Dilli Veer to storm into semis of Pro Wrestling League

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో అజేయంగా దూసుకెళుతున్న ముంబై గరుడ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా సోమవారం ఢిల్లీ వీర్ జట్టుతో జరిగిన బౌట్‌లో 5-2 తేడాతో ముంబై నెగ్గింది. దీంతో సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబైకి ఓటమి లేకుండా పోయింది. అటు ఢిల్లీ ప్రతీ మ్యాచ్ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. తొలి మూడు బౌట్స్ అనంతరం ఢిల్లీ 2-1తో ఆధిక్యంలో ఉన్నా ఆ తర్వాత ముంబై వరుస విజయాలతో అదరగొట్టింది.

ప్రారంభ మ్యాచ్‌లో ఒడికడ్జే (97 కేజీలు) 5-0తో గురుపాల్ సింగ్‌పై నెగ్గి ముంబైకి శుభారంభాన్నిచ్చాడు. మహిళల 48 కేజీలో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ) 8-0తో రితూ ఫోగట్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేసింది. పురుషుల 74 కేజీలో దినేశ్ కుమార్ (ఢిల్లీ) 5-3తో ప్రదీప్‌ను ఓడించి 2-1 ఆధిక్యాన్నిచ్చాడు.

ఇక ఇక్కడి నుంచి ముంబై పుంజుకుని ఒడునాయో (53 కేజీలు) 10-0తో లిలినాయోను, గియోర్గి (125 కేజీలు) 10-0తో క్రిషన్ కుమార్‌ను, అడెలిన్ గ్రే (69 కేజీలు) 10-0తో నిక్కీని, ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ఇక్తియోర్ (65 కేజీలు)ను 9-7తో అమిత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై విజయం ఖాయమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్‌తో పంజాబ్  రాయల్స్ తలపడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement