big
-
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్కు అనుసంధానమైన అన్ని గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్రథ్ ఎక్స్ప్రెస్తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్రథ్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను లింక్ హాఫ్మన్ బుష్గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ 16 కోచ్లకు బదులుగా 20 కోచ్లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో 352 బెర్త్లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
యువత కబుర్లు కాస్త సీరియస్ విషయాలుగా మారితే...!
కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్ గురించి విన్నావా? ఇన్స్టాగ్రామ్లో నా లేటెస్ట్ ఇమేజ్లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్ టాక్’ కంటే.. ‘బిగ్ టాక్’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్ టాక్’ ట్రెండ్ అంటున్నారు. ‘బిగ్ టాక్’ అనేది ‘టాప్ ట్రెండ్స్ ఫర్ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్ టాక్’కు అపోజిట్ ట్రెండ్. ‘స్మాల్ టాక్’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్ టాక్ ట్రెండ్ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్ టాపిక్స్పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్ ఒకే అన్నారు. అయితే బిగ్ టాక్ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి. ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్ టాక్’లో భాగంగా ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘నా కొలీగ్ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ టాక్లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్ కాఫీ కార్నర్లో బిగ్ టాక్ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్పూర్కు చెందిన నిఖిల్ మిత్ర. బిగ్ టాక్లో భాగంగా.. జాబ్ మార్కెట్పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్–టైమ్ జాబ్స్పై ‘చాట్జీపీటి’లాంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చూపించే ప్రభావం, మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ ఎలాంటి అడ్జెస్ట్మెంట్స్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సీనియర్లతో పోల్చితే జెన్ జెడ్ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్లపై కొలీగ్తో మాట్లాడాడు నిఖిల్ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘బిగ్ టాక్’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్ టాక్’ ట్రెండ్ సారాశం. పారదర్శక సంభాషణ స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్ ప్రొఫెషనల్స్కు కొలీగ్స్తో ఉండే స్నేహం ఆఫీస్ టైమింగ్స్ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్–సెన్సర్ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్ ప్రొఫెషనల్స్లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్ సర్వే ప్రకారం సెన్సిటివ్ టాపిక్స్ గురించి కొలీగ్స్తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇవి చదవండి: పర్పుల్ కలర్ ఎందుకు? -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేటి (శనివారం)ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో నిండిన ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పటియాలీ-దరియావ్గంజ్ రహదారిలోని చెరువులో పడింది. అనంతరం అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినవారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులతోపాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. పాటియాలీలోని సీహెచ్సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. -
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,500 సార్లు లేదా సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె నిముషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కాగా బ్లూ వేల్ గుండె భారీ పరిమాణం కలిగివుంటుంది. జీవులలో అతిపెద్ద గుండె బ్లూ వేల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సముద్ర జీవి రెండు బస్సులకు మించిన పొడవు కలిగివుంటుంది. దాని గుండె లవ్సీట్ ఆకారంలో ఉంటుంది. అది 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాని గుండె నిమిషానికి కనీసం రెండుసార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నీటి అడుగున ఉండే ఈ నీలి తిమింగలం ఛాతీపై జెయింట్ స్టెతస్కోప్ పెట్టిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలోని అన్ని జీవులలో తిమింగలం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. దాని గుండె చాలా పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దాని గుండె కొలతలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో బ్లూ వేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె బరువు 190 కిలోలు. ఈ జీవి మొత్తం బరువులో గుండె ఒక శాతం ఉంటుంది. అంటే గుండె బరువు 400 పౌండ్లు అయితే తిమింగలం మొత్తం బరువు 40,000 పౌండ్లు. చేపల బరువు పౌండ్లలో కొలుస్తారు. మనిషి గుండె బరువు 10 ఔన్సులకు సమానం. కేజీలోకి మారిస్తే 283 గ్రాములు. తిమింగలం గుండె బరువు మనిషి గుండె కంటే 640 రెట్లు అధికం. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు? -
5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి..
దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. 1. సిక్కు అల్లర్లు(1984) దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే, అతని సహచరులు మరణించారు. 2. భాగల్పూర్ అల్లర్లు(1989) 1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్లో భాగల్పూర్లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 3. ముంబై అల్లర్లు (1992) ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది. 4. గుజరాత్ అల్లర్లు(2002) గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 5. ముజఫర్నగర్ (2013) ఈ అల్లర్లు ముజఫర్నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
AP: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర అన్ని రంగాల్లో కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.3,74,369 కోట్లు పెరిగింది. అలాగే రాష్ఠ్ర తలసరి ఆదాయం గత నాలుగేళ్లలో 65,487 రూపాయలు పెరిగింది. ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో వెల్లడించింది. గత నాలుగేళ్లుగా వ్యవసాయం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.7,90,810 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.11,65,179 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతున్నట్లు పేర్కొంది. 2018–19లో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల నికర విలువ రూ.2,61,448 కోట్లు ఉందని, ఈ విలువ ప్రతి ఏటా పెరుగుతూ 2022–23లో రూ.4,16,441 కోట్లకు చేరిందని వివరించింది. అలాగే తయారీ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.67,393 కోట్లు ఉండగా 2022–23కి రూ.89,180 కోట్లకు పెరిగింది. నిర్మాణ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.56,106 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.76,694 కోట్లకు పెరిగింది. రియల్ ఎస్టేట్, యాజమాన్యం, నివాసం, వృత్తిపరమైన సేవల ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.58,147 కోట్లు ఉండగా 2022–23కి రూ.82,775 కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గత నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షలు దాటింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 ఉండగా 2022–23కి రూ. 2,19,518 రూపాయలకు పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. -
Sakshi TV-Big Question: ‘‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా
సాక్షి, హైదరాబాద్: జేబుకు తెలియకుండానే పర్సు కొట్టేసే రకం ఆయనది. స్కీమ్ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన స్కామ్ వల్లే ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సీమెన్స్ అనే కంపెనీకి తెలియకుండానే వాళ్ల పేరుతో ఒప్పందం చేసుకోవడం ఒక వింత. అయితే అది 100 శాతం ఫ్రాడ్ అని తేల్చేసి బాబు బండారాన్ని బయటపెట్టింది సదరు సీమెన్స్ కంపెనీ. డిజైన్ టెక్ నుంచే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన షెల్ కంపెనీలకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మళ్లాయి. ఆ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ని ఈడీ గతంలోనే అరెస్ట్ చేసింది. రూ. 371 కోట్ల దోపిడీలో స్కిల్ చూపించిన చంద్ర బాబు, వికాస్ ఖన్వేల్కర్. స్కిల్ స్కామ్లో పక్కా ఆధారాలతో పట్టుబడ్డ బాబు అండ్ గ్యాంగ్.. ‘‘దెబ్బకు ఠా...దొంగల ముఠా’’ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో బిగ్ క్వశ్చన్ రాత్రి 7 గంటలకు.. మీ సాక్షి టీవీలో.. -
ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది?
ప్రతి వ్యక్తి వివిధ కూరలతో నిండిన ప్లేట్లోని ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాడు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటిది ఇది కళ్లకు ఇంపుగా కనిపించడం. రెండవది మన శరీరానికి అవసరమైన రీతిలో పోషకాలను అందించడం. అయితే ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడుందనే ప్రశ్న మీ మనస్సులో ఎప్పుడైనా తలెత్తితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అతిపెద్ద కూరగాయల మార్కెట్ కలిగిన ఘనత భారత్ ఖాతాలోనే ఉందని తెలిస్తే ఎవరైనా చాలా సంతోషిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్పూర్లో ఉంది. ఆ మార్కెట్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని చాలామంది రైతులు ఆ మార్కెట్లో వ్యాపారం చేయాలని తపన పడుతుంటారు. 90 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్ ఈ మార్కెట్ విస్తీర్ణం దాదాపు 90 ఎకరాలు. ఆజాద్పూర్ మండికి వెళ్లగానే ముందుగా పెద్ద గేటు కనిపిస్తుంది. దానిపై ‘చౌదరి హరి సింగ్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్పూర్’ అని రాసివుంటుంది. అక్కడ ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. భారతదేశంలో లభించే అన్ని రకాల కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. చిన్న, పెద్ద వ్యాపారులు ఇక్కడ విరివిగా కనిపిస్తారు. డీల్ కుదుర్చుకున్న తర్వాత కొందరికి లాభం చేకూరుతుంది. మరికొందరు గిట్టుబాటు ధర లభించక డీలా పడుతూ కనిపిస్తారు. ఈ మార్కెట్లో మహిళలు కూడా అధికసంఖ్యలో కనిపిస్తారు. ఇంటి బాధ్యతలతో పాటు వారు కూరగాయల వ్యాపారాన్ని కూడా చక్కబెడుతుంటారు. 1977లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ మండి కమిటీల వివిధ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలను నిర్వహించడానికి, నియంత్రించడానికి, మార్గనిర్దేశం చేయడానికి 1977లో ఆజాద్పూర్ మండిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఏర్పాటయ్యింది. మండి పరిషత్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వివిధ చట్టాలను రూపొందించింది. ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది? -
అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..
ఈ ప్రపంచంలో అతిపెద్ద పిల్లిని ఎప్పుడైనా చూశారా... అయితే ఇప్పుడు చూడండి... ఫొటో కనిపిస్తున్న ఈ పిల్లి పేరు కెఫిర్. శరీర పరిమాణం దాదాపు పెద్ద పులికి సమానంగా కనిపిస్తుంది. ఈ పిల్లి హావభావాలు, దీని చేష్టలు అచ్చం మనిషిని పోలి ఉంటాయి. రష్యాలోని ఓస్కోల్కు చెందిన యులియా మినినా అనే మహిళ దీనిని పెంచుకుంటోంది. అయితే ఈ పిల్లి, ఆమె. నాలుగేళ్ల కుమార్తె అనెష్కా నిలబడి ఉన్నప్పుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే ఎత్తులో ఉంటారు. ఎప్పుడూ ఇద్దరూ తోటలో ఆడుకుంటూ, సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటే అది ఒక పిల్లి అనే అనిపించదు. ఈ పిల్లి అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంది. స్వయంగా తలుపులు తెరుచుని బయటకు వెళ్తుంది. అలా ఈ పిల్లి ఫొటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పిల్లి సెలబ్రిటీగా మారింది. అతిపెద్ద పిల్లిని చూసిన నెటిజన్లు షాక్ అవుతూ పిల్లిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Юлия🤍Кефир (@yuliyamnn) (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!) -
JioBharat phone: సక్సెస్ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ సినిమాలు, హెచ్బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
2018మూవీ కి బిగ్ షాక్..
-
మెటాకు భారీ షాక్
-
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా
-
వైరల్ వీడియో : అదృష్టం అంటే ఇతనిదే..!
-
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్..
-
గన్ షాట్ : నీ ప్యాకేజీ మాకొద్దు ..
-
కాకినాడలో కేఏ పాల్కు చేదు అనుభవం
-
క్రెడిట్ కార్డు కస్టమర్లకు చార్జీల మోత..
-
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
ఆత్మాభిమానికి పెద్దమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్పాత్పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి. గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది. ఇదిగో.. టీ తాగు చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ.. సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ -
జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలి
మంత్రి కామినేని ఆదేశం కాకినాడ వైద్యం(కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై వైద్యులందరూ విధిగా రోగులకు జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ధీరూబాయి లేబొరేటరీ పక్కన రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక జీఈ కంపెనీకి చెందిన 16 స్లైస్ సిటీ స్కాన్ మెషీన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుబడ్జెట్లో ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యపరికరాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్లో రోగులకు వైద్యులు సమష్టిగా నాణ్యమైన వైద్య సేవలందించడంతో ఓపీ సంఖ్య పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో 1,065 పడకలుండగా, 1,800 మంది ఇన్పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సిటీస్కాన్ ప్రస్తుతం విశాఖపట్టణం, కాకినాడలో ప్రారంభించామని, అనంతపురం, తిరుపతి, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో సిటీస్కాన్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టామన్నారు. రూ.20 కోట్లతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలకు 1,000 ప్రసవాలు జరుగుతుండగా బేబీకిట్లను అందిస్తున్నామని, త్వరలో తల్లికి కూడా కిట్ అందిస్తామన్నారు. ఆసుపత్రికి 80 శాతం మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగతా 20 శాతం మందుల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీఎంఈ డాక్టర్ బాబ్జి, జెడ్పీ అధ్యక్షుడు నామన రాంబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు. స్టైఫండ్ కోసం ప్రశ్నించిన పీజీ వైద్యులపై మంత్రి ఆగ్రహం నాలుగు నెలలుగా స్టైఫండ్ విడుదల కావడం లేదని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరిన పీజీ వైద్యులపై మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీస్కాన్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన మంత్రిని పలువురు పిజీ విద్యార్థులు కలుసుకుని స్టైఫండ్ కోసం అడిగారు. అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తే. ఇప్పుడా స్లైఫండ్ కోసం అడిగేది..మీ సమస్యలు లేవనెత్తడానికి ఇదా సమయమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులై ఉండి కూడా ఇలా అడగడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఎంఈ డాక్టర్ బాబ్జి కలుగజేసుకుని తర్వాత మాట్లాడదాం అంటూ సర్ది చెప్పడంతో మంత్రి శాంతించారు. -
‘అక్ను’ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం
యూజీసీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన ‘అక్ను’ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముత్యాలనాయుడు రాయవరం : ఆది కవి నన్నయ యూనివర్సిటీ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వ విద్యాలయమని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. రాయవరంలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘అక్ను’ పరిధిలో 460 కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నట్టు తెలిపారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభించే సమయానికి 21 కోర్సులు ఉండగా, ప్రస్తుతం 36 కోర్సులు ఉన్నట్టు తెలిపారు. ఏటా కొత్త కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో సీపీఏ(అమెరికన్ కోర్సు), ఫోర్స్నిక్ సైన్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. యూనివర్సిటీలో లేని కోర్సులు డిగ్రీ కళాశాలల్లో పెడుతున్నట్లు ఆయన తెలిపారు. 45.28కోట్లు మంజూరు.. యూనివర్సిటీ ప్రారంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా రూ.45.28కోట్లు విడుదల చేశారన్నారు. ఆ నిధులతో నూతన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీకి 115 ఎకరాలు కేటాయించగా, ఇప్పటి వరకు 95 ఎకరాలు అప్పగించారని, ఇంకా 20 ఎకరాలు అప్పగించాల్సి ఉందన్నారు. నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన.. ‘అక్ను’ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గురు, శుక్రవారాల్లో సందర్శిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. యూజీసీ కమిటీ యూనివర్సిటీకి ఉన్న భవన సముదాయం, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. యూజీసీ కమిటీ సానుకూలమైన నివేదిక ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 12బీ గుర్తింపుతోనే నన్నయ ప్రగతి రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బీ గుర్తింపు లభిస్తేనే త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద యూనివర్సిటీగా ఉన్న నన్నయ అభివృద్ధి ఇంతకాలం నామమాత్రంగానే జరిగిందన్నారు. గురు, శుక్రవారాల్లో యూజీసీ కమిటీ జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న వివిధ సదుపాయాల ఆధారంగా 12బీ అనుమతి ఇస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. -
పరిధి దాటి పట్టుబడి..
పెద్దనోట్ల పట్టివేత కేసులో ఆర్ ఎస్సై చేతివాటం ఎస్సై పోస్టుకు ఎసరు తెచ్చుకున్న కానిస్టేబుల్ కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వేగేటు సమీపంలో పెద్దనోట్ల అక్రమ రవాణా పట్టివేత వ్యవహారంపై తవ్వేకొద్దీ పలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నగదు పట్టివేత, పోలీస్ స్టేషన్ అప్పగింత విషయంలో ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. పెద్దనోట్ల అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే కాకినాడ సబ్ డివిజినల్ అధికారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన అనుమతి తీసుకున్నాక, సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే తనిఖీలు చేపట్టాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా సర్వం తానై పెద్దనోట్ల పట్టివేతలో అక్రమానికి సదరు అధికారి తెరలేపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆర్ఎస్సై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లకుండా కేవలం కానిస్టేబుళ్లను పంపి తాను పక్కకు తప్పుకోవడం పోలీసు వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో రిజర్వు ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, నాలుగు నెలలుగా కాకినాడ ఒకటో పట్టణ సార్జెంట్ ట్రాఫిక్ ఎస్సైగా చేరి పెద్దనోట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్ప డటంతో జిల్లా ఎస్పీ వీఆర్లో ఉంచారు. కొవ్వాడ కేసులో పెద్దనోట్ల అక్రమ రవాణాలో పట్టుబడ్డ నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిషోర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామని, విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రిలిమినరీ ఎస్సై పరీక్షకు క్వాలిఫై.. ఇటీవల జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష (సివిల్ ఎస్సై) పోస్టుకు అర్హత సాధించిన ఓ కానిస్టేబుల్ పెద్దనోట్ల అక్రమ వ్యవహారంలో తలదూర్చి అడ్డంగా దొరికిపోవడంతో ఇతని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డిసెంబర్ 4వ తేదీన కొవ్వాడలో నగదు తనిఖీల్లో అక్రమాలకు పాల్పడి వీఆర్లోకి వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లలో ఒకరైన (గంగాధర్) ఒకటో పట్టణ ట్రాఫిక్ పోలీసుస్టేçÙన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీ దిగి, ఇంటికెళ్లిపోతున్న క్రమంలో ఆర్ఎస్సై తనిఖీలకు రావాలంటూ ఆదేశాలివ్వడంతో, కొవ్వాడ వెళ్లి ఈ కేసులో ఇరుక్కున్నట్టు పలువురు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. -
బీమా పడగ నీడలో భద్రమ్....!
బీమా పేరుతో భారీ దోపిడీ ∙కోటనందూరు మండలంలో రూ.30 కోట్లు స్వాహా! ∙తెల్లకార్డులున్న నిరుపేదలకూ భారీ పాలసీలు ∙తప్పుడు ధ్రువపత్రాతో అక్రమాలు ∙మరణానికి చేరువగా ఉన్నవారే లక్ష్యం ముక్కూమొహం తెలియని వ్యక్తి పేరున బీమా చేస్తారు. బీమా చేశారన్న విషయం ఆ వ్యక్తికీ తెలియదు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. తనను ఎందుకు చంపుతున్నారో కూడా అతడికి అంతుపట్టదు. అతడి పేరున బీమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాజేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో జరుగుతోంది. ఇదేదో సినిమా కథలా ఉంది కదూ. ఏడాది క్రితం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంచుమించు ఇదే తరహా సంఘటనలు జిల్లాలోనూ చోటుచేసుకుంటున్నాయి. దీని తీగలాగితే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. – కోటనందూరు మరికొన్నాళ్లలో మరణించే వారి పేరున భారీ మొత్తంలో బీమా పాలసీ చేయించి, వారు చనిపోయాక ఆ పరిహారంలో ఏజెంట్లు వాటా దండుకున్న సంఘటనలు కోటనందూరు మండలంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా భీమవరపుకోటలో జరిగిన ఇలాంటి వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కావడంతో, నకిలీ బీమా పాలసీల బాగోతంలో తీగ దొరికినట్టయింది. బహుళజాతి బీమా కంపెనీల్లో కొందరు ఏజెంట్లు.. ప్రాణాంతక వ్యాధులతో, మరణానికి చేరువులో ఉన్న వారి వివరాలను ముందుగా సేకరిస్తారు. ఈ ప్రక్రియలో వైద్యవృత్తిలో ఉన్నవారు, వ్యాధిగ్రస్తుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటారు. వ్యాధిగ్రస్తుల బంధువులను కలసి, బీమా వ్యవహారంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రీమియం మొత్తం ఏజెంట్ చెల్లిస్తే, పరిహారం మంజూరయ్యాక కొంతభాగం బాధిత కుటుంబానికి ఇవ్వడానికి, ఒకవేళ ప్రీమియం వ్యాధిగ్రస్తుల బంధువులు చెల్లిస్తే, చెరిసగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. భారీగా నగదు వస్తుందన్న ఆశతో నిరుపేద కుటుంబాల వారు సైతం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి వెనుకాడడం లేదు. సాధారణంగా నిర్ణీత వయస్సు వారికి మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. వృద్ధులకు కూడా తక్కువ వయస్సు నమోదు చేయించి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించకుండానే ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాల వారు కూడా భారీ మొత్తంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ, బీమా కంపెనీలు ఎందుకు జాగురుకతతో వ్యవహరించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం మంజూరు కోసం వస్తున్న విచారణాధికారులకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యమే. స్థిరమైన పెద్ద బీమా కంపెనీల జోలికి ఈ ఏజెంట్లు వెళ్లడం లేదు. కొత్తగా వచ్చిన బీమా కంపెనీలనే వీరు బురిడీ కొట్టిస్తున్నారు. రూ.30 కోట్లు హుష్కాకి! పదేళ్లుగా కేవలం కోటనందూరు మండలంలోనే సుమారు రూ.30 కోట్ల మేరకు ఇలా కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బీమా ఏజెంట్లను కంపెనీ తొలగించగా, మరలా వారే బినామీ పేర్లతో పాలసీలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది కంపెనీలకు ఈ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ ఏజెంట్లు ఇలాంటి వ్యవహారాల్లో చక్రం చక్రం తిప్పుతూ, అనతికాలంలోనే లక్షలాది రూపాయలు గడించారని సమాచారం. ఇలాంటి వ్యవహారాలు కోటనందూరు, జగన్నాథపురం, భీమవరపుకోట, కాకరాపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్నట్టు తెలిసింది. బీమా మోసాలపై ఫిర్యాదు చేయండి త్వరలో చనిపోతారని భావించిన వారి పేరున బీమా పాలసీ చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సరైన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. కోటనందూరులో ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. -
వేములవాడలో అతిపెద్ద బస్టాండ్
స్థలాన్ని పరిశీలించిన అధికారులు వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుడిచెరువు కట్టకింద 20 ఎకరాల్లో 40 ప్లాట్ఫాంలతో అతిపెద్ద బస్టాండ్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని టూరిజం, వీటీడీఏ, స్థానిక అధికారులు ఆదివారం పరిశీలించారు. బస్టాండుతోపాటు డార్మెటరీహాల్, సమాచారకేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. వీటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ రమేశ్ లొలేవార్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తీశ్వర్, ఆలయ డీఈ రఘునందన్, సైస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నామాల లక్ష్మీరాజం, పొలాస నరేందర్, పెంట బాబు, ఇప్పపూల విజయ్, పుల్కం రాజు, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’
కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’ జె.తిమ్మాపురం (పెద్దాపురం) : పెద్దాపురం మండలం జె.తిమ్మాపురంలో ఓ వంగమెుక్క కాలంపై, రుతువులపై గెలుపు బావుటా ఎగరేసింది. గ్రామానికి చెందిన పాలచర్ల విశ్వనాథం తన పొలంలో నాలుగేళ్ల క్రితం నాటిన ఆ మెుక్క ఏపుగా ఎదిగి అప్పటి నుంచి ఇప్పటి వరకూ పూత, పిందె, కాయలతో ఫలసాయాన్నిస్తూనే ఉంది. ప్రస్తుతం ఏడడుగుల ఎత్తు పెరిగిన వంగమెుక్క ఆ ఊళ్లో ఓ విశేషంగా ఆకర్షిస్తోంది. దాంతో పాటు నాటిన మెుక్కలు ఎన్నడో చనిపోయాయని, వాటి స్థానంలో ఇప్పటి వరకూ ఐదారుసార్లు వేరే మెుక్కలు వేశానని, ఈ మెుక్క మాత్రం నిక్షేపంలా ఉండి కాపు కాస్తూనే ఉందని విశ్వనాథం సంతోషంతో చెప్పారు. -
ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!
న్యూయార్క్ః భోజన ప్రియులు ఇప్పటికే ఎన్నో రకాల కేక్ లను రుచి చూసి ఉంటారు. కానీ వాటర్ కేక్ ను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు నీటితో తయారయ్యే స్వచ్ఛమైన నీటి బిందువులా కనిపించే వాటర్ కేక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా గుడ్డుతోనూ, గుడ్డు లేకుండానూ కూడా కేక్ లు తయారు చేయడం చూశాం. ఇప్పుడా రోజులు పోయి ఏకంగా నీటితోనే చవులూరించే రుచికరమైన కేక్ లు కొన్ని దేశాల్లో తయారైపోతున్నాయ్... స్వచ్ఛమైన నీటితో కేక్ ను తయారు చేయడం కొత్తగా కనుగొన్నారు న్యూయార్క్ వాసులు. ఈ కొత్త ప్రయోగానికి జనం ఆకర్షితులయ్యారంటే ఇక వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో త్వరలో మంచినీటికి ఎద్దడి ఏర్పడక తప్పదేమో అంటున్నారు వినియోగదారులు. తాజాగా తయారైన వాటర్ కేక్ ఇప్పుడు న్యూయార్క్ లోని సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్మార్గాస్ బర్గ్ లో ఈ సంవత్సరం అత్యంత ఆదరణను చూరగొన్నఈ జపనీస్ డెజర్ట్ ను మిజు షింగెన్ మోచీగా పిలుస్తున్నారు. జపాన్ లోని కేక్ ల సృష్టికర్త.. డేరెన్ వాంగ్ సృష్టించిన ఈ స్ఫటికాకారంలో ఉన్ననీటి వంటకాన్ని(వాటర్ కేక్) న్యూయార్క్ కు తీసుకొచ్చి రైన్ డ్రాప్ కేక్ గా మార్చారు. మృదువుగా, ట్రాన్స్పరెంట్ జెల్లీలా కనిపించే వాటర్ కేక్ ను ముక్కలు ముక్కలుగా కూడ కోయచ్చు. అయితే దీన్ని కాస్త భద్రంగా కూడ నిల్వ ఉంచాల్సి వస్తుంది. వేడి తగిలినా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కరిగిపోతుంది. ఇప్పటికే పలు రకాల ఆహార పదార్థాలను సృష్టించి, తన ప్రయోగాలతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న వాంగ్ కేవలం ఘనీభవించిన నీరు, జెలటిన్ తో ఈ కేక్ ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన వాటర్ కేక్ పై బ్రౌన్ సుగర్ సిరప్, వేయించిన సోయా పిండి చల్లి వడ్డిస్తున్నారు. జపాన్ లో వాటర్ కేక్ గా గుర్తింపు పొందిన ఈ కేక్ ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు రైన్ డ్రాప్ కేక్ గానూ పరిచయమై ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. -
విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు
భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే సిక్కా పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది. సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు (సుమారు 75 కోట్లు) ప్యాకేజ్ ఉండగా... అందులో ఓ మిలియన్ డాలర్ బేసిక్ శాలరీ, 3 మిలియన్ డాలర్ల వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా పొందుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజాల్లోని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 ప్యాకేజ్ (11.3 మిలియన్ డాలర్లు) కు దగ్గరగా చేరుకుంది. 2013-14 లో టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజ్ 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
వామ్మో ఎంతపెద్ద కంది చెట్టో!
గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన శారద ఇంటిపెరట్లో పెంచుకున్న కంది చెట్టు ఇంటిఎత్తు వరకు ఎదిగింది. కేవలం 5నెలల కాలంలోనే 15అడుగుల ఎత్తుపెరిగి సుమారు 3నుండి 5కిలోల కాయలు ఇస్తుందని శారద చెప్పారు. ఇంటి ఆవరణలో ఇలాంటి కందిచెట్టు పెరగడంతో గ్రామంలో అందరూ వింతగా చూసి వెళ్తున్నారు. - గండేడ్ -
తుంటరి చెంప ఛెళ్!
బిగ్, స్మాల్... స్క్రీన్ ఏదైనా ముద్దుగుమ్మలకు తిప్పలు తప్పడం లేదు పబ్లిక్లోకి వెళితే. హాలీవుడ్... బాలీవుడ్ అన్న తేడా లేదు... ఎక్కడో అక్కడ తారలపై ఆకతాయిల ఆగడాలు రొటీన్ అయిపోయాయి. తాజాగా టీవీ నటి ఐరిస్ మైటీకీ ఓ తుంటరి గ్యాంగ్ తగిలింది. అందులో ఒకడు ఆమె వెంటపడి.. ఆపై తిట్లు అందుకున్నాడు. చిర్రెత్తిన ఐరిస్... డిఫరెంట్ ట్రీట్ ఇచ్చింది. సర్రున వెనక్కు తిరిగి ఆ పోకిరి గూబ గుయ్యిమనిపించింది. దెబ్బకు అతగాడు దిమ్మ తిరిగి కిందపడ్డాడు. అంతటితో వదలకుండా... పోలీసులకు పట్టించింది. ‘ఓ గాడ్! నాకు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వచ్చు కాబట్టి సరిపోయింది’ అంటూ తన టాలెంట్ గురించి లేటుగా హింటిచ్చిందీ సుందరి! -
మీసాలా.. గోపాలా..