crushed
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్!
పెరవలి: ముక్కుపచ్చలారని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా చితకబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన చేబ్రోలు అనిల్కుమార్ కుమారుడు పెరవలి మండలం కానూరు గ్రామంలోని రమా గాయత్రి ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన సమయంలో ఏడుస్తున్న ఆ విద్యార్థి ఆటో నుంచి దిగలేదు. దీంతో ఉపాధ్యాయుడు అశోక్ వచ్చి, ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబు ఏడుస్తుండడంతో ఆరా తీయగా మాస్టారు కొట్టారంటూ వీపుపై ఉన్న గాయాలు చూపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని శుక్రవారం రాత్రి పెరవలి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి అనుమతి తీసుకుని, కేసు నమోదు చేయాల్సి ఉందని, అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. -
బెంగళూరు: అర్ధరాత్రి రోడ్డుపై ప్రాణభయంతో పరుగులు
సాక్షి, బెంగళూరు: ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నగరంలోని పులకేశి నగర్లో అక్టోబర్ 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే జరిగిన దారుణమిది. మృతుడిని అస్గర్గా గుర్తించిన పోలీసులు, సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా భావించారు. అయితే, మృతుడి స్నేహితుడిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు అమ్రీన్, అతడి వెంట ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు వివాదం కారణంగానే తామీ పనికి పూనుకున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అస్గర్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ కాగా, అతడి వద్ద అమ్రీన్ కారు కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి అతడు అస్గర్కు రూ.4 లక్షలు బకాయి పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అస్గర్ తనపై దాడి చేశాడంటూ అమ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకోవాలని అస్గర్ కోరగా అమ్రీన్ నిరాకరిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి మాట్లాడుకుందాం రమ్మని అస్గర్ను అమ్రీన్ పిలిచాడు. చెప్పినచోటుకు రాగానే ప్లాన్ ప్రకారం అతడిని కారుతో ఢీకొ ట్టి, చంపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో ఈ ఘటన ఆ సాంతం వీడియో తీశాడని పోలీసులు చెప్పారు. A murder committed openly on the streets of #Bengaluru has been captured on a mobile phone wherein a Scorpio runs over a man who was running to save his life. The incident, which occurred on October 18 at around 12:30 am, was recorded on a passerby's mobile phone in the… pic.twitter.com/ZBahJI0RNX — Hate Detector 🔍 (@HateDetectors) October 31, 2023 పారిస్ రైలులో బెదిరింపులు.. పోలీసు కాల్పులు పారిస్: ఫ్రాన్సు రాజధాని పారిస్లో హిజాబ్ ధరించిన ఓ మహిళ(38) రైలులో ప్రయాణి కులను బెదిరింపులకు గురిచేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపి ఆమెను గాయపరిచారు. దక్షిణ పారిస్లోని 13వ డిస్ట్రిక్ట్ గుండా వెళ్తున్న సబర్బన్ రైలులో ఓ మహిళ ‘అల్లాహూ అక్బర్’ అని అరుస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, సదరు మహిళను పలుమా ర్లు హెచ్చరించారు. తనను తాను పేల్చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెపైకి కాల్పులు జరిపారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరో గ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలి పారు. ఆమె 2021లోనూ భద్రతా అధికారులను ఇలాగే బెదిరింపులకు గురిచేసిందన్నారు. ఈ సంఘటన తర్వాత మానసిక ఆరోగ్య కారణాలతో కొన్ని రోజులపాటు నిర్బంధంలో ఉంచామన్నారు. తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఇజ్రాయెల్– హమాస్ యు ద్ధంతో ఫ్రాన్సులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ట్రాక్టర్ స్టంట్స్లో యువకుడి మృతి.. పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చంఢీగర్: ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి చెందిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్పై స్టంట్స్ చేయడాన్ని నిషేధించింది. ఇలాంటి విన్యాసాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. "ప్రియమైన పంజాబీలారా, ట్రాక్టర్ను పొలాల రాజు అంటారు. దానిని మృత్యుదేవతగా చేయవద్దు. ట్రాక్టర్ సంబంధిత పనిముట్లతో ఎలాంటి స్టంట్ లేదా ప్రమాదకరమైన పనితీరు పంజాబ్లో నిషేధించబడింది.” అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. పంజాబ్ గురుదాస్పూర్లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్మన్దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్మన్దీప్ ట్రాక్టర్పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: విషాదం: క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి -
నుజ్జునుజ్జు అయిన 5 భోగీలు
-
క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి
చంఢీగర్: పంజాబ్ గురుదాస్పూర్లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. Video | Man Crushed To Death Performing Tractor Stunt During Punjab Sports Fair Read here➡️https://t.co/TZIq7d6bvw pic.twitter.com/V2z6beZzey — NDTV (@ndtv) October 29, 2023 ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్మన్దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్మన్దీప్ ట్రాక్టర్పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
Vizag: ఇక బంద్! రోడ్డు రోలర్తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బీచ్రోడ్డులోని పోలీస్ మెస్ ఆవరణలో ఆదివారం రోడ్డు రోలర్తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్రోడ్డులో యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బీచ్రోడ్డులో బైక్ రేసింగ్లు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా వుండి తమ కుమారులపై నిఘా వుంచాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైక్లు నడుపుతూ ప్రమాదాలకు గురై ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మట్ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడేవారితో కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తున్నామని గుర్తు చేశారు. ఆయా జంక్షన్లలో వీరిచేత ప్లకార్డుల సాయంతో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 205 మందితో కమ్యూనిటీ సర్వీస్ చేయించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ఆరిబుల్లా, ట్రాఫిక్ ఏసీపీ – 1 కుమారస్వామి, ట్రాఫిక్ ఏసీపీ – 2 శరత్కుమార్, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ఎస్ఐ అసిరితాత, తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించి..) -
ప్రకాశం జిల్లాలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
-
88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించి..
రాయచోటిటౌన్: అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రాజ్కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!) -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో..
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా బిడ్డ గురించి ఆలోచించింది ఓ మహిళ. ట్రక్ కింద పడిపోతుండగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. అయితే ఇది 2019లో జరగ్గా.. క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చెయ్యడంతో ఇది మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నామ్ దిన్హా ప్రాంతంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు వీరిని తాకుతూ ఓవర్ టేక్ చూస్తూ వెళ్లింది. దీంతో బైక్ వెనక కూర్చున్న తల్లి, చేతిలోని పిల్లాడు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. వేగంగా స్పందించి చక్రాల కింద పడిపోబోతున్న తన బిడ్డను చాకచక్యంగా వెనక్కి లాగింది. పెను ప్రమాదం నుంచి కుమారుడిని కాపాడుకుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ఘటనలో తల్లీ, కొడుకులు వెంట్రుకవాసిలో తల్లి, క్షేమంగా భయటపడ్డారు. చదవండి👉 ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి. తల్లి చాకచక్య తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది ఏది లేదు', 'కన్నపేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Mother of the year https://t.co/qIZlz1PYEZ — Jofra Archer (@JofraArcher) April 25, 2022 -
Biggest Ice Gola: ఈ ఐస్గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!!
వాన పడితే చాలు వేడి వేడీ బజ్జీలు, పకోడీలు గుర్తుకొస్తాయి. ఇక ఎండాకాలంలో అయితే చల్లని పానియాలు, ఐస్క్రీమ్లు.. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతాం. అలాగే ఇతర సీజన్లలో కూడా.. రొటీన్కి భిన్నంగా కొత్త రుచుల కోసం ఎప్పుడూ వెదుకుతూనే ఉంటాం! ఋతువుకో రుచన్నమాట. సాధారణంగా వేసవికాలంలో ఏ వీధిలోనైనా ఐస్గోళా బండి కనిపిస్తుంది. నలగ్గొట్టిన ఐస్ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్లో, రకరకాల రంగుల్లో భిన్న రుచుల్లో అందిస్తారు. వీటిని పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా ఆస్వాదిస్తారు. ఐస్గోళా పాపులర్ రుచుల్లో కలఖట్టా ఫ్లేవర్ ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎందరో. ఐతే తాజాగా గుజరాత్లోని సూరత్కి చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి 5 కేజీల అతిపెద్ద ఐస్గోళాను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ భారీ ఐస్గోళాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వేలకొద్ది నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో దీని తయారీ విధానాన్ని మనం చూడొచ్చు. మూడున్నర కేజీల నలగ్గొట్టిన ఐస్ను కోలాకారంలో తయారు చేసిన తర్వాత దీనిపై మ్యాంగో , చాక్లెట్లతో పాటు భిన్న రుచుల చిక్కని ద్రావణాలను పోశారు. దీని పై భాగంలో కేసర్ రబ్రీ, తాజా క్రీమ్లను జోడించారు. వీటన్నింటినీ చేర్చడంతో మరికొంచెం పెద్దగా తయారైంది. తర్వాత కోవాను తురిమి, నాలుగు స్పూన్ల ఐస్క్రీమ్ను పై భాగంలో ఉంచారు. వీటిపై క్రీమ్తో మరొక పొరను వేశారు. చివరిగా చెర్రీస్, చాక్లెట్ చిప్స్, బాదం పప్పు, సిరప్లతో అలంకరించారు. నోరూరించేలా ఉన్న ఈ ఐస్గోళా దేశంలోనే అతిపెద్దదని, 12 మంది తినగల ఈ గోళా ఖరీదు రూ.999లని అమర్ సిరోహి చెప్పుకోచ్చాడు. చదవండి: ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే.. -
క్షణాల్లో బతికిపోయాడు...
సాక్షి, ముంబై: ప్రమాదమనీ, ప్రాణాంతకమనీ తెలిసినా ఏదో ఒక కారణంతో కొంతమంది కదిలే రైలునుంచి ప్లాట్ఫాం మీదికి దూకడం లాంటి చర్యల్ని మానుకోరు. ఇలాంటి దుందుడుకు చర్యతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించి ఉండకపోతే క్షణాల్లో ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. వాయువేగంగా కదలిన గార్డు పట్టు తప్పి పట్టాలపై పడిపోబోతున్న సదరు వ్యక్తిని కాపాడారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దిలీప్ భికాన్ మాండే (52) తన కుమారుడితో కలిసి మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్ వెళ్తున్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి యూపీకి చెందిన కామ్యాని ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే పొరపాటున వీరిద్దరూ బిహార్కు చెందిన పవన్ ఎక్స్ప్రెస్ ఎక్కేసారు.ఈ విషయాన్ని గ్రహించే సమయానికి, రైలు ప్లాట్ఫాం నుండి బయలుదేరుతోంది. దీంతో వారు సామానుతో పాటు కదిలే రైలు నుండి ప్లాట్ఫాంపై దూకేందుకు ప్రయత్నించారు. కుమారుడు బాగానే దూకేశాడు కానీ తండ్రి సైడ్ బార్ పట్టుకుని ఉండటంతో నియంత్రణ కోల్పోయాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు క్షణం ఆలస్యం చేయకుండా మాండే ను ట్రాక్పైకి జారిపోకుండా కాపాడారు. దీంతో మాండే స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోమనాథ్ మహాజన్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిప్) అధికారి కె సాహు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తన ప్రాణాలను కాపాడినందుకు సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్లాస్టిక్ బాటిల్ వేస్తే ముక్కలే
సాక్షి, కాజీపేట : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్ క్రషింగ్ మిషన్’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి. అలవాటు చేసేందుకు.. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే.. నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్ను ఇందులో వేస్తే బాటిల్ చూరచూర అవుతుంది. తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, గ్లాస్లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలుగా మారుతోంది. ఆ ముక్కలను ప్లాస్టిక్ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్ క్రషింగ్ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్క్రీన్పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్తో దేశ భవిష్యత్కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్ భాషలో వివరిస్తుంటారు. -
ఫ్యాషన్ డిజైనర్ నిర్లక్ష్యం.. లగ్జరీ కారుతో దారుణం!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా రాంగ్సైడ్లో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ యువతి. లగ్జరీ ఎస్యూవీని కారు అడ్డదిడ్డంగా నడుపుతూ.. ఓ మహిళ ఢీకొట్టి తొక్కించేసింది. దీంతో ప్రమాదస్థలిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా అగర్వాల్ లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్ష్ యుటిలిటీ వెహికల్) కారును రాంగ్రూట్లో నడుపుతూ.. ఫూల్వతి అనే 50 ఏళ్ల మహిళను ఢీకొట్టింది. ఆదివారం రాత్రి శివాజీ స్టేడియం బస్ టెర్మినల్ వద్ద గల ఓ రెస్టారెంట్ ముందు ఫూల్వతి నిల్చుని ఉండగా.. అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ఆమెపైకి శ్రేయ దూసుకుపోయింది. ఆమెను ఢీకొట్టడమే కాకుండా.. దాదాపు 300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫూల్వతి అక్కడిక్కడే మృతిచెందారు. దగ్గరలోని చెక్ పోస్టు వద్ద విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు విషయాన్ని గ్రహించి నిందితురాలిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
భయానకం.. కారుతో కసి తీరా 8సార్లు గుద్దించి...
బీజింగ్ : తనకు సంబంధం లేని గొడవలో చిక్కుకుని ఓ వ్యక్తి పైశాచికంగా హత్యకు గురయ్యాడు. దక్షిణ చైనాలోని చెన్ చియాంగ్జ్లో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన భయానక వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు తన ఇంటి పక్కనే ఉండే మహిళతో కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. అది మనసులో పెట్టుకుని ఆమెపై అతను పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం టాక్సీలో వెళ్తున్న మహిళను నడిరోడ్డుపై అడ్డగించి వివాదానికి దిగాడు. ఆమె ఓవైపు వాదిస్తుండగానే మధ్యలో ఓ యువకుడు కలుగజేసుకుని సర్దిచెప్పే యత్నం చేశాడు. ఇంతలో నిందితుడు జువాన్ లింగ్జి(26) మాత్రం కారును తీసి అతన్ని ఢీకొట్టాడు. ఊహించని పరిణామానికి అక్కడున్నవారంతా షాక్కి గురయ్యారు. అంతా తేరుకునేలోపే ఎనిమిది సార్లు కారుతో అతన్ని ఢీకొట్టాడు.నిందితుడి కారు(తెలుపు)కి, టాక్సీకి మధ్య నలిగిపోయి ఆ యువకుడు కుప్పకూలిపోయింది. వీడియోలో నిందితుడి కారుకు అంటిన రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న కొందరు అతన్ని రక్షించేందుకు యత్నించగా.. వారికి కూడా గాయాలయ్యాయి. ఈ నేరంలో నిందితుడు జువాన్ లింగ్జి(26)కు ముగ్గురు వ్యక్తులు సాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో నుంచి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హాహాకారాలతో ఉన్న ఆ దృశ్యాలు మీకోసం... -
భయానకం.. కారుతో కసి తీరా 8సార్లు గుద్ది...
-
షాకింగ్: యాంకర్ను మింగేసిన కొబ్బరిచెట్టు
ముంబై: ముంబైలో అనూహ్యమైన ప్రమాదం కలకలం రేపింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర్శన్ మాజీ యాంకర్ మరణించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది దూరదర్శన్ మాజీ యాంకర్, యోగ టీచర్ కూడా అయిన కంచన్ నాథ్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమెమీద విరుచుకుపడింది. దీంతో ఆమె చెట్టుకింద పడి నలిగిపోయింది. అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో శనివారం ఉదయం కన్ను మూశారని కంచన్ భర్త తెలిపారు. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాడైపోయి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు. -
ప్రాణాన్ని బలి తీసుకున్న ఫుట్బోర్డు ప్రయాణం
-
పిలిచిన వెంటనే రాలేదని చితక్కొట్టిన పోలీసులు
-
ఎస్కలేటర్లో ఇరుక్కుపోయింది
కౌలలాంపూర్: ఎస్కలేటర్లో ఇరుక్కున్న బాలుడి ఆర్తనాదాలతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ మారుమోగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన పశ్చిమ మలేసియాలో బుధవారం చోటుచేసుకుంది. ఫ్లోర్ పైకి వెళ్తున్న సమయంలో మూడేళ్ల బాలుడు ఎస్కలేటర్ మీద కూర్చున్నాడు. అయితే చివరకు వచ్చినా కూడా లేవకపోవడంతో అతని పాంటు అందులో ఇరుక్కుపోయింది. దీంతో అతను పైకి లేవడానికి అవకాశం లేకుండా పోయింది. అతని పురుషాంగం చివర మెట్లకు, ఫ్లోర్ కిందభాగానికి మధ్యలో ఇరుక్కుపోయింది. బాలుడు ఎస్కలేటర్లో ఇరుక్కోవడం గమనించిన ఓ వ్యక్తి ఎమర్జెన్సీ బటన్ను నొక్కాడు. ఎస్కలేటర్ ఆగినా, అప్పటికే ఆ బాలుడి పురుషాంగం ఎస్కలేటర్లో చిక్కుకోవడంతో ఆ బాలుడి రోదనలు మిన్నంటాయి. బాలున్ని రక్షించేందుకు వచ్చిన రెస్యూటీం ఎస్కలేటర్ను విడివిడిగా చేసి విప్పారు. 30 నిమిషాల పాటు భద్రతా సిబ్బంది కష్టపడి బాలుడిని బయటకు తీశారు. వెంటనే అతడిని మలేసియాలోని తాయిపింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. ఎస్కలేటర్లో పైకి వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని రక్షణ చర్యల్లో పాల్గొన్న అధికారి నసీర్ వహబ్ తెలిపారు. పైకి చేరుకున్నసమయంలో ముందుగా బాలుడి ప్యాంటు చిక్కుకొని, తర్వాత పురుషాంగం కూడా ఇరుక్కుందని తెలిపారు. పిల్లలను కదిలే ఎస్కలేటర్ పై కూర్చోనివ్వొదని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి
-
హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలింది..!
పది అంతస్తుల హ్యూమన్ పిరమిడ్ కుప్ప కూలిపోయింది. జపాన్ ఒకసా లోని ఓ పాఠశాలలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన అర్థంతరంగా నేల ఒరిగింది. 150 మంది విద్యార్థులతో నిర్మించిన పిరమిడ్ ఒక్కసారిగా నేల కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జెండా ఎగుర వేసేందుకు అందరికంటే పైకి ఎక్కిన విద్యార్థి తన పని పూర్తి కూడా చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి అతడు జారిపోవడంతో మొత్తం ప్రదర్శన కకావికలమైపోయింది. జపాన్ లోని ఒసాకా.. యో సిటీ లోని జూనియర్ హైస్కూలు విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా ఒకరిపై ఒకరు ఎక్కుతూ పది అంతస్తులుగా.. ఓ పిరమిడ్ రూపాన్నినిర్మించారు. ఇటువంటి గ్రూప్ ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒకరి మధ్య ఒకరికి ఎంతో గట్టి నమ్మకం ఉండాలి. అప్పటికీ పైన ఎక్కిన విద్యార్థి తాను జెండా ఎగురవేసేందుకు నిలబడుతున్నానని ఒకటికి రెండుసార్లు అందర్నీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. అంతా కలిపి చేయాల్సిన పనిలో ఏ ఒక్కరు పరధ్యాన్నంగా ఉన్నా మొత్తం కొలాప్స్ అవ్వడం ఖాయం. అక్కడ అదే జరిగింది. పైకెక్కిన విద్యార్థి చివరి అడుగును పైకి వేసేలోపు కింది వరుసలో నిలబడ్డ వారిలో కదలికలు రావడంతో అంతా ఒక్కసారి కుప్ప కూలిపోయారు. ఆ హఠాత్ పరిణామం అక్కడ ప్రదర్శనను చూస్తూ ఉన్న మిగిలిన విద్యార్థులను షాక్ కు గురి చేసింది. మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒక విద్యార్థికి మాత్రం చెయ్యి కూడ విరిగిపోయింది. హ్యూమన్ పిరమిడ్స్ తో గాయాలవ్వడం జపాన్ లో కొత్తేమీ కాదు. 2012 లో 6,500 మందికి గాయాలవ్వడం ఓ రికార్డుగా మారింది. అప్పట్లో ఒక విద్యార్థికి పెర్మనెంట్ స్పైనల్ డ్యామేజ్ కూడ అయ్యింది. ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా జపాన్ ప్రజలు ఆ ప్రదర్శనను ఎంతో గర్వంగా ఫీలౌతారు. ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల ప్రదర్శనల్లో మానవ పిరమిడ్ నిర్మించడం అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
ఇంటి ముందు పడుకుంటే...
హిసార్: హర్యానాలోని హిసార్లో గురువారం రాత్రి దారుణం జరిగింది. కొడుకుతో పాటు ఇంటిముందు నిద్రిస్తున్న ఓ 45 ఏళ్ల మహిళపై కారు ఎక్కించడంతో ఇద్దరూ చనిపోయారు. పెహల్వాన్ చౌక్ ప్రాంతంలో తన ఇంటి ముందు రాణి, ఆమె కొడుకు వివేక్ పడుకున్నారు. పొరుగున ఉండే జస్ దీప్ సంధూ వారిపై తన ఎస్యూవీని ఎక్కించేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో పాటు బాధితులు ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో సందూ కారునే అక్కడే వదిలేసి పారిపోయాడు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శవపరీక్షకు పంపించారు.