Dalit man
-
దళిత యువకుడిని చంపి.. తల్లిని వివస్త్రను చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది. వారంతా అక్కడి నుండి బస్స్టాండ్కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్వార్ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే. MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod #MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL — Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్పై చికెన్ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా, పోలీసు అధికారి శివకుమార్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. తన ఫోన్ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు.. -
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..
లక్నో: మధ్యప్రదేశ్లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C — NDTV News feed (@ndtvfeed) July 8, 2023 దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్బలి సింగ్ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్ -
బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
గుజరాత్:గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. పిల్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
హేయనీయం: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’
క్రైమ్: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్ వైరింగ్ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్ కోసం భరత్ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. కోపంతో ఆ దాబా ఓనర్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. Video Credits: First India News -
అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. దొంగతనం చెయ్యలే!
క్రైమ్: తోటలోంచి జాంకాయను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకున్ని ఘోరంగా హింసించి చంపారు. ఈ ఘటనలో బాధితుడు దళితుడు కాగా, స్థానికుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమాష ఘటన యూపీలోని అలీగఢ్ జిల్లాలో శనివారం జరిగింది. 20 ఏళ్ల ఓం ప్రకాశ్ అడవి నుంచి తిరిగొస్తూ.. జాంపళ్ల తోట వద్ద కింద పడున్న ఓ పండును తీసుకుని తినబోయాడు. అయితే అది గమనించిన తోట యజమానులు భీంసేన్, భన్వారీలు దొంగతనం చేశాడేమో అనే అనుమానంతో అతన్ని దారుణంగా హింసించారు. తాను దొంగతనం చేయలేదని, కిందపడితే తీసుకున్నానని బాధితుడు కాళ్ల మీద పడ్డా కూడా ఆ మూర్ఖులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని కేకలు విని.. జనం గుమిగూడారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మధ్యలోనే అంతా చూస్తుండగానే.. దుడ్డుకర్రలు.. చేతికి దొరికిన వస్తువులతో స్పృహ తప్పేదాకా ఓం ప్రకాశ్ను చితకబాదారు. గాయాలతో పడి ఉన్న అతన్ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఘటనపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఇదీ చదవండి: నేరాలు.. ఘోరాలు.. చూసి ఇంట్లోవాళ్లనే! -
ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?
బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్లోని భీమా నగర్లో లేఅవుట్లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్, నవాజ్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్షిప్ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్ను ఎవరో కొట్టారని మాకు కాల్ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
పాత కక్షలతో తండ్రీకొడుకులపై దాడి.. మూత్రం తాగాలంటూ..
జైపూర్: రాజస్థాన్లోని బార్మెర్లో దారుణం చోటు చేసుకుంది. 15 మంది వ్యక్తులు కలిసి దళిత వ్యక్తిని, అతడి కొడుకుపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బార్మెర్లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కిరాణా దుకాణంలో రాయ్చంద్ మేఘవాల్, అతని కుమారుడు రమేష్ వస్తువులను కొనుగోలు చేస్తున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసలు పేర్కొన్నారు. ఓ 15 మంది వ్యక్తులు అకస్మాత్తుగా తండ్రీకొడుకుల పై దాడి చేసి మూత్రం తాగమని బలవంతం చేసినట్లు వెల్లడించారు. కులం పేరుతో దూషించి అవమానించినట్లు తెలిపారు. అంతే కాకుండా రాయ్చంద్పై దాడి చేయడంతో అతడి పంటిని కోల్పోగా.. రమేష్కు కాలు విరగడంతో పాటు చేతికి గాయాలయ్యాయి. కాగా, ప్రాధమిక చికిత్స కోసం బాధితులను చౌహతాన్కు తరలించి, తదుపరి చికిత్స కోసం బార్మెర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇది పాత శత్రుత్వానికి సంబంధించిన కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అప్పు తీర్చలేదని సర్పంచ్ భర్త సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. మృతుడి భార్య గ్రామ్ ప్రధాన్(సర్పంచ్) కావడం గమనార్హం. ఈ ఘటన శుక్రవారం అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం 5-6గురు వ్యక్తులు కలిసి అర్జున్ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తక్షణమే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్పూర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్కు తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఆస్పత్రికి చేరేలోపే అతడు మరణించాడు. (బర్త్డే పార్టీలో ఓవరాక్షన్ : సింగర్పై కాల్పులు) ఈ సందర్భంగా గ్రామ పెద్ద(సర్పంచ్), బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇక ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ్ ప్రధాన్ భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం లక్నో ట్రామా సెంటర్కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్బాబు
-
శిరోముండనం కేసు; కొత్త కోణం
సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు. విజయ్బాబు ఏమన్నాడంటే... ‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్కు సంబంధం లేదు’ అని విజయ్బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) -
బైక్ తాకినందుకు రోడ్డుపైకి ఈడ్చి దాడి
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని తాకాడన్న కారణంతో దళితుడిపై దాడి చేసిన అనాగరిక ఘటన శనివారం కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విజయపుర జిల్లా మినాజీ గ్రామానికి చెందిన ఓ దళితుడు అనుకోకుండా ఉన్నత కులానికి చెందిన ఓ వ్యక్తి బైక్ను ముట్టుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన అగ్ర కులస్థులు అతనిపై మూకదాడి చేశారు. అతని బట్టలూడదీసి గొడ్డును బాదినట్టు బాదడమే కాక అతని కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి ఈడ్చి వారిపైనా దాడి చేశారు. దీంతో బాధితుడు తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడికి పాల్పడ్డ 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ మూకదాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో కొందరు దళితుడిని గట్టిగా అదిమి పట్టుకోగా మరికొందరు అతన్ని ఇష్టారీతిన కొట్టారు. అతని కుటుంబ సభ్యులపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. (నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!) -
దళితుడి ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి
ముంబై : ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించినందుకు ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి ఓ దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. పుణెకు చెందిన విరాజ్ విలాస్ జాగ్తాప్(20) ఉన్నత కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం కాస్తా యువతి కుటుంబానికి తెలియడంతో యువకుడితో పలుమార్లు గొవడకు దిగారు. ఈ వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు యువకుడికి ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించారు. ఈ క్రమంలో అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడిని కులం పేరుతో దూషించి, అసభ్యకరమైన పదజాలంతో యువతి తల్లిదండ్రులు అతన్ని అవమానించారు. (బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం ) అనంతరం అక్కడ నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విరాజ్ను యువతి బంధువులు ఆరుగురు యువకుడిని అడ్డుకొని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్ బైక్పై నుంచి కింద పడగా కనీస కనికరం లేకుండా నిందితులు అతనిపై రాళ్లు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. యువతి తండ్రి విరాజ్ ముఖంపై ఉమ్మి వేశాడు. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. రక్తపు మడుగుల మధ్య ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు యువకుడు మరణించాడు. (భార్య మాట వినటం లేదని భర్త హల్చల్) ఈ ఘటనపై విరాజన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా వారిని రిమాండ్ హోమ్కు తరలించారు. కాగా తన కొడుకును చంపిన వారిని ఉరి తీయాలని, అప్పుడే మరోసారి ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఉంటాయని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
సోదరి ప్రేమికుడిపై విచక్షణారహితంగా దాడి
తిరువనంతపురం: తన సోదరిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో దళిత యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన కేరళలో ఆదివారం చోటు చేసుకుంది. ఎర్నాకులంలోని మువట్టుపుఝకు చెందిన 20 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి సోదరుడికి తెలిసింది. ప్రేమ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు దళితుడిని మర్చిపోవాలంటూ సోదరిని మందలించాడు. అయినప్పటికీ వాళ్లిద్దరూ ప్రేమను వదులుకోడానికి ఇష్టపడలేదు. ఇదిలా వుండగా ఆదివారం సాయంత్రం యువతిని ప్రేమించిన వ్యక్తి ఫేస్ మాస్కు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. (నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్) అక్కడికి చేరుకున్న యువతి సోదరుడు అతడిని బయటకు రమ్మని పిలిచాడు. దీంతో అతను దుకాణంలో నుంచి బయటకు రాగానే కత్తి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై తీవ్ర గాయాలైన అతడిని కొట్టాయంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి సహకరించిన పదిహేడేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. (నవవధువు అనుమానాస్పద మృతి) -
యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..
లక్నో : పొలానికి వెళ్లిన దళిత యువకుడి తలను శరీరంనుంచి వేరుచేసి, చేతి వేళ్లను నరికి అతి క్రూరంగా చంపేశారు గుర్తు తెలియని కొందరు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫతేహ్పుర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫతేహ్పుర్కు చెందిన ప్రమోద్ కుమార్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు ఆదివారం 12 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. 2:30 గంటల ప్రాంతంలో తల వేరు చేయబడ్డ అతడి శవాన్ని అటుగా వెళుతున్న కొందరు గుర్తించారు. ఆ వెంటనే కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి కుడి చేతి వేళ్లను మూడింటిని తొలగించి ఉండటం గమనించారు. అంతేకాకుండా అతడి తలను ఇటుకపై పెట్టి, వేరుచేసినట్లుగా వారికి ఆనవాళ్లు లభించాయి. దీనికి తోడు ప్రమోద్ సెల్ఫోన్ సైతం కనిపించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం లేదని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 10మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువమంది ఈ హత్యలో పాల్గొని ఉంటారని వారు భావిస్తున్నారు. ( భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం ) -
మొబైల్ చోరీ చేశాడంటూ చావబాదారు..
జైపూర్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్లోని సికార్ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్ లాల్ మీనా (75) సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్, భరత్భూషణ్, దిలీప్ సింగ్, సందీప్ మీనా, సందీప్ యాదవ్లను అరెస్ట్ చేశామని అదనపు ఎస్పీ దినేష్ అగర్వాల్ వెల్లడించారు. ఓ హోటల్ వద్ద తమ మొబైల్ ఫోన్ను మదన్ లాల్ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : మహిళా కండక్టర్పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు! -
నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారు!
చండీగఢ్ : దేశంలో రోజుకో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్న ఆధునిక కాలం ఇది. ఎక్కడి ఎవరికి చిన్నకష్టమొచ్చినా ప్రపంచమంతా తల్లడిల్లుతున్న సున్నితమై కాలం ఇది. కానీ కొందరిలో అనాగరికత్వం, అమానుషత్వం రోజురోజుకూ నరనరానా జీర్ణించుకుపోతున్న చరిత్రకు కూడా ఈ కాలం ప్రత్యక్ష సాక్షి. వివరాల్లోకేళ్తే.. ఓ దళిత వ్యక్తిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేసి, అతనితో బలవంతంగా మూత్రం తాగించిన సంఘటన పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో సంచలనం రేపింది. పాతకక్షల నేపథ్యంలో కొందరు దుండగులు దళితుడిని ఎత్తికెళ్లి చితకబాదారు. అంతటితో ఆగకుండా తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చి ఆ వ్యక్తికి నరకం చూపించారు. సంగ్పూర్ జిల్లాకు 55 కి. మీ దూరంలో ఉన్న చంగలివాలా గ్రామానికి చెందిన జగ్మిల్ సింగ్(37) అనే వ్యక్తి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా అతడిని ఎత్తుకెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ స్తంబానికి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించి, రాడ్లతో హింసించారు. అయితే వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగు చూసింది. కాగా గ్రామానికి చెందిన రింకూ అనే వ్యక్తితో సెప్టెంబర్21న చిన్న వివాదం ఏర్పడినట్లు, అప్పుడే రాజీకి రావడంతో ఆ గొడవ సర్ధుమనిగిపోయిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఎత్తుకువెళ్లి స్తంబానికి కట్టేసి కర్రలు, రాడ్లతో కొట్టారని, తాగడానికి నీళ్లు అడిగితే మూత్రం ఇచ్చారని పోలీసుల ఎదుట వాపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రింకూ, అమర్జిత్ సింగ్,లక్కీ అలీయాస్ గోలి, బీతా అలీయాస్ బిందర్గా గుర్తించారు. వీరంతా చంగలివాలా గ్రామానికే చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితుడి అభియోగంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కుమారుడి హత్య.. తండ్రి ఆత్మహత్య
జైపూర్: కుమారుడిని చంపేశారు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించడంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించారు. నిందితుల బెదిరింపులకు భయపడి కళ్లు లేని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాలు.. రత్తిరన్ జాతవ్ అనే వ్యక్తి అంధుడు. అతడికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు హరీశ్ జాతవ్ గత నెలలో ఓ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో సదరు మహిళ బంధువులు హరీశ్ మీద దాడి చేసి చంపేశారు. దీని గురించి అతడి తండ్రి రత్తిరన్ పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హరీశ్పై దాడి చేసి, అతని చావుకు కారణమయిన వ్యక్తులు కేసు వాపసు తీసుకోవాలని.. లేదంటే రత్తిరన్ కుటంబ సభ్యుల్లో ఎవ్వరిని వదలమని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన రత్తిరన్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి హరీశ్ సోదరుడు మాట్లాడుతూ.. ‘న్యాయం చేయాలంటూ మా నాన్న పోలీసులను ఎంతో వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వారు ముందుగానే స్పందించి ఉంటే.. ఈ రోజు మా నాన్న మరణించేవారు కాదు. మాకు న్యాయం జరగదనే భయంతోనే మా నాన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. -
దారుణం : గర్భంతో ఉన్న భార్య కోసం వెళితే..
గుజరాత్లో అమానవీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్సీ / ఎస్టీ సెల్)మన్వర్ అందించిన వివరాల ప్రకారం దళిత యువకుడు హరేష్ సోలంకి (25) వర్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిలా బెన్ను కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ తమ కూతురు ఊర్మిలాబెన్ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కచ్ జిల్లాలోని గాంధీధామ్లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు సోలంకి. అయితే ఊర్మిలా గర్భం దాల్చడంతో మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని వారాల తరువాత ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పారు. అయితే రెండు నెలలైనా భార్యను తన వద్దకు పంపించక పోవడంతో, తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించటానికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మహిళల హెల్ప్లైన ‘అభయం 181’ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ అధికారుల సహాయంతో హెల్స్లైన్ వాహనంలో అత్తమామల ఇంటికి వెళ్లాడు. హెల్ప్లైన్ సిబ్బంది ఊర్మిలాబెన్ను పంపించేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వాహనంలో సోలంకి ఉన్నాడని తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పదునైన దారుణంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో హెల్ప్లైన్ వాహనం కూడా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన తర్వాత నిందితులు తమ ఇంటి నుంచి పారిపోయారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్తమామలు సహా ఎనిమిది మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు, ప్రభుత్వ అధికారికపై దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ ప్రకటించారు. -
అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితుడి మృతి
నైనిటాల్ : ఉత్తరాఖండ్లో గతనెల 26న ఓ వివాహ రిసెప్షన్లో తమ ఎదురుగా భోజనం చేసినందుకు అగ్ర వర్ణాల చేతిలో భౌతిక దాడికి గురైన దళిత యువకుడు మరణించాడు. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్కువ కులానికి చెందినప్పటికీ తమ సరసన భోజనం చేశాడనే ఆగ్రహంతో జితేంద్ర అనే దళితుడిని తెహ్రి జిల్లా ష్రికోట్ గ్రామంలో అగ్రకులాల వ్యక్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు. కాగా, బాధితుడు తొమ్మది రోజుల పాటు డెహ్రడూన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. జితేంద్ర సోదరి ఫిర్యాదుతో ఏడుగురు నిందితులు గజేంద్ర సింగ్, శోభన్ సింగ్, కుషాల్ సింగ్, గబ్బర్ సింగ్, గంభీర్ సింగ్, హర్బీర్ సింగ్, హుకుం సింగ్లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
షాకింగ్.. పొరపాటున బీజేపీకి ఓటేసి.. !
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ లోక్సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పవన్.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
పెళ్లిలో నృత్యం చేశాడని దళితుడి హత్య
ముజఫర్పూర్: బిహార్లో వివాహ వేడుకలో నృత్యం చేశాడంటూ ఓ మహాదళితుడిని కాల్చిచంపారు. అభీఛాప్రాలో బుధవారం రాత్రి ఓబీసీ వర్గానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి ఊరేగింపుæ జరిగింది. ఇందులో స్థానిక మహాదళితుడు (ముసాహర్) నవీన్ మాంజీ(22) అనుమతి లేకుండా వచ్చి డాన్స్ చేశాడు. పెళ్లి బృందంలోని వారు అభ్యంతరం చెప్పినా వినలేదు. దీంతో ఆ బృందంలోని ఓ వ్యక్తి మాంజీని కాల్చి చంపాడు. దీంతో ఆగ్రహించిన ముసాహర్లు పెళ్లి కొడుకు ఇంట్లో లూటీ చేశారు. దీనిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. పెళ్లి కొడుకు సోదరుడు (వరుసకు) పాత కక్షలతోనే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని బాధితుడి తండ్రి పేర్కొన్నారు. ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారని వాహనాలకు నిప్పుపెట్టారని పెళ్లివారు ఫిర్యాదు చేశారు. -
దళితుడిని కట్టేసి కొట్టి చంపారు
రాజ్కోట్ (గుజరాత్): చెత్త ఏరుకొని జీవనం సాగించే ఓ దళితుడిని తాడుతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో చోటు చేసుకుంది. ముఖేష్ వనియా, తన భార్య జయాబెన్తో కలసి రాజ్కోట్లో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం షాపర్లోని రాడాడియా ఫ్యాక్టరీ వద్ద దంపతులిద్దరు చెత్తను సేకరిస్తుండటాన్ని యజమాని గమనించాడు. వారిని దొంగలుగా అనుమానించిన ఆయన, తన నలుగురు స్నేహితులతో కలసి ముఖేష్ను తాడుతో కట్టేసి దారుణంగా కొట్టారు. తన భర్తను కొట్టవద్దని జయాబెన్ వేడుకున్నా కనికరించలేదు.. సరికదా ఆమెను కూడా కర్రలతో చావబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముఖేష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, జయాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యజమాని జయకుష్తో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రాజకోట్(గ్రామీణ) ఇన్చార్జి ఎస్పీ శ్రుతి మెహతా తెలిపారు. దళితులకు గుజరాత్ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్ మేవానీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాగా, మృతుని కుటుంబానికి గుజరాత్ ప్రభుత్వం రూ.8.25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. -
షాకింగ్: ఉనా కంటే దారుణ ఘటన!
గాంధీనగర్ : గుజరాత్లోని రాజ్కోట్లో దారుణం చోటుచేసుకుంది. దళితుడిని కట్టేసి విచక్షణారహితంగా కొట్టి హింసించడంతో బాధితుడు మృతిచెందాడు. అతడి భార్యపై సైతం దాడి చేయగా ఆమె గాయపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోను దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వివరాలిలా.. ముఖేష్ వనియా తన భార్యతో కలిసి రాజ్కోట్లో నివాసం ఉండేవాడు. చెత్త ఏరుకుని జీవనం సాగించే ముఖేష్ ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు. ఆ దళితుడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని అవమానించడంతో పాటు తాడుతో కట్టేసి చచ్చేలా కొట్టారు. ముఖేష్ భార్యపై కూడా దాడి చేశారు. ఉద్యోగులు విచక్షణా రహితంగా రాడ్లు, కర్రలు, తాడు లాంటి వాటితో కొట్టడంతో అమాయకుడు ముఖేష్ మృతిచెందగా, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దళితులకు గుజరాత్ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్ మేవానీ పోస్ట్ చేయగా చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. కుల ఘర్షణలతో అమాయకులు చనిపోతున్నా గుజరాత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫేస్బుక్లో జిగ్నేశ్ మేవానీ ప్రశ్నించారు. -
బరాత్ కోసం హైకోర్టులో యువకుడి పిటిషన్
లక్నో : బరాత్ అనుమతి కోసం యూపీకి చెందిన ఓ దళిత యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో అతనికి చేదు అనుభవమే ఎదురైంది. స్థానిక పోలీసులను ఆశ్రయించాలంటూ కోర్టు అతనికి సూచిస్తూ.. పిటిషన్ను కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే... కాస్గంజ్ పరిధిలోని ఓ గ్రామంలో గత నెలరోజులుగా దళిత-అగ్రవర్ణాలకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థాకూర్ పెద్దలు దళితుల వివాహా వేడుకలకు అడ్డుపడుతున్నారు. కాదని వేడుకలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. శీతల్ అనే దళిత యువకుడికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో వివాహం కూడా. అయితే గ్రామంలోనే థాకూర్ పెద్దలు అడ్డుపడుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ప్రయోజనం లేకపోవటంతో చివరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘తమ ఆదేశాలకు దిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థాకూర్ పెద్దలు బెదరిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం.. మీరు ఎవరిని ఆశ్రయించినా వ్యర్థమే. ఎవరూ జోక్యం చేసుకోరు అంటూ చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. బరాత్తో నా వివాహం జరుపుకునేందుకు అనుమతి ఇప్పించండి’ అని శీతల్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారంపై సంజయ్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కావాలంటే పొరుగు గ్రామంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. -
గుజరాత్లో దారుణం
అహ్మదాబాద్: ‘గార్భ’ నృత్య వేడుక చూశాడనే ఆగ్రహంతో ఉన్నత స్థాయి పటేల్ వర్గీయులు ఓ దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్ జిల్లాలోని భద్రనియా గ్రామంలో పటేల్ వర్గీయులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ‘గార్భ’ నృత్య వేడుక చేసుకుంటున్నారు. ఆ వేడుకకు సమీపంలో ఓ ఇంటి దగ్గర దళిత యువకులు జయేశ్ సోలంకి, ప్రకాశ్ సోలంకి, మరో ఇద్దరు కూర్చున్నారు. అటుగా వచ్చిన పటేల్ వర్గీయులు.. ‘గార్భ నృత్యం చూసే హక్కు దళితులకు లేదు’ అని వీరిని బూతులు తిట్టి మరికొందరు పటేల్ వర్గీయులను అక్కడికి పిలిచారు. తర్వాత పటేల్ వర్గీయులంతా కలసి మూకుమ్మడిగా ఈ దళిత యువకులను చితకబాదారు. ఈ సందర్భంగా జయేశ్ తలను గోడకేసి బాదారు. తీవ్రంగా గాయపడిన జయేశ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్యాచారం, అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. పథకం ప్రకారం హత్య జరిగిందన్న ఆరోపణలను డిప్యూటీ ఎస్పీ(ఎస్సీ, ఎస్టీ సెల్) ఏఎం పటేల్ తోసిపుచ్చారు. క్షణికావేశంలో ఈ ఘటన చోటుచేసుకుందని, రెండు వర్గాల మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని వెల్లడించారు. అన్నికోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మీసాలు పెంచుతారా అంటూ... మీసాలు పెంచినంత మాత్రాన దళితులు.. రాజ్పుత్లు కాలేరని హెచ్చరించి దళితులను రాజ్పుత్లు చితకబాదారు. గత నెల 25, 29వ తేదీల్లో గాంధీనగర్ జిల్లా లింబోదారా గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడి ఘటనలకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. -
దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం!
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో గర్భిణీ అయిన ఓ ముస్లిం మహిళను ఆమె కుటుంబసభ్యులే సజీవంగా దహనం చేశారు. ఈ అమానుష ఘటన బీజాపూర్ జిల్లాలోని గుండనకల గ్రామంలో జరిగింది. గుండనకలకు చెందిన బానూ బేగం (21) తన ఊరికి చెందిన దళిత యువకుడైన సాయబన్న శరణప్ప కొన్నూర్ (24)ను ప్రేమించింది. కొంతకాలంగా వీరి ప్రేమ గురించి గత జనవరిలో ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. వీరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బాను కుటుంబం ఆమెను పోలీసు స్టేషన్కు ఈడ్చుకొచ్చి సాయబన్నకు వ్యతిరేకంగా పోస్కో కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. అయితే, సాయబన్నపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు, చరిత్ర లేకపోవడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. అనంతరం సాయబన్న బానును తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు. ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కర్ణాటకలోనే కొంతకాలం నివసించారు. ఈ క్రమంలో బాను గర్భవతి కావడంతో ఇరు కుటుంబాలు మారి ఉండవచ్చునన్న ఆశతో గత శనివారం (జూన్3న) ఊరికి తిరిగొచ్చారు. అయితే, తమ వైఖరిని ఏమాత్రం మార్చుకొని ఇరుకుటుంబాలు సాయబన్న-బాను దంపతులను చూడటంతోనే గొడవకు దిగారు. బాను కుటుంబం బరితెగించి సాయబన్నపై దాడికి దిగింది. అతన్ని రాళ్లతో కొట్టి తరిమింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుతున్న సాయబన్న స్థానికంగా ఉన్న తాలికోట్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. మరో పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే బానును ఆమె కుటుంబసభ్యులే కత్తితో పలుమార్లు పొడిచి.. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. పట్టపగలే ఈ కిరాతకం జరుగుతున్నా, తన భార్యను కాపాడాలని సాయబన్న వేడుకున్నా గ్రామస్తులు ఎవరూ ముందుకురాలేదని, తమ ఇళ్లకు తలుపులు పెట్టుకొని లోపలే ఉండిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో బాను తల్లిని, సోదరిని, సోదరుడిని, బాను అరెస్టు చేశారు. బాను మరో ఇద్దరు అక్కల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మధుకర్ ‘మర్డర్’ మిస్టరీ!
-
మధుకర్ ‘మర్డర్’ మిస్టరీ!
♦ హత్యా.. ఆత్మహత్యా..? ♦ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ♦ ప్రేమ వ్యవహారమే కారణమా? ♦ యువతి బంధువులే చంపేశారా? ♦ అమ్మాయి నోరు విప్పితేనే గుట్టు వీడేది ♦ దళిత, ప్రజాసంఘాల ఆందోళన బాట సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్/న్యూఢిల్లీ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతి కలకలం రేపుతోంది. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై సాగుతున్న విస్తృత ప్రచారం అటు పోలీసు శాఖలో, ఇటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మధుకర్ది అనుమానాస్పద మృతి అని పోలీసులు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోంది. ప్రేమ వ్యవహారం కారణం గానే మధుకర్ను హత్య చేశార ని, కళ్లు పీకి.. మర్మాంగాలు కోసి చంపే శారని, ఇందులో మంథని నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. మంథనిలో ఆదివారం సుమారు 48 దళిత సంఘాలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరిగింది? మధుకర్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఖానాపూర్ పొరుగునే ఉన్న వెంకటాపూర్కు చెందిన ఓ యువతి, మధుకర్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయమై సదరు యువతి కుటుంబ సభ్యు లు, బంధువులు మధుకర్ను పిలిచి బెదిరిం చినట్లు తెలుస్తోంది. గతనెల 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ మరుసటి రోజు ఖానాపూర్ శివారులో శవమై కనిపించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ట్లు కనిపించినా.. ముళ్ల కంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడనే అను మానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అయితే మధుకర్ను హత్య చేశారంటూ 15న కుటుంబసభ్యులు, బంధువులు మంథనిలో రాస్తారోకో చేశారు. మృతిపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిపారు. ఇద్దరూ కలిసే ఆత్మహత్యాయత్నం? మధుకర్, సదరు యువతి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి వెంకటాపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన యువతి కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ యువతే.. నర్సు సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పడంతో వెళ్లి చూడగా మధుకర్ మృత దేహం దొరికిందని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఇద్దరూ కలసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనేందుకు బలం చేకూరుతోంది. కానీ వెంకటాపూర్ నుంచి ఖానాపూర్కు మధుకర్ శవం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. మధుకర్ మృతిపై విచారణాధికారిగా పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను నియమించారు. సోమవారం నుంచి ఆమె దర్యాప్తు ప్రారంభించనున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకున్నట్టే తేలిందని, ఎపిడమిక్ సెల్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న యువతి నోరు తెరిస్తేనే అసలేం జరిగిందో వెల్లడికానుంది. దళిత సంఘాల రాస్తారోకో మధుకర్ది హత్యేనంటూ తెలంగాణ, ఏపీకి చెందిన 48 దళిత, ప్రజా సంఘాలు ఆదివా రం మంథనిలో ఆందోళనకు దిగాయి. ఎమ్మార్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి–ఎల్లయ్యను కలిసి సంఘాల ప్రతిని ధులు వివరాలు సేకరించారు. అంబేడ్కర్ చౌక్ వెళ్లి బైఠాయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించి, పార్టీ జెం డాలను తగలబెట్టారు. నిరసనలో తెలం గాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్.రమేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, ప్రజా ఫ్రంట్ నేత గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ సురెపల్లి సుజాత, కదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం జరిపించాలని ఇన్నయ్య, చెరు కు సుధాకర్ అన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతోపాటు సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ మధుకర్ హత్యపై సిట్టింగ్జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు బంధువుల అమ్మాయిని ప్రేమించిన కారణంగా మధుకర్ను హత్య చేయించారని ఆదివారం ఢిల్లీలో ఆయన ఆరోపించారు. రీ పోస్టుమార్టం చేయాలి: వీహెచ్ మధుకర్ మృతదేహానికి మూడు రోజుల్లో రీ పోస్టుమార్టం నిర్వహిం చాలని, లేకుంటే హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద దళిత సంఘాలతో కలిసి ధర్నా నిర్వహిస్తానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హెచ్చరించారు. మంథనిలో ఆయన మధుకర్ తల్లిదండ్రులను కలిశారు. విచారణ చేయాలి: చాడ మధుకర్ మృతిపై న్యాయ విచారణ చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అతడి మృతి వెనుక అధికార పార్టీకి చెందిన కొందరి హస్తం ఉందని, ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. -
కుల పెద్దల తీర్పుతో వివాహిత ఆత్మహత్య
భోపాల్: వివాహేతర సంబంధం అంటగట్టారని మనోవేదనకు గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గఢ్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టికామ్ గఢ్ జిల్లాలోని బజారువా ఖారి గ్రామంలో ఓ వివాహిత(36), భర్త రాకేష్, తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. మూడు రోజుల కిందట భర్త రాకేష్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా అతడి భార్య ఓ దళితవ్యక్తితో సన్నిహితంగా గడిపిందని వారి కులపెద్దలు ఆరోపించారు. ఈ విషయాన్ని కుల పెద్దల పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. భర్తతో కలిసి పనిచేసే ఓ దళిత యువకుడితో ఆమె శారీరక సంబంధాలు పెట్టుకుందని కొందరు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. దళితుడితో సంబంధాలు పెట్టుకున్నావని ఆమెను కొందరు పెద్దలు మందలించారు. రూ.5 వేలు జరిమానా కట్టాలని, ఆ వివాహిత గంగా నదిలో స్నానం ఆచరించాలని, 30 మందికి పైగా మందు పార్టీ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా సమీపంలోని గ్రామంలో ఉండే శివాలయం వరకు పొర్లుదండాలు పెడుతూ వెళితేనే ఆమె తప్పును క్షమిస్తామని పెద్దలు తీర్పిచ్చారు. గ్రామంలో జరిగిన పెళ్లికి తమను ఎందుకు ఆహ్వానించలేదని అడిగిన నేపథ్యంలో ఆ వివాహిత కుటుంబంపై ఆ కుల పెద్దలు ఇలాంటి దారుణ తీర్పును ఇచ్చారు. -
వృద్ధుడిని కొట్టి చంపారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని షామిలి జిల్లాలో దారుణం జరిగింది. స్వల్ప వివాదానికి దళిత వృద్ధుడిని కొట్టి చంపిన వైనం ఆందోళన రేపింది. మంగే రామ్ (60 )పై రోషన్, శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మాంగే రామ్ అక్కడిక్కడే చనిపోయాడు. అకారణంగా తన సోదరుడిని కొట్టి చంపారని మృతుడు సోదరుడు రామ్ నివాస్ ఆరోపించారు. అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. -
లుంగీ పైకి కట్టుకున్నాడని..
చెన్నై: లుంగీని మోకాళ్లపైకి కట్టుకున్నందుకు ఓ దళిత యువకుడిని చితక్కొట్టిన వైనం తమిళనాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తూతుకుడిలో ఈ దారుణం జరిగింది. మునియంది(21) అనే దళిత యువకుడిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి, తీవ్రంగా గాయపర్చారు. దసరా పండుగ సందర్బంగా కులశేఖర పట్టినం బీచ్కు వచ్చిన మునియంది.. తన లుంగీని పైకి కట్టుకున్నాడు. అయితే కిందకు వేసుకోలేదంటూ కొంతమంది వ్యక్తులు అతడితో గొడవకు దిగారు. మా ముందే లుంగీ పైకి కట్టుకుని వెళ్తావా అంటూ ఐదుగురు వ్యక్తులు ఆవేశంతో ఊగిపోయారు. అందరూ కలిసి అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పీవీపీ పైపులతో దారుణంగా కొట్టారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. గ్రామంలో దళితులెవ్వరూ లుంగీ పైకి కట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. దళితులు లుంగీ పైకి కట్టుకుని తమ వీధుల్లో నడిస్తే తమ మర్యాదకు భంగమంటూ, ఇంకోసారి ఇలాసారి జరిగితే సహించేది లేదని బెదిరించారు. బాధితుడు ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలోని దళితులు ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దురై, ఆనంద్, చెల్లా, సమ్ముకుట్టి, ఇసాయికుదుకురై తదితరులపై కేసులు నమోదు చేశారు. -
గుడికి వెడుతున్న దళిత వృద్ధుడి సజీవదహనం
లక్నో: ఉత్తరప్రదేశ్లో గుడికి వెళుతున్న ఓ దళిత వృద్ధుడిపై దాడిచేసి సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపింది. జలౌన్ జిల్లా హమీర్పూర్ సమీపంలో బిల్గాం గ్రామంలో మైదాని బాబా గుడిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిమ్మ (90) అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. చిమ్మ.. తన భార్య, కొడుకుతో కలిసి స్థానిక మైదాని బాబా గుడికి వెళ్లేందుకు బయలుదేరాడు. గుళ్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ సంజయ్ తివారీ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే సంజయ్ మాటలను లెక్కచేయని చిమ్మా ముందుకు కదిలాడు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ గొడ్డలితో నరికి, ఆపై నిప్పంటించాడు. మిగతా భక్తులందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కొంతమంది భక్తులు సంజయ్ తివారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మద్యం మత్తులో ఉన్న తివారీ చిమ్మాతో పాటు ఇంకా చాలామంది భక్తులను గుడిలోకి వెళ్లొద్దంటూ వారించాడు. అయితే వారందరూ తిరస్కరించారు. దీంతో అప్పటికే కోపంతో ఉన్న తివారీ.. చివరకు వృద్ధుడు కూడా తనను లెక్కచేయలేదని అతడిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని భార్య సహాయం కేకలు పెట్టింది. అయినా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న తివారీ.. మరింత రెచ్చిపోయి, చిమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి సంజయ్ తివారీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.