decentralisation
-
సర్వతోముఖాభివృద్ధి దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
-
వికేంద్రీకరణే మా విధానం: సజ్జల
-
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో భారీ సభ
-
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
బిగ్ క్వశ్చన్ : సుప్రీం తీర్పుపై ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
-
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో సత్యాగ్రహ దీక్ష
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
అనంతపురంలో వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం
-
అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు : స్పీకర్ తమ్మినేని
-
బిగ్ క్వశ్చన్ : వికేంద్రీకరణకే జై కొడుతున్న ఏపీ ప్రజలు
-
సీఎం ఎక్కడైనా కూర్చుండి పాలన చేయొచ్చు : సీఎం వైఎస్ జగన్
-
మూడు రాజధానుల కోసం .. తిరుపతి గర్జన
-
‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం’
సాక్షి, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్ర రద్దుతోపాటు దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. పాదయాత్రపై తమ ఆదేశాలను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతించిన 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు పేర్కొంది. పాదయాత్రపై విచారణ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లో 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీలుగా చేర్చారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్తో కోర్టుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. తమ ప్రాంత ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారన్న అమర్నాథ్.. వారి మనోభావాలను కోర్టుముందు ఉంచటానికే వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలు మేం చెప్పకుండా ఎలా ఉంటాం. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు వింటామని కోర్టు చెప్పింది. అవసరమైతే ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం. కోర్టు ఆదేశాల తరువాత పోలీసులు పాదయాత్రను పరిశీలిస్తే 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవు. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం. కాని అమరావతి రైతులు మాత్రం మేమే బాగుపడాలని అంటున్నారు. రెచ్చగొట్టేలా ఏ పని చేయవద్దని మేం అంటున్నాం.’ అని వ్యాఖ్యానించారు. చదవండి: సీఎం జగన్ సామాజిక సాధికారతకు న్యాయం చేశారు -
ఈ ప్రశ్నలకెవురు జెబాబు సెప్తారు?
ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి? నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది? ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది? పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి? విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా? మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా? ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా? మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?) అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?) – కళింగ కరువోడు -
మూడు రాజధానులపై ఎందుకంత ఆక్రోశం : స్పీకర్ తమ్మినేని
-
రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏపీకి అన్యాయం జరిగింది : మంత్రి ధర్మాన
-
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
సీఎం వైఎస్ జగన్ తో మంత్రి ధర్మాన భేటీ
-
అమరావతి పాదయాత్రకు రామచంద్రపురం లో నిరసన సెగ
-
విశాఖను పరిపాలన రాజధాని చేయడం ఖాయం : సజ్జల
-
అనాధిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడింది : మంత్రి బొత్స
-
‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’
సాక్షి, అనకాపల్లి: అనాదిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ప్రాంతానికైనా వలసలు ఉత్తరాంధ్ర నుంచే జరుగుతున్నాయని, అక్షరాస్యతలోనూ ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పరిపాలన రాజధానిని అందరూ నిలబెట్టుకోవాలని.. అప్పుడే మిగతా ప్రాంతాలతో సమానంగా తమ ప్రాంతం ఎదగగలదని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశారని, అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని ప్రస్తావించారు. మిగతా 1,500 కోట్లలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇక పోతే చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ నుంచి అమరావతికి ఖర్చు చేశారని గుర్తు చేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలంటే ఐదు నుంచి ఆరు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా అని, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ విధానమని స్పష్టం చేశారు. చదవండి: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం ఒక్కటే ‘అమరావతిలో భవనం నిర్మించాలంటే 110 నుంచి 135 అడుగుల లోతు పునాది కోసం తవ్వాలి. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. బడ్జెట్ మొత్తం, జీతాలు సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుంది. నేను చెప్పింది అబద్ధమో.. నిజమో చంద్రబాబు, యనమల రామకృష్ణడు చెప్పాలి. నేను చెప్పింది అబద్ధం అయితే తలదించుకుంటాను. విభజన చట్టంలోనే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ సినిమా నటుడు వచ్చినా ప్రజలు చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదు. చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా ఇంతకంటే ఎక్కువమంది వస్తారు. పాదయాత్రకు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలి. ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పాదయాత్ర జరుగుతున్న సమయంలో బైక్ ర్యాలీలు, నిరసనలు తెలపడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేయాలి. జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా మేము మద్దతుగా ఉంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
-
KSR కామెంట్ : అమరావతి దారుణాలను ఏనాడూ రాయని ఎల్లో మీడియా
-
KSR కామెంట్ : ఎల్లో మీడియా పంతం..
-
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి : అనంత వెంకట్రామిరెడ్డి
-
అన్నమయ్య జిల్లా పీలేరులో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ
-
గన్ షాట్ : ఉత్తరాంధ్రకు ఊపిరి...
-
గన్ షాట్ : సేనాని సిల్లీ ప్లాన్స్
-
ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో ...
-
విశాఖ రాజధాని కాకపోతే పాతికేళ్లలో.. మరో విభజన యుద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరుగార్చారు. దేవుడిలా.. ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల విశాఖ కేంద్రంగా (రాజధానిగా) ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు..’ అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ పేర్కొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు సంబంధించిన జెండాను శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేఏసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్టపోయాం. వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష.. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు..’ అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాజధాని కోసం శనివారం విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. విశాఖ వాసులు.. ఉత్తరాంధ్ర వాసులు ఈ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతున్న ఉద్యమం. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనంపై ఎన్నో కమిటీలు చెప్పాయి. కేంద్రం కూడా గుర్తించింది. అటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ పరిపాలన రాజధానిగా, రాయలసీమ వాసుల కోసం కర్నూలు న్యాయ రాజధానిగా, మధ్యాంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం..’ అని చెప్పారు. ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాటపడతాయని తెలిపారు. 1956 ఏప్రిల్ ఒకటినే.. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సిలో ఉండేదని, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశంపంతులు ఉన్నప్పుడు తొలి అసెంబ్లీ సమావేశం విశాఖ ఏయూ టీఎల్ఎన్ సభా హాల్లో జరిగిందని చెప్పారు. కర్నూలు రాజధానిగా అప్పుడే ఒక తీర్మానం చేశారని గుర్తుచేశారు. తర్వాత పరిణామాల్లో 1956 ఏప్రిల్ ఒకటిన విశాఖ రాజధానిగా శాసనసభ్యులందరూ అప్పుడే తీర్మానం చేసినప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడంతో రాజధాని హైదరాబాద్కు వెళ్లిపోయిందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం నిలబెట్టుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విశాఖ రాజధానికి సహకరించాలని అభ్యర్థించారు. -
విశాఖ గర్జనపై మంత్రి గుడివాడ అమర్నాథ్
-
విశాఖ గర్జన పాటలతో ఉద్యమ స్ఫూర్తి నింపుతున్న కళాకారులు
-
పవన్ కుప్పిగంతులు ,పిచ్చి కూతలు ఎవరూ పట్టించుకోరు : మంత్రి రోజా
-
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
-
విశాఖ గర్జన విజయవంతం చేయాలి : వైవీ సుబ్బారెడ్డి
-
చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు : మంత్రి అప్పలరాజు
-
వికేంద్రీకరణకు మద్దతుగా యువకుడి ఆత్మహత్యయత్నం
-
చోడవరంలో ఉద్రిక్తత.. జై విశాఖ అంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం!
సాక్షి, విశాఖపట్నం: చోడవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీనివాసరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, గంధవరం నుంచి చోడవరానికి యువకులు భారీ ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో జై విశాఖ అంటూ శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాసరావును కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు. -
హైదరాబాద్ లో కొండలు తవ్వి చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకోలేదా ...?
-
పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తుంది : మంత్రి అంబటి రాంబాబు
-
చంద్రబాబు పై కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్
-
వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు : సజ్జల
-
టీడీపీ బినామీలు గోబ్యాక్
-
తణుకులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎక్కడ నివసిస్తున్నారు : ఎంపీ మార్గని భరత్
-
వికేంద్రీకరణ కోసం చేయిచేయి కలిపి..
వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. – టెక్కలి చైతన్యదీపం వెలిగించి.. వికేంద్రీకరణకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమై పాటిమీద సెంటర్, ఓవర్ బ్రిడ్జి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, గణపతి సెంటర్ల మీదగా పార్టీ కార్యాలయం వద్దకు చేరకుంది. ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. – నిడదవోలు -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్టీఆర్ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని -
వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు : మంత్రి పెద్దిరెడ్డి
-
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా నిడదవోలులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు
-
బిగ్ క్వశ్చన్ : రియల్ ఎస్టేట్ రైతులకి రియల్ షాక్ తగిలిందా ..?
-
పొలిటికల్ కారిడార్ : అమరావతి పాదయాత్రలో పాల్గొనేవారికి రోజుకు రెండు వేలు
-
రాజధాని పేరుతో చంద్రబాబు దగా చేశారు : మంత్రి కారమూరి
-
తెలంగాణలో కూడా మూడు రాజధానులు ఉండాలి : ప్రొపెసర్ వినోద్
-
వికేంద్రీకరణపై మంత్రి ధర్మాన
-
ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోంది : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 9న పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణ అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. జేఏసీ ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు రైతుల పేరిట జరుగుతున్న యాత్రపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రజలు వికేందీకరణకు వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రే ఈ యాత్ర అని దుయ్యబట్టారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని కోర్టు చెప్పలేదని స్పష్టం చేశారు. యాత్రలో చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం లాంటి పనులు చేయమని చెప్పలేదని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడాలని ఉన్నా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 29 గ్రామాల కోసం అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 29 గ్రామాల కోసం 26 గ్రామాల కోసం 26 జిల్లాలు విడిచిపెట్టాలని కోరడం అన్యాయమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాదయాత్ర విరమించాలని మరోసారి కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన పూజలు
-
వికేంద్రీకరణకు మద్దతుగా మైనార్టీ నేతల ప్రార్థనలు
-
వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా YSRCP ప్రత్యేక పూజలు
-
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా దసరా వేడుకలు
-
వికేంద్రీకరణకు మద్దతుగా కారుమూరి ప్రత్యేక పూజలు
-
మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి : కొడాలి నాని
-
మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి : ఎమ్మెల్యే తలారి
-
Dharmana Prasada Rao: వికేంద్రీకరణతోనే సమన్యాయం
స్వతంత్రం రాక ముందు మద్రాస్కు, స్వాతంత్య్రం వచ్చాక కర్నూలుకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. పరిపాలనా వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాల వాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. అలా ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పాలనా రాజధానిగా త్వరగా, తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. జూన్ 2, 2014. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ (రీ–ఆర్గనైజేషన్ యాక్ట్, 2014) అమలులోకి వచ్చిన రోజు. ఈ చట్టం చేసే ముందు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విధివిధానాల పరిశీలన కోసం కేంద్ర ప్రభు త్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2010 ఫిబ్రవరి నుంచి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించింది. పది నెలలు పర్యటించి చేసిన అధ్యయనంలో వివిధ అంశాలను ప్రస్తా విస్తూ నివేదికను సమర్పించింది. తొలుత రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరడానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఆర్థిక, సామాజిక పరిపాలనా అంశాల్లో కొన్ని భద్రతలు కల్పించడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకటి కావడం, ఆ తర్వాత తెలంగాణతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం వంటి పరిణామాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగు తుందని, ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొ న్నారు. సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు నాటి నుండి ఆరు నెలల లోపు ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు, సిఫారసులు చేస్తుందని ఉంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రతన్ రాయ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ డైరెక్టర్)ను, సభ్యులుగా ఆరోమార్ రెవి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్), శ్రీ జగన్ షా (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్), ప్రొఫెసర్ కె. రవీంద్రన్ (న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్)లను నియమించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఈ కమిటీకి అపార అనుభవం ఉంది. ఈ కమిటీ రాష్ట్రంలో 11 జిల్లాలు పర్యటించి ప్రజలను ప్రజా సంఘాలను కలిసింది. వారితో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. 4728 ప్రజా విజ్ఞప్తుల్ని పరిశీలించి వాటన్నింటినీ క్రోడీకరించింది. 187 పేజీలతో తన నివేదికను నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ‘‘హైదరాబాద్లో కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు; మంత్రిత్వ శాఖల కేంద్రీకరణకు అనేక సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లుగా రాజధాని పేరిట హైదరాబాద్లో జరిగిన ఈ కేంద్రీకృత అభివృద్ధే విభజన డిమాండ్కు కీలకాంశం. కాబట్టి ఒకే ఒక పెద్ద రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యం కాదు’’ అని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడింది. అలాగే గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మాణం మొదలు పెట్టడం) రాజధాని కూడా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆనాటి ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. పైగా అత్యంత విచారకరమైన విషయమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో భూలభ్యత గురించి అడిగినప్పుడు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించకపోవడం! అసలు కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఒక అభిప్రాయానికొచ్చి విభజన చట్టానికి వ్యతిరేకంగా తానే ఒక కమిటీ నియమించుకుంది. అర్హతలూ, అనుభవం, నైపుణ్యం ఏ మాత్రం లేని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అందులో సభ్యులుగా ఉన్న వారిని చూస్తే వారి ఆలోచన, సామర్థ్యం, రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదనుకునే బాధ్యతా రాహిత్యం, ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బొమ్మిడాల శ్రీనివాస్, జీవీకే సంజయ్ వంటివారు ఆనాటి కమిటీ సభ్యులు. రాజ్యాంగబద్ధంగా, శాసన సమ్మతంగా ఏర్పాటైన శివరామ కృష్ణన్ నివేదికను తొక్కిపెట్టి, ఏ చట్టంలోనూ పేర్కొనని నారాయణ కమిటీని అడ్డం పెట్టుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు! దాని కోసం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చట్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. రాజ్యాంగ సభలో 1949 మే 27న ‘రాజధాని ఎక్కడ ఉండాలి?’ అనే విషయంపై చర్చ జరిగినా, రాజ్యాంగంలో ప్రస్తావన జరగలేదు. రాజధాని ఒకటే ఉండాలని గాని, ఒకే చోట ఉండాలి గాని ఎక్కడా నిర్దేశించలేదు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు ఒకేచోట ఉండాలని నిర్ణయించలేదు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి అనుకూల మని భావించిన చోట పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు విచారణలు ఎక్కడ జరపాలో నిర్ణయించే అధికారం ఉంది. వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు సూచించమని రిటైర్డ్ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానత లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర సమగ్రా భివృద్ధిని సూచిస్తూ తన నివేదికను 2019 డిసెంబర్ 20న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కమిటీ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ విశాఖపట్నంలో; రాష్ట్ర శాసన సభ, హైకోర్ట్ బెంచ్, మినిస్టర్స్ క్వార్టర్స్ అమరావతి, మంగళగిరిల్లో; హైకోర్ట్ ప్రిన్సిపల్ సీట్, సంబంధిత కోర్టులు కర్నూలులో పెట్టాలని సూచించింది. అసలు ఈ పరిపాలన వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాలవాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. ఆ ఆకాంక్షలు, కోరికలు తీరే రోజులు సమీపిస్తున్నాయని పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పరిపాలన రాజధానిగా అతి త్వరగా తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో ఇతర రాష్ట్రాలు, దేశాలతో విశాఖపట్నం అనుసంధానం కలిగి ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది. అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలలోని చాలా కంపెనీలు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. విశాఖపట్నం మొదటి నుంచీ జీడీపీకి కీలక వాటాను అందిస్తున్నా తిరిగి తగినంత ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఐదేళ్లు పాలన ఒక కల లాగే మిగిలిపోయి, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ముందు నిలబడ్డాం. మన ముందు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శివరామకృష్ణన్ రిపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ ఒకటే సూత్రమనే తారకమంత్రం వినిపిస్తోంది. సమాన అభివృద్ధి అనే విధానాన్ని పట్టిం చుకోకపోతే భవిష్యత్తు పట్ల యువత ఆశలు కునారిల్లిపోతాయి. ప్రజా స్వామ్య ప్రభుత్వంపట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది. స్వతంత్రం రాక ముందు నుండి మద్రాస్కు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూ లుకు, ఏపీ ఏర్పడ్డాక హైదరాబాద్కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. -వ్యాసకర్త: ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి -
బిగ్ క్వశ్చన్ : గో బ్యాక్ భ్రమరావతి పేరుతో ఫ్లెక్సీలు
-
ఏ ఒక్క వర్గానికో మేలు చేసే ప్రభుత్వం మాది కాదు : బొత్స సత్యనారాయణ
-
సీమవాసుల గోడు వినరా?
ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటుకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతుండటంతో ఇక రాయలసీమకు న్యాయం జరగదా అనే అనుమానం సీమవాసుల్లో నెలకొంటున్నది. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రాయలసీమ ప్రత్యేక ఉద్యమం మాటా తరచుగా వినిపిస్తోంది. ఉన్న తెలుగు జాతి ఐక్యంగా సాగేందుకు అనువైన పరిస్థితులను, నమ్మకాన్ని కేవలం ప్రభుత్వమే కాక కొన్ని జిల్లాల కోస్తాంధ్ర సోదరులూ కలిగించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సమగ్రంగా, వెనుకబడిన ప్రాంతానికి ప్రయోజనాలు కలిగే విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును తక్షణమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. వాటితోపాటు ఇతర రాయలసీమ అభివృద్ధి అంశాలపై కూడా అసెంబ్లీ సాక్షిగా విధాన నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఉప ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థలు (శాసనసభ, సచివాలయం, న్యాయస్థానం) ఉండేలా తక్షణమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఒక ప్రాంతంలో ఒక ప్రధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే అనుబంధంగా ఇతర వ్యవస్థలుండాలి. రాయలసీమలో రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షలను కాదని హైకోర్టు ఏర్పాటే అంతిమ ఉద్దేశం అయితే... కర్నూలులో హైకోర్టుతో పాటు సీమలోని వివిధ కేంద్రాలలో ఒక మినీ సెక్రటేరియట్, ఒక సెక్షన్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేలా కొత్త వికేంద్రీకరణ చట్టంలో పేర్కొనాలి. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో అనుమతించిన ప్రాజెక్టులుగా విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ తదితర కరువుపీడిత ప్రాంత ప్రాజెక్టులతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ప్రాజెక్టులను చేర్చాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ సెషన్లో నిధులు కేటాయించాలి. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. తుంగభద్ర సమాంతర కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్లు, సిద్దేశ్వరం అలుగు, రాయలసీమ ఎత్తి పోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని కోరాపుట్–బుందేల్ ఖండ్ తరహాలో రూ. 30 వేల కోట్లతో అమలు చేయాలి. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని ఎయిమ్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీలను రాయలసీమలో నెలకొల్పాలి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే శ్రీశైలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయ చరిత్ర, పురావస్తుశాఖ క్యాంపస్కే యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్నీ మార్చాలి. రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య, కళారంగాల అభివృద్ధికీ, అధ్యయనానికీ ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. పరిశ్రమల స్థాపనలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలి. రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అదనంగా కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయాలి. (క్లిక్: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?) శ్రీ బాగ్ ఒప్పందం, శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ, జీయన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ తదితర నివేదికలు వికేంద్రీకరణ విషయమై చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకొని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి తోడ్పడాలి. (క్లిక్: బాబు బ్రాండ్ రాజకీయాలు) - డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత -
ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తాం: మంత్రి బొత్స
-
ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అమరావతి రైతులకు నష్టం జరగదని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే వికేంద్రీకణ చట్టాలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఆక్రోషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అని సూటిగా ప్రశ్నించారు. రాజధానిపై బయటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం పోయిందని చంద్రబాబుకు కడుపుమంటని దుయ్యబట్టారు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగ ప్రకారం చట్టాలు ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. దాన్ని అధిగమించి ఎవరూ ఏమీ చేయరని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నామని తెలిపారు. ఎవరి పాత్ర ఎంతవరకు అనే దానిపై సభలో చర్చించామని, అభిప్రాయ బేధం ఉంటే చంద్రబాబు శాసనసభలో మాట్లాడవచ్చని అన్నారు. అందుకు భిన్నంగా బయట కూర్చుని ఎలా మాట్లాడతారు?అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దమైనవిగానే ఉంటాయని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నిర్ణయం కోరుదామనుకుంటే.. తాము వద్దన్నామా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే చట్టాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నారు. కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నాని తెలిపారు. -
వితండవాదం ఆపండి... ప్లీజ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజధానిని రెండు, మూడు కేంద్రాలుగా వికేంద్రీకరణ చేయడం సాధ్యమేనా? అందులోనూ హైకోర్టు లాంటి ప్రధాన వ్యవస్థను రాజధాని వెలుపల ఏర్పాటు చేయడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. కానీ మన దేశంలోనూ, విదేశాల్లోనూ అనేక చోట్ల ఒకటికన్నా ఎక్కువ రాజధానులతో పరిపాలనను సజావుగా నడిపిస్తున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఆయా భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధిలో ఉన్న అసమానతలు; కొన్ని ప్రాంతాల అస్తిత్వం, ఆత్మగౌరవాలు – ఒకటి కన్నా ఎక్కువ రాజధానుల ఏర్పాటుకు హేతువులయ్యాయి. భారతదేశంలో ఇప్పటికి దాదాపు ఆరు రాష్ట్రాల్లో రాజధానుల వికేంద్రీకరణ జరిగింది. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో అధికారికంగా శ్రీనగర్ వేసవికాల రాజధానిగా, జమ్మూ శీతకాల రాజధానిగా.. వాతావరణ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య దూరం 262 కిలోమీటర్లు ఉంది. ఇటీవల జమ్మూ–కశ్మీర్ నుండి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లడఖ్కి లేహ్, కార్గిల్లు వరుసగా వేసవి, శీతకాల రాజధానులుగా అధికారికంగా ఉన్నాయి. ఈ రెండు రాజధానుల మధ్య దూరం 219 కిలోమీటర్లు ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబై కాగా, రెండవ రాజధానిగా నాగపూర్ను అధికారికంగా 1988లో ప్రకటించారు. శీతాకాల రాజధానిగా ఉంది. వెనకబడిన విదర్భ తదితర ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఏర్పడింది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 823 కిలోమీటర్లు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా అయినా ధర్మశాలను కూడా రెండో రాజధానిగా 2017లో అధికారికంగా ప్రకటించారు. సాంస్కృతిక పరంగా ప్రాధాన్యంతో ఇది ఉంది. వీటి మధ్య దూరం 223 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్తో పాటు గైర్సేన్ని కూడా 2013లో రెండో రాజధానిగా ప్రకటించారు. వీటి మధ్య 280 కిలోమీటర్ల దూరం ఉంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకి బెంగళూరు రాజధాని కాగా, ఉత్తర కర్ణాటక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బెల్గామ్ను 2012లో మరో రాజధానిగా ప్రకటించారు. వీటి మధ్య దూరం 507 కిలోమీటర్లు. తమిళనాడులో మధురై, తెలంగాణలో వరంగల్ ఇలా... అనేక రాష్ట్రాల్లో రెండవ రాజధాని ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. వచ్చే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో రాజధానుల వికేంద్రీకరణ వివిధ కారణాలతో తప్పనిసరి కానుంది. భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాదు నగరం ఉండాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మొదలుకొని ఎందరో ప్రతిపాదించిన సంగతీ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు, ప్రజల మనోభావాలు, వెనుకబాటుతనం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు, అభివృద్ధి అవకాశాలు.. ఇలా అనేక కారణాల రీత్యా రాజధానుల వికేంద్రీకరణ ఒక ప్రజాస్వామిక హక్కుగా రాబోతోంది. ఆయా రాష్ట్రాల పరిస్థితుల బట్టి రాజధానుల, పాలన వికేంద్రీకరణ చేసుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేది సత్యం.హైకోర్టు అనేది కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల కన్నా భిన్నమైంది. ఎంతో స్వయం ప్రతిపత్తి ఉండేది. నిజానికి హైకోర్టు దైనందిన కార్యక్రమాలకు, పై రెండు వ్యవస్థలకూ పెద్దగా సంబంధం కూడా ఉండదు. హైకోర్టు కూడా రాజధానిలోనే కచ్చితంగా ఉండాలనడం అశాస్త్రీయం. దేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు 9 చోట్ల రాజధాని కేంద్రంలో కాకుండా ఇతర నగరాలలో ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో గౌహతి, ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్, గుజరాత్లో అహ్మదాబాద్, కేరళలో ఎర్నాకుళం, మధ్యప్రదేశ్లో జబల్పూర్, ఒడిస్సాలో కటక్, రాజస్థాన్లో జో«ద్పూర్, ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లో నైనిటాల్... ఇలా రాష్ట్ర రాజధానితో సంబంధం లేకుండా పక్క ప్రాంతాలలో హైకోర్టులు ఉన్నాయి. ఆయా హైకోర్టుల బెంచ్లు 15 వరకు రాజధానేతర నగరాలలో ఉన్నాయి. విభజన చట్టం 31 సెక్షన్, 2 సబ్సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన స్థానం రాష్ట్రపతి నోటిఫై చేసిన చోట ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు అది సహజంగా జరగాలి. 3వ సబ్సెక్షన్ ప్రకారం పై 2వ సబ్సెక్షన్తో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, ద్విసభ్య ధర్మాసనాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన చోట లేదా ప్రాంతాల్లో న్యాయ విచారణ చేయవచ్చు అని ఉంది. సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు అనుసరించడం ఆనవాయితీ. ఇంత సహజంగా హైకోర్టు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం చట్టం కల్పించింది. ఈ నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో కర్నూలులో హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తొమ్మిది రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా బయట ఉండగా, ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నంగా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయకూడదని అశాస్త్రీయంగా చర్చ సాగుతోంది. ముందు ఈ వితండ వాదాన్ని ఆపి సానుకూల దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించాలి. కర్ణాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల స్ఫూర్తితో వికేంద్రీకరణను స్వాగతించాలి. రాజధాని విషయంలోనే కాకుండా సాగునీళ్ళు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి తదితర అనేక అంశాలలో భవిష్యత్తులో వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటి, ఆధునిక భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి. -డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, అనంతపురం ‘ 99639 171187 -
‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!
ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపుమాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి. ఆంధ్రలోనే గతంలో రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు కొనసాగించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయి. కాబట్టి పలు రాజధానుల ఏర్పాటు ఆంధ్రకు కొత్త కాదన్నది చారిత్రక సత్యం. ఆంధ్రులకు, తెలుగు భాషకు ఉన్న చారిత్రక నేపథ్యం అతి సుదీర్ఘమైనది. క్రీస్తుపూర్వం 5000–500 ఏళ్ల మధ్యకాలంలో నడిచిన పురాచరిత్ర ఆంధ్రుల, తెలుగు భాషా సంస్కృతులకు అద్దం పడుతూ వచ్చింది. కాగా క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తు శకం 624 వరకూ కొనసాగుతూ వచ్చిన వీరి చరిత్రను ప్రాచీన ఆధునిక దశగా చరిత్రకారులు నిర్ధారించారు. అలాగే మధ్యయుగ దశలో వీరి చరిత్రను క్రీస్తుశకం 624–1368 కాలానికి చెందినదిగా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత ముసునూరు నాయకుల కాలాన్ని క్రీ.శ. 1325–1368 దశ గాను, రెడ్డిరాజుల కాలాన్ని క్రీ.శ. 1324–1448 దశ గానూ, విజయనగర రాజుల కాలాన్ని 1336–1660 దశ గానూ, చరిత్రకారులు పేర్కొ న్నారు. కాగా, ఆధునికాంధ్ర తొలిదశ 1724–1857 గానూ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ చారిత్రక దశను క్రీ.శ.1858–1956 గానూ పేర్కొన్నారు. ఇక సమకాలీన ఆంధ్రప్రదేశ్ చారిత్రక దశను 1956– 2000గా పేర్కొన్నారు. ఆంధ్రుల భాషా సంస్కృతుల ప్రాదుర్భావ దశను భారత పురాచరిత్ర పితామహుడైన హెచ్.డి. సంకాలియా విశేషంగా కొనియాడారు. ఈ కోణంలోనే నాటి ఆంధ్రప్రదే శ్ను‘యావద్భారత దేశానికే ప్రాచీన చారిత్రక రాజధాని’గా సాధికారి కంగా ఆయన పేర్కొన్నారు! ఆ తర్వాత సంకాలియా దారిలోనే సుప్రసిద్ధ ఆధునిక కవి, సాహితీ చరిత్రకారుడైన ఆరుద్ర.. ఆంధ్రుల చరిత్ర, వారి భాషా సంస్కృతుల చారిత్రక పూర్వ రంగాన్ని క్రీ.శ.12వ శతాబ్ది చాళుక్య యుగం నుంచి ఆధునిక యుగారంభం 1900 దాకా 12 యుగాలుగా 12 సంపుటాలలో వెలువరించారు. ఆంధ్రుల ఈ సుదీర్ఘ చారిత్రక కాలచక్ర గతికి తెలుగు ప్రజల భాషా సంస్కృతులు దోహదపడిన అపూర్వమైన ఆధారాలతో (క్రీ.పూ.5000 నుంచి క్రీ.శ. 2016దాకా) ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ ఒక అద్భుత సంపుటాన్ని తీసుకొచ్చారు. తెలుగువారైన ఆంధ్రులకు సుదీర్ఘకాలంపాటు సొంత రాజధాని లేకుండా పోయింది. ఎంతో ప్రాచీన భాషా సంస్కృతులతో దీపించిన ఆంధ్రులకు తమిళనాడులో భాగంగా ఉన్నందున ‘మదరాసీల’న్న ముద్రపడింది. దీంతో ఆంధ్రులు ‘రాజధానులు’ లేని రాజ్యంలో కాలం వెళ్లబుచ్చుకోవాల్సి వచ్చింది. క్రమంగా ఈ దుఃస్థితి, చారిత్రక స్పృహ గల ఇద్దరు నాయకుల దూరదృష్టి వల్ల తొలగిపోయింది. వారే పొట్టి శ్రీరాములు, నందమూరి తారకరామారావు. తెలుగు ప్రజలు, విశిష్ట భాషా సంస్కృతులున్న జాతి అన్న స్పృహను వీరిద్దరూ, యావద్భారత దేశానికి చాటి చెప్పడమే కాకుండా కార్యరంగంలోకి దిగి నిరూపించారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రలోనే రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు చెలాయించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయన్నది కాదనలేని మరొక సత్యం. అసలు ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలకు, వేర్పాటు ధోరణులకు కారణం అవకాశవాద రాజకీ యాలు, అధికార రంధి గల రాజకీయ నాయకులే కారణమని ఆనాడే కాదు, ఈనాడూ రుజువవుతోంది. కనుకనే ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపు మాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! ఈ దృష్ట్యానే, సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి. ఈ వివరాల్ని ‘సాక్షి’ అనేకసార్లు పాఠకుల సౌకర్యార్థం ప్రచురించింది. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాళ్లను, ‘పుట్టుగుడ్డివాళ్లు’గా నటిస్తున్న కొన్ని పత్రికలు, వాటి సంపాదకులను నమ్మించలేము! ఇంతకూ బుద్ధుని పేరిట అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు కోతలుకోస్తున్న చంద్రబాబు ఆ బుద్ధుడు బూజు పట్టిపోతున్నా గుడ్లు అప్పగించి చూస్తుండిపోయారే గాని సంరక్షించే చర్యలు తీసుకోలేదు. పైగా రైతుల త్యాగాలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైందని అంటూనే అదే రైతుల భూములను అర్ధరాత్రిపూట దొంగచాటుగా ఎందుకు తగలపెట్టించారు? పైగా దానికి కారకు లంటూ ఆరోపణలు మోపి వైసీపీ, కాంగ్రెస్ నాయకులపైన కేసులు పెట్టించారు. రైతాంగాన్ని మోసగించి అమరావతి భూముల్ని టీడీపీ అనుయాయులకు కారు చౌకగా కట్టబెట్టిన వైనం ప్రజలు గ్రహిం చారు. అమరావతి రైతాంగానికి జరిగిన ఈ మోసాన్ని లెక్కలతో సహా నిరూపిస్తూ అప్పటి రాష్ట్ర హైకోర్టులో సుప్రసిద్ధ మాజీ న్యాయ మూర్తులు, ఈ వ్యాసకర్త జమిలిగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కాని చంద్రబాబుకు కోర్టుల్ని ‘మేనేజ్’ చేసే లక్షణం వెన్నతోపెట్టిన విద్య కాబట్టే... ఆ రోజుకీ, ఈ రోజుకీ మా రిట్ పిటిషన్ అతీగతీ తేలకుండా అలా మూలుగుతూనే ఉంది! తీరా ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక వనరులు సమకూడాలంటే అమరావతి భూముల్ని జగన్ ప్రభుత్వం అమ్ముకుంటే చాలునని, ఉచిత సలహా ఇవ్వడానికి సాహసించారు! పదేళ్ళ దాకా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ కార్యరంగంగా ఉంటుందని చెప్పినా వినకుండా చంద్రబాబు బిచాణా ఎత్తేశారు. మరోవైపున అమరావతి భూములు కాజేసి తన అనుయాయులకు చేతులు ‘తడిపితే’ గాని తన ముఖ్యమంత్రిత్వం ఆంధ్రలో నిలవదన్న భీతి బాబు గుండెల్లో గూడుకట్టుకుంది. దీని ఫలితం గానే నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతాంగానికి ఇన్ని తిప్పలు తప్పలేదు. ఈ నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ప్రజలు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. వైఎస్ జగన్కు అధికార పగ్గాలను రాష్ట్ర ప్రజలు కట్టబెట్టింది తాను తలపెట్టిన అఖండ పాదయాత్ర ఫలితమే. నిర్దిష్టమైన కార్యాచరణకు తగిన నవరత్నాలతో ప్రణాళికను రూపొం దించుకుని, పాద యాత్రలో గడించిన అనుభవాల ఆధారంగా మాట తప్పకుండా ప్రభుత్వ పాలనా రథాన్ని వినూత్న పద్ధతులతో వైఎస్ జగన్ నడిపిస్తున్నారు. గ్రామసీమల్లో ఎక్కడికక్కడ ప్రజలకు అందు బాటులో ఉండే గ్రామ సచివాలయాల స్థాపనతోనే వికేంద్రీకృత పాలనకు బలమైన అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు (ఉత్తర, పశ్చిమ, దక్షిణాంధ్ర ప్రాంతాలు) మూడు రాజధానులు ఏర్పర్చడం ఇప్పుడెంతో అవసరం. దూరాభారాలతో నిమిత్తం లేని ప్రాంతీయ రాజధానుల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు ప్రబలే అవకాశాలు ఉండవు. ఆ మాటకొస్తే మదరాసు నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర కాలంలో బెజవాడ, కర్నూలు, గుంటూరు.. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానులుగానే వ్యవహరించాయి! కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అమరా వతి ఒక్కటే కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా ఉండ కూడదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలకు చెందినదని, రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలని తెలిసికూడా అమరావతిని కొద్దిమంది మోతుబరుల ‘రియల్ ఎస్టేట్’గా మార్చడం తగదన్నది క్రమంగా ప్రజలు అనుభవంలో తెలుసుకున్న సత్యం. ఇది ఇప్పటికీ, ఎప్పటికీ తెలుసుకోవలసిన వాస్తవం. అమరావతి ఆది నుంచి బౌద్ధ విద్యా కేంద్రంగానే వర్ధిల్లింది కానీ, రియల్ ఎస్టేట్గా కాదు. నలందాకు నకలే అమరావతి. నాగా ర్జునుడి కేంద్రాలు, నాగార్జున విశ్వవిద్యాలయ స్థాపన వెనక రహ స్యమూ ఇదేనని గుర్తించాలి -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అభివృద్ధి వికేంద్రీకరణ నినాదాలతో మార్మోగిన తిరుపతి
-
అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ
తిరుపతి: అభివృద్ధి అధికార వికేంద్రీకరణ నినాదాలతో తిరుపతి మారుమ్రోగింది. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ మేధావులు విద్యార్థి సంఘాల నేతలు మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. మూడు రాజధానులు మద్దతుగా శనివారం.. తిరుపతి ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు వేలాదిగా తరలివచ్చారు. రాయలసీమ వాసులే కాకుండా ఉత్తరాంధ్ర అమరావతి ప్రాంతాల నుంచి వచ్చిన మేధావులు వివిధ వర్గాలకు చెందిన నేతలు తమ గొంతును వినిపించారు. అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతానికి పరిమితమయితే మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని స్పష్టం చేశారు. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని చేసి డిమాండ్ తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సభలో ప్రసంగించిన మేధావులు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా సమగ్రాభివృద్ధి బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది చేతులు పైకెత్తి తమ హర్షం ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు డిమాండ్, రాయలసీమ అవసరాలు, ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హక్కుల కోసం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన ప్రజా రాజధానుల మహాసభ కొనసాగుతోంది. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మహాసభలో సీమ అభివృద్ధిని ఆకాంక్షించే అన్ని సంఘాలు పాల్గొన్నాయి. రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్ మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం ఎత్తుకొందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని అది జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోనూ రాజధానుల ఉండాలని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలేదీక్షలు చేపడతామని చెప్పారు. వికేంద్రీకరణ సాధన కోసం మహా పాదయాత్రకు సిద్ధమవుతామని తెలిపారు. చిత్తూరు, కడప, కర్నూల్. అనంతపురం జిల్లాల నుంచి ప్రతినిధులు మేధావులు హాజరయ్యారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (తిరుపతి), రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ (అనంతపురం), రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి (కడప), కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి (కర్నూల్) పాల్గొన్నారు. -
'వికేంద్రీకరణతో అమరావతికి నష్టమేం లేదు'
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధాని విషయమై ట్విటర్ వేదికగా స్పందించారు.' వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారి ఏఎమ్ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు' అని ట్వీట్ చేశారు. -
మూడు రాజధానుల ‘చారిత్రక’ నిర్ణయం
రాజధానికి ఒక ఠీవి ఉండాలి. ఒక ఘన చరిత్ర ఉండాలి. ఇతర రాష్ట్రాలు, దేశాల పెట్టుబడుల్ని ఆకర్షిం చేట్లుండాలి. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆదాయాన్ని అందించే దిగా ఉండాలి. ఆంధ్రప్రదే శ్లో ఇప్పటికి ఆ స్థాయి ఒక్క విశాఖకు మాత్రమే ఉంది. నిజమే, ఒకప్పుడు 1937 నాటి శ్రీబాగ్ ఒడం బడిక మేరకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని 140 మంది తెలుగు జిల్లాల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్రా నికి కర్నూలులో లెజిస్లేటివ్–కమ్–ఎగ్జిక్యూటివ్ పాలన విభాగాల రాజధాని, గుంటూరులో జ్యుడీషి యల్ పాలనా విభాగ రాజధాని నెలకొల్పాలని నిర్ణ యించారు. అట్లా రెండు వికేంద్రీకరణలతో కూడిన రాజధానులు ఏర్పరుచుకోవడం 1953లోనే జరి గింది. కానీ ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పరుచుకోవడంతో బాటు విజయవాడ–గుంటూరులను కేంద్రీకృత రాజ ధానిగా చేసుకోవాలని లోలోపల ఆకాంక్ష గల ఆనాటి మధ్యాంధ్ర నాయకులు, ముఖ్యంగా కృష్ణా– గుంటూరు నాయకులు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్(20 మంది శాసన సభ్యులు) నాయకులు రాజధానిని కర్నూలు నుండి మార్చాలని పట్టుబట్టారు. రాజధానిగా కర్నూలు పుట్టి రెండు నెలలు కూడా గడవకముందే (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్; దానికి హైదరాబాద్ రాజ ధాని అనే ఆలోచన లేశమంతైనా రూపుదిద్దుకోక ముందే) కర్నూలులోని శాసనసభలో ‘రాజధాని విషయంగా’ పలు దఫాలుగా చర్చలు జరిగాయి. దానిపై నవంబర్ 30, 1953న తుది నిర్ణయం తీసు కునేట్లు ఆమోదం అయ్యింది. కానీ మూడు ఓట్ల తేడాతో వీరి ప్రయత్నం విఫలమైంది. అనగా విజయ వాడ–గుంటూరులను రాజధానిగా చేసుకోవాలనే వీరి ఆకాంక్ష ఆకాంక్షగానే మిగిలిపోయింది. అటు గ్రేటర్ రాయలసీమ ప్రాంత సభ్యుల్లో కొందరు కర్నూలులోనే రాజధాని శాశ్వతంగా ఉండా లని కోరగా, కొందరు విశాఖనూ, మరికొందరు విజయవాడ–గుంటూరులను కోరుతూనే అప్పటికి ఏ రూపూలేని విశాలాంధ్ర ఏర్పడితే హైదరాబాద్నే రాజధానిగా ఏర్పరుచుకోవాలని సీమేతర నాయకుల తోబాటు కోరడం జరిగింది. ఏప్రిల్ 1, 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధాని కొనసాగాలనీ, ఆ తరువాత పలు సౌకర్యాల దృష్ట్యా విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేయాలని మెజారిటీ సభ్యులు నవంబర్ 30, 1953 నాటి సమావేశంలో నిర్ణయించారు– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని రాజ ధానిగా హైదరాబాద్ ఆలోచనలకు మూడేండ్ల ముందుగానే. ఈ నిర్ణయానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు పడ్డాయి. 20 మంది (కమ్యూనిస్టులు) తటస్థంగా ఉన్నారు. అనగా శ్రీబాగ్ ఒప్పందానికి భిన్నంగా రాజధాని అయిన కర్నూ లును తాత్కాలిక రాజధానిగా నిర్ణయించడం, విశా ఖకు తరలించడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే శ్రీబాగ్ ద్వారా పొందిన రాజధానిని కోల్పోయామనే బాధ గ్రేటర్ సీమవాసుల్లో 1953 నుండీ కొనసాగు తూనే ఉంది. పైగా సభ నిర్ణయం వల్ల విశాఖ ప్రాంతీ యులకు కూడా రాజధాని వచ్చేసిందన్నట్లు ఆశ కలిగింది. కానీ, వీరి ఆశ కూడా అడియాసగానే మిగిలిపోయింది. అంటే, కర్నూలు, విజయవాడ–గుంటూరు, విశాఖపట్నం ప్రాంతీయుల ముగ్గురిలోనూ తమ తమ ప్రాంతాల్లో రాజధాని ఏర్పడాలనే ఆకాంక్ష దీర్ఘకాలంగా నెలకొని ఉంది. కనీసం రాజధాని పాలనా విభాగాలు మూడింటిలో ఒక్కటైనా తమ ప్రాంతంలో ఏర్పాటు కావాలన్న కోరిక బలంగా ఉంది. ఈ మూడు ప్రాంతీయుల ఆకాంక్షల చారిత్రక నేపథ్యంపై అవగాహన ఉన్నందువల్లే నేటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావ తిలో లెజిస్లేచర్ విభాగాన్ని ఏర్పరచడానికి గత అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించారు. కాబట్టి, ఉత్తరాంధ్ర ఈస్ట్ పాకిస్తాన్ కాదు; గ్రేటర్ రాయలసీమ వెస్ట్ పాకిస్తాన్ కాదు; రెండూ మనవే. అవి కూడా తమ ఆకాంక్షల్నీ, అభివృద్ధినీ సాధించుకోవాలని ఆశి స్తాయి. కాబట్టి అమరావతి ప్రాంతీయుల్లో మిస్గైడ్ కాబడినవారు ఆలోచిస్తారని ఆశిద్దాము. రాజధాని మార్చకూడదని వాదించేవాళ్లు– 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని త్యాగం చేసిన సీమవారు, 1953 నాటి శాసనసభ నిర్ణయం ప్రకారం విశాఖను రాజధానిగా పొంది కోల్పోయిన ఉత్తరాంధ్ర వాళ్లు నేటి మూడు రాజధానుల నిర్ణ యానికి ఎక్కువ సర్దుకుపోతున్నారో, అమరావతి వాసులు ఎక్కువ సర్దుకుపోతున్నారో ఆలోచించాలి. వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీయూ, తిరుపతి ‘ 98495 84324 |డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి -
సంప్రదాయం మరిచి బాబు సవాళ్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్లైన్ సవాల్ తమాషాగా ఉంది. సాధారణంగా ఎవరైనా తమకు ప్రభుత్వం చేసే పని నచ్చకపోతే దానికి అసమ్మతిగా నిరసన తెలుపుతారు. సవాళ్లు విసురుతారు. రాజీనామాలు చేస్తారు. ఉపఎన్నికలకు సిద్ధం అవుతారు. కానీ చిత్రంగా చంద్రబాబు మాత్రం ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఆయన కూడా రాజీనామా చేస్తారట. తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారట. పైగా, మళ్లీ ఎన్నికలు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీనామాలకు చాలా చరిత్ర ఉంది. 1950వ దశకంలో పలువురు నేతలు తాము పార్టీ మారినప్పుడు రాజీనామాలు చేశారు. పీవీజీ రాజు, తెన్నేటి విశ్వనా«థం వంటి ప్రముఖులు రాజీనామాలు చేయడానికి వెనుకాడలేదు. ఆ తర్వాత కాలంలో ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో పెద్ద ఉద్యమం చెలరేగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సీపీఐ తది తర పార్టీల ఎమ్మెల్యేలు 1967 ఎన్నికలకు ముందు తమ పదవులు వదలుకున్నారు. అప్పటినుంచి జైఆంధ్ర ఉద్యమ సమయంలో కానీ, 1994లో కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో కానీ అనేకమంది నేతలు ఉద్యమ లక్ష్యాలకోసం పదవులకు రాజీనామా చేశారు. బోఫోర్స్ స్కామ్ సమయంలో నేషనల్ ్రçఫంట్ అధ్యక్షుడుగా ఉన్న ఎన్టీరామారావు దేశవ్యాప్తంగా వందకు పైగా ప్రతిపక్ష ఎంపీలతో రాజీనామా చేయించారు. ఇకపోతే, 2001లో టీఆర్ఎస్ స్థాపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుది ఇందులో ప్రత్యేక రికార్డు. సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి, కరీంనగర్ ఎంపీ పదవికి మరోసారి మంత్రి పదవికి వరుసగా రాజీనామాలు చేసి తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా రాజీనామా చేయించారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ ఇద్దరూ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి వైఎస్సార్ కాంగ్రెస్ను స్థాపిం చినప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందారు. వైసీపీలో చేరదలచిన 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికలలో పోటీచేయించారు. ఇదంతా చరిత్ర. ఒక్క చంద్రబాబు హయాంలో మాత్రమే ఇలాంటి రాజీనామాలు జరగలేదు. ఇతరపార్టీల నుంచి వచ్చిన వారికి ఆయన టీడీపీ కండువాలు కప్పారు. కానీ వారితో రాజీనామాలు చేయించే ధైర్యం చేయలేదు. గత టర్మ్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారితో రాజీనామా చేయించాలని, అనర్హత వేటు వేయాలని పలుమార్లు వైసీపీ డిమాండ్ చేసింది. వీటిలో దేనికీ చంద్రబాబు సిద్ధపడలేదు. ఎవరైనా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి రాజీనామా అస్త్రం ప్రయోగిస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరూ సాధారణంగా తమంతట తాముగా పదవులను వదులుకోవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు అమరావతి రాజధానిని మూడుగా విభజించి విశాఖపట్నం, కర్నూలుకు కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో దానిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీ రద్దు డిమాండ్ చేశారు. అప్పుడు తాము కూడా ఎన్నికలకు సిద్ధం అని అంటున్నారు. చంద్రబాబు చెప్పే సిద్ధాంతమే కరెక్టు అయితే ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీని రద్దు చేయాలి? ఉదాహరణకు 1996 లోక్సభ ఎన్నికలకు ముందు రేషన్ బియ్యం రేట్లు పెంచబోమని, మధ్యనిషేధం ఎత్తివేయబోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ కలవబోమని చెప్పారు. కానీ వీటిలో ఏ ఒక్కదానిపైన నిలబడలేదు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. 1994 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ఇచ్చిన ప్రధాన నినాదం మద్య నిషేధం. కానీ బాబు దానికి మంగళం పాడారు. 2014 ఎన్నికలకు ముందు మొత్తం రైతుల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వీటీలో ఏ విషయంలోనూ మాట నిలుపుకోలేదు. ఈ సందర్భాలలో ఎన్నడూ రాజీనామా ఊసే ఎత్తలేదు. ఎవరైనా రాజీనామా అడిగితే ఇంతెత్తున ఎగిరిపడేవారు. అలాంటి బాబు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లి అమరావతి నుంచి రాజధానిని మార్చుతానని ఎన్నికలకు ముందు చెప్పలేదు కనుక ఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు. ఆయన గొప్పతనం ఏమిటంటే తాను ఎన్ని వాగ్దానాలను తుంగలో తొక్కినా అవేమీ జరగనట్లు నటించగలరు. సీఎం జగన్ మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలను తీసుకోవాలని జగన్ చెబితే, ప్రభుత్వ భూమి అన్న పదం వదలిపెట్టి వీడియో చూపిస్తారు. తమకు మద్దతు ఇచ్చే పత్రికలలో రాయిస్తారు. ఇది వారి నీతి. మరి లక్ష కోట్లు కావాలని కేంద్రాన్ని ఎందుకు అడిగారంటే చంద్రబాబు సమాధానం చెప్పరు. పైగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని కొత్త వాదన తెస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటే తానే నాలుగైదు లక్షల కోట్లు ఉంటే కానీ రాజధాని నిర్మాణం జరగదని చెబుతారు. ప్రతిపక్షంలోకి రాగానే పైసా అక్కర్లేదని చెప్పగల నేర్పరితనం ఆయనకు మాత్రమే ఉంది. నాలుగైదు లక్షల కోట్లా? లక్ష కోట్లా అన్నది పక్కన పెడితే, మొత్తం ఏపీ ప్రజల డబ్బంతా కొన్నేళ్లపాటు అమరావతిలో ఖర్చు చేయాలన్నది చంద్రబాబు సిద్దాంతంగా ఉంది. ఆ మాట చెప్పకుండా అమరావతి పూర్తి అయితే లక్ష నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు ఎంత దారుణంగా అబద్ధం చెబుతున్నారో చూడండి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదాయం మొత్తం లక్షా పాతికవేల కోట్లు లేదు. అలాంటిది అడ్రస్ లేని అమరావతి లక్ష కోట్లు సంపాదించేదని చంద్రబాబు చెప్పగలుగుతున్నారంటే అబద్ధాలు ఆడడానికి ఆకాశమే హద్దు అని ఆయన రుజువు చేసుకుంటున్నారనిపిస్తుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి? కర్నూలులో హైకోర్టు పెడితే వచ్చిన చిక్కేమిటి? ఇచ్ఛా పురం వాళ్లు కర్నూలు వెళ్లగలరా? కర్నూలు వారు విశాఖపట్నం రాగలరా? అని ఆయన అంటున్నారు. అసలు సామాన్యులకు రాజధానికి రావల్సిన అవసరం ఎంత ఉంటుంది? రాష్ట్ర విభజన జరగడానికి ముందు ఇచ్ఛాపురం నుంచి హైదరాబాద్కు ఎలా వచ్చారు? విభజన తర్వాత అనంతపురం, కర్నూలు వాళ్లు విజయవాడకు ఎలా వస్తున్నారు? 1953లోనే కర్నూలును రాజధానిగా అప్పటి ఆంధ్ర నేతలు ఎందుకు ఒప్పుకున్నారు? ప్రజలను మభ్యపెట్టే వాదనలతో జనాన్ని మాయ చేయాలని చంద్రబాబు యత్నం. లక్షల కోట్లు వ్యయం చేసి ఒకేచోట అభివృద్ధి చేయడమా? లేక ఆ డబ్బును ఆయా చోట్ల వెచ్చించి అన్ని ప్రాంతాలను సమానంగా చూడడమా? అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. అంతేకాదు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్తి, ఆత్మగౌరవం కూడా ఇందులో ఇమిడి ఉంటాయన్నది అర్థం చేసుకోవాలి. అమరావతిలో ఎటూ అసెంబ్లీ ఉంటుంది. పైగా అక్కడ వ్యవసాయ లేదా ఇతర రంగాలకు చెందిన హబ్లు రావచ్చని అంటున్నారు. చరిత్రలో కొత్తగా నిర్మించిన నగరాలు ఏవీ సఫలం కాలేదు. పుత్రజయ, బ్రెసిలియా, మన దేశంలో గాంధీ నగర్, నయా రాయపూర్ ఇలా ఆయా చోట్ల అవి జనం లేక వెలవెలపోతున్నాయన్నది ఒక విశ్లేషణ. అందులోనూ విజయవాడ, గుంటూరుల మధ్య పల్లెటూళ్లలో తలపెట్టిన బాబు కలల రాజధాని రియల్ ఎస్టేట్కు పనికి వచ్చిందేకాని, ప్రజల అవసరాలు తీర్చడానికి కాదన్నది పచ్చి నిజం. అయితే అదే సమయంలో అక్కడ భూములు ఇచ్చిన రైతులకు నష్టం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. బాబు రాజీనామాల సవాళ్ల ప్రహసనానికి మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు ఘాటుగానే బదులు ఇచ్చారు. అమరావతి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని.. కర్నూలు, విశాఖపట్నంలలో రాజధాని వికేంద్రీకరణ ప్రజలు వద్దని కోరుకుంటున్నారని బాబు విశ్వసిస్తుంటే ఆయన రాజీనామా చేసి సవాల్ విసరాలి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఆ సవాళ్లలో ఆయన నెగ్గితే అప్పుడు తన వాదనకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఆయనవన్నీ మేకపోతు గాంభీర్యం, విషయం లేని సవాళ్లేనని తేలిపోతుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
అబద్ధాల నోళ్లకి నాలుకలెన్ని?!
‘గుడ్లగూబ పగలు చూడ లేదు. కాకి రాత్రివేళల్లో చూడ లేదు. మూర్ఖుడు (అజ్ఞాని) రేయింబవళ్లు చూడలేడు’ ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు మాటలు విన్నప్పుడల్లా ఈ ప్రాచీన సూక్తి గుర్తుకు రాక తప్పదు. ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులను (శాసన వేదికగా అమరావతిని, కార్యనిర్వాహక (పాలనా) కేంద్రంగా విశాఖపట్టణాన్ని, న్యాయ పాలనా కేంద్రంగా కర్నూలును) రాష్ట్ర అసెంబ్లీ సుదీర్ఘ చర్చల అనంతరం నికరం చేసిన తరువాత రాష్ట్ర గవర్నర్ తుది ఆమోదముద్ర వేశారు. అది చట్టమవుతోంది. దాంతో, రాజ్యాంగపరంగా, శాస నాధికారపరంగా ఆంధ్రప్రదేశ్ అవతరణకు అయి దేళ్ల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సారథ్యంలో పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ఒక బలమైన, సరైన ముసాయిదా రూపకల్పన జరిగినట్టయింది. అన్ని హామీల మాదిరే, రాష్ట్ర పరిపాలనా నిర్వహణకు ఒక తాత్విక పునాదికి అనువైన అధికార వికేంద్రీకరణకు పునాదులను పటిష్టం చేసుకోవలసిన ఈ తరుణంలో–ఎన్నికల రంగంలో దారుణాతిదారుణంగా విలువ కోల్పోయి చతికిలపడవలసి వచ్చిన టీడీపీ, అన్నివిధాలా అభాసుపాలైన దాని నాయకుడు చంద్రబాబు మరొకసారి మోకాలడ్డటానికి ఉద్యుక్తుడయ్యారు. ఇప్పుడాయన మన దేశంతోసహా మొత్తం ప్రపం చంలోనే ఏ దేశంలోనూ రెండు, మూడు రాజధా నులు లేవని బుకాయించడానికి సిద్ధమై ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన విషయంలో పైన పేర్కొన్న ప్రాచీన సూక్తిని ఉదహరించవలసి వచ్చింది. తన ‘కేంద్రీకరణ’ విధానాల ద్వారా గతంలో బాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెలగబెట్టడంలో ఏం జరిగిందో 2002–03 నాటికే ప్రపంచబ్యాంకుకు అనుబంధ సంస్థగా భారతదేశంలో ఫండింగ్ ఏజెన్సీగా రాష్ట్రా లకు రుణాలు సమకూర్చిపెడుతూ వచ్చిన డీఎఫ్ ఐడీ ఏజెన్సీకి స్పష్టంగా బోధపడింది. ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు పనితీరును, క్యాబినెట్తో గానీ, శాసనసభతోగానీ నిమిత్తం లేకుండా ఏక పక్షంగా తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేస్తున్న తీరునూ అది ఒక నివేదికలో పూసగుచ్చి నట్టు వివరించింది. బాబు పనితీరును, నర్మ గర్భంగా బ్యాంకింగ్ రుణాలు వినియోగమవుతున్న తీరు తెన్నుల్ని పరిశీలించి నివేదికను సమర్పించ మని ప్రపంచబ్యాంకు అనుబంధ సంస్థ (డీఎఫ్ ఐడీ)ని ఇంగ్లండ్లోని ససెక్స్ యూనివర్సిటీ ఆర్థిక రంగ నిపుణుడు ప్రొఫెసర్ జేమ్స్ మానర్ ద్వారా క్షేత్రస్థాయి విచారణ జరిపించింది. అది సమర్పిం చిన నివేదికలోని ఈ క్రింది కొన్ని అంశాలను ఉదహరిస్తే చంద్రబాబు ధన దుర్వినియోగాన్ని, నిధుల మళ్లింపు కార్యక్రమాల తీరునూ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ ఫండింగ్ ఏజెన్సీ నివేదిక చంద్రబాబు పనితీరు గురించి ఇలా పేర్కొంది: ‘‘భారతదేశంలోని రాష్ట్రాలకు రుణాలు సమకూర్చే రుణదాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వా లతో సంప్రదించాల్సి వస్తే ప్రధానంగా సంస్థల స్థాయిలో మాత్రమే ఫండింగ్ ఏజెన్సీలు చర్చిం చాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరు– ఇక్కడ కేవలం ఒకే ఒక్క వ్యక్తితో, కేవలం ఒక్క చంద్రబాబుతో మాత్రమే ఫండింగ్ సంస్థ చర్చించాల్సి ఉంది. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు జరగాల్సిన ప్రభుత్వ ప్రాజెక్టుల ఖర్చుల తాలూకు లెక్కల్ని వాస్తవాలకు అందకుండా అధికారులు పెంచేసి చూపడం జరుగుతోంది. ఆ దొంగ లెక్కలపై అదు పాజ్ఞలు లేవు, ఒకవేళ అలాంటి అధికారుల్ని మంద లించడమూ లేదు. ఇదంతా ఒకే ఒక్క వ్యక్తి (చంద్ర బాబు) చేతిలో అదుపూ ఆజ్ఞా లేకుండా, అధికారం కేంద్రీకృతమై ఉన్నందున సంభవిస్తోంది. ల్యాండ్ రికార్డులు కూడా చట్టవిరుద్ధంగా తారుమారు చేయడం జరిగింది. ప్రభుత్వ కాంట్రాక్టులు మంజూరు చేయడంలో భారీ మొత్తాలలో డబ్బు చేతులు మారాయి. ఇలా రూ. 10 లక్షలకు మించిన కాంట్రాక్టులలో వందలాది సందర్భాలలో ఈ అవి నీతి పారింది. మధ్యస్థాయిలో ధారాళంగా డబ్బులు గుంజుకోవడాన్ని అనుమతించారు. ఇదిగాక, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కేటాయించిన నిధు లలో మూడింట ఒక వంతు నిధుల్ని పక్కకు మళ్లిం చడానికి పార్టీ శాసనకర్తలకు అనుమతినిచ్చారు. ఈ దోపిడీలో చివరికి క్రిమినల్ ముఠాలతో కూడా కుమ్మక్కయ్యారు. కాకపోతే ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్కన్నా ఆంధ్రప్రదేశ్ కొంత తక్కువ స్థాయిలో ఉంది. కానీ, ఈ దోపిడీలో మిగతా పెక్కు రాష్ట్రాల కన్నా బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ సగటు శాతంలో మించిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం భారతదేశంలోనే అత్యంత కేంద్రీకృతమైన ప్రభు త్వం. రాష్ట్రంలో ఉన్నది ఒక్క వ్యక్తి చేతిలో కేంద్రీ కృతమై ఉన్న పాలనా వ్యవస్థే గాదు, వ్యక్తి నిష్టమైన కేంద్రీకృత పెత్తనం... ఆయనకి జరిగిన పనికన్నా చిత్రగుప్తుని స్థాయిలో చూసే లెక్కలంటే ఇష్టం. ఈ అవినీతి డాక్యుమెంటరీ సాక్ష్యం దాదాపు దొర క్కుండా కనుమరుగు చేశారు. అయితే మా ఇంట ర్వ్యూలలో జరుగుతున్న అవినీతికి విశ్వసనీయమైన సాక్ష్యాలు, బలమైన సాక్ష్యాలు చాలా లభించాయి. ఇక న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడం అంటారా, అదో నైపుణ్యంగల విద్య. ఈ నైపుణ్యం నేర్చిన సీఎం (బాబు) న్యాయమూర్తులను లోబర్చుకోవడానికీ ప్రయత్నించగలడు. ఈ నైపుణ్యం తోనే ఆయన తన విశ్వసనీయమైన అడ్వొకేట్ జన రల్ ద్వారా తెలివిగా హైకోర్టును హ్యాండిల్ చేయగలిగారు. దాంతో కోర్టుతో వ్యవస్థాగతమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అలా కోర్టును తగినంత ప్రభావితం చేయగలిగారు. చివరికి ఈ ప్రభావం ఏ స్థాయికి చేరుకుందంటే తనకు సన్నిహితులైన ఇద్దరు వందిమాగధులైన న్యాయవాదులకు హైకో ర్టులో స్థానం కల్పించగలిగారు. ఈ పద్ధతి న్యాయ వ్యవస్థ సంస్కరణకు దోహదపడదు గానీ దాన్ని నిపుణ రాజకీయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి పద్ధతులు, సత్వర న్యాయం సాధించడానికి పేద వర్గాలకు లీగల్ న్యాయం ఒనగూర్చడానికి ఎంత మాత్రం తోడ్పడవుగాక తోడ్పడవు’’. ఇదీ చంద్ర బాబు పాలనపైన ప్రపంచబ్యాంక్ నివేదిక సారాంశం. ఈ అనుభవం దృష్ట్యా, బాబు వల్ల ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏర్పడిన దుర్గతిని అంచనా వేసుకుని, విభక్త ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ యజ్ఞంలో అడ్డుపుల్లలు పేర్చాలని చూస్తున్న ఆయన దుష్టచింతనను తుత్తునియలు చేయవలసిన అవసరం ఉందని మరిచిపోరాదు. ప్రపంచంలో ఏ దేశానికీ రెండు, మూడు రాజధా నులు లేవన్న బాబు అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేసే సమాచారం ఇక్కడ చూడవచ్చు. బొలీవి యాలో లా పాజ్, నుక్రీలలో రెండు రాజధానులు. దక్షిణాఫ్రికాలో కేప్టౌన్, ప్రిటోరియా, బ్లోమ్ ఫాంటైన్; చీలీలో శాంటియాగో, లాల్పరాయిసో (శాసన రాజధాని); చక్రిపబ్లిక్లో ప్రేగ్, బర్నో; మలేసియాలో కౌలాలంపూర్, పుత్రజయ; నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్, హేగ్; శ్రీలంకలో కొలంబో, పొట్టే.. ఇలా దాదాపు పది దేశాలలో రెండు లేక మూడు రాజధానులు ఉన్నాయి. ఇక భారత్లో కనీసం ఆరు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్న సంగతిని పట్టికలో చూడవచ్చు. అందువల్ల ఇప్పటికైనా బాబు వందిమాగ ధులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవడం శ్రేయ స్కరం. రేపో మాపో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాగా, పరిమిత సంఖ్యలో ఉన్న మిగతా టీడీపీ చోటామోటా నాయకులు కూడా బీజేపీ ‘తీర్థంకరులు’గా ‘కాషాయం’లో మునకవేసే అవకాశం లేకపోలేదు. అబద్ధాలతో అసత్య ప్రమా ణాలతో కాలం వెళ్లబుచ్చుకునే రోజులు కావవి. అబద్ధాల నోళ్లలో వీశెల కొద్దీ సున్నంకొట్టే రోజులివి అని తెలుసుకోవడం మంచిది. భారత దేశంలో రెండేసి రాజధానులు ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ రాజధాని : రాయ్పూర్, హైకోర్టు : బిలాస్పూర్ కేరళ రాజధాని : తిరువనంతపురం, హైకోర్టు : కొచ్చిన్ రాజస్తాన్ రాజధాని: జైపూర్, హైకోర్టు : బోథ్పూర్ ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని : డెహ్రాడూన్, వేసవి రాజధాని : గైర్సన్ మహారాష్ట్ర ముంబై/ నాగపూర్ ఉత్తరప్రదేశ్ రాజధాని : లక్నో, హైకోర్టు : అలహాబాద్ abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు, కోర్టు కేసులు, శాసనమండలిలో నాటకీయ పరిణామాల అనంతరం సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానులకు తొలినుంచీ వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ప్రతిపక్ష టీడీపీకి ఈ పరిణామం కంటగింపులాంటిదే. మండలిలో బిల్లును అడ్డుకోవడం, కోర్టుల్లో కేసుల వేయడం వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడ్డ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిల్లుకు గవర్నర్ చేత ఆమోదం లభించకుండా ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ప్రభుత్వ నిర్ణయానికే ఓటు.. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ప్రజా ఆమోదం కలిగిన శాసనసభ రెండుసార్లు ఆమోందించిన బిల్లును వెనక్కిపంపడం భావ్యం కాదని భావించిన గవర్నర్ హరిచందన్ ప్రభుత్వ నిర్ణయానికే ఓటు వేశారు. అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మూడు వారాల పాటు బిల్లును పూర్తిగా పరిశీలించిన అనంతరమే మూడు రాజధానులకు రాజముద్ర వేశారు. శాసనసభ ఆమోందించిన వెంటనే తన నిర్ణయం చెప్పని గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుపై సమగ్ర పరిశీలన జరిపారు. బిల్లుకు సంబంధించి పలు అంశాలపై విస్తృత పరిశీలన చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు సైతం తీసుకున్నారు. (పరిపాలన రాజధానికి త్వరలోనే శంకుస్థాపన) బిల్లు తీసుకురావడంలో శాసనసభ అనుసరించిన విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల అంశాన్నికూడా గవర్నర్ పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పెండింగ్లో ఉన్న కేసులు.. బిల్లుల ఆమోదంపై ప్రభావితం చూపుతాయా? అన్న అంశంపై న్యాయ నిపుణలతో చర్చించి, పరిశీలించారు. పునర్విభజన చట్టానికి అనుగుణంగా ఉందా? అనే అంశంపై సైతం ఆరా తీశారు. శాసన మండలిలో జరిగిన సంఘటనలపై.. శాసనసభ కార్యదర్శి నుంచి నివేదిక తెప్పించుకుని అధ్యాయం చేశారు. చంద్రబాబు, కన్నా, శైలజానాద్లో హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను పరిశీలించి 3 వారాల విస్తృత పరిశీలన, సంప్రదింపుల తర్వాత మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. (గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం) -
పరిపాలన రాజధానికి త్వరలోనే శంకుస్థాపన
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఆర్డీఏ బిల్లు రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపడం శుభపరిణామం అని అన్నారు. మూడు రాజధానుల బిల్లు ఆమోధాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారన్నారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని బొత్స స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయం అనంతరం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. (గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం) ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రంలో ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు. మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. వీధి రౌడీల్లా శాసన మండలిలో బిల్లును అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. చివరకు ధర్మమే గెలిచింది. త్వరలోనే పరిపాలన రాజధానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. పరిపాలన వికేంద్రీకరణతోనే.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి. అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమే. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రాజధాని రైతులకు తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు అమరావతి రాగం అందుకున్నారు’ అని పేర్కొన్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) -
మూడు రాజధానులను సందర్శిస్తా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ గొప్ప పరిణామంగా కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) (వైజాగ్ని చాలా మిస్ అవుతున్నా..) -
'అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు'
సాక్షి, ఏలూరు: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం. రాజధాని ఎప్పటికీ మారదు మారదు అంటూ చంద్రబాబుకు వంత పాడిన పవన్ కల్యాణ్కి ఇది దుర్దినం. ప్రజలకు శుభదినం. మూడు రాజధానులు ప్రజల కోరిక. మూడు ప్రాంతాల అభివృద్ధి విజ్ఞులు ఆలోచన. ఇకనైనా అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కల్యాణ్ కళ్లు తెరువు అని గ్రంధి శ్రీనివాస్ హితువు పలికారు. రాష్ట్ర ప్రజల విజయం: కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్టానికి శుభదాయకం: ఎంపీ భరత్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 4 రాయలసీమ జిల్లాలు కూడా రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం రాష్టానికి శుభదాయకం అని మార్గాని భరత్ తెలిపారు. కృష్ణా: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందునునట్లు ఉదయభాను వివరించారు. -
యనమల ఏమైనా గవర్నర్కు సలహాదారా?
సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చీప్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనలు ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్నది సత్యం. ఈ దశలో కూడా గవర్నర్ను ప్రతిపక్షనేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏమిటి? యనమల ఏమైనా గవర్నర్కు సలహాదారా' అంటూ ప్రశ్నించారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) 'నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్డీడీయే రద్దు బిల్లులు రెండింటినీ ఆమోదించారు. ఇప్పటికైనా విపక్ష తెలుగుదేశం నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలి. రాజ్యాంగబద్ద నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి' అన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. -
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ‘అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా గవర్నర్ వ్యవస్థపై మాట్లాడే పార్టీలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని రాజధానిగా టీడీపీ ఎంచుకుంది. చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలనుకోవడం చంద్రబాబుకు సరికాదు. నాడు రాజధానిపై చర్చ సందర్భంగా అమరావతి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టాడమని కేంద్రం చెప్పింది. కేంద్రంపై టీడీపీ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా బాబు మూర్ఖంగా వ్యవహరించారు. ఫెడరల్ స్ఫూర్తితో పని చేస్తున్నాం.’ అని జీవీఎల్ పేర్కొన్నారు. -
నెరవేరిన ఆరు దశాబ్దాల కల
సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన హరిచందన్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6 దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్కు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచన చేశారు’ అని అన్నారు. -
సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. (ముగ్గురి నోట అదే మాట!) రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. (‘బోస్టన్’ చెప్పిందేంటి?) అనంతరం 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్క్లియర్ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’
సాక్షి, విశాఖపట్నం: సోమవారం ఈనాడు పేపర్లో వచ్చిన ‘తీరంలో చీలిక’ వార్తపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిలో ఆయన ‘ఉత్తరాంధ్రకు సెక్రెటేరియట్ వస్తుందంటే, చంద్రబాబు నాయుడుతోపాటు రామోజీరావుగారికి కూడా నిద్ర పట్టటం లేదని ఈ రోజు ‘ఈనాడు’లో వచ్చిన వార్తను చూస్తే అర్థమవుతోంది. ఈ వార్తను తెలుగుదేశం నేతలు తమ పలుకుబడి ఉపయోగించి మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా ప్రచురింపజేశారు. ఇంతకీ ఈ వార్తలో ఏముందంటే... ఎప్పుడో 1 కోటీ 60 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 300 కిలోమీటర్ల మేర సముద్రంలో చీలిక ఏర్పడిందట. దాన్ని చూపించటానికి... ఓ పటం వేసి విశాఖపట్టణం అని రాశారు. 68 లక్షల సంవత్సరాల పూర్వం నుంచి 30 లక్షల సంవత్సరాల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదట. ఇంతవరకూ మాత్రమే రాస్తే అది ఈనాడు ఎందుకవుతుంది’ అంటూ ఎద్దేవా చేశారు. ఏమిటీ రాతలు రామోజీరావుగారూ.. ‘అందుకే ఆ సముద్ర గర్భంలో చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్ను పట్టుకుని చెప్పించారు. పనిలోపనిగా, అమరావతి ఒక్కచోటే రాజధాని ఉండాలని కూడా ఆ శాస్త్రవేత్తలతోనే చెప్పించి ఉంటే మరింత బాగుండేది. మొట్టమొదటగా మీరు పెట్టిన ఈనాడు విశాఖలోనే. మీ డాల్ఫిన్ హోటల్ విశాఖలోనే. మీ ఆస్తులు విశాఖలోనే. విశాఖకు ముప్పుందంటున్న మీరు మీ ఆస్తులన్నింటినీ ఖాళీ చేయించి మీ ఉద్యోగుల్ని ఇక్కడ నుంచి తక్షణం బయటకు తీసుకువెళ్ళిపోతారా. అసలు విశాఖకు ముప్పుందా.. ఎవరిది చెప్పింది’ అని ప్రశ్నించారు. అంతేకాక ‘మనకు ఆధారాలతో తెలిసిన మానవ చరిత్ర సింధు నాగరికత నుంచే కదా. అంటే కేవలం 6 వేల సంవత్సరాల నుంచే కదా. మరి 30 లక్షల సంవత్సరాల క్రితమే ఆగిపోయిన అలజడి... ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోవటం వల్ల మళ్ళీ మీలో రేగిందా.. లేక... అమరావతిలో చంద్రబాబు కొనుగోలు చేసిన భూములమీద మీకు కూడా ప్రేమానురాగాలు పెరిగాయా’ అని ప్రశ్నించారు. (ఇంకా ఎందుకు నవ్వులపాలవుతారు?) అంతేకాక ‘విజయవాడలోనే సెక్రెటేరియట్, హైకోర్టు ఉంటే... హైదరాబాద్లో రామోజీ ఫిలింసిటీకి డిమాండ్ పడిపోకుండా ఉండాలన్నది మీ ఆలోచనలా ఉంది. విశాఖపట్టణం అభద్రం... మొత్తంగా తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అంతా అభద్రం అనే వార్త రాసే ముందు అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా ఎలా అచ్చువేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయపెట్టాలని ఎందుకు చూస్తున్నారు. మీ చంద్రబాబు ప్రయోజనాలు, మీ తెలుగుదేశం ప్రయోజనాలు తప్ప మీకు ప్రజా ప్రయోజనాలు పట్టవా. ఈస్ట్రన్ నేవెల్ కమాండ్ ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. సబ్మెరైన్ బేస్ భారతదేశానికి ఎక్కడ ఉంది.. విశాఖలోనే కదా. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేంద్రం విశాఖ. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి ఇంతకు దిగజారతారా. దీన్ని జర్నలిజం అంటారా’ అంటూ ధర్మశ్రీ వరుస ప్రశ్నలు కురిపించారు. -
రాష్ట్రానికి ఆయనో ఎల్లో వైరస్: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతిపక్షం అడ్డుపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చూస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అమర్నాథ్ గుర్తు చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేశారని ప్రజలు దానిని గ్రహించారని అన్నారు. చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ తొత్తుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర టీడీపీ, సీపీఐ నేతలు విశాఖ అభివృద్ధికి అడ్డుపడటంపై ఆలోచించాలని కోరారు. రాయలసీమ ప్రజలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని చెప్పారు. సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబు నమ్మకం కోల్పోయారని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. కనీసం కృష్ణా, గుంటూరులో అయినా ప్రాతినిధ్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి.. చంద్రబాబు, లోకేష్ సమయం దొరకలేదా? అని అన్నారు. చంద్రబాబు కుట్రలను ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన ఎల్లో వైరస్ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. విశాఖ పరిపాలన రాజధాని రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: అన్న కోసమే.. మోకా హత్య !) -
ఏపీ: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు, 2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇదిలాఉండగా.. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని అన్నారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి: బీఏసీ సాక్షిగా బయటపడ్డ టీడీపీ డ్రామాలు) -
పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..
సాక్షి, విశాఖపట్నం : అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్రలో ఊహించని పరిణామం ఎదురైంది. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన ఆయనకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు పర్యటనపై విశాఖపట్నంలో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో దాదాపు నాలుగు గంటల పాటు వందలాది మంది ప్రజలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వ్యతిరేకంగా రోడ్డును దిగ్బంధించి వాహనాన్ని అంగులం కూడా కదలనీయలేదు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వారు చేసిన నినాదాలతో అక్కడి ప్రాంతం మారుమోగింది. (చంద్రబాబును అడుగుపెట్టనివ్వం) చంద్రబాబు వెనక్కివెళ్లాలని కాన్వాయ్పైకి ఎక్కి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు’ అంటున్న చంద్రబాబు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. అమరావతిలో టీడీపీ నేతలు అక్రమించిన భూములును, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. మరోవైపు విశాఖ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తేలేదని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విశాఖకు జైకొడితేనే ఆయన కాన్వాయ్ని కదలనిస్తామని, లేకపోతే ఒక్క అంగులం కూడా ముందుకు వెళ్లనీయమని భీష్మించుకుని కూర్చున్నారు. తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుని , టీడీపీ నేతలను విశాఖలో అడుగుపెట్టనీయమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రపై ప్రేమ లేనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని మహిళలను నిలదీశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఇక్కడి ప్రజలే స్వాగతిస్తుంటే టీడీపీ నేతలకు నొప్పెందుకని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు రుచించడంలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖకు వ్యతిరేకంగా టీడీపీ విష ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ తరఫున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాడాలని మహిళలను డిమాండ్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారటంతో పర్యటన కొనసాగించడం కష్టతరమని పోలీసులు తెలిపారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన విరమించుకుని వెనక్కి తిరిగి వెళ్లాలని పోలీసులు కోరినట్లు తెలిసింది. -
వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
-
అమరావతి ఆందోళనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : అధివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో గత కొంతకాలంగా టీడీపీ చేస్తున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు, బాధ్యత రాష్ట్రాలకు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. అధివృద్ధికి విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకునే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతిభద్రతలను మాత్రమే పర్యవేక్షిస్తుందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం అదనపు బలగాలను కూడా పంపిస్తుందని పేర్కొంది. అయితే అమరావతిలో అందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా అభివృద్ధి వికంద్రీకరణకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో టీడీపీ నేతలు అమరావతిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. -
మాట జారి తడబడ్డ టీజీ వెంకటేష్
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ బీజేపీలోకి ఫిరాయించినప్పటికీ.. ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మాట జారి తడబడ్డారు. సమావేశం ప్రారంభంలోనే మా తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ నాలుక కరచుకున్నారు. ఇంతలోనే అక్కడున్న మీడియా ప్రతినిధులు ‘సార్ మీరు బీజేపీలో ఉన్నార’ని గుర్తుచేయడంలో సరిచేసుకున్నారు. పొరపాటును సరిదిద్దుకుంటూ.. తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు. మూడు ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, వాటి బ్రాంచులు ఉండాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ‘నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం’ అందుకే అందరి కోసం మూడు రాజధానులుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణకు టీజీ వెంకటేష్ ఇదివరకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. -
వికేంద్రీకరణపై విద్యార్థులతో అవగాహన సదస్సు
-
3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై శివరామకృష్ణ కమిటీ చేసిన సూచలను జీవీఎల్ ప్రస్తావించారు. ‘ శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వం రిపోర్టులు, గ్రాఫిక్స్కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదు. దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. నిజానికి ఒకేచోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదు’ అని అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.(ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు!) అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో జరిగిన భారీ అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చి నిర్ణయం తీసుకోవాలి’ అని జీవీఎల్ పేర్కొన్నారు. అదే విధంగా శివరామకృష్ణ కమిటీ సూచలను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వికేంద్రీకరణ కుదరదు.. అన్నీ ఒకచోటే: చంద్రబాబు
రాష్ట్ర రాజధాని విషయంలో అధికార వికేంద్రీకరణ కుదరదని, ప్రధాన కార్యాలయాలు అన్నీ ఒకచోటే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బద్దలుకొట్టేశారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ''కొన్ని సూచనలిచ్చారు. ఇంకా కొంతమంది ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. అవి పనికొస్తాయనుకుంటే పాజిటివ్గా పరిశీలిస్తాం. వ్యవసాయ భూముల సేకరణ వల్ల ఇబ్బంది అవుతుందని కొందరు ప్రస్తావించారు. ఎక్కడైనా వ్యవసాయ భూములు తీసుకుంటే ఎకరా భూమికి నీరు ఆదా అయితే వేరేచోట రెండెకరాలకు నీరు ఆదా అవుతుంది. వికేంద్రీకరణ చేయాలని కొంతమంది అన్నారు. ఎక్కడైనా పనుల మీద వచ్చినవాళ్లు వేర్వేరు చోట్లకు తిరగడం కుదరదు. అందుకని అధికార వికేంద్రీకరణ కుదరదు. డిజిటల్ ఏపీ అయినా.. వాటిని నడిపించేది మనుషులే. ఒక్కో ఊళ్లో ఒక్కో కార్యాలయం పెట్టాలంటే ప్రజలకు సౌకర్యంగా ఉండదు. రైతులను కోరుతున్నా.. మంచి రాజధాని కడదాం, మీకు కూడా లాభసాటిగా ఉండేలా తయారుచేద్దాం. అందరి సహకారం అవసరం. విశాఖపట్నంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే దాన్ని మరింత బలోపేతం చేసి మరింత ట్రాఫిక్ పెంచాల్సి ఉంటుంది. లాండ్ పూల్ సిస్టంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తిరుపతిలో నా ఇంటి ముందే పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ రాజధాని కావాలని నాకూ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ లాంటివి కట్టింది నేనే. సైబరాబాద్ నగరాన్ని కట్టింది నేనే. విశాఖలో ఐఐటీ కావాలన్నారు. ఒక ఐఐటీ ఇప్పటికే కేటాయించారు. రెండోది వస్తే అక్కడ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం. అరకు, లంబసింగి లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం'' అన్నారు.