Drain
-
ఐస్ క్రీంలో పురుగులు
-
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
డ్రైన్లు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్. భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు. ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ. water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92 — Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023 -
ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్
ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్ చేస్తుంటారు. కూల్డ్రింక్స్కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్ వాటర్ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్గా గుర్తించారు. #Watch | Vendor sprinkling drain water on coconuts. Noida Police caught after video viral on social media#Noida #viralvideo #Coconuts #News18JKLH pic.twitter.com/ZhuXEYCylz — News18 Kashmir (@News18Kashmir) June 6, 2023 (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
వైరల్ వీడియో: చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం..
-
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
ఇంటికో ఇంకుడు గుంత
సాక్షి, అమరావతి: వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా లేఅవుట్లలో 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా.. రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 17.66 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఆయా కాలనీల్లో రూ.32 వేల కోట్లకు పైగా నిధులతో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇప్పటికే కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు చకచకా ఇస్తున్నారు. ఇదిలావుండగా శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయి ఉండాలి. అలాకాకుండా సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గుంతకు రూ.6 వేలు ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, తొలి దశలో 7,278 కాలనీల్లో 1,11,770 ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీవోలు/మునిసిపల్ కమిషనర్ల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు/వార్డు ఎమినిటీ సెక్రటరీలకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరికి గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలం పెరుగుతుంది ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం వినియోగిస్తాం. పూర్తి స్థాయిలో డ్రెయిన్లు, కాలువలు నిర్మించిన అనంతరం ఇంట్లో వృథాగా పోయే నీటితోపాటు వర్షపు నీటిని కూడా ఈ గుంతల్లోకి చేర్చవచ్చు. తద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. కాలనీల్లో పెద్దఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే భవిష్యత్లో భూగర్భ జలాల అభివృద్ధికి దోహదపడుతుంది. – అజయ్జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
Video: పెళ్లి ఫొటోలు తీస్తూ కాలువలో పడిపోయిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే!
పెళ్లంటేనే సందడి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా పండగ వాతావరణం ఉంటుంది. పెళ్లిలో జరిగే ఫన్నీ, ఊహించని, ఆసక్తికర, షాకింగ్, ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మధ్య వివాహ వేడుకల్లో ఎంజాయ్మెంట్ ఎక్కువైంది. అతి చేష్టలకు పోయి కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తున్న ఓ మహిళ పొరపాటున కాలు జారి మురికి కాలువలో పడిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందో దానిపై క్లారిటీ లేదు కానీ.. వీడియో చూస్తుంటే విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ వధూవరుల ఫొటోలను తన ఫోన్లో రికార్డ్ చేస్తూ కనిపించింది. జంటను కెమెరాలో బంధించే క్రమంలో వెనక్కి నడుస్తుండగా ఉన్నట్టుండి మురుకు నీటి కాలువలో పడిపోయింది. అక్కడున్న వారంతా ఆమెను కాలువ నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఇక ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఫోటోలో మునిగిపోవడమే కాకుండా.. చుట్టూ పిరిసరాలను గమనిస్తూ ఉంటే బాగుంటుంది. అదృష్టం బాగుండి ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ఎంత ఘోరం జరిగేది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by hyderabadi__jaan (@hyderabadi__jaan) -
బిక్కవోలు డ్రెయిన్లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
పాపం ఏమైందో.. వివాహిత ఆత్మహత్య
మొగల్తూరు(పశ్చిమగోదావరి): గొంతేరు డ్రెయిన్లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు గ్రామంలో జరిగింది. ఎస్సై ఆర్.మల్లిఖార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గత ఏడాది కరోనా కారణంగా మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని దిగాలుగా ఉండేది. మూడు నెలల క్రితం అశ్వినికి (23)కి భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహమైంది. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. ఇటీవల సంక్రాంతి పండుగకు కాళీపట్నం వచ్చిన ఆమె గురువారం అర్దరాత్రి మోటార్సైకిల్పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్ఫోన్ను అక్కడ వదిలేసి డ్రెయిన్లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద మోటార్సైకిల్ గుర్తించి డ్రెయిన్లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేనినగర్ డొంకరోడ్డు కాలనీలో జరిగింది. వల్లెపు మీనాక్షి డొంకరోడ్డు కాలనీకి చెందిన జయరాంను ద్వితీయ వివాహం చేసుకుంది. వీరికి 6 నెలల కిందట సామ్యేలు జన్మించాడు. మీనాక్షిపై భర్తకు అనుమానం పెరిగింది. జయరాంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో విసిగిపోయిన మీనాక్షి బుధవారం ఉదయం 5 గంటలకు సామ్యేలును తీసుకొని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. కాలనీ వాసులు సామ్యేలు కోసం డ్రైనేజీలో గాలించారు. సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని పటమట పోలీసులకు చెప్పారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా!
మహమ్మారి కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో కూడా ఒక ఆకతాయి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. బాధితులకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఒక వింత కోరిక కోరాడు. దీంతో అప్పటికే ఇలాంటి అసంబద్ద కాల్స్ తో విసుగు చెందిన జిల్లా ఉన్నతాధికారి సదరు వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన సేవలందిస్తున్న సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ తో విసిగిస్తే.. ఇలాంటి గుణపాఠమే చెబుతామంటూ హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాంపూర్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసిన ఒక వ్యక్తి తనకు వేడి వేడి సమోసాలు కావాలని కోరాడు. అంతకు ముందు పిజ్జా డెలివరీ కావాలని అడిగాడు. పలుమార్లు ఇలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన డిఎం ఆంజనేయ కుమార్ సింగ్ అతగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతను అడిగినట్టుగానే సమోసాలను అతనికి పంపించి, అనంతరం సదరు వ్యక్తిచేత డ్రైనేజీ శుభ్రం చేయించారు. దీనికి సంబంధించి ఆయనొక పోస్ట్ షేర్ చేశారు. తమ అమూల్య సమయాన్నివృధా చేస్తే ఇలానే వుంటుందనేసందేశాన్నిచ్చారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వుండాలని సూచించారు. దీంతో డీఎం చర్యను పలువురు నెటిజన్లు అభినందించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని ఇలా విసిగించడం తగదని మండిపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం విశేషం. नाली साफ कर सामाजिक कार्य में योगदान देकर प्रशासन को सहयोग देते व्यवस्था का दुरुपयोग करने वाले व्यक्ति। राष्ट्रीय आपदा के समय आप सभी का सहयोग प्रार्थनीय है। जिम्मेदार नागरिक बनें। स्वस्थ रहें। सुरक्षित रहें। pic.twitter.com/4vMMp97OLp — DM Rampur (@DeoRampur) March 29, 2020 -
కన్నతల్లే కఠినాత్మురాలై..
నిడదవోలు రూరల్: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్లో పడవేసినట్లు తెలిసింది. స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుధీర్కుమార్ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని.. యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. -
తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి
చండీగఢ్ : ఇంకా కన్ను కూడా తెరవని పసిపాపను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలోకి విసిరేసింది ఓ కసాయి తల్లి. కానీ నోరు లేని మూగజీవులు ఆ బిడ్డను కాపాడి మానవత్వం చాటుకున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం హరియాణలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీ రికార్డులో ఉన్న దాని ప్రకారం శుక్రవారం ఓ మహిళ డోగ్రన్ గేట్ ప్రాంతంలో ఓ పసిపాపను ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురికి కాల్వలోకి విసిరి వెళ్లి పోయింది. అయితే కుక్కలు ఆ కవర్ను బయటకు తీసుకురావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్ కవర్లో పసిపాపను చూసి కుక్కలు అరుస్తూ.. బాటసారులను అప్రమత్తం చేశాయి. పసిబిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విసిరేయడం మూలానా చిన్నారి తలకు బలమైన గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే నయమవుతుందన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన మహిళ గురించి ఆరా తీస్తున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
డ్రైన్లో తేలుతూ.. పసికందు మృతదేహం
సాక్షి, అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్) : తల్లి పొత్తిళ్లలో నిద్రించాల్సిన ఆ పసికందు మురుగు కాల్వ పాలయ్యాడు. ఏ తల్లికి భారమయ్యాడో మరి కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరికీ దూరమయ్యాడు. డ్రైనేజీలో ఓ మగ శిశువు మృతదేహం లభ్యమైన ఘటన పాయకాపురం శాంతినగర్లో సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం శాంతినగర్ శారదా విద్యాలయం రోడ్డులోని ప్రధాన డ్రైన్లో ఓ శిశువు ఆకారం ఉన్న మృతదేహం తేలుతూ స్థానికులకు కనిపించింది. దీంతో వారు స్థానిక నా యకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డ్రైన్ మధ్యలో ఉన్న ఆ శిశువును బయటకు తీశారు. పేగులు మొత్తం బయటపడి ఉన్నాయి. సుమారు రెండు రోజుల వయస్సు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఎవరైనా కావాలని పడేశారా లేక ఎక్కడైనా పుట్టి చనిపోయిన బిడ్డను ఇలా కాల్వలో వదిలేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నున్న సీఐ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు. -
మురికి కాల్వలో పడ్డ వరుడు
చండీగఢ్ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దాంతో పెళ్లి కుమారుడితో సహా మరో 14 మంది మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్లోని హోషియాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘజియాబాద్లోని ఇందిరాపురముకు చెందిన అమిత్ యాదవ్కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో హోషియాపూర్లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. అయితే ఫంక్షన్ హాల్కు రోడ్డుకు మధ్య చిన్నపాటి మురుగు కాల్వ ఉంది. పెళ్లికి వచ్చే వారికి వీలుగా ఈ మురుగు కాల్వపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ముందు వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఆహ్వానం పలికేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వరుడితో పాటు ఆయన స్నేహితులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది. దాంతో వరుడితో సహా మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది. -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్డయాక్సైడ్ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
కాలువలో యువకుడి మృతదేహం
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ కాలువలో తేలుతున్న యువకుడి మృతదేహాన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 8లో కాలువలో పడిఉన్న యువకుడి మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. స్ధానికుల సమాచారంతో కాలువ నుంచి యువకుడి మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మనోజ్ కుమార్ పంత్ పేర్కొన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, కుడి చేయితో పాటు ఛాతీపై విజయ్ అనే టాటూ ఉందని, రెండు చేతులపై ఓం అని రాసిఉందని పంత్ తెలిపారు. బాధితుడికి 28 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆటోప్సీ నివేదిక వెలుగుచూస్తే యువకుడి మరణానికి స్పష్టమైన కారణం తెలుస్తుందని, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
వైరల్ వీడియో: డ్రైనేజీ శుభ్రం చేసిన సీఎం
పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్మోడల్గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్ చేశారు. -
మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం
-
మద్యం మత్తులో డ్రెయిన్లో దూకేశాడు..
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్లోకి భీమవరంలోని చిన్నవంతెన పైనుంచి మద్యం మత్తులో నక్కా రాము అనే వ్యక్తి ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో దూకేశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళ కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ ఎస్కే జాన్అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది బాల ఏసు, సుబ్బారావు, వెంకటరత్నం, వై.సుబ్బరాజు అక్కడికి చేరుకున్నారు. తాడు సహాయంతో రామును బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించారు. మద్యం మత్తులో ఉన్న అతను తాడును పట్టుకుని కొంతమేర పైకి లాగిన తర్వాత వదిలేయడంతో మళ్లీ అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. ఎట్టకేలకు రక్షించగలిగారు. డీఎన్నార్ కాలువగట్టు సమీపంలో నివశిస్తున్న అతను తనకు ఏవో కష్టాలు ఉన్నాయని మద్యం మత్తులో ఉండి చెబుతున్నాడు. చివరకు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు. -
‘గీత నీ మంచి మనసుకు సలాం’ ; వీడియో వైరల్
చెన్నై : పాలు అమ్మే వ్యక్తి పిలుపుకు బయటకు వచ్చిన గీతకు చిన్న మూలుగు శబ్దం వినిపించింది. పాపం ఏదో పిల్లి పిల్ల డ్రైనేజీ గుంత దగ్గర చిక్కుపడిందేమో అనుకున్న గీతకు అక్కడ కనపడిన దృశ్యం చూడగానే ఒక్కసారి ఒళ్లు జలదరించింది. కారణం ఆ అరుపులు పిల్లివి కాదు.. ఇంకా పూర్తిగా కళ్లు తెరవని ఓ పసిగుడ్డువి. అంతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పసివాణ్ణి బయటకు తీసింది గీత. ఆ చిన్నారికి దెబ్బలు ఏమైనా తగిలాయేమో పరిశీలించింది. అనంతరం ఆ పసివాణ్ణి శుభ్రం చేసి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. చెన్నైలోని వలసరవక్కంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నీ మంచి మససుకు సలాం’ అంటూ నెటిజన్లు గీతను తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పసివాడు క్షేమంగానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. ఈ విషయం గురించి గీతా ‘పాలు అమ్మే వ్యక్తి చెప్పడం వల్ల నేను శబ్దం వస్తోన్న వైపుగా వెళ్లాను. అదృష్టం కొద్ది పసివాడు ఉన్న చోట నీరు లేదు కాబట్టి క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారుల సంక్షేమ గృహానికి చేరుస్తాం అని అధికారులు తెలిపారన్నారు గీత. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ బాలునికి ‘సుతంథిరమ్’(తమిళ పదం. దానికి అర్ధం స్వేచ్ఛ) అనే పేరు పెట్టినట్లు తెలిపారు గీత. -
బాలికను హత్య చేసి గోనే సంచిలో వేసి..
-
నీటిసంపులో పడి బాలుడి మృతి
కేసముద్రం(మహబూబాబాద్): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రం గాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నేరేడి శ్రీనాథ్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు బబ్లు, జశ్వంత్(2) ఉన్నారు. శ్రీనాథ్ మేకలను మేపేందుకు వెళ్లగా, అనిత కూలీ పని నిమిత్తం వెళ్లింది. ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న జశ్వంత్ ఇంటి ఆవరణలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఇంతలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు సంపు వద్దకు వచ్చి చూడగా కొడుకు చనిపోయి ఉండడాన్ని గమనించారు. సంప్లో నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
నదిలో 3.5 కోట్ల నగదు!
గౌహతి : పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, బ్లాక్మనీని మార్చుకోవాలంటే మొహం చెల్లక చాలామంది ఆ నగదును మురికి కాల్వలో, నదుల్లో పారేస్తున్నారు. గౌహతిలోని రెండు విభిన్న ప్రాంతాలైన భరాలు నదిలో, ఓ డ్రైనేజీలో దాదాపు రూ.3.5 కోట్ల నగదును గుర్తించినట్టు పోలీసు అధికారులు చెప్పారు. నారెంగి రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీలో, దేశ రాజధానికి సమీపంలోని అనిల్ నగర్ ప్రాంతంలోని భరాలు నదిలో కొట్టుకుని పోతున్న ముక్కముక్కలుగా చినిగిపోయిన నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ చినిగిపోయిన నగదు, నిజమైన కరెన్సీ నోట్లా? కాదా? అనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద నోట్లు పనికిరాకుండా పోవడంతో, వీటిని ముక్కలుముక్కలుగా చేసి నదిలోకి విసిరినట్టు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కూడా రూ.500, రూ.1000 నోట్లు గౌహతిలోని చందన్ నగర్, రుక్మిణిగాన్ ప్రాంతాల డ్రైనేజీలో కొట్టుకుపోతూ కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. -
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
అమృత్సర్ : పంజాబ్లోని అమృత్సర్లో మంగళవారం ఓ స్కూల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. విద్యార్థులను తీసుకు వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూలు బస్సు అదుపు తప్పి ముహవా గ్రామంలోని ఓ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు ఘటనా స్థలంలో మరణించగా, మరో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వీరంతా నర్సరీ విద్యార్థులు కావటంతో బస్సులో నుంచి బయటకు రాలేక...అందులోనే చిక్కుకుపోయారు. కాగా గల్లంతు అయినవారి కోసం గాలిస్తున్నట్లు అమృత్సర్ రూరల్ ఎస్పీ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రైనేజీలో పడిన మహిళా ఎంపీ
జామ్నగర్: తన నియోజక వర్గంలో ప్రజా సమస్యలు వినడానికి వెళ్లిన ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె నీల్చున్న డ్రైనేజీ స్లాబ్ ఒక్క సారిగా కుప్పకూలడంతో అమాంతం 10 అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీ నీళ్లలో పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్లోని జామ్నగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ ఎంపీగా ఉన్న పూనమ్.. సోమవారం తన నియోజక వర్గంలోని ప్రజల సమస్యలను వినేందుకు వెళ్లారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో అధికారులు పేదల ఇళ్లు కూల్చేయడంతో.. అక్కడ ఉన్న బాధితులతో ఎంపీ మాట్లాడుతుండగా, ఒక్క సారిగా ఆమె నిల్చున్న డ్రైనేజీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ఎంపీ 10 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయారు. వెంటనే పక్కనున్న అధికారులు, కార్యకర్తలు ఆమెకు సహాయం చేసి బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆ వ్యక్తి అదితి కొట్టుకుపోవడం చూశాడట!
-
వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి
-
వరద నీటికి కొట్టుకుపోయిన చిన్నారి
సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వరదనీటిలో పడి ఓ చిన్నారి కొట్టుకుపోయింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన అతిథి(6) అనే చిన్నారి.. ట్యూషన్కు వెళ్లి వస్తుండగా వర్షం నీటి ఉధృతికి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. చిన్నారి తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తుండటంతో బాధితురాలు విశాఖలోని అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. చిన్నారి ఆచూకీ కోసం ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. -
డ్రైన్లో పడి బాలుడు గల్లంతు
తూర్పుగోదావరి: ఇంటిపక్కనే ఉన్న డ్రైన్లో పడి 15 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. మామిడి కుదురు మండలం లుతుకర్రు అనేగ్రామంలో రచ్చా రవికుమార్ (15) అనే బాలుడు ఇంటి పక్కనే ఉన్న డ్రైన్లో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. స్థానికులు బాలుడి ఆచూకీ కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. (మామిడికుదురు) -
శివారు.. కష్టాలు శివాలు..!
శివారు గ్రామాల్లో సమస్యల తిష్ట అధ్వానంగా మారిన డ్రెయిన్లు అస్తవ్యస్తంగా రహదారులు పట్టించుకోని పాలకులు.. బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు విజయవాడ సెంట్రల్/ రామవరప్పాడు : స్వచ్ఛభారత్.. స్మార్ట్ విలేజ్లు.. అంటూ ఆదర్శపాఠాలు వల్లెవేస్తున్న పాలకులకు శివారు గ్రామాల సమస్యలు మాత్రం కనిపించడం లేదు. కాలుష్యం కాటేస్తోంది బాబోయ్.. అని జనం గగ్గోలుపెడుతున్నా వినిపించడంలేదు. అధ్వానంగా మారిన డ్రెయిన్లు, రోడ్ల మీదుగానే పాలకులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో అనుకుంటే పొరపాటే... రాజధాని నగరం విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామాల్లోనే ఈ దుస్థితి నెలకొంది. శివారు గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఆనుకుని ఉన్న డ్రెయిన్లలో మురుగు మేట వేసింది. తోపుడు బండ్ల వ్యాపారులు చెత్తాచెదారాన్ని డ్రెయిన్లలో వేస్తున్నా వారిని అడ్డుకునేవారు గానీ, డ్రెయిన్లు శుభ్రంచేయించేవారు గానీ లేరు. వర్షం కురిస్తే జాతీయ రహదారిపై నుంచి వర్షపు నీరు డ్రెయిన్లలోకి చేరి మురుగు పొంగిపొర్లుతోంది. వర్షాకాలం వస్తుందంటేనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కాలుష్య కాసారం.. గుంటుతిప్ప డ్రెయిన్ గుంటుతిప్ప డ్రెయిన్ కాలుష్య కాసారంలా మారింది. ఈ డ్రెయిన్ ఆటోనగర్ నుంచి ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల మీదుగా రైవస్ కాలువలోకి కలుస్తుంది. నగరంలో నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను ఈ డ్రెయిన్లో కలుపుతున్నారు. ఆటోనగర్లోని పరిశ్రమల రసాయనాలు, వ్యర్థాలు కూడా దీనిలోనే కలుస్తున్నాయి. డ్రెయిన్ వల్ల ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రసాదంపాడు కార్మికనగర్లో ఇటీవల వేసిన బోరు, చేతిపంపుల నుంచి రసాయనాల వాసనతో కూడిన నీరు వస్తోందని ఈ ప్రాంతవాసులు వాపోతున్నారు. దీనిలోని నీరు తాగిన పశువులు రోగాల బారినపడుతున్నాయి. కొన్ని మరణిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ డ్రెయిన్ పొంగి సమీపంలోని ఇళ్లలోకి మురుగు చేరుతోంది. ఈ డ్రెయిన్ పరిసర ప్రాంతాల ప్రజలు బోరు నీరు తాగేందుకు సాహసించడంలేదు. మినిరల్ వాటర్ కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. శివారు గ్రామాల్లో ముఖ్య సమస్యలు ఇవీ.. రామవరప్పాడు, కరెన్సీనగర్కు మధ్య ఉన్న డ్రెయిన్ చిన్నసైజు కాలువలా తయారైంది. దీంతో ప్రజలకు ఏళ్ల తరబడి ఇక్కట్లు తప్పడం లేదు. ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. వర్షాకాలంలో మోటారు బోర్ల సహాయంతో మురుగునీటిని తోడాల్సిన దుస్థితి నెలొంది. జాతీయ రహదారి వెంబడి నిడమానూరు, రామానగర్ డ్రెయిన్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. గూడవల్లిలోనూ ఇదే పరిస్థితి. రింగ్రోడ్డుకు అనుసంధానంగా ఉన్న సాల్వెంట్ రోడ్డు దారుణంగా ఉందని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. పోరంకి రోడ్డులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్ మరుగుదొడ్డి నీరు, భోజనశాల వ్యర్థాలను పంట కాలువలో కలిపేస్తున్నారు. ఓ కార్పొరేట్ విద్యాసంస్థ నిర్వాహకులు నిడమానూరు పంచాయతీ స్థలంలో తూములు ఏర్పాటుచేసి బుడమేరు కాలువలో వ్యర్థాలు కలుపుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు అయ్యాయి. -
చిట్టితల్లి లేదిక..
అనంతపురం క్రైం : మొన్నటి వరకు తల్లి ఒడిలో హాయిగా నిద్రించింది.. తండ్రి భుజాలపై కూర్చుని సంతోషంగా గడిపింది. చుట్టుపక్కల చిట్టిపొట్టి చిన్నారులతో కలిసి అల్లరి చేసింది. అలాంటి చైత్ర ఆడుకుంటూ వెళ్లి కన్పించకుండాపోయింది. చిట్టితల్లి కోసం రెండ్రోజుల పాటు ఆ తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. కన్పించిన వారినంతా ‘మా లవ్లీ కన్పించిందా’ అంటూ అడిగారు. ఎవరూ జాడచెప్పలేకపోయారు. మంగళవారం ఉదయాన్నే గుండెలు పిండేసే విషాదం.. కన్పించకుండా పోయిన చైత్ర మురుగు కాలువలో మృతదేహంగా కన్పించడం చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఖాజానగర్కు చెందిన సీహెచ్ శ్యాంసుందర్, సరళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. శ్యాంసుందర్ ‘హీరో’ షోరూంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చైత్ర అలియాస్ లవ్ లీ (2) ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండాపోయింది. పాప కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో.. కాలనీలో వెతికినా ఫలితం లేకపోయింది. రెండ్రోజులైనా పాప జాడలేకపోయింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత చైత్ర వేసుకున్న డ్రస్సు కన్పించడంతో దగ్గరికెళ్లి చూశారు. చిన్నారి వృతదేహం కన్పించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి వరకు వచ్చీరాని మాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. వృతి చెంది రెండ్రోజులు కావస్తుండడంతో పాప శరీరమంతా ఉబ్బిపోయింది. సమాచారం అందుకున్న మేయర్ మదమంచి స్వరూప, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, వన్టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత కోగటం విజయభాస్కర్రెడ్డి, గోవిందరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిని ఓదార్చారు. వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలువను శుభ్రం చేసే నాథులే లేరు.. నగరమంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చైత్రను మింగేసిన మురుగు కాలువను చూస్తే ఏ మేరకు నగర అభివృద్ధి జరుగుతోందో అర్థమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసం, విద్యా సంస్థల మధ్యనే ఈ కాలువ ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయించే నాథుడే కరువయ్యారు. ఇదే విషయంపై మేయర్, కమిషనరును మంగళవారం స్థానికులు నిలదీశారు. ‘మీఇళ్ల వద్ద ఇలాగే ఉంటే భరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అరగంట పాటు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది పడతారని, అలాంటిది తాము 24 గంటలూ ఎలా కాపురం చేస్తున్నామో ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మురుగు కాలువను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో భారీవర్షం
పొంగుతున్న డ్రెయిన్లు వందలాది ఎకరాలు మునక పొంగి ప్రవహిస్తున్న మున్నేరు, వైరా, కట్టలేరు నందిగామ, వీరులపాడు మధ్య నిలిచిన రాకపోకలు జిల్లాలో 15.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు మచిలీపట్నం : జిల్లా వ్యాప్తంగా శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మచిలీపట్నం, చల్లపల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా వైరా, మున్నేరు, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాములూరు కూడలి వద్ద వైరా నది పొంగి ప్రవహిస్తుండటంతో నందిగామ-వీరులపాడు-ఖమ్మం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనాసాగరం వద్ద మరుగమ్మవాగు ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహంలోనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి వద్ద ఏనుగుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పొంగి ప్రవహిస్తున్న డ్రెయిన్లు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సముద్రతీరంలోని పంట పొలాల్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వేసవి నుంచి ప్రధాన డ్రెయిన్లలో పూడిక తీయలేదు. గుర్రపుడెక్క, నాచు, తూడులను తొలగించలేదు. డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా పనులు చేసేందుకు ఈ ఏడాది రూ.3.54 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కాంట్రాక్టర్లు పనులే ప్రారంభించకపోవటంతో ఆ ప్రభావం రైతుల పైనా పడుతోంది. గూడూరు, పెడన, బంటుమిల్లి మండలాల పరిధిలోని 65 వేల ఎకరాల ఆయకట్టులోని మురుగునీటిని సముద్రంలో కలిపే లజ్జబండ డ్రెయిన్కు కనీస మరమ్మతులు చేయలేదు. గూడూరు మండలంలోని శారదాయిపేట తదితర ప్రాంతాల్లో లజ్జబండ డ్రెయిన్లో గుర్రపుడెక్క మేట వేసుకుపోయింది. ఇటీవల పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గూడూరు మండలంలో పర్యటించిన సమయంలో లజ్జబండ డ్రెయిన్లో గుర్రపుడెక్క, నాచు, తూడులను తొలగించటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కాంట్రాక్టర్ లజ్జబండ డ్రెయిన్ ప్రారంభమయ్యే గూడూరు పీహెచ్సీ నుంచి 250 మీటర్లు మాత్రమే పనిచేసి నిలిపివేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లోకి భారీగా వర్షపునీరు చేరింది. నీటి ప్రవాహానికి గుర్రపుడెక్క అడ్డుగా ఉండటంతో నీరు దిగువకు వెళ్లక మండలంలోని జక్కంచర్ల, తరకటూరు, ముక్కొల్లు, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, శారదాయిపేట తదితర ప్రాంతాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. ఆదివారం నాటికి వర్షపునీటి ప్రభావం మరింత పెరుగుతుందని, వర్షాలు కురిస్తే ఎక్కువ రోజులు నీటిలో ఉండి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పైరు పిలకలు తొడిగే దశలో ఉందని, ఈ దశలో పైరు నీటమునిగితే మొక్కలు చనిపోతాయని రైతులు చెబుతున్నారు. పెడన మండలంలోని వడ్లమన్నాడు డ్రెయిన్, కంచడం డ్రెయిన్, ఇసుకపర్ర డ్రెయిన్ పొంగి ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని దక్షిణ తెలుగుపాలెం తదితర గ్రామాల్లో ఇటీవల వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో మోకాలులోతున నీరు నిల్వ ఉంది. గతంలో చేపల చెరువులు అధికంగా తవ్వటంతో వర్షపునీరు బయటకు వెళ్లడానికి ఆస్కారం లేకుండాపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో.. బంటుమిల్లి మండలంలో పెదతుమ్మిడి, పెందుర్రు, కొమాళ్లపూడి, ఆముదాలపల్లి డ్రెయిన్లు ఉన్నాయి. ఈ డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూసేందుకు పనులకు సంబంధించి టెండర్లు పిలిచి కాంట్రాక్టుదారులకు పనులు అప్పగించినా, ఇంత వరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లలో నిల్వ ఉన్న గుర్రపుడెక్క, తూడు, నాచు, జమ్ము, కిక్కిస నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి. ఈ డ్రెయిన్లలో ముందస్తుగానే పనులు చేసి ఉంటే ప్రస్తుతం తమ పొలాలు నీట మునిగేవి కావని రైతులు చెబుతున్నారు. కృత్తివెన్ను మండలంలో యండపల్లి, లక్ష్మీపురం, కృత్తివెన్ను డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవటంతో కొద్దిపాటి వర్షానికే పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరుకుమిల్లి, పెందుర్రు, మునిపెడ, వాలంక, పీతలావ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల వరి పైరు నీటమునిగింది. చల్లపల్లి మండలంలో గుండేరు, జీలగలగండి, చిల్లలవాగు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లక్ష్మీపురం, రామానగరం తదితర ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు నీటమునిగాయి అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, వాయుగుండం ఏర్పడి రోజుల తరబడి భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు సముద్రం మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 15.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా విస్సన్నపేటలో 84.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాట్రాయి-81.6 మిల్లీమీటర్లు, తిరువూరు-70.2, మచిలీపట్నం-47.6, ముసునూరు-35.2, పెడన-31.2, గూడూరు-23.0, నూజివీడు-24.2, వత్సవాయి-22.4, గుడ్లవల్లేరు-21.6, పెనుగంచిప్రోలు-19.8, విజయవాడ రూరల్, అర్బన్-17.0 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. బాపులపాడు-16.4, వీరులపాడు-16.2, పెదపారుపూడి-16.2, రెడ్డిగూడెం-15.8, మండవల్లి- 12.4, జగ్గయ్యపేట-11.8, ఉయ్యూరు-11.8, పెనమలూరు-8.8, ముదినేపల్లి-8.6, కృత్తివెన్ను-8.2, పామర్రు-8.6, చందర్లపాడు-7.6, గుడివాడ-7.4, మోపిదేవి-6.8, కలిదిండి-6.4, కంచికచర్ల-5.8, కైకలూరు-5.4, అవనిగడ్డ-5.2, మైలవరం-4.4, ఉంగుటూరు-4.2, నందివాడ-3.8, ఆగిరిపల్లి-3.4, బంటుమిల్లి-2.4, జి.కొండూరు-2.2, నాగాయలం-1.8, నందిగామ-1.2 మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. -
కావలి కాలువపై సోలార్ ప్లాంట్ ?
సాక్షి, నెల్లూరు: సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అనువైన ప్రాంతాల అన్వేషణలో ప్రభుత్వం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండే రాయలసీమతో పాటు ఇరిగేషన్ ఆధారిత ప్రాంతాల్లో సైతం గుజరాత్ తరహాలో సాగునీటి కాలువలపై ప్లాంట్లు ఏర్పాటు చేసే యోచనలో సర్కారు ఉంది. అందులో భాగంగా జిల్లాలోని కావలి కాలువపై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ఏపీ జెన్కో, ఎన్టీపీసీ, నెడ్క్యాప్లు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, గుంటూరు తదితర జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన కాలువలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సైతం అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. కావలి కాలువ సోలార్ ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని అధికారులు గుర్తించినట్లు సమాచారం. సంగం ఆనకట్ట వద్ద నుంచి దగదర్తి, బోగోలు, కావలి టౌన్, కావలి రూరల్ ప్రాంతాల మీదుగా ప్రకాశం జిల్లా సరిహద్దు వరకు 68 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంది. ఇప్పటికే కాలువను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఈ బాధ్యతను నీటిపారుదల ఈఈకి అప్పగించారు. కావలి కాలువతో పాటు సోమశిల -కండలేరు, తెలుగుగంగ కాలువ లను అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
పంట పొలాలు మునుగుతున్నా పట్టించుకోరా?
తాళ్లపాలెం డ్రెయిన్పై క్రాస్బండ్కు గండి ఇప్పటికే నిండా మునిగిన రైతులు పాలకులకు చెప్పినా పట్టించుకోని వైనం రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం : మురుగునీటి పారుదలకు అడ్డంకిగా మారిన తాళ్లపాలెం డ్రెయిన్పై ఉన్న క్రాస్బండ్కు సోమవారం రైతులు గండి కొట్టారు. బందరు మండలంలోని బోట్లవానిపాలెం, పల్లెతాళ్లపాలెం మధ్య ఏడు నెలల క్రితం తాళ్లపాలెం డ్రెయిన్పై వంతెన నిర్మాణం ప్రారంభించారు. అప్పట్లోనే ఈ వంతెన నిర్మాణం కోసం డ్రెయిన్కు క్రాస్బండ్ నిర్మించారు. ఏడు నెలలుగా కేవలం పునాదుల పనులు మాత్రమే పూర్తిచేశారు. నెల రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో పొట్లపాలెం, చిరివెళ్లపాలెం, గోకవరం, బొర్రపోతుపాలెం, పిళ్లారిశెట్టిపాలెం, పిల్లనగొల్లపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. వర్షపునీరు దిగువకు చేరడానికి వీలు లేకుండా ఉండటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు నీటమునిగి చనిపోయాయి. మంత్రికి చెప్పినా ఫలితం లేదు.. పల్లెతాళ్లపాలెం, తాళ్లపాలెం, చిరివెళ్లపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఒకటికి రెండుసార్లు మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు వెళ్లి తాళ్లపాలెం డ్రెయిన్పై క్రాస్బండ్ అడ్డుగా ఉండటంతో తమ పొలాల్లోని పైర్లు నీటమునిగి చనిపోతున్నాయని విన్నవించారు. ఆదివారం జెడ్పీ సమావేశానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలిసి మరోసారి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. క్రాస్బండ్ తొలగిస్తామని చెప్పటమే తప్ప ఎలాంటి పనులు చేయలేదు. దీంతో రైతులు విషయాన్ని వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) దృష్టికి తీసుకువెళ్లారు. కాంట్రాక్టర్కు సర్దిచెప్పినా ససేమీరా.. సోమవారం ఉదయం తాళ్లపాలెం డ్రెయిన్పై వంతెన నిర్మిస్తున్న ప్రాంతం వద్దకు నాని, రైతులు వెళ్లారు. క్రాస్బండ్ తొలగించాలని కాంట్రాక్టర్తో సంప్రదింపులు జరిపారు. అయితే 15 రోజుల వరకు క్రాస్బండ్ తొలగించే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్ చెప్పటంతో రైతులకు, కాంట్రాక్టర్లకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వేలాది ఎకరాల్లో మురుగునీరు నిలిచిపోయి పైరు చనిపోతోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న క్రాస్బండ్ను తొలగించాలని పేర్ని నాని కాంట్రాక్టర్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్ తాను క్రాస్బండ్ను తొలగించేది లేదని చెప్పటంతో పొక్లెయిన్ను తీసుకువచ్చి క్రాస్బండ్కు మధ్యలో గండికొట్టారు. పొక్లెయిన్కు మట్టి తవ్వటం సాధ్యపడకపోవటంతో పేర్ని నానితో పాటు రైతులు స్వయంగా గండిలోకి దిగి పారలతో మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తాళ్లపాలెం డ్రెయిన్ ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశామని తెలిపారు. నీరు ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండిపోవటంతో మొదటి సారి వేసిన పైరు దెబ్బతిందని, మళ్లీ నాట్లు పూర్తి చేశామని, రెండోసారి కూడా పొలాల్లోని పైరు చనిపోయేందుకు సిద్ధంగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు పొలాలను ముంచెత్తటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పరిహారం ఇప్పించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. వెఎస్సార్ సీపీ నేత బొర్రా విఠల్, తాళ్లపాలెం సర్పంచి రవిశంకర్, సిరివెళ్లపాలెం మాజీ సర్పంచి బలరాం పాల్గొన్నారు. -
బందరు అభివృద్ధికి సమష్టి కృషి : మంత్రి కొల్లు
మచిలీపట్నం టౌన్ : బందరు ప్రాంత అభివృద్ధికి సమష్టిగా పని చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యాన ఆదివారం ఆలయ ప్రాంగణంలో మంత్రి, మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు సూర్యనారాయణ, శ్రీరాములు అమ్మవారి సమక్షంలో వీరికి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ బందరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బందరు అభివృద్ధికి సహకరించే పోర్టు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని నియోజకవర్గ సమీక్షలో ప్రతిసారి చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. అలాగే కోస్తాతీరంలో నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు వినతి పంపారన్నారు. బందరు పట్టణంలో తాగునీటి వసతి, డ్రెయిన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనపై నియోజకవర్గ ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించారని, అలాగే చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వడం, మునిసిపాలిటీ, మండల పరిషత్లను ప్రజలు తమ పార్టీకే అప్పగించడంతో తన బాధ్యతను మరింత ఎక్కువ చేశారన్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తానని రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మారుతీదివాకర్, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, బూరగడ్డ రమేష్నాయుడు, గొర్రెపాటి గోపీచంద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు సామ కాంతారావు, సహాయ కార్యదర్శి బైసాని హయగ్రీవరావు, కోశాధికారి ఉడత్తు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య ప్రముఖులు గుడివాడ రామచంద్రరావు, తాడేపల్లి మెహర్బాబా,జంగాల హరనాథ్బాబు, బెల్ ఏజీఎం డీ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి కొల్లు, మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కౌన్సిలర్లను ఆలయ మర్యాదలతో పూర్ణకుంభాలతో వేద పండితులు స్వాగతం పలికారు. -
భీమవరం రాయలం డ్రెయిన్లో పడి ఏడేళ్ల బాలుడి మృతి
భీమవరం క్రైం, న్యూస్లైన్ : భీమవరంలో ఇటీవల నిర్మించిన రాయలం క్లోజ్డ్ డ్రెయిన్ ఏడేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. డ్రెయిన్ నిర్మించినా మెస్ ఏర్పాటు చేయకపోవడంతో అందులో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అడ్డవంతెన సమీపంలోని రామ్నగర్లో నివాసముంటున్న పొత్తూరి సుబ్బరాజు, ప్రభావతిల కుమారుడు హేమంత్ వర్మ (7) స్థానిక రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాయలం రోడ్డులో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. మరో ఇద్దరు పిల్లలతో కలిసి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సమీపంలోని పంట కాలువ, రాయలం క్లోజ్డ్ డ్రెయిన్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పంట కాలువ గట్టు దాటుతుండగా ప్రమాదవశాత్తు క్లోజ్డ్ డ్రెయిన్లో పడి గల్లంతయ్యాడు. హేమంత్ వర్మ డ్రెయిన్లో పడిపోవడాన్ని చూసిన స్థానిక మహిళలు కేకలు వేయడంతో అటువైపు వెళ్లే వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. అయితే డ్రెయిన్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో దిగే సాహసం చేయలేకపోయారు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్సై విష్ణు, ఏఎస్సై ఖాన్, అగ్నిమాపక అధికారులు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని డ్రెయిన్ చివర వలలు ఏర్పాటు చేశారు. విషయం తెలిసినా సాగునీటి శాఖ అధికారులు మాత్రం రాలేదు. డ్రెయిన్ నిర్మించిన కాంట్రాక్టర్ అక్కడకు వచ్చి ఎక్కడ మేన్హోల్స్ ఉన్నాయో చెప్పారు. స్థానికులు మేన్హోల్ ఇనుప చువ్వలను కట్ చేసి డ్రెయిన్లోపలకు వెళ్లి గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు లభ్యమయ్యాడు. పైకి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదకరంగా డ్రెయిన్ సుమారు రూ.6 కోట్లతో ఇటీవలే రాయలం క్లోజ్డ్ డ్రెయిన్ను నిర్మించారు. డ్రెయిన్ ప్రారంభంలో ఎటువంటి మెస్ ఏర్పాటు చేయకుండా దానిని అలాగే వదిలేశారు. పక్కనే పంట కాలువ ఉండడంతో ప్రమాదకరంగా మారింది. ఇరిగేషన్ అధికారులు స్పందించి డ్రెయిన్ ప్రారంభంలో మెస్ ఏర్పాటు చేయడం లేదా పూర్తిగా మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పుట్టినరోజునే తిరిగిరాని లోకాలకు.. అప్పటి వరకు కళ్లెదుటే తిరిగిన తమ గారాల కుమారుడు డ్రెయిన్లో పడి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లారు. వారి రోదనలు చూపరులను కన్నీరుపెట్టించాయి. హేమంత్వర్మది ఆదివారమే పుట్టిన రోజు. బర్త్డే జరుపుకుని బంధువుల ఇంటికి వచ్చినట్లు బాలుడి కుటుంబికులు తెలిపారు. -
కలకలం రేపిన కారు
ఏలూరు క్రైం, న్యూస్లైన్ : గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన కారు ఏలూరులో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. ఏపీ 16ఎం 4869 నంబర్ గల మారుతీ 800 కారును గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది రోజుల క్రితం స్థానిక ఐఏడీపీ హాల్ సమీపంలో పార్క్ చేశారు. శనివారం ఉదయం ఆ కారు ఉన్న ప్రదేశం నుంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు కారులో మృతదేహం ఉందేమోనని అనుమానించారు. ఈ వార్త నగరంలో గుప్పుమనడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. త్రీటౌన్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలన చేశారు. కారులో ఏమీ కనిపించకపోవడంతో పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని డీఈవో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద గాలించి డ్రెయిన్లో కుక్క మృతదేహాన్ని గుర్తించారు. బాగా కుళ్లిపోవడంతో అక్కడి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ధ్రువీకరించారు. పార్కు చేసిన కారు ఎవరిదనే విషయం తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.