Drug Peddler
-
ఫిల్మ్ నగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఫిలింనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ ఫిలింనగర్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్తో పాటు ఓ కొనుగోలుదారును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్పేటలోని ఫాల్కన్ కాలనీలో నివసించే ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ కారు డీలర్గా పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మహ్మద్ రెహమాన్ అలీ న్యూ ఇయర్ వేడుకలకు అవసరమైన వారికి డ్రగ్స్ విక్రయించేందుకు ముంబై నుంచి ఇటీవలే ఎండీఎంఏ డ్రగ్స్ను నగరానికి తీసుకువచ్చాడు. ఇర్ఫాన్తో కలిసి నాలుగు రోజుల పాటు డ్రగ్స్ విక్రయించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఫిలింనగర్లోని కొత్త చెరువు వద్దకు రెహమాన్ అలీ చేరుకుని మరో పెడ్లర్ ఇర్ఫాన్ను అక్కడికి పిలిపించాడు. అవసరమైన వారికి సరుకును విక్రయించే క్రమంలో బహదూర్పురాకు చెందిన సయ్యద్ హజ్మతుల్లాను పిలిపించారు. కొత్త చెరువు వద్ద వీరిద్దరూ కలిసి హజ్మతుల్లాకు డ్రగ్స్ ఇచ్చే క్రమంలో అప్పటికే సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రెహమాన్ అలీ ఇటీవలే డ్రగ్స్ను ముంబై నుంచి తీసుకు వచ్చినట్లుగా తేల్చారు. ఇర్ఫాన్తో కలిసి డ్రగ్స్ను విక్రయించాలని పథకం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేయడానికి వచి్చన హజ్మతుల్లాతో పాటు వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు అడిగితే డ్రగ్ పెడ్లర్గా మార్చాడు!
సాక్షి, సిటీబ్యూరో: తనను అప్పు అడిగిన చిన్ననాటి స్నేహితుడిని డ్రగ్ పెడ్లర్గా మార్చాడో వ్యక్తి. ముంబైలో ఉండే సప్లయర్స్ను కూడా పరిచయం చేశాడు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యం అమ్మి దండిగా సంపాదించ వచ్చని ప్రేరేపించాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఓ నిందితుడిని పట్టుకుని 13.9 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్ స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహ్మద్ హనీఫ్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై క్యాబ్ డ్రైవర్గా మారి 2016లో బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూడేళ్ల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన అతను తన స్వస్థలంలోనే ఉంటున్నాడు. నెలకు రూ.16 వేల జీతానికి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న హనీఫ్కు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత మొత్తం అప్పు కావాలంటూ తన చిన్ననాటి స్నేహితుడు చాంద్ పీర్ను కోరాడు. ఆరి్థకంగా బలపడాలంటే డ్రగ్స్ దందా చేయాలని, ముంబై నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ ఖరీదు చేసి తీసుకువచ్చి హైదరాబాద్లో ఎక్కువ ధరకు అమ్మితే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్కు మంచి డిమాండ్ ఉంటుందనీ సలహా ఇచ్చాడు. అందుకు హనీఫ్ అంగీకరించడంతో ముంబైకి చెందిన డ్రగ్స్ సప్లయర్స్ విక్కీ, రోహిత్లను పరిచయం చేశాడు. దీంతో వారి వద్దకు వెళ్లిన హనీఫ్ 13.9 గ్రాములు ఎండీఎంఏ ఖరీదు చేశాడు. దానిని తీసుకుని నేరుగా నగరానికి వచి్చన అతను కస్టమర్ల కోసం కార్ఖానాలోని దోభీఘాట్ వద్ద వేచి ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో తూర్పు మండల టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి, పి.నాగరాజు తన బృందంతో దాడి చేసి హనీఫ్ను పట్టుకుని డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా అధికారులకు అప్పగించి పరారీలో ఉన్న చాంద్ పీర్ కోసం గాలిస్తున్నారు. -
మస్తాన్ సాయి అరెస్ట్తో కదులుతున్న డ్రగ్స్ డొంక
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి కేసులో సంచనల విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి అరెస్ట్తో డ్రగ్స్ డొంక కదులుతోంది. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. తాజాగా మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం బయటకొచ్చింది. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయితో మస్తాన్సాయి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోగా.. డ్రగ్స్ కవాలి, తీసుకురావలిన వాట్పాప్లో ప్రీతి చాటింగ్ చేసినట్లు వెల్లడైంది.కాగా గుంటూరులో సోమవారం రావి మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతడికి హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి సెల్ ఫోన్లో భారీగా పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేయగా..వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలోనూ మస్తాన్సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్సాయి పేరు వెలుగులోకి వచ్చింది. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
రాడిసన్ డ్రగ్స్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో విక్రయిస్తున్నారు. హైదరబాద్లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరబాద్తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్పేట్, చాదర్ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్ను పిటీ వారింట్పై హైదరాబాద్కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్ వెల్లడించారు. -
పోలీస్ కస్టడీకి గోవా డ్రగ్ పెడ్లర్ స్టాన్లీ
-
హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
-
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల నడుమ.. ఈసీ ఆదేశాలతో డీజీపీగా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన పూర్తిస్థాయిలో కొనసాగించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాదకద్రవ్యాల విషయమై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారాయన. Govt. of Telangana resolved to make Telangana, a drug-free State. Let’s all unite to drive away the drugs from the territory of our State. All drug peddlers and consumers are hereby warned in this regard. Stringent legal action would be initiated against the violators. Let’s… — DGP TELANGANA POLICE (@TelanganaDGP) December 20, 2023 -
డ్రగ్ పెడ్లర్గా మారిన భగ్న ప్రేమికుడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడి సలహా మేరకు డ్రగ్ పెడ్లర్గా మారి హైదరాబాద్తో పాటు నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేయడం మొదలెట్టాడు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్–నాబ్) అతనితో సహా 14 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి 42 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకుంది. చేస్తున్న ఉద్యోగాలు మానేసి.. నెల్లూరులోని ఫతేఖాన్పేటకు చెందిన జె.ఆషిక్ యాదవ్ గతంలో బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్న రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి కూడా ఉన్నత చదువుల కోసం అక్కడికే రావడంతో ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే ఇద్దరి మధ్యా వివాదాలు ఏర్పడటంతో ఆమె ఆషిక్కు దూరమైంది. దీంతో తీవ్ర డిప్రెషన్కు గురైన ఆషిక్ మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. బెంగళూరు, గోవాలకు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసి వినియోగించే వాడు. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్కు వచ్చిన ఆషిక్ నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో నెలకు రూ.22 వేల జీతం వస్తున్నా సరిపోకపోవడంతో గత జూన్లో ఆ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. మనమే ఆ దందా చేద్దామంటూ.. ఈ క్రమంలో నెల్లూరుకే చెందిన ఇతని క్లాస్మేట్ రాజేష్ వ్యాపార నిమిత్తం ఆగస్టులో హైదరాబాద్ వచ్చాడు. డ్రగ్స్ వినియోగించే అలవాటు ఉన్న ఇతడు ఆషిక్ నుంచి వాటిని తీసుకునే వాడు. నగరంలో మాదకద్రవ్యాలకు ఉన్న డిమాండ్ గుర్తించిన రాజేష్ తామే ఆ దందా చేద్దామని, మార్కెట్లో ఎక్స్టసీ పిల్స్కు మంచి డిమాండ్ ఉందని, వాటినే తీసుకువచ్చి విక్రయిద్దామని చెప్పాడు. దీంతో గోవాకు చెందిన తన స్నేహితుడు బాబాతో పాటు బెంగళూరుకు చెందిన సాయి చరంద్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తున్న ఆషిక్ వాటిని నగరానికి తీసుకువచ్చి రాజేష్కు అప్పగిస్తున్నాడు. ఇతడు నగరంతో పాటు నెల్లూరులోని తన స్నేహితులు, రెగ్యులర్ కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నాడు. అక్కడ ఒక్కో ఎక్స్టసీ పిల్ను రూ.1000కి ఖరీదు చేసి... ఇక్కడ రూ.3 వేలకు అమ్ముతు న్నారు. గత మంగళవారం గోవా వెళ్లిన ఆషిక్ అక్కడ బాబాకు రూ.60 వేలు చెల్లించి 60 ఎక్స్టసీ పిల్స్ ఖరీదు చేసుకువచ్చాడు. వీటిని తన వద్ద ఉంచుకున్న రాజేష్... శనివారం రెండు పిల్స్ను ఆషిక్కు ఇచ్చి తమ కస్టమర్లకు అందించమని చెప్పాడు. ఇతడి కదలికలపై టీఎస్–నాబ్కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శనివారం ఉదయం అమీర్పేటలోని మైత్రీవనం వద్ద ఆషిక్ను పట్టుకుని రెండు పిల్స్ స్వాధీనం చేసుకుంది. అతడిచ్చిన సమాచారంతో సోమ వారం ఎస్ఆర్ నగర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ పై దాడి చేసింది. అక్కడ రాజేష్తో పాటు 12 మంది చిక్కారు. వీరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి మరో 40 పిల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. డ్రగ్స్తో అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో రేవ్ పార్టీలు డ్రగ్స్ ఖరీదు చేసిన కొందరు గతంలో అమీర్పేట, ఎస్సార్నగర్ల్లోని సర్వీస్ అపార్ట్మెంట్స్లో రేవ్ పార్టీలు చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఓ బర్త్డే పార్టీతో పాటు న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు వీరి నుంచి ఈ పిల్స్ ఖరీదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. టీఎస్–నాబ్ అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్సార్నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆషిక్, రాజేష్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించిన పోలీసులు రెగ్యులర్గా డ్రగ్స్ ఖరీదు చేసే 33 మందిని గుర్తించారు. వీరి వద్ద ఈ డ్రగ్ కొనుగోలు చేస్తున్న వారిలో నెల్లూరుకు చెందిన సంపత్, నిహార్, మోహిత్, అశోక్, అమిత్, జై, వసీమ్, ఫయాజ్, శ్రీరామ్, గౌతమ్, గిరిధర్, హనీష్, వేలాసరి, డాక్టర్ పునీత్, డాక్టర్ అరుణ్ మత్, డాక్టర్ ప్రశాంత్, నగరానికి చెందిన శ్రీరామ్, హృతిక్ ఉన్నారు. వీరిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా మిగిలిన వాళ్లు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు డాక్టర్లు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
కారు బోనెట్ మీద మహిళ... అలాగే తీసుకెళ్లిన పోలీసులు..
భోపాల్: మధ్యప్రదేశ్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న నెపంతో అరెస్టైన యువకుడిని విడిచి పెట్టమంటూ ఓ తల్లి పోలీసు కారు బోనెట్ ఎక్కి కూర్చుంది. దీంతో పోలీసులు ఆమెను అలా బోనెట్ పైన కూర్చుండగానే అమానుషంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లారు. స్థానికుల్లో ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్, నర్సింగ్ పూర్లో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అనిల్ అజ్మేరియా, సంజయ్ సూర్యవంశీ అనే ఇద్దరు ఎస్సైలు నీరజ్ డెహరియా అనే కానిస్టేబుల్ తో కలిసి అక్కడి వెళ్లారు. అక్కడ సోను కహార్ అనే యువకుడి ఇంటిని సోదా చేయగా రూ. 3 లక్షలు విలువ చేసే 20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సోను కహర్ ను పోలీసు కస్టడీకి తరలించే క్రమంలో కారు ఎక్కించగానే అతడి తల్లి మోహిని కహార్ వచ్చి వారికి అడ్డుపడింది. తన బిడ్డను విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళమీద పడి ప్రాధేయపడింది. అయినా కూడా వారు కనికరించకపోవడంతో పోలీసు వాహనం బోనెట్ ఎక్కి కూర్చుని బ్రతిమాలింది. అంతలో చుట్టూ జనం గుమికూడటంతో కారుని అలాగే పోలీసు స్టేషన్ కు పోనిచ్చారు పోలీసులు. అక్కడున్న వారిలో ఎవరో ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. వెంటనే ఆ ఇద్దరు ఎస్సైలను, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. #MadhyaPradesh के #Narsinghpur जिले से रोंगटे खड़े करने वाला वीडियो सामने आया है.वायरल वीडियो में एक प्राइवेट नम्बर की चलती कार में लटकी महिला को थाने में ले जाते देखा जा सकता है.तीन पुलिस वाले सस्पेंड कर दिए गए है.@abplive @drnarottammisra @DGP_MP @brajeshabpnews pic.twitter.com/ltVroZuigX — AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) July 5, 2023 -
17కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్వాడి: వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 17కిలోల గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు బైక్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. నగరంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం అడవిమామిడిపల్లి వద్ద గంజాయిని తరలిస్తున్న ని స్సార్ నుంచి 15.225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయితోపాటు బైక్ను, నిస్సార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్లోని జిరాయిత్నగర్లో సోదాలు నిర్వహించగా అక్బర్ అనే వ్యక్తి నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి నిజామాబాద్కు బస్సులో గంజాయిని తరలించినట్లు విచారణలో తేలిందన్నారు. బస్సులలో తీసుకువచ్చిన గంజాయిని స్థానికంగా అమ్ముతారని తెలిపారు. జిల్లాలో గంజాయి అమ్మకాలు సాగిస్తే వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందించాలని, వారి వి వరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు. సీఐలు స్వప్న, వేణుమాధవరావు, ఎస్సై రాంకుమార్, హెడ్కానిస్టేబుల్ శివప్రసాద్, రాజన్న, కానిస్టేబుళ్లు ఉత్తమ్, రాంబచన్, శివ, విష్ణు, భోజన్న, హమీద్, గంగారాం, మంజుల, సుకన్య, అవినాష్ పాల్గొన్నారు. -
హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా? బంగారాన్ని మించిన ధర
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్రాము బంగారం రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి సిటీకి సరఫరా అవుతున్న హైగ్రేడ్ ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు ఎంతో తెలుసా..? ఏకంగా గ్రాము రూ.10 వేలు. వ్యవస్థీకృతంగా ఈ డ్రగ్ నెట్వర్క్ నడిపిస్తున్న అంతరాష్ట్ర సరఫరాదారుడిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. ఇతడికి హోల్సేల్గా విక్రయిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ముంబైలోని అంథేరీ వెస్ట్ ప్రాంతంలో నివసించే మిరాజ్ కాజీ అక్కడి పబ్స్కు వెళ్లే క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. తానూ ఇదే దందా చేయాలని నిర్ణయించుకుని ఆ నగరంలో ఉన్న డ్రగ్ సప్లయర్ సూరజ్ గోస్వామితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతడి నుంచి హోల్సేల్గా కొంటూ ముంబైతో పాటు హైదరాబాద్లో ఉన్న అనేక మంది వినియోగదారులకు రిటైల్గా అమ్ముతున్నాడు. హైక్వాలిటీ ఎండీఎంఏ డ్రగ్ను గ్రాము రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి అందించడం కోసం 40 గ్రాముల ఎండీఎంఏ తీసుకున్న మిరాజ్ ఇక్కడకు చేరుకున్నాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్రెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు తన బృందంతో నిఘా ఉంచారు. చార్మినార్ ప్రాంతంలో మిరాజ్ ఉన్నాడన్న సమాచారం అందుకుని వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గోస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతడి నుంచి ఈ మాదకద్రవ్యాన్ని సిటీలో ఎవరెవరు ఖరీదు చేస్తున్నారు? వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వా«దీనం చేసుకున్న డ్రగ్ను చార్మినార్ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పు.. రూ. 50 వేలు ముంబైలోని మూతపడిన కర్మాగారాల్లో తయారవుతున్న ఎండీఎంఏ డ్రగ్ దేశ వ్యాప్తంగా అనేక మెట్రో నగరాలకు సరఫరా అవుతోంది. దీనికోసం ప్రత్యేకంగా నెట్వర్క్ పని చేస్తోంది. ఈ డ్రగ్ను తరలించే క్యారియర్లను ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేల చొప్పున సరఫరాదారులు చెల్లిస్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందిదని కొత్వాల్ సీవీ ఆనంద్ అన్నారు. ఏఓబీ టు ముంబై సింథటిక్ డ్రగ్స్ ముంబై నుంచి నగరంతో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి సరఫరా అవుతోంది. ఈ దందా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు ఈస్ట్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన భార్యభర్తలు బిల్కిస్ మహ్మద్ సులేమాన్, అలీ సాగర్ సైఫుద్దీన్ రాంపుర్వాలా కొన్నేళ్లుగా గంజాయి దందాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఏడు, మరొకరిపై 15 కేసులు నమోదయ్యాయి. ఏఓబీలో గంజాయి పండించే శ్రీనివాస్ నుంచి గంజాయి ఖరీదు చేసే రకీబ్ అనే ముంబై వాసి అక్కడి విక్రయిస్తున్నాడు. బిక్విస్, సైఫుద్దీన్ తమకు పరిచయమైన జహీరాబాద్కు చెందిన ముర్తుజా షేక్ ద్వారా రకీబ్ను సంప్రదించారు. తమకు, గంజాయి పండించే వారికి మధ్య దళారిగా ఉండాలని కోరడంతో ఇతడు అంగీకరించాడు. శ్రీనివాస్ నుంచి ఖరీదు చేసిన 110 కేజీల గంజాయిని మంబై తరలించడానికి రకీబ్... అబ్దుల్ అనే వ్యక్తికి చెందిన కారు రూ.20 వేలకు అద్దెకు మాట్లాడుకున్నారు. ఈ సరుకు తీసుకురావడానికి అబ్దుల్ తన భార్య హసీనాతో కలిసి ఏఓబీకి వెళ్లాడు. శ్రీనివాస్ను కలిసి 110 కిలలో గంజాయి తీసుకొని కారు సీట్ కింద ప్యాకెట్ల రూపంలో దాచాడు. ముంబై వెళ్తూ ఇమ్లీబన్ దగ్గర ఆగి 20 కిలోలు జహీరాబాద్కు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ డి.సంతోష్ కుమార్కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేసి బిలి్కస్, సైఫుద్దీన్ , ముర్తుజా షేక్లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్గూడ జైలు నుంచి మోహిత్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్తో మోహిత్కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్పాండే భర్త అరెస్ట్ -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్గోపాల్పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
యాపిల్ బాక్సుల్లో చెరస్ డ్రగ్ రవాణా!.. ఇది చాలా రేటు గురూ
సాక్షి, హైదరాబాద్: గార్లిక్ బ్రెడ్–రూ.160, దోశ–రూ.250, ఫ్రూట్ సలాడ్–రూ.300, సీఫుడ్ సూప్–రూ.320.. ఎడ్విన్ కేసులో అరెస్టు అయిన డ్రగ్ పెడ్లర్ బాలమురుగన్కు చెందిన మోర్గన్స్ ప్లేస్ రెస్టారెంట్ మెనూ ఇది. అక్కడకు వెళ్లిన ఎవరైనా ఇంత రేటా..? అంటే.. అంతా విలువ ఉంటుందని చెప్తుంటారు నిర్వాహకులు. బాలమురుగన్ సరఫరా చేసే చెరస్ కూడా ఇలానే ఎక్కువ రేటు ఉంటుందని, ఎందుకంటే అతడి నుంచీ అదే సమాధానం వస్తుందని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెప్తున్నారు. దీనికి అతడి నుంచి వచ్చే సమాధానం వర్తీ స్టఫ్ సార్ అని. హిమాచల్ప్రదేశ్లోని మనాలీ పర్వత ప్రాంతాల్లో అది పండటమే కారణం. తదుపరి విచారణ నిమిత్తం బాలమురుగన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామ్గోపాల్ పేట పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తులాల లెక్కన విక్రయం... హోటళ్ల వ్యాపారం చేసే బాలమురుగన్కు రాజస్థాన్లోని కోట, బుండి, పుష్కర్లతో పాటు హిమాచల్ప్రదేశ్లోని ధరమ్కోట్, గోవాలోని అంజునా బీచ్ల్లో మోర్గన్స్ ప్లేస్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. అనునిత్యం రద్దీగా ఉండే వీటిలో నాణ్యమైన ఆహారం అందిస్తున్న నేపథ్యంలోనే రేటు సైతం ఎక్కువని మురుగన్ ప్రచారం చేసుకుంటాడు. అతడు సరఫరా చేసే చెరస్ విషయంలోనూ ఇదే సూత్రం అవలంబిస్తున్నాడు. మనాలీలో దొరికే గంజాయి ఆకులు, పుష్పాల నుంచి తీసే ఈ జిగురు లాంటి పదార్థాన్ని అతగాడు కేజీల్లో ఖరీదు చేస్తున్నాడు. దాన్ని గోవా సహా ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ తులాల లెక్కన అమ్ముతున్నాడు. ఒక్కో తులం పెడ్లర్లకు రూ.5 వేలకు అమ్ముతుండగా అది వినియోగదారుడి వద్దకు చేరేసరికి రూ.10 వేలు దాటుతోంది. యాపిల్ బాక్సులు ఆర్డర్ ఇస్తూ... తన హోటల్స్ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా బాలమురుగన్ అనునిత్యం గోవా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ల మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాడు. గతంలో మనాలీ నుంచి ఇతగాడే చెరస్ను రవాణా చేసేవాడు. కూరగాయల మధ్యలో కేజీ చొప్పున ప్యాక్ చేసిన చెరస్ పెట్టి తీసుకువచ్చేవాడు. అయితే గడిచిన రెండుమూడేళ్లుగా నిఘా పెరిగిపోయింది. దీంతో ఇతగాడు యాపిల్స్ మార్గం అనుసరిస్తున్నాడు. హిమాచల్ప్రదేశ్లోని హోల్సేల్ యాపిల్ వ్యాపారుల నుంచి తన హోటల్ కోసమంటూ 10, 15 బాక్సులు ఆర్డర్ ఇచ్చేవాడు. వాటిని ప్యాక్ చేసే వారిని మ్యానేజ్ చేయడం ద్వారా ఒక్కో దాంట్లో కేజీ చొప్పున చెరస్ ప్యాకెట్లు పెట్టించేవాడు. ఈ బాక్సులపై ప్రత్యేక గుర్తులు పెట్టి మిగిలిన వాటిలో కలిపేసేవాళ్లు. ఈ పార్శిల్స్ గోవా వచ్చిన తర్వాత తొలుత తనకే సమాచారం ఇచ్చేలా ట్రాన్స్పోర్టు వ్యాపారులనూ మేనేజ్ చేసేవాడు. అలా వారి వద్దకు వెళ్లి ప్రత్యేక గుర్తులతో ఉన్న బాక్సులు తీసుకువెళ్లేవాడు. తాము సహకరిస్తున్నది చెరస్ రవాణాకని అటు హిమాచల్, ఇటు గోవాలో ఉన్న వారికీ తెలిసేది కాదు. గోవా నుంచి ఇతర రాష్ట్రాల్లోని పెడ్లర్స్కు హోల్సేల్గా సరఫరా చేసేవాడు. మురుగన్కు మరికొందరు పెడ్లర్స్... ఏళ్లుగా చెరస్, కొకైన్ వ్యాపారం చేస్తున్న బాలమురుగన్కు నగరంలోనూ కొందరు పెడ్లర్స్ ఉంటారని పోలీసు విభాగం అనుమానిస్తోంది. వారి వివరాలు గుర్తించడానికి లోతుగా విచారించాలని నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో రామ్గోపాల్పేట పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. -
డ్రగ్ కేసు: గోవాలో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా దేశ్యావ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 15 రోజులుగా ఎడ్విన్ కోసం గోవాలో పోలీసులు గాలిస్తుండగా.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోజు రాత్రి వరకు అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. కాగా ఎడ్విన్ గోవా కర్లీస్ రెస్టారెంట్, పబ్ యజమాని. ఇక ఇదే కేసులో మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బోర్కర్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాదులో సరాఫరా చేస్తుంటాడు. ఇతను గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్నాడు. ఈ ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ను హెచ్–న్యూ ఆగస్టు 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్లకు బీజేపీ నేత, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అయితే నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గోవాలో పలువురుపై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఎడ్విన్ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా.. -
Hyderabad: గంజాయి సరాఫరా.. మహిళా డ్రగ్ పెడ్లర్లపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ ఆకాశ్ కుమార్ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్ నవాజుద్దీన్, వినాయక్, బానావత్ కిషన్, బానావత్ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి, చంచల్గూడ జైలుకు తరలించారు. -
పుణే కేంద్రంగా డ్రగ్స్ దందా
హిమాయత్నగర్: సోషల్ మీడియా వేదికగా సింథటిక్, ఎండీఎంఏ డ్రగ్ దందా చేస్తున్న పెడ్లర్లను హెచ్న్యూ టీం గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన 40 గ్రాముల సింథటిక్, 30 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం మాసబ్ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నైజీరియాకు చెందిన మహమద్ టొయిరూ బకారీ 2013లో ముంబైకి టూరిస్ట్ వీసాపై వచ్చాడు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ స్థానికుడైన అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయతో కలిసి పుణేలో డ్రగ్స్ రవాణా, సరఫరా చేస్తున్నాడు. వీరు కొకైన్ (సింథటిక్) అమ్ముతున్న విషయాన్ని అక్కడి నార్కోటిక్ బృందం పసిగట్టి 2019లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2020లో రిలీజైన ఈ ఇద్దరూ ముంబైకి చెందిన మరో వ్యక్తి అజయ్కుమార్ చౌపల్ను జతకలుపుకున్నారు. పుణే నుంచి వీరు సిటీకి సింథటిక్ డ్రగ్ను రవాణా చేస్తూ పంజగుట్ట పరిధిలో విక్రయిస్తున్నట్లు హెచ్న్యూ టీం గుర్తించి కొద్దిరోజుల క్రితం అపూర్వ మటప్రసాద్ ఉపాధ్యాయ, అజయ్కుమార్ చౌపల్లను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం మహమద్ టొయిరూ బకారీని అరెస్ట్ చేసి ఇతని వద్ద ఉన్న 40 గ్రాముల కొకైన్(సింథటిక్), 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో..యూపీలోని గయాస్పుర్కు చెందిన మహ్మద్ అలీంఖాన్ నగరానికి చెందిన కొందరి కాంటాక్టస్ను సేకరించి వీరికి ఇన్స్ట్రాగామ్ వేదికగా సరఫరా చేసేందుకు గోల్కొండ పీఎస్ పరిధిలో ఉండగా..హెచ్న్యూ టీం పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇతని వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఒక మొబైల్, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందాపై ఏదైనా సమాచారం తెలిస్తే ప్రజలు 8712661601 నంబర్లో ఫిర్యాదు చేయాలని జోయిల్ డేవిస్ కోరారు. సమావేశంలో హెచ్న్యూటీం డీసీపీ గుమ్మి చక్రవర్తి, ఇన్స్పెక్టర్ రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెలలో అరెస్టు చేసిన గోవా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్కు పెద్ద బ్యాగ్రౌండే ఉంది. గోవా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డ్రగ్ డీలర్ సదానంద్ చిముల్కర్కు సమీప బంధువు ఇతడు. భూయ్ అనే మారు పేరు కూడా ఉన్న చిముల్కర్ 2010–14 మధ్య గోవా సహా అనేక రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించాడు. ప్రీతీష్ను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్న ఘరానా పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్ నూనిస్లకు బీజేపీ నేత, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. అంజునా ప్రాంతానికి చెందిన డ్రగ్స్ డాన్ సదానంద్ అలియాస్ భుయ్ చిముల్కర్కు ప్రీతీష్ బోర్కర్ సమీప బంధువు. సదానంద్ జీవశైలి, సంపాదన, డబ్బు ఖర్చు చేసే విధానం..ఇవన్నీ చూసిన ప్రీతీష్ తానూ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సదానంద్కు సరఫరా చేసే వారి నుంచే ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, ఎక్స్టసీ, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేసే అమ్మడం మొదలెట్టాడు. సదానంద్ను గోవా యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ) అధికారులు 2010 జనవరిలో అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత సదానంద్ అడ్డం తిరిగాడు. అసలు తాను డ్రగ్సే అమ్మలేదని, తన కారులో ఏఎన్సీ అధికారులే వాటిని పెట్టారని కోర్టులో పిటిషన్ వేశాడు. లంచం ఇవ్వనందుకే ఇలా చేశారంటూ ఆరోపించాడు. అయితే పోలీసులు చూపించిన ఆధారాలతో ఈ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో గోవా పోలీసులు సదానంద్ను కట్టడి చేయడానికి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు. గోవా పోలీసు చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్ కేసులో నిందితుడి ఆస్తులు, బంగారం, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంకు ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దీనికి తోడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు (ఈడీ) లేఖ రాశారు. దీంతో ఆ అధికారులు సదానంద్పై 2014లో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా డ్రగ్స్ డాన్పై ఈడీ కేసు నమోదు కావడం కూడా గోవాలో అదే తొలిసారి. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రీతీష్ బోర్కర్ తన ఉనికి బయటపడకుండా దందా చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా సింథటిక్ డ్రగ్స్ అయిన ఎక్స్టసీ పిల్స్, ఎల్ఎస్డీ బోల్ట్సŠ, ఎండీఎంఏ మాత్రమే అమ్మేవాడు. అప్పుడప్పుడు మాత్రం చెరస్ను సరఫరా చేస్తుండేవాడు. అయితే ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న గోవా పోలీసులు 2014 నవంబర్లో అక్కడి సియోలిమ్ వద్ద పట్టుకుని జైలుకు పంపారు. అప్పట్లో ఓ కస్టమర్కు నేరుగా డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్లిన ప్రీతీష్ పట్టుబడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఇతగాడు తన పంథా మార్చాడు. ఎవరికీ కనిపించకుండా, కొరియర్స్ ద్వారానే డ్రగ్స్ సరఫరా చేపట్టాడు. ఇన్నాళ్లకు మళ్లీ హబ్సిగూడకు చెందిన కస్టమర్ల కోరిక మేరకు వారికి డ్రగ్స్ సరఫరా చేయడానికి గత నెల్లో హైదరాబాద్కు వచ్చి హెచ్–న్యూకు చిక్కాడు. -
డెత్ డ్రాప్.. డ్రగ్ ట్రాప్! ఎవరికీ చిక్కకుండా కొత్త పంథాలో ‘సరుకు’ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి. ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య డార్క్ వెబ్లో ఆర్డర్లు తీసుకుని.. హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు. బికర్మీ యాప్లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్వెబ్లోని డ్రగ్స్ ఫోరమ్స్లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. ►హైదరాబాద్కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్కుమార్, పి.భూషణ్రాజ్ డార్క్వెబ్లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు. ►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ను పంపిస్తున్నారు. కొరియర్లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు. నిఘా పెట్టి.. ఈ డ్రగ్ నెట్వర్క్పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్నగర్, చాదర్ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్ను సరఫరా చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. –సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
హైదరాబాద్ నగరాన్ని ఆందోళనకు గురి చేస్తోన్న డ్రగ్ మాఫియా
-
ప్ర‘మాదక’ ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా.. వినియోగం.. విక్రయం.. ఇన్నాళ్లూ ఈ కోణాలే బయటపడేవి. విదేశీయుల నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల దాకా ఎందరో పట్టుబడ్డారు. సినీ ప్రముఖులూ డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ తొలిసారిగా డ్రగ్స్ కారణంగా ఓ యువకుడు మరణించిన విషయం బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నార్కోటిక్స్ వినియోగమే ఎక్కువ మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యేవి నార్కోటిక్ సబ్స్టాన్సస్. కృత్రిమంగా తయారు చేసేవి సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్. గంజాయి, ఓపియం, కొకైన్లతోపాటు గంజాయి నుంచి ఉత్పత్తి చేసే చెరస్, హష్ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్ షుగర్, హెరాయిన్ నార్కొటిక్స్ కిందికి వస్తాయి. కెటామిన్, ఎఫిడ్రిన్, పెథిడిన్ వంటివి సైకోట్రోపిక్ డ్రగ్స్. హైదరాబాద్లో నార్కోటిక్స్ వినియోగం ఎక్కువ. ఈ ఉత్పత్తులు ప్రధానంగా ఆదిలాబాద్, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలతోపాటు హిమాచల్ప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని వరంగల్, మెదక్, జహీరాబాద్లతోపాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి, హష్ ఆయిల్ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి కూడా వివిధ రూపాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. నైజీరియన్ల నుంచి లోకల్ దాకా.. ముంబై, గోవా, ఢిల్లీ, చండీగఢ్ తదితర చోట్ల డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి డ్రగ్ నెట్వర్క్లో నైజీరియన్లు, ఇతర ఆఫ్రికా దేశాల వారిని వినియోగిస్తున్నారు. వీరు డ్రగ్స్ను రవాణా చేసి, తీసుకున్న డబ్బును డీలర్లకు పంపి.. వారిచ్చే కమీషన్ తీసుకుంటారు. నైజీరియన్లు పట్టుబడినా తమకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా డీలర్లు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో డ్రగ్స్ బానిసలైన స్థానిక యువకులు డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లుగా మారుతున్నారు. కొందరు నేరుగా డార్క్నెట్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. నిఘా పెరిగితే గోవాకు వెళ్తూ.. డ్రగ్స్కు వారాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. పబ్బులు, ఫామ్హౌజ్లు, రిసార్టుల్లో శని, ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు, కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. పెడ్లర్లు తెలిసినవారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. వీటిని వినియోగించేవారిలో వీఐపీలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు, వారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక గంజాయి, హష్ఆయిల్ వంటివాటిని చిన్నస్థాయి ఉద్యోగులు, విద్యార్థులు వంటివారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నిఘా పెరిగితే.. యువత గోవా వంటి చోట్లకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. కొందరు అక్కడే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘తొలి మరణానికి’ సంబంధించిన యువకుడు కూడా గోవాలో జరిగిన పార్టీతోనే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. హైదరాబాద్లో ఎఫిడ్రిన్ తయారీ! అల్లోపతి ఔషధాల తయారీలో ఉపయోగించే ఎఫిడ్రిన్ కూడా మాదకద్రవ్యాల తరహాలోనే మత్తునిస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. కొన్ని ముఠాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో భారీగా ఎఫిడ్రిన్ తయారు చేసి.. ఇతర ప్రాంతాలు, విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానికంగా ఈ డ్రగ్ వినియోగం తక్కువేనని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హెచ్– న్యూ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ)’ ఆవిర్భవించింది. సీనియర్ అధికారులతో కూడిన ఈ వింగ్ గత 51 రోజుల్లో మొత్తం 20 ముఠాలను పట్టుకుంది. పెడ్లర్లు, వినియోగదారులు సహా 120 మందిని అరెస్టు చేసింది. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు. వీటితో ప్రమాదకరమే.. హెరాయిన్: బ్లాక్ట్రా, చివా, నెగ్రా, హార్స్ మారుపేర్లు. కరిగించి ఇంజెక్షన్లా తీసుకోవడం (ఇంజెక్టింగ్), ముక్కుతో పీల్చడం (నోజింగ్), సిగరెట్లో నింపుకొని కాల్చడం (స్మోకింగ్) చేస్తారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతోపాటు కోమాలోకి వెళ్లి మరణించే ప్రమాదం ఉంటుంది. కొకైన్: స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా దీనికి మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్లో నింపుకొని కాల్చడం, వైన్లో కలుపుకుని తాగడం (స్పైకింగ్) చేస్తారు. దీనివల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. గాంజా, చెరస్, హష్ ఆయిల్: ఓ మాల్గా పిలుస్తుంటారు. గంజాయి ఆకులను సిగరెట్లో నింపుకొని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్ ద్వారా సేవిస్తారు. వీటితో ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఎవరినీ వదిలిపెట్టం నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పాటు చేశాం. ఈ విభాగం స్థానికంగా జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలతోపాటు వాటి మూలాలను కనిపెట్టి చెక్ పెడుతుంది. మాదకద్రవ్యాలతో ఏ రకమైన ప్రమేయం ఉన్నా.. ఎవరినైనా వదిలిపెట్టం. డ్రగ్స్ వ్యవహారాలపై సమాచారం ఉన్న వారు 9490616688, 040–27852080 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –డీఎస్ చౌహాన్, అదనపు సీపీ విష వలయంలో విద్యార్థులెందరో.. నగరంలో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులతోపాటు విద్యార్థులు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్–న్యూ ఏర్పడిన రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్టు చేశాం. విక్రేతలు, వినియోగదారులుగా చిక్కిన వారిలో వివిధ కాలేజీలతోపాటు యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ డ్రగ్స్ దందాలపై నిఘా పెట్టాం. –‘హెచ్–న్యూ’కు చెందిన అధికారి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది డ్రగ్స్ ప్రభావం నాడీ వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. అవి సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను అతిగా ప్రేరేపించి అకారణ ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే వేరే లోకంలో ఉన్న భ్రాంతి కలుగుతుంది. కొద్దిరోజులు తరచూ డ్రగ్స్ తీసుకుంటే బానిసవడం ఖాయం. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా డ్రగ్స్కు అలవాటు మానుకునేలా చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ అభినయ్, న్యూరాలజీ, కన్సల్టెంట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
డ్రగ్స్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
-
టోనీకి రిమాండ్..చంచల్గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు(గురువారం) నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. టోనీకి ఈనెల 14 వరకూ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో టోనీని చంచల్గూడ జైలుకు తరలించారు. -
డ్రగ్ కేసు: టోనీ ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీ అయిదు రోజుల కస్టడీ బుధవారంతో ముగియనుంది. డ్రగ్ కేసులో నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో‚ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిదిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టోనికి వ్యాపార వేత్తలకు ఏజెంట్లుగా పనిచేసిన10 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. అయితే టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్ ఫోర్స్ బృందాలు అతని కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్సైట్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా పరీశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించిన పోలీసులు.. టోనీని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో టోనీ అనుచరుడు అఫ్తాబ్. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో టోనీ డ్రగ్స్ లావాదేవీలను అఫ్తాబ్ పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని ఖాతాలో రోజుల వ్యవధిలోనే రూ.కోట్లలో లావాదేవీలు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అఫ్తాబ్ ఖాతాల్లో డబ్బులు పంపినవారి వివరాలను సేకరిస్తున్నారు . అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోన్కాల్స్, మెసేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ వ్యాపారి టోనీకి కస్టమర్లుగా ఉన్న తొమ్మిది మంది వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం కొట్టివేసింది. డ్రగ్స్కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున టోనీ అతని కస్టమర్లు నిరంజన్ కుమార్ జైన్, సశ్వత్ జైన్, యజ్ఞనాద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి పంపేందుకు హైకోర్టు నిరాకరించింది. చదవండి: హైదరాబాద్ టు ఢిల్లీ ‘వందేభారత్’.. పింక్ బుక్లో ఏముందో.. -
వీసా గడువు ముగిసినా.. డ్రగ్స్ పెడ్లర్ టోనీ బ్యాగ్రౌండ్ ఇదే!
హైదరాబాద్: నగరంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ ఇంతకాలం పోలీసులకు కళ్లుగప్పి తప్పించుకుని తిరిగాడు. కానీ అతన్ని చివరకు ముంబైలో పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఈ క్రమంలోనే అతని బ్యాగ్రౌండ్ ఏమిటా అనేది ఆసక్తికరంగా మారింది. టోనీ పూర్తి పేరు చుకువు డేవిడ్ అలియాస్ మార్ష్ టోనీ. తండ్రి పేరు అభియా మార్ష టోనీ..తల్లి పేరు రోజ్ మేరీ చుకువు. బర్త్ ప్లేస్ షాగాము విలేజ్, నైజీరియా. అనంతరం నైజీరియాలోని ఒక్ పంక్ విలేజ్కి మకాం మార్చాడు.. 2013 నుండి బట్టల వ్యాపారం ముసుగులో ముంబైలో డ్రగ్స్ దందాకు తెర లేపిన టోనీ. ముంబైలోని అంధేరీ ఈస్ట్, చాందీవాలీలలో మిలాన్ కాంప్లెక్స్ లో టోనీ నివసిస్తూ.. ముంబై నుండి షిప్స్ ద్వారా డ్రగ్స్ను భారత్కు దిగుమతి చేసేవాడు.. అలా డ్రగ్స్ పెడ్లర్గా, డ్రగ్స్ డాన్గా ఎదిగాడు. వీసా గడువు ముగిసిన కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ బిజినెస్ కొనసాగిస్తున్న టోనీ.. గత 9 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ముంబై లో టోని కోసం భారీగా ఇన్ఫార్మర్లను పోలీసులు ఏర్పాటు చేయగా, చివరకు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని ముంబైలో అరెస్ట్ చేశారు. చదవండి: డ్రగ్స్ పెడ్లర్ టోనీ కేసులో కీలక పరిణామం -
డ్రగ్స్ పెడ్లర్ టోనీ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: డ్రగ్స్ పెడ్లర్ టోనీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టోనీ దగ్గర నుంచి 2 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే సెల్ఫోన్లో డేటా మొత్తాన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఫేస్టైమ్ డేటాను ఎప్పటికప్పుడు టోని డిలీట్ చేశాడు. వాట్సాప్ చాటింగ్లు కూడా ప్రతిరోజు డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ముందుస్తుగా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీంతో డేటా అనాలసిస్ కోసం ఫోరెన్సిక్ పంపించారు పోలీసులు. ఈ క్రమంలో టోనీ కాంటాక్ట్స్ లిస్టును పోలీసులు రిట్రీవ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో టోనీ టచ్లో ఉన్నట్లుగా విచారణలో గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వ్యాపారవేత్తల చిట్టాతో విచారణ చేపడుతున్నారు. టోనీ, వ్యాపారవేత్తల మధ్య ఉన్నసంబంధాలు గురించి టాస్క్ఫోర్స్ ఆరా తీస్తుంది. -
డ్రగ్స్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు ప్రధాన నిందితుడు టోనీ
Latest Updates: 2:00PM ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ కస్టడి విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పీఎస్లో ప్రత్యేక గదిలో భారీ భద్రత మధ్య విచారణ జరుగుతోంది. ప్రత్యేక ప్రశ్నావలి సిద్దం చేసుకొని పోలీసులు టోనీని ప్రశ్నిస్తున్నారు. అలాగే టోనీని ప్రశ్నించేందుకు ట్రాన్సిలేటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అరెస్ట్ అయిన తమ్మిది మంది కంజూమర్స్తో సంబందాలాపై పోలీసులు ఆరా తీసుకున్నారు. హైదరాబాద్లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. టోనీ ఏజంట్స్ ఇమ్రాన్, నూర్లతో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతమంది ఏజంట్స్ ఉన్నారు, టోనీ కాల్ లీస్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అతడిని తదుపరి విచారణ నిమిత్తం బుధవారం వరకు(అయిదు రోజులు) పంజగుట్ట పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్గూడ జైలునుంచి పోలీసులు టోనీని తరలించారు. 34 మంది వ్యాపారులకు టోకు టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యాపారస్తుల్ని కస్టడీకి అప్పగించాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇతడి విచారణలో మరికొందరు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతడితో పాటు అరెస్టు అయిన ఏడుగురిని కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించలేదు. దీంతో దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలిసారిగా వినియోగదారులు అరెస్టు నగరంలో డ్రగ్స్కు ఉన్న డిమాండ్ తగ్గిస్తేనే సరఫరా ఆగుతుందనే ఉద్దేశంతో సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ విక్రేతలతో పాటు వినియోగదారులనూ అరెస్టు చేయించారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో టోనీ, ముగ్గురు దళారులు మినహాయిస్తే మిగిలిన వినియోగదారులంతా నగరంలోని పెద్ద కుటుంబాలకు చెందిన వారే. వీరిలో పది మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. టోనీ సహా ఇతర పెడ్లర్ల కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్ షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబుతో పాటు అతడి భార్య, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ కొనుగోలు, వినియోగదారులుగా గుర్తించారు. టోనీ తదితరుల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చదవండి: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ సిటీలో ఇంకెందరు ఉన్నారో..? నైజీరియా నుంచి వచ్చి ముంబైలో అక్రమంగా నివసిస్తున్న టోనీ 2013 నుంచి డ్రగ్స్ మాఫీయాను నడుపుతున్నాడు. దాదాపు అప్పటి నుంచే హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇతడి కస్టమర్ల జాబితాలో దాదాపు 60 మంది వరకు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కొకైన్ సరఫరా చేసే టోనీ ఒక్కోసారి గ్రాము రూ.20 వేలకు విక్రయించాడు. ఈ స్థాయిలో డబ్బు వెచ్చించి ఖరీదు చేసే వారిలో సంపన్నులే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, వీఓఐపీ కాల్స్ ద్వారా ఇతడు దందా చేస్తుండటంతో కాల్ డేటాలో అందరి వివరాలు బయటకురాకపోవడంతో కస్టడీలో రాబట్టాలని భావిస్తున్నారు. నగరంలోని కొన్ని స్టార్ హోటల్స్, పబ్స్, రిసార్టుల నిర్వాహకులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ద్వారా తన దందా నిర్వహించినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో విచారించాలని నిర్ణయించారు. ‘టోనీని శనివారం నుంచి పంజగుట్ట ఠాణాలో విచారిస్తాం. ఎంత మంది వ్యాపారస్తులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయో గుర్తిస్తాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి’ అని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. -
పోలీస్ కస్టడీకి అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీని పోలీస్ కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని ఐదురోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో రేపటి నుండి ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో టోనీని విచారించనున్నారు. టోనీకి హైదరాబాద్లోని బిజినెస్ మెన్స్కి సంబంధాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏడు మంది వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. టోనీని మరింత లోతుగా విచారించి ఇంకా ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టనున్నారు. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నారు.హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. -
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. హైదరాబాదులో 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దమ్కీ కహానీ.. రూ.కోటి ఇవ్వకుంటే నీకు, నీ భార్యకు మరణమే!
సాక్షి, సిటీబ్యూరో: బోయిన్పల్లికి చెందిన బల్క్ డ్రగ్ వ్యాపారి మనోజ్ సలేచా జైన్ను టార్గెట్ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్ కుదరక వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్తో బెదిరింపులకు దిగిన జవారీలాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ను బోయిన్పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల క్రితం మానుకోటలో జరిగిన బాలుడి కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తును తలదన్నే చర్యలు తీసుకున్నారు. ♦ ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్ ఫోన్లో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ♦ ఆ యాప్ వినియోగిస్తూ మనోజ్కు వీఓఐపీ కాల్స్ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు. ♦ దీంతో ‘ఓ కాల్లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి (ఏక్ కోకా) ఇవ్వకపోతే మనోజ్తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు. ♦ ఇంటి చుట్టూ పోలీసులకు ఉంచుకున్నా దేవుడి దయ ఉన్న తాను చిక్కననీ, డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్ అతగాడిని బతిమలాడాడు. ♦ తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ♦ యాప్ ద్వారా వీఓఐపీ కాల్స్ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. సాధారణ కాల్స్ మాదిరిగా వీటితో దాన్ని వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో టాస్క్ఫోర్స్ సాంకేతికంగా ముందుకు వెళ్లింది. ♦ ఎదుటి వ్యక్తి ఏ యాప్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్ యాప్స్ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్ పంపిస్తూ అందులో మనోజ్ నెంబర్ పొందుపరిచారు. ♦ ఈ నెంబర్కు ఫలానా తేదీ, సమయంలో మీ యాప్ నుంచి వచ్చిన కాల్ ఎవరు చేశారో చెప్పగలరా? అంటూ కోరారు. దీనిపై స్పందించిన ఓ యాప్ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్ ఐడీ అందించారు. ♦ దీంతో పాటు సదరు కాల్స్ చేయడానికి ఆ వ్యక్తి యాప్లోకి లాగిన్ అయిన ఐపీ అడ్రస్లు అందించారు. ఈ అడ్రస్లను సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్ఫోన్ నెంబర్తో ఈ ఐపీ అడ్రస్లు యాక్టివ్ అయ్యాయో చెప్పమని కోరారు. ♦ ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ ప్రొవైడర్ 300 ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు. వీటిని విశ్లేషిస్తూనే అధికారులు మరికొన్ని వివరాలు ఇవ్వాలంటూ యాప్ను సంప్రదించారు. ♦ ఈసారి స్పందించిన యాప్ నిర్వాహకుడు తమ యాప్ వినియోగానికి నిర్ణీత మొత్తం చెల్లించాలని, సదరు వ్యక్తి రాజస్తాన్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఆ 300 నంబర్లలో రాజస్తాన్తో సంబంధం ఉన్న వాటిని గుర్తించడానికి ప్రయత్నించారు. ♦ ఫలితంగా జవారీలాల్ నంబర్ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు. ♦ గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ♦ వీరిని లోతుగా విచారించి తుపాకీ, తూటాలు విక్రయించిన మధ్యప్రదేశ్ వ్యక్తిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అతడూ కీలకం కావడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
కోరాపుట్ టు నాసిక్
మియాపూర్: ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్కు గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన వికాస్జాదవ్, ఒడిస్సా, మోహిపాల్పుట్కు చెందిన సుభాష్కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్లో సుభాష్కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి కొనుగోలు చేసి అశోక్కూలే, అమోల్కు అప్పగించేవాడు. వారు విలాస్జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్కు గంజాయి తరలించేవారు. వారం రోజుల క్రితం వికాస్ జాదవ్, సుభాష్కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్కూలే, అమోల్కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్కుమార్ సింగ్లకు ఫోన్ చేసి తమ ప్లాన్ను వివరించారు. ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు. ఈ నెల 19న అశోక్కూలే, రాహుల్కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం సంచులను లోడ్ చేశారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసుల నిఘా ఉంటుందనే అనుమానంతో ఇతర హైదరాబాద్కు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై కారు, డీసీఎంను ఆపారు. కారులో ఉన్న అశోక్కూలే, రాహుల్కుమార్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా డీసీఎంలో 800 కిలోల గంజాయిని నాసిక్కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అశోక్కూలే, అమోల్, రాహుల్కుమార్ సింగ్, విలాస్జగనాథ్, ఫీరోజ్ మోమిన్, సుధామ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితులు వికాస్జాదవ్, సుభాష్కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటున్నామని సీపీ తెలిపారు. ♦ 800 కిలోల గంజాయితో పాటు డీసీఎం, ఐ 20 కారు, ఐదు మొబైల్స్, రూ.2,130 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీ మియాపూర్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ తిరుపతిరావు, ఎస్ఓటీ సీఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసులో బడా‘బాబులు’
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాల ఆరోపణలపై హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్న సంపన్న కుటుంబాలకు చెందిన ఏడుగురి గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో కొందరికి గతంలో పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ టోనీసహా నిందితుల్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కీలకాంశాలివీ... ♦ నగరంలోని హిమాయత్నగర్కు చెందిన నిరంజన్ కుమార్ జైన్కు కొన్నాళ్ళ క్రితం ముంబైలోని ఓ పబ్లో టోనీతో పరిచయమైంది. అప్పటి నుంచి 30 సార్లు డ్రగ్స్ కొనడంతోపాటు మరికొందరు స్నేహితులకు అలవాటు చేశాడు. నిరంజన్ కుటుంబం ఏటా రూ.600 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతోంది. నగరంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల్లో అనేకం వీరు చేపట్టినవే. ♦ మరో నిందితుడైన బంజారాహిల్స్ నివాసి శాశ్వత్ జైన్ది కూడా కన్స్ట్రక్షన్ వ్యాపారమే. రూ.1,000 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఈ కుటుంబం నగర శివార్లలో ప్రముఖ డిటర్జెంట్ సబ్బుల కంపెనీ నిర్వహిస్తోంది. సీఎస్సార్ కింద ఏటా 400 మంది పేదలకు ఉచితంగా కిడ్నీ తదితర ఆపరేషన్లు చేయిస్తోంది. వీరి కుటుంబ సభ్యుడి పేరుతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఓ పెవిలియన్ కూడా ఉంది. 2011లో టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముంబైకి చెందిన అర్వింద్ అనే డ్రగ్ పెడ్లర్ కస్టమర్ల జాబితాలో శాశ్వత్ పేరు ఉండటంతో కౌన్సెలింగ్ చేసినా అతడితో మార్పు రాలేదు. ♦ గౌలిపురకు చెందిన యజ్ఞానంద్ అగర్వాల్ కుటుంబం మసాలా దినుసుల వ్యాపారంలో ఉంది. ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్లున్నాయి. మరో నిందితుడు ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్రెడ్డి కీలక నిందితుడు నిరంజన్కు స్నేహితుడు. ♦ ఇంకో నిందితుడు బండి భార్గవ్ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాడు. వెంకట్ చలసాని అనే నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారి. భార్గవ్ ఇతడి వ్యాపార భాగస్వామి. ♦ నిందితుల్లో కొందరు చిన్నస్థాయి పెడ్లర్లుగానూ వ్యవహరిస్తున్నారు. వీళ్ల అరెస్టు విషయం తెలియగానే స్నేహితులు, పరిచయస్తులైన 200 మంది నగరం నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఎవరెవరికీ డ్రగ్స్ అమ్మారు? ఎక్కడెక్కడ రేవ్ పార్టీలు నిర్వహించారు? తదితర అంశాలను సేకరించాలని నిర్ణయించారు. -
మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ టోనీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అక్రమంగా నివసిస్తూ ఏడేళ్లుగా డ్రగ్స్ దందా సాగిస్తున్న నైజీరియా డ్రగ్ పెడ్లర్ చుకో ఒబెన్నా డేవిడ్ అలియాస్ టోనీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివిధ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న అతన్ని పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. టోనీ నుంచి ఓ కారు, సెల్ఫోన్తోపాటు 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం ఓఎస్డీ పి.రాధాకిషన్రావుతో కలసి ఆయన డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన టోనీ 2013లో తాత్కాలిక వీసాపై ముంబై వచ్చాడు. వీసాతోపాటు పాస్పోర్ట్ కాలపరిమితి ముగిసినా అంథేరీ ఈస్ట్లో అక్రమంగా నివసిస్తున్నాడు. తొలినాళ్లలో వస్త్ర వ్యాపారం చేయగా సులువుగా అధిక డబ్బు సంపాదనకు డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సోషల్ మీడియా, నైజీరియా ఫోన్ నంబర్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్తో అనుచరులను సంప్రదిస్తూ దందా సాగించేవాడు. అతనికి తెలంగాణ, ఏపీతోపాటు గోవా, ఢిల్లీల్లోనూ అనుచరులు ఉన్నారు. వారి సహకారంతో ఆయా ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. లావాదేవీలన్నీ బిట్ కాయిన్స్ రూపంలో జరుగుతుంటాయి. అనుచరులు చిక్కడంతో... హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాకు ఇమ్రాన్ బాబూఖాన్ కీలకంగా వ్యవహరించాడు. అతనితోపాటు మరికొందరినీ ఈ నెల మొదటి వారంలో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారు టోనీ పేరు చెప్పడంతో ముంబైలో ఉన్న అతన్ని పట్టుకొనేందుకు సుమారు 10 రోజులు అక్కడే మకాం వేసింది. గత వారం టోనీ నాలుగైదుసార్లు ముంబై, పుణే మధ్య రాకపోకలు సాగించినట్లు సాంకేతిక ఆధారాలు, స్థానిక పోలీసుల సాయంతో టోనీని పట్టుకున్నారు. 9 మంది వినియోగదారులకు చెక్... టోనీని పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతని సెల్ఫోన్ను విశ్లేషించి 13 మంది డ్రగ్స్ వినియోగదారుల వివరాలను సేకరించారు. వారిలో నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యోగానంద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్లను పట్టుకున్నారు. వారంతా సంపన్నుల బిడ్డలే కావడం గమనార్హం. ఒక్కొక్కరి ఆస్తి రూ. 100 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఉంటుందని సీవీ ఆనంద్ వెల్లడించారు. టోనీకి నైజీరియాలో ఉంటున్న స్టార్ బోయ్ అనే వ్యక్తి ఓడల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు టోనీకి కూడా తెలియవని చెప్పారు. సహకరించిన ఆఫీస్ బాయ్స్ అరెస్టు... డ్రగ్స్ కొనుగోలు కోసం వెంకట్ చలసాని, నిరంజన్ జైన్ తమ కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తున్న అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావుల ఫోన్లు వాడారు. అయితే ఈ విషయం తెలిసినా తమ ఫోన్లు ఇచ్చి సహకరించినందుకు ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డ్రగ్స్ వినియోగదారుల్లో సినీ ప్రముఖులు ఉన్నట్లు తేలినా ఈసారి వదిలేది లేదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణలో మరో భారీ నిధుల గోల్మాల్ -
టోనీ మొదట గార్మెంట్ బిజినెస్ చేశాడు: సీవీ ఆనంద్
-
మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్ టోనీ అరెస్ట్
-
మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ
తిరువనంతపురం: మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీరిని ఆడి కారులో వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీరిని వెంబడించిన సైజు థంకచన్కు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2021, నవంబర్ 1న మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కబీర్, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే చనిపోవాడానికి ముందు వీరు ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలో ఉన్న హైఎండ్ హోటల్ నంబర్.18లో ఓ పార్టీ హాజరయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం) పార్టీ ముగిసిన తర్వాత మోడల్స్ ఇంటికి వెళ్తుండగా.. పార్టీకి వచ్చిన కొందరు అతిథులు మోడల్స్ ఇంటికి వెళ్తుండగా ఆడి కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమరా ఫుటేజ్లో ఆడి కారు మోడల్స్ని ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సైజు థంక్చన్ అని.. అతడికి కొచ్చిలోని డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్ కోసం సైజు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ముగిసిన తర్వాత తనతో రావాల్సిందిగా సైజు మోడల్స్ని ఆహ్వానించాడు. కానీ వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైజు వారిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్ హోటల్ యజమాని రాయ్ వాయలత్తో పాటు కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం) మే 2021లో సైజు ఫోటో జత చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి నంబర్ 18 హోటల్లో జరిగిన పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు తెలుపుతోంది. అయితే, హోటల్ యజమాని రాయ్ వాయలత్కు పోలీసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కేసు తదుపరి విచారణ ముందుకు సాగలేదు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసు.. సింగే కింగ్ పిన్
సాక్షి, అమరావతి: దేశంలో సంచలనం సృష్టించిన హెరాయిన్ దందా గుట్టు వీడింది! టాల్కం పౌడర్ పేరుతో అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కీలక పురోగతి సాధించింది. ఢిల్లీకి చెందిన కుల్దీప్సింగ్ ఈ డ్రగ్స్ రాకెట్లో కీలక సూత్రధారిగా డీఆర్ఐ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరొకరు కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించింది. కుల్దీప్సింగ్ చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులకు కమీషన్ల ఎరవేసి స్మగ్లింగ్ దందాను నడిపి నట్లు నిర్ధారించింది. ఢిల్లీలో కేంద్రీకృతమైన ఈ ముఠా అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ దందా సాగిస్తున్నట్లు ఆధా రాలు సేకరించింది. హెరాయిన్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఆర్ఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికను ఎన్ఐఏ కు సమర్పించింది. సింగే.. కింగ్ పిన్ అఫ్ఘనిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ దందాలో ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగే కింగ్ పిన్ అని డీఆర్ఐ నిర్ధారించింది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులతోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు అఫ్ఘన్ జాతీయులు, ఓ ఉజ్బెకిస్తాన్ జాతీయురాలి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, మెయిల్స్ను డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. కుల్దీప్ సింగ్ పేరుతో ఢిల్లీ నుంచి ఓ డాన్ స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. చాటింగ్లో కుల్దీప్సింగ్గా పేర్కొ న్నప్పటికీ మారుపేరుతో వ్యవహరించి ఉండవ చ్చని డీఆర్ఐ భావిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్లు డీఆర్ఐ అంచనాకు వచ్చింది. చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్) వాట్సాప్ గ్రూప్ ద్వారా... డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కుల్దీప్ సింగ్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతా చాటింగ్ ద్వారా నడిపించాడు. అఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ డీలర్ హాసన్ హుసేన్, చెన్నైకు చెందిన సుధాకర్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో కీలక అంశాలను వెల్లడించింది. తాను పంపిస్తున్న సరుకును ఢిల్లీలోని కుల్దీప్సింగ్కు చేర్చాలని సుధాకర్తో హాసన్ హుసేన్ పేర్కొనడం గమనార్హం. డబ్బిస్తేనే సరుకు పంపిస్తా.. ఈ ఏడాది జూన్ 6న టాల్కం పౌడర్ పేరుతో హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వచ్చిన విషయాన్ని హాసన్ హుసేన్ సుధాకర్కు చెప్పాడు. ఆ కన్సైన్మెంట్ ‘కుల్దీప్సింగ్, అలీపుర్, న్యూఢిల్లీ’ పేరున ఉంది. వాటిని ఢిల్లీ చేర్చేందుకు అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన సుధాకర్ దిగుమతి చేసుకున్నాడు. ఈ సంద ర్భంగా వాట్సాప్ గ్రూప్లో సంభాషణలు డ్రగ్స్ దందాలో కీలక అంశాలను వెల్లడించాయి. తమ కంపెనీ పేరిట డ్రగ్స్ దిగుమతి చేసుకుంటు న్నందుకు సుధాకర్కు ఇవ్వాల్సిన కమీషన్ను కుల్దీప్ సింగ్ ఇంకా చెల్లించలేదు. దీంతో పోర్టులో ఆ సరుకును విడుదల చేసేందుకు సుధాకర్ సహకరించలేదు. ‘డబ్బులిస్తేనే సరుకు ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తా..’ అని సుధాకర్ చాటింగ్లో కుల్దీప్ సింగ్తో పేర్కొన్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఈ క్రమంలో కుల్దీప్సింగ్ రూ.4 లక్షలు సుధాకర్కు బదిలీ చేయడంతోపాటు మరో రూ.9 లక్షల నగదు హవాలా మార్గంలో చెల్లించాడు. అనంతరం ఆ హెరాయిన్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి చేరింది. ఈ సమాచారం అంతా వాట్సాప్ గ్రూప్ చాటింగ్లో డీఆర్ఐ అధికారులు గుర్తించారు. చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!) స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్గా ‘అషీ’ అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ పోర్టు మీదుగా కొన్నేళ్లుగా స్మగ్లింగ్ దందా సాగుతోంది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులు లక్షలు కమీషన్గా తీసుకుంటూ స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్గా తమ అషీ ట్రేడింగ్ కంపెనీని వాడుకునేందుకు అనుమతిం చారని రూఢీ అయింది. అందుకోసమే విజయ వాడ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజి స్టర్ చేశారు. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంతో విజయవాడకుగానీ ఆంధ్రప్రదేశ్కుగానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. అస లు హెరాయిన్ ఏపీకి రాలేదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ భారీగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సేకరించిన సమాచారంతో ముంబై, ఇతర మెట్రో నగరాల్లో డీఆర్ఐ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధారి స్తోంది. డీఆర్ఐ అధికారులు ఏపీలో ఎలాంటి తనిఖీలుగానీ దాడులుగానీ నిర్వహించక పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొనసాగుతున్న వేట... స్మగ్లింగ్ దందాలో కింగ్ పిన్ కుల్దీప్ సింగ్ ఆచూకీ కోసం డీఆర్ఐ, ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్లో వచ్చిన హెరాయిన్ కన్సైన్మెంట్లో పేర్కొన్న కుల్దీప్ సింగ్ చిరునామా సరైంది కాదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వెల్లడైంది. వాట్సాప్ గ్రూప్లోని ఫోన్ నంబర్లు ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ ఆచూకీ కనుగొంటామని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై?
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మాదక ద్రవ్యాలకు స్వర్గధామంగా మారిందా అంటే అవుననే సమాధానమే కరెక్టేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క నగరంలోనే గత ఏడాది కాలంలో జాతీయ నార్కొటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు, పోలీసులు దాదాపు రూ. 200 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఓ కేసులో అరెస్టు కావడంతో మరోసారి డ్రగ్స్ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, గత ఏడాది కాలంలో జాతీయ నార్కొటిక్స్ బ్యూరో (ఎన్సీబీ), ముంబై పోలీసులు చేసిన వేర్వేరు దాడులలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిపై చర్యలు తీసుకున్నారు. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం ఎన్సీబీ ముంబైలో మాదక ద్రవ్యాల విక్రేతలపై నిఘా వేసింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేయడం మొదలు పెట్టింది. గత సంవత్సర కాలంలో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 144 కేసులలో 300 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అదేవిధంగా 150 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఎన్సీబీ అరెస్టు చేసిన వారిలో 34 మంది నైజీరియన్లు (విదేశీయులు) ఉన్నారు. వీరి వద్ద 30 కిలోల చరస్, 12 కిలోల హెరాయిన్, రెండు కిలోల కొకైన్, 350 గ్రాముల గంజాయి, 25 గ్రాముల మెఫ్రెడాన్ తదితర మాదక ద్రవ్యాలను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పరిశీలించినట్టయితే ఎన్సీబీ మొత్తం 94 కేసులు నమోదు చేసింది. ఇక, ముంబై పోలీసులు గత సంవత్సర కాలంలో సుమారు రూ. 78 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 274 కేసులను నమోదు చేశారు. 4,412 మంది మాదక ద్రవ్యాల విక్రేతలు, సేవించిన వారిని అరెస్టు చేశారు. 2021 ఆగస్టు వరకు ముంబై పోలీసులు 12 కేసులలో రూ. 8.10 కోట్ల విలువైన హెరాయిన్, రూ. 12.27 కోట్ల విలువైన చరస్, రూ. 9.57 కోట్ల విలువైన కొకైన్, రూ. 6.58 కోట్ల విలువైన గంజాయి, రూ. 25.21 కోట్ల విలువైన మెఫ్రెడాన్ (ఎండీ), రూ. 18.90 లక్షల ఎల్ఎస్డీతో పాటు సుమారు రూ. 55 లక్షల విలువైన ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ దందా!
మహారాష్ట్ర:ముంబైలో పట్టుబడుతున్న భారీ డ్రగ్స్ స్థావరాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గుర్తించింది. శుక్రవారం ముంబై నార్త్ అంధేరీలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ 4.6కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో తయారు చేసి పరుపులు, మెత్తల్లో పెట్టి సముద్ర మార్గంగా ఆస్ట్రేలియా తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియా డ్రగ్స్ తరలింపు జరుగుతోంది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి మూడు రోజుల క్రితం గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాది సిద్ధిక్ అహ్మద్ అరెస్టు అయ్యారు. శనివారం ముంబైలో షిప్లో పట్టుబడ్డ ఎపిడ్రిన్ సైతం హైదరాబాద్ నుండే వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపిడ్రిన్ డ్రగ్స్కు హైదరాబాద్ కేంద్రంగా మారినట్లు సమాచారం. నైజీరియన్ పెడ్లర్లుగా మార్చుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ బిజినెస్ జరుగుతోంది. ఇటీవల బెంగళూర్లో పట్టుబడ్డ డ్రగ్స్ డాన్ యోగిత, హైదరాబాద్లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. యోగిత, సిద్ధిఖ్ అహ్మద్ల విచారణలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో శనివారం క్రూజ్ షిప్లో రేవ్ పార్టీపై అధికారులు దాడి చేయగా.. రేవ్ పార్టీలో షారుఖ్ పెద్ద కొడుకు అర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత ‘డ్రగ్స్ డాన్’గా మారింది. ఆ నగరంతో పాటు హైదరాబాద్లోనూ నైజీరియన్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న ఈమె మాదకద్రవ్యమైన ఎండీఎంఏ విక్రయాలు ప్రారంభించింది. దాదాపు మూడేళ్లుగా దందా చేస్తున్న యోగిత కోసం వలపన్నిన బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఇటీవల పట్టుకోగలిగారు. హైదరాబాద్లో ఈమె తరఫున డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. వినియోగం నుంచి విక్రేతగా మారి... బెంగళూరులో వివిధ పబ్స్కు వెళ్లే యోగిత డ్రగ్స్కు బానిసగా మారింది. వీటి ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఆమె మూడేళ్ల క్రితం పెడ్లర్గా మారి విక్రయించడం మొదలెట్టింది. తనకు డ్రగ్స్ అమ్మిన నైజీరియన్లనే పెడ్లర్స్గా మార్చుకుని వారి ద్వారా వినియోగదారులకు అమ్మడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి నైజీరియన్లకు స్నేహితులైన హైదరాబాద్లో ఉంటున్న వారినీ ఏజెంట్లుగా మార్చుకుంది. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు ఇస్తూ, క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేస్తూ విదేశాల నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయిస్తోంది. ఈ వ్యవహారంపై మూడు నెలల క్రితమే ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. (చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి) జర్మనీ నుంచి ఇంటర్నేషనల్ పోస్టులో... యోగితకు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలు తమ వద్ద లేకపోవడంతో అధికారులు వేచి చూశారు. ఈమెను పట్టుకోవడానికి విదేశాల నుంచి వచ్చే అనుమానాస్పద పార్శిల్స్పై నిఘా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రెండో వారంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోస్టాఫీసుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ ఇంటర్నేషనల్ పోస్టు పార్శిల్పై ఎన్సీబీ దృష్టి పడింది. కాస్మోటిక్స్, శాండ్విచ్ గ్రిల్ తదతరాల పేరుతో వచ్చిన దాన్ని డెలివరీ చేయడానికి పోస్టుమ్యాన్ వెళ్లగా యోగిత చిరునామా లభించలేదు. దీంతో అతడు దాన్ని వెనక్కు తీసుకువచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు మూడు రోజుల పాటు ఆ పోస్టాఫీస్ వద్దే మాటు వేసి ఉన్నారు. మూడో రోజు పోస్టాఫీస్కు వచ్చిన యోగిత పార్శిల్ తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తరలింపు ఎన్సీబీ అధికారులు ఆ పార్శిల్ను విప్పి చూడగా అందులోని వస్తువుల మాటున అర కేజీ ఎండీఎంఏ ఉన్నట్లు గుర్తించారు. వివిధ దేశాల నుంచి ఇంటర్నేషనల్ పోస్టు ద్వారా వస్తువుల మాటున డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు యోగిత అంగీకరించింది. ఇలా వచ్చిన వాటిని నైజీరియన్ల ద్వారానే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు పంపుతున్నట్లు బయటపెట్టింది. ఇక్కడ ఉన్న ఆమె ఏజెంట్లు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆమె నెట్వర్క్ కోసం గాలిస్తున్న అధికారులు త్వరలో హైదరాబాద్ పెడ్లర్ల కోసం ఇక్కడకు రానున్నారని సమాచారం. (చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! )