GHMC Elections 2020 Result
-
అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్న విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నూతన మేయర్గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపింది. సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కేశవరావు కూతురైన విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్గా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి... బాల్యం, విద్యాభ్యాసం.. కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం మొత్తం అంతా హైదరాబాద్లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి.. రెడ్డి మహిళా కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్లో జర్నలిజం పూర్తి చేశారు. అనంతరం సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. వివాహం.. విజయలక్ష్మి వివాహం బాబీ రెడ్డితో జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో.. కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్గా పని చేశారు. 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. రాజకీయ ప్రస్థానం తొలిసారి 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరో సారి విజయం సాధించి.. ఈ సారి ఏకంగా మేయర్ పదవిని అలంకరించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతే శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. బీఏ చదివిన శ్రీలత శోభన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీతేజస్వి. 20 ఏళ్లుగా బొటిక్ నిర్వహించిన శ్రీలత.. తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. కొంతకాలం పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో తార్నక కార్పొరేటర్గా విజయం సాధించిన మోతే శ్రీలత.. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. -
మేయర్ ఎన్నిక: గ్రేటర్పై మరోసారి గులాబీ జెండా
-
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్ఎస్
-
కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహత్మకంగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. మేయర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే (చేతులెత్తి) వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు (56+32) తెలపడంతో విజయం సాధించారు. వ్యూహత్మకంగా వ్యహరించిన కేసీఆర్.. అయితే 44 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు పదిమంది ఎక్స్అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్ పీఠం టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కెలా సీఎం కేసీఆర్, ఒవైసీ ఒప్పందం కుదుర్చుకున్నారని తొలినుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. రెండు కీలక పదవులను దక్కించుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించారు. దీంతో రాజధాని నగరంపై మరోసారి పట్టునిలుకున్నారు. మేయర్ ఎన్నిక: గ్రేటర్పై మరోసారి గులాబీ జెండా -
‘బల్దియా’ రాణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్ఎస్కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్గా మైనార్టీ వర్గాలకు టీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు. ఐదో మహిళా మేయర్.. గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ ఇలా సాగింది.. ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్ఎస్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు. -
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు:కలెక్టర్ శ్వేతామహంతి
-
టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు...
-
గ్రేటర్ : మేయర్ బరిలో బీజేపీ
-
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ ఎన్నికలు
-
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మేయర్ ఎన్నికల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు గురువారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు అమలులో ఉంటాయి. ►అప్పర్ ట్యాంక్బండ్ వైపు నుంచి లిబర్టీ జంక్షన్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్ళిస్తారు. ►లోయర్ ట్యాంక్బండ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు. కట్టమైసమ్మ చౌరస్తా నుంచి తెలుగు తల్లి ఫైఓవర్ మీదుగా పంపిస్తారు. ►హిమాయత్నగర్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని లిబర్టీ జంక్షన్ నుంచి బషీర్బాగ్, నిజాం కాలేజీ, అసెంబ్లీ మీదుగా పంపిస్తారు. ►బషీర్బాగ్ వైపు నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వైపు వచ్చే వాహనాలను బషీర్బాగ్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ►తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఆదర్శ్నగర్ వైపు వాహనాలను పంపించరు. వీటిని ఇక్బాల్ మీనార్ జంక్షన్ నుంచి రవీంద్రభారతి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ►పోలీసు కంట్రోల్ రూమ్ చౌరస్తా నుంచి ఆదర్శ్నగర్ మీదుగా తెలుగుతల్లి చౌరస్తా వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్ వైపు నుంచి పంపిస్తారు. -
గ్రేటర్ : మేయర్ బరిలో బీజేపీ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. వరుసగా నాలుగుసార్లు కార్పొరేటర్గా గెలుపొందిన సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్కు పార్టీ ఫ్లోర్లీడర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 47కు చేరింది. మరో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొత్తంగా అధికార టీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ బలం తక్కువగానే ఉంది. అయితే మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల నుంచి తమకు కొంత మంది సపోర్ట్ చేసే అవకాశం ఉందని, ఆ మేరకే పార్టీ అభ్యర్థిని మేయర్ బరిలో నిలిపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. బుధవారం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఓటింగ్పై జాగ్రత్తలను వివరించింది. అభ్యర్థులకు విప్ జారీ చేసింది. ప్రమాణ స్వీకారానికి ముందు అభ్యర్థులు గురువారం ఉదయం బషీర్బాగ్లోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అల్పాహారం తీసుకుని జీహెచ్ఎంసీకి ర్యాలీగా వెళతారు. పోటీలో ఎంఐఎం.. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్ (ఏఐఎంఐఎం) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడేందుకు సిద్ధమైంది. ఇందుకు అంతర్గతంగా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు పూర్తి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి, యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీకి విప్ జారీ చేసే అధికారం కట్టబెట్టింది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండటంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వాలకు సంబంధించి బీఫాం బాధ్యతలను కూడా పాషా ఖాద్రీకి అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమెల్సీ సయ్యద్ అమీన్–ఉల్–హసన్ జాఫ్రీలు కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతా మహంతికి ఫాం– ఎ,అనెక్జ్సర్–1, 2లను సమర్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలపై పార్టీపరంగా అవలంబించాల్సిన వ్యూహంపై గురువారం ఉదయం దారుస్సలాంలో జరిగే కొత్త కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలో దిశానిర్దేశం జరగనుంది. -
GHMC: మేయర్గా కేకే కుమార్తె
Time 12:35 టీఆర్ఎస్ పార్టీ సినియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీవుద్దీన్ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. Time 11:10 AM హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన సభ్యులకు తొలుత ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కో పార్టీలతో కూడిన సభ్యులు ఓ గ్రూపుగా ఏర్పడి ప్రమాణం చేస్తామని కొందరు కోరారు. భాషల ప్రతిపాదికన గ్రూపులుగా ఏర్పడిన ప్రమాణం చేస్తామని మరికొందరు కోరారు. కలెక్టర్ శ్వేతామహంతి దానికి అంగీకరించారు. భాష ప్రకారంలో సభ్యులంతా సామూహికంగా ఏర్పడి ప్రమాణం చేశారు. కౌన్సిల్ హాల్లో శ్వేతా మహంతి కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 12:30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుందని కలెక్టర్ తెలిపారు. సభ్యులంతా పది నిమిషాల ముందు కౌన్సిల్ హాల్లోకి రావాలని సూచించారు. తొలుత తెలుగు భాషలో సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం ఉర్దూ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. మూడో విడతలో హిందీలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. చివరిగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడే సభ్యులు ప్రమాణం చేశారు. పార్టీ నేతలతో ముఖ్య సమావేశం అనంతరం అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 149 మంది సభ్యులు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరుగనుంది. Time 10:37 Am తెలంగాణ భవన్లో ముఖ్య సమావేశం అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్ల జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ ఆఫీస్కు చేరుకున్నారు. మరోవైపు ఎంఐఎం కార్పొరేటర్లు దారుసలాం నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్కు బయల్దేరారు. బషీర్బాగ్ నుంచి బీజేపీ కార్పొరేటర్లు సైతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. Time 10:4 Am జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి భేటీ కాకముందే సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు కనీసం కరోనా టెస్టులు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లింగోజీ కూడా కార్పొరేటర్ కరోనాతో మరణించడం సభ్యులను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిల్ హాల్లో కనీసం సామాజిక దూరం కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 193 మంది సభ్యులతో పాటు 34 మంది ఆఫీసర్లు, మరొక 20 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హాలులో దాదాపు మూడు గంటల పాటు 250 మంది వరకు ఉంటున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. TIME 10 AM నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశం ముగిసింది. అక్కడి నుంచి సభ్యులంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సమావేశంలో సభ్యులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనల చేశారు. TIME 9:40 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో భేటీ అయ్యారు. మేయర్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. TIME 9:04 జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మోతె శ్రీలత శోభన్రెడ్డి తార్నాక కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. TIME 8:47 బషీర్బాగ్ సమీపంలోని ముత్యలమ్మ ఆలయానికి చేరుకుంటున్న బీజేపీ కార్పొరేటర్లు. వారితో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం బయలుదేరనున్నారు. TIME 8:40 తెలంగాణ భవన్కు చేరుకుంటున్న నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. మేయర్ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అర్హత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గుర్తింపు కార్డులు ధరించి అధికారులకు సహకరించాల్సిందిగా సూచించారు. వారిని గుర్తించేందుకు ఉన్నతాధికారులు ప్రవేశద్వారం వద్ద ఉంటారు. కార్పొరేటర్లు వారు ఎన్నికైనట్లు తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని, ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన నోటీసును తీసుకొని రావాల్సిందిగా కోరారు. వారు హాల్లోకి ప్రవేశించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. వారు ఎక్కడ కూర్చోవాలో సంబంధిత వరుసను ఆఫీసర్లు సూచిస్తారు. ఇందుకు 34 మందిని నియమించారు. ప్రమాణం చేసేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రమాణ పత్రాలు సిద్ధం చేశారు. తొలుత తెలుగులో ప్రమాణం చేయాలనుకున్న వారందరితో ఒకేసారి చేయిస్తారు. తర్వాత మిగతా భాషల వారీగా చేయిస్తారు. కొత్త కార్పొరేటర్లు తాము ఎంచుకునే భాషలో ప్రమాణ పత్రాన్ని ముందుగానే చదువుకొని రిహార్సల్ చేసుకుంటే తప్పులు దొర్లకుండా ఉంటుందని సూచించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ సందీప్ సుల్తానియా మాత్రమే వేదికపై కూర్చుంటారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. నిజాం కాలేజీ, ఎమ్మెల్యే క్వార్టర్లలో పార్కింగ్ చేయాల్సిందిగా సూచించారు. అన్నీ సజావుగా సాగితే మధ్యాహ్నం రెండుగంటలకు అటూఇటూగా కార్యక్రమం పూర్తికావచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక జరగుతున్న రెండో ఎన్నిక ఇది. టీఆర్ఎస్తోపాటు ఎంఐఎం, బీజేపీలు విప్ జారీకి సభ్యులను నియమించాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికకు రంగం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కొత్త నగరానికి కొత్త మేయర్ ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీల్డ్ కవర్లో నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. 32 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు కిషన్రెడ్డి, రాజాసింగ్ ఓటు హక్కును కలిగి ఉన్నారు. గ్రేటర్ మేయర్ ఎంపిక.. Updates జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి. ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి 11 గంటల నుంచి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయ ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది -
గ్రేటర్ మేయర్: వాకౌటా.. గైర్హాజరా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్కు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజర్ కావడమా అనే అంశాలపై చర్చించనుంది. మజ్లిస్ సంఖ్యాబలం 54.. బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్ఎస్ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. దూరం పాటించడమే.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నేరేడ్మెట్ కౌంటింగ్: ఆర్వో సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరేడ్మెట్ కౌంటింగ్ సందర్భంగా జరిగిన వాదోపవాదనలపై ఆర్వో లీనా కలత చెందారు. ఎన్నికల్లో తాను ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆర్వో లీనా వివరించారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాపై పలువురు అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. నా విధులకు ఆటంకం కల్పించడం, నన్ను అసభ్యంగా దూషించడంపై నేరేడ్మెట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నన్ను తిట్టిన కాల్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇస్తాను. ఎన్నికల్లో నేను పారదర్శకంగా పనిచేశా. ఎవరికీ అమ్ముడుపోలేదు. నా సెల్ఫోన్, కాల్ రికార్డ్స్ అన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నా' అని ఆర్వో లీనా తెలిపారు. చదవండి: (నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం) ఇదిలా ఉండగా నేరేడ్మెట్ కౌంటింగ్ వద్ద బీజేపీ అభ్యర్థి ఆందోళన దిగారు. రిజక్ట్ అయిన 1,300 ఓట్లను కూడా లెక్కించాలంటూ బీజేపీ అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు. కాగా 544 ఓట్లు మాత్రమే లెక్కించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. 544 ఓట్లలో 278 టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. గతంలో టీఆర్ఎస్కు 504 ఓట్ల ఆధిక్యం ఉండటంతో.. మొత్తంగా 782 ఓట్లతో టీఆర్ఎస్పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించింది. -
నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం
-
నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 782 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఇతర గుర్తులున్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తమ పార్టీ అభ్యర్ధి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీ ఆందోళన నేరెడ్మెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరస్కరణకు గురైన 1300 ఓట్లు లెక్కించాలని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ప్రసన్ననాయుడు ఇంతకుముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. 8 గంటలకు మొదలైన కౌంటింగ్ కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలావుంటే, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. బీజేపీ ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. దీంతో స్వస్తిక్తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోవాంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇతర ముద్ర ఉన్న మరో 544 ఓట్లను లెక్కించిన తర్వాత నేరేడ్మెట్ ఫలితం ప్రకటించనున్నారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. -
‘నేరేడ్మెట్’ కౌంటింగ్కు అనుమతిచ్చిన హై కోర్టు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది. బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై అభ్యంతరాలున్న వారు ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి సోమవారం తీర్పునిచ్చారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర నిరి్ధష్టమైన గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జీ అంథోనిరెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి సోమవారం విచారించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను లెక్కించడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్రెడ్డి వాదనలు వినిపించారు. ఏ గుర్తు ఉన్నా వాటిని లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నేరెడ్మెట్ డివిజన్లోని ఓ పోలింగ్ బూత్లో స్వస్తిక్ గుర్తుకు బదులుగా సిబ్బంది పోలింగ్ కేంద్రాన్ని తెలిపే గుర్తును ఇచ్చారని, కొంతసేపటి తర్వాత ఈ తప్పును గుర్తించి సరిచేశారని ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. అప్పటికే మరో గుర్తుతో ఓట్లు పడిన విషయాన్ని పోలింగ్ సిబ్బంది తెలియజేయడంతో ఆ ఓట్లను కూడా లెక్కించాలని 3వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నేరేడ్మెట్ డివిజన్లో మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, బూత్ నంబర్ 50లో ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) ఈ నెల 9న ఓట్ల లెక్కింపు... నేరేడ్మెట్: నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్కు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ నెల 9న నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ)లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఉప ఎన్నికల అధికారి దశరథ్ చెప్పారు. -
జీహెచ్ఎంసీ: యంగ్ స్టార్స్..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పీఠంపై యువరక్తం కొలువు దీరనుంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొంతమంది బరిలోకి దిగితే.. సమాజసేవపై ఆసక్తితో మరికొంత మంది ఎన్నికల్లో పోటీకి దిగారు. నేరెడ్మెట్ను మినహాయిస్తే ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన 149 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపొందిన అభ్యర్థుల్లో 78 మంది మహిళలు ఉండగా, 71 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 29 ఏళ్లలోపు వారు 10 మంది ఉండగా, 30–39 ఏళ్లలోపు వారు 43 మంది, 40–49 ఏళ్లలోపు వారు అత్యధికంగా 59 మంది, 50–59 ఏళ్లలోపు వారు 35 మంది ఉన్నారు. 60 వయసు దాటిన వారు కేవలం(లింగోజిగూడ, రియాసత్నగర్) ఇద్దరే ఉన్నారు. పత్తర్గట్టి, ఉప్పుగూడ, నవాబ్సాబ్కుంట, కవాడిగూడ, యూసూఫ్గూడ, సీతాఫల్మండీ అభ్యర్థులు అవివాహితులు. వీరంతా వైవాహిక జీవితానికి ముందే రాజకీయాల్లో అడుగుపెట్టడం గమనార్హం. యువతతోనే మార్పు హుడాకాంప్లెక్స్: ‘రాజకీయాలను చాలామంది బురద గుంటలా భావిస్తుంటారు. అందులోకి దిగితే ఎక్కడ తమకు అంటుకుంటుందోనని భయపడుతుంటారు. నీతి, నిజాయితీ, సేవాభావం కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల అవినీతిపరులు, స్వార్థపరులు, వ్యాపారులు, రౌడీలు రాజకీయాల్లో వస్తున్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి గెలుపొందుతున్నారు. చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యువత, ముఖ్యంగా అంకితభావంతో ప్రజలకు సేవ చేసే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వారితోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి(38) అభిప్రాయపడ్డారు. సమాజసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు ఆమె చెప్పారు. తల్లిదండ్రులది ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం. అత్తమామలది రాజకీయ నేపథ్యం. చిన్నప్పటి నుంచే నాకు రాజకీయంపై ఆసక్తి ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాను. ఎంఏ ఎకానామిక్స్లో డిస్టింక్షన్ సాధించాను. ఉన్నత చదువులు చదివిన నాకు నా భర్త అంజన్కుమార్ కుటుంబం ద్వారా నాకు రాజకీయ వారసత్వం లభించింది. గత ఎన్నికల్లో మా మామ, బావ పోటీ చేసి ఓడిపోయారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే సరూర్నగర్ డివిజన్ నుంచి పోటీ చేశాను. ఓటర్లు నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించారు. బంధుప్రీతి, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాసేవ చేస్తాను’ అని ఆమె వివరించారు. క్రీడల నుంచి రాజకీయాల్లోకి.. కాప్రా: గ్రేటర్ ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది సత్తాచాటిన కాప్రా సిట్టింగ్ కార్పొరేటర్, టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ శివమణి రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటాడు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడైన స్వర్ణరాజ్ మైనంపల్లి హన్మంతరావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం తరఫున రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడలో పాల్గొని తనదైన శైలిలో ఆటతీరు కనబర్చారు. కాప్రా సర్కిల్ ప్రస్తుతం పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు స్వర్ణరాజ్. డివిజన్లో ప్రజల సమస్యలు, తన సమస్యలుగా భావించి సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా కల్పించి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. స్వర్ణరాజ్ క్రీడాకారుడే కాకుండా రాజకీయాల్లోకి రాకముందు హార్డ్వేర్ ఇంజినీర్ కూడా.. యువత క్రీడల వైపు దృష్టి సారించేలా కందిగూడలో బాస్కెట్ బాల్ గ్రౌండ్ నిర్మించారు. స్వర్ణరాజ్ శివమణి కార్యకర్త కుటుంబం నుంచి.. అంబర్పేట: ఆమె తండ్రి టీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త. బస్తీలో చిన్నపాటి లీడర్. పార్టీ జెండాలు మోయడం, అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయడం చేసేవారు. ఎన్నికల సమయంలో రత్నానగర్ బస్తీలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. బస్తీలకు వచ్చిన నాయకులకు జైకొడుతుండేవారు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని దగ్గరగా చూసిన దూసరి లావణ్యకు ప్రజాసేవ అంటే ఇష్టం. పెళ్లి తర్వాత భర్త దూసరి శ్రీనివాస్గౌడ్ కుటుంబం సైతం అదే బస్తీలోనే నివాసం ఉండేది. భర్త శ్రీనివాస్గౌడ్కు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తతత్వం. ఎవరు ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేసేవారు. భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో అతడికి అన్నివిధాలుగా ప్రోత్సాహం ఉండేది. భర్త ప్రోత్సాహంతో టీఆర్ఎస్ తరఫున పోటీలో దిగి విజయం సాధించారు దూసరి లావణ్య. బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని తెలిపారు. భర్త, పిల్లలతో .. డాక్టర్.. నుంచి కార్పొరేటర్గా.. బహదూర్పురా: బహదూర్పురా నియోజకవర్గం నవాబ్సాబ్కుంట డివిజన్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి షరీన్ ఖతూన్(26) రెండోసారి కార్పొరేటర్గా విజయం సాధించింది. 21 ఏళ్ల వయస్సులో గ్రాడ్యుయేషన్ చేస్తూ మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది. ప్రస్తుతం డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు పూర్తిచేసి ఆస్పత్రిలో పనిచేస్తూనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ మజ్లిస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అటు ఉన్నత చదువులు కొనసాగిస్తూనే డివిజన్ ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారు. తండ్రి అన్నాన్తో కలిసి స్థానిక బస్తీల్లో పర్యటిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. నిరక్షరాస్యులు ఐదుగురే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఏసీల నుంచే కాకుండా పలువురు స్వతంత్రులు పోటీ చేశారు. ఇలా మొత్తం 1,122 మంది పోటీ చేశారు. వీరిలో 600పైగా గ్రాడ్యూయేట్లు ఉన్నారు. ఇప్పటి వరకు గెలుపొందిన 149 మంది అభ్యర్థుల్లో 102 మంది విద్యాధికులే. వీరిలో 80 మంది బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఉండగా, 13 మంది ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేశారు. మరో ఇద్దరు ఎంబీఏ, ముగ్గురు బీటెక్, ఒకరు ఎంటెక్, ఇద్దరు వైద్య విద్యను పూర్తి చేశారు. ఒకరు ఎంసీఏ, పదో తరగతి పూర్తి చేసిన వారు 18 మంది ఉండగా, ఇంటర్మీడియట్ చదివిన వారు 11 మంది ఉన్నారు. ఐదుగురు నిరక్షరాస్యులు ఉండగా, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుకున్న వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అంతేకాదు 2009, 2016లోని జీహెచ్ఎంసీ పాలకవర్గంలో విద్యావంతులు శాతం 50లోపే ఉండగా ఈ సారి ఏకంగా 68 శాతానికి పెరగడం విశేషం. చిన్నవయసులో.. కవాడిగూడ: డిగ్రీ బీకాం చదువుతుండగానే 22 ఏళ్ల వయసులోనే ఆమెకు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం వచి్చంది. పేద దళిత కుటుంబానికి చెందిన రచనశ్రీ తండ్రి టెంట్హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాదాపు 36 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. అతడి సేవలకు గానూ బీజేపీ రచనశ్రీని కవాడిగూడ డివిజన్ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆమె తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితపై 1,468 ఓట్ల మెజారీ్టతో ఆమె విజయం సాధించారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పేదల కష్టాలపై తన తండ్రి చేస్తున్న పోరాటాన్ని దగ్గరగా చూసిన అనుభవం, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసినందున వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 22 ఏళ్లకే రాజకీయాల్లోకి.. చిలకలగూడ: ప్రపంచంలోని అన్ని అంశాలను ఫింగర్ టిప్స్పై ఆవిష్కరిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగి ఆమె. 2016లో రాజకీయ రంగంలో అవకాశం రావడంతో ప్రజాసేవ చేసే ఆలోచనతో సరేనంది. కట్ చేస్తే 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అత్యధిక మెజారీ్టతో సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించింది సామల హేమ. అప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ స్థానికులకు మరింత దగ్గరైంది. మరోమారు అవకాశం రావడంతో విజయకేతనం ఎగురవేసింది. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. 22 వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె కొద్దిరోజుల్లోనే తనదైన ముద్ర వేసింది. ఉద్యోగంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో, రాజకీయాల్లోకి వచి్చన తర్వాత కూడా అంతే ఆనందంగా ఉన్నానని, చెప్పులు అరిగేలా తిరిగిన వృద్ధురాలికి ఫించను అందిస్తే ఆమె కళ్లలో కనిపించే మెరుపే నాకు అనంతమైన ఆత్మసంతృప్తి ఇస్తుందని చెప్పారు. అతి పిన్న వయసు చాంద్రాయణగుట్ట: జీహెచ్ఎంసీలోనే 2016 ఎన్నికల్లో అతి పిన్న వయసు(21)లో కార్పొరేటర్గా గెలుపొందిన ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్ రెండోసారి కూడా 26 ఏళ్ల వయసులో ద్వితీయ విజయాన్ని అందుకున్నాడు. మజ్లిస్, బీజేపీల నడుమ జరిగిన పోరులో 8,006 ఓట్ల మెజారీ్టతో మజ్లిస్ తరఫున విజయం సాధించారు. బీఈ చదువుతున్న సమయంలోనే మొదటిసారి కార్పొరేటర్గా గెలిచిన ఫహద్ ఐదేళ్ల పాటు ప్రజల మధ్యే ఉంటూ అభిమానాన్ని చూరగొని రెండోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫహద్కు వివాహం జరిగింది. కుల, మత, రాజకీయాలకతీతంగా చేసిన అభివృద్ధే తనకు మరోసారి అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. నాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్కాజిగిరి: ప్రజాసేవ కోసమే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు శ్రవణ్. 40 సంవత్సరాలుగా అతడి తండ్రి ఎలాంటి పదవి ఆశించకుండా బీజేపీ కార్యకర్తగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ, ఎమ్మెల్సీ రాంచందర్రావు మద్దతుతో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్గా పోటీచేసే అవకాశం రావడంతో గెలుపొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన తెలిపారు. నాడు రేషన్ డీలర్.. నేడు కార్పొరేటర్ అబిడ్స్: గోషామహాల్ డివిజన్లో అందరినోట అతడు సుపరిచితుడు. 30 సంవత్సరాలుగా గోషామహాల్ డివిజన్ పరిధిలోని ధూల్పేట్లో లాల్సింగ్ రేషన్ డీలర్. బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ ఓ వైపు రేషన్ షాపు నడుపుతూ.. మరోవైపు బీజేపీలో సైతం కొనసాగుతున్నాడు. గోషామహాల్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లాల్సింగ్ 7,369 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ ముఖేష్సింగ్ను ఓడించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. 59 సంవత్సరాల లాల్సింగ్కు ఇద్దరు పిల్లలు. ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో సంబురపడుతున్న లాల్సింగ్ మాట్లాడుతూ.. తాను ఇక నుంచి పూర్తిగా ప్రజాసేవలో మునిగిపోతానన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల రూపకల్పనకు కృషి చేస్తానన్నారు. మేనత్త, మేనల్లుడి విజయం కుత్బుల్లాపూర్: వారు వరుసకు బంధువులు.. ఒకరు మూడుసార్లు కార్పొరేటర్గా గెలిస్తే.. మరొకరు రెండుసార్లు గెలిచారు. రంగారెడ్డినగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా మూడుసార్లు విజయం సాధించిన విజయ్శేఖర్గౌడ్, కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్గా ఎన్నికైన గౌరీష్ పారిజాతగౌడ్ మేనత్త, మేనల్లుడు కావడం విశేషం. అధికార టీఆర్ఎస్ పార్టీ మరోమారు సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడంతో వీరిద్దరూ విజయం సాధించారు. మూడుసార్లు మూడు పార్టీలు సైదాబాద్: ఐఎస్సదన్ ఓటర్లు గ్రేటర్ ఎన్నికల్లో ప్రతీసారి భిన్నంగా తీర్పునిస్తున్నారు. ఐఎస్సదన్ డివిజన్గా ఏర్పడిన తర్వాత నిర్వహించిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించారు. సైదాబాద్లో అంతర్భాగంగా ఉన్న ఐఎస్సదన్ 2009లో చేసిన పునరి్వభజనలో భాగంగా డివిజన్గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఐఎస్సదన్ నుంచి టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అప్పటి బీజేపీ అభ్యర్థి సామ సుందర్రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ అభ్యరి్థగా రంగంలోకి దిగిన సామ స్వప్నాసుందర్రెడ్డి బీజేపీ అభ్యర్థి సునీతారెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిలిచిన జంగం శ్వేతామధుకర్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ సామ స్వప్నాసుందర్రెడ్డిపై గెలిచి విజయకేతనం ఎగురవేశారు. ఇలా డివిజన్ ఓటరు ప్రతీ గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ మార్పును కోరుకుంటూ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అభ్యరి్థకి ఒక్కోసారి అవకాశం ఇచ్చారు. పచ్చపార్టీకి తీవ్ర పరాభవం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. హైదరాబాద్ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే టీడీపీకి గ్రేటర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. హైటెక్ సిటీని తామే నిరి్మంచామని, చంద్రబాబు విజన్తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పారీ్టకి గ్రేటర్ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 38 ఏళ్ల పార్టీ చరిత్ర ఉన్న టీడీపీ గ్రేటర్వాసులు నమ్మలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2016 జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరాభవం పాలైంది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పూర్తిస్థాయిలో ఓటమిపాలైంది. అంతేకాదు ఆ పార్టీ అభ్యర్థులకు అన్నిచోట్లా డిపాజిట్ గల్లంతైంది. ఈ ఘోర పరాజయంతో నగరాన్ని ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటల్లోని డొల్లతనం వెల్లడికావడంతో పాటు ఆ పార్టీ సంపూర్ణంగా నగర రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగైనట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దశలవారీగా కనుమరుగవుతూ వచి్చన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హయాంలో హైదరాబాద్లో తన ప్రస్థా నాన్ని అత్యంత అవమానకరంగా ముగించింది. 92 డివిజన్ల్లో వెయ్యిలోపు ఓట్లు ఈసారీ గ్రేటర్ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పారీ్టకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివిజన్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. పోటీ చేసిన 106 డివిజన్లలో 92 డివిజన్లలో వెయ్యిలోపు ఓట్లు పడ్డాయి. 14 డివిజన్లలో వెయ్యి ఓట్లు కంటే తక్కువ నమోదయ్యాయి. 65 డివిజన్లలో కేవలం 100 కంటే తక్కువ జనం ఓట్లు వేశారు. ఎస్సదన్లో టీడీపీ అభ్యరి్థకి అతితక్కువగా 22 ఓట్లు పడ్డాయి. కేపీహెచ్బీ డివిజన్లో అత్యధికంగా 2,656 ఓట్లు పడ్డాయి. బాలాజీనగర్ డివిజన్లో 2,252 ఓట్లు, వీవీనగర్లో 2,297 ఓట్లు, హైదర్నగర్లో 2,119 ఓట్లు పడ్డాయి. తక్కువగా ఘాన్సీబాజార్లో 54 , కూర్మగూడ 55, కిషన్బాగ్లో 71, దూద్»ౌలిలో 82 ఓట్లు పడ్డాయి. -
జీహెచ్ఎంసీ: గెలుపోటములకు కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజవకర్గంలో కారు స్పీడుకు బ్రేక్ పడింది. అడిక్మెట్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని మార్చకపోవడం, ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే తిష్టవేసి అహర్నిషలూ శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముషీరాబాద్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిని మార్చకపోవడం, రూ.10వేల వదర సాయం, కార్పొరేటర్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార పార్టీ ఓటమికి దారి తీసింది. రాంనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 5వేల ఓటు బ్యాంకున్న పలు బస్తీలు ముషీరాబాద్ డివిజన్లో కలవడం, అసమ్మతి నేతలను బుజ్జగించడంలో ఆలస్యం చేయడంతో బీజేపీ అభ్యర్థి వి.రవిచారికి విజయానికి దోహదం చేశాయి. భోలక్పూర్ డివిజన్లో ఎంఐఎం నాయకత్వం కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మరోసారి ఎంఐఎం తన పట్టును నిలుపుకొంది. గాంధీనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నా.. టీఆర్ఎస్పై వ్యతిరేకత, బీజేపీ పాజిటివ్ ఓట్లు కొంపముంచాయి. కవాడిగూడ డివిజన్ టికెట్ను టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి లాస్యనందితకే మళ్లీ ఇచ్చారు. ఆమె తండ్రి ఎమ్మెల్యేగా ఉండటం, డివిజన్లో ఆమె పట్ల ఉన్న వ్యతిరేకత, బీజేపీ గాలి తోడవడం, బీజేపీ అభ్యర్థి ఒక టెంట్ హౌస్ నడుపుకునే సామాన్య నాయకుడి కుమార్తె కావడంతో టీఆర్ఎస్ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. చీలిన ఓట్లు.. సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్: ఆరు సిట్టింగ్ స్థానాలకుగాను టీఆర్ఎస్ నాలుగు డివిజన్లను నిలబెట్టుకుంది. బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, రహమత్నగర్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చీలిన ఓట్లు, ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. షేక్పేట, ఎర్రగడ్డ డివిజన్లలో మైనార్టీలు పెద్దసంఖ్యలో ఉండడంతో ఎంఐఎం సులభంగా విజయం సాధించింది. ఎల్బీనగర్లో వరద సాయం, ఎల్ఆర్ఎస్ ప్రభావం ఎల్బీనగర్: ఎల్బీనగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తడంతో చాలా కాలనీలు నీట మునిగి కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అందించిన వరద సాయం అసలైన బాధితులకు అందలేదనే కారణంతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీంతో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నీట మునిగిన కాలనీలకు చెందిన వరద బాధితులకు సహాయ అందిచండంలో అధికార పార్టీ కార్పొరేటర్లు తమ బంధువర్గాలకు, సన్నిహితులకు, కార్యకర్తలకు ఇచ్చారని కారణంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించారు. పట్టు నిలుపుకొన్న ఎంఐఎం నాంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్కు ఉన్న ఒక్క స్థానాన్ని చేజార్చుకుంది. గుడిమల్కాపూర్ నుంచి బీజేపీ ఖాతా తెరుచుకుంది. బీజేపీ అగ్రనేతల ప్రచారం‘కమల’ వికాసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు చేసిన ప్రచారం బీజేపీ అభ్యర్థుల ‘స్టార్’ మార్చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అగ్రనేతలు చేసిన ప్రచారం గ్రేటర్లో ఆ పార్టీ పుంజుకునేందుకు దోహదపడింది. 150 డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకొని గ్రేటర్లో అత్యధిక సీట్లు సాధించిన రెండో పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, అనంతరం ప్రచార తీరుతెన్నులు, బావోద్వేగ ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనేలా బీజేపీ నేతల వ్యవహరించిన తీరు కమలం వికాసానికి తోడ్పడింది. గ్రేటర్ ఎన్నికలతో అధికార పార్టీ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ బలంగా చెప్పగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఉన్న అతి తక్కువ సమయంలో బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రజలకు పరిచయం లేకున్నా అగ్రనేతల ప్రచారశైలి వారికి ఓట్లు తెచ్చిపెట్టింది. ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వారాసిగూడ నుంచి సీతాఫల్మండి వరకు చేసిన రోడ్డు షో ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మిగతా డివిజన్లలో గెలుపుపై ప్రభావాన్ని చూపింది. అడిక్మేట్, కవాడిగూడ, రాంనగర్ ప్రాంతాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా నాగోల్ నుంచి చైతన్యపురి వరకు రోడ్డు షో మాత్రం అనూహ్య ఫలితాన్ని రాబట్టింది. ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును కూడా ప్రసంగాల్లో ఎండగడుతూ చేసిన ప్రచారం కమలం పార్టీకి ఓట్లు కురిపించింది. ఏకంగా ఎల్బీ నియోజకవర్గంలోని 13 సీట్లను క్లీన్స్వీప్ చేసింది. ఆర్కేపురం, సరూర్నగర్, బీఎన్ రెడ్డి, హస్తినాపురం, చంపాపేట, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్నగర్, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురిలలో కాషాయ జెండా రెపరెపలాడింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన జీడిమెట్ల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి చెరకుపల్లి తారాచంద్రరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వినిసూర్య కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఎన్నికల పరిశీలకుడు బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ వ్యూహాలను రాష్ట్ర పార్టీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అమలు చేసి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించి విజయం వైపు తీసుకెళ్లారు. మోండాలో విలక్షణ తీర్పు కంటోన్మెంట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రాంతాలతో కూడుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రజలకు అధిక సంఖ్యలో ఉన్నారు. డివిజన్ పరిధిలోనే ఉండే మారేడుపల్లిలో అధిక ఆదాయ వర్గాలు, ఉన్నత విద్యావంతుల శాతం ఎక్కువగా ఉంది. బస్తీలు పరిమిత సంఖ్యలోనే ఉండే ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉండటంతో ప్రతీ ఎన్నికల్లోనూ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విలక్షణ తీర్పునిస్తూ ఉంటారు. ఈ నేపపథ్యంలోనే తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతతో బీజేపీకి మద్దతుగా నిలిచారు. కంటోన్మెంట్కు చెందిన కీలక నేతలు రామకృష్ణ, మల్లికార్జున్లు ఇటీవలే బీజేపీలో చేరడంతో మోండా పరిధిలోని వారి అనుచరగణం పెద్ద సంఖ్యలో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. సిట్టింగ్ కార్పొరేటర్గా బరిలోని నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో చాలా వరకు నెరవేర్చకపోవడంతో కొంత వ్యతిరేకత నెలకొంది.అంబేడ్కర్నగర్, లోహియా నగర్ వంటి బస్తీల్లోనూ ఆంధ్రా సెటిలర్లు బీజేపీకి అనుకూలంగా వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్లపై వ్యతిరేకత.. టీఆర్ఎస్ను సిట్టింగ్ అభ్యర్థులే కొంపముంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లపై జనంలో వ్యతిరేకత ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి 72 మంది సిట్టింగ్లకు టీఆర్ఎస్ సీట్లు ఇవ్వగా.. ఇందులో 28 మంది మాత్రమే గెలుపొందారు. అంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురైంది. స్వయంకృతాపరాధంతో.. ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు టీఆర్ఎస్ సీట్లలో ఒకదాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి భార్య భేతి స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి బరిలో దిగారు. దీంతో ఆయన ఇతర డివిజన్లలో ప్రచారం చేయకపోవడం, వరదతో హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్లోని కాలనీలు ముంపునకు గురికావడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెరసి ఉప్పల్ సర్కిల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాప్రా సర్కిల్లో ఏఎస్రావునగర్ స్థానం మినహా అన్ని సీట్లు టీఆర్ఎస్ దక్కించుకుంది. కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి, కేసీఆర్ పథకాలు శ్రీరామరక్షగా నిలిచాయి. కొంపముంచిన అతివిశ్వాసం.. ఆరోపణలు మల్కాజిగిరి: సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అతివిశ్వాసం, వరద సహాయం అందని బాధితుల అసంతృప్తితో పాటు కార్పొరేటర్లపై ఆరోపణలు, ఉద్యమకారులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. ఓల్డ్సిటీలో బీజేపీ పాగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్సిటీలో బీజేపీ పాగా వేసింది. మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసి పాగా వేసింది. 7 టీఆర్ఎస్, ఒక ఎంఐఎం సిట్టింగ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. సికింద్రాబాద్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అయిదు డివిజన్లనూ టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. నగరం అంతా బీజేపీ పవనాలు వీచినా ఇక్కడ మాత్రం అధికార పార్టీ తన స్థానాలను పదిలపర్చుకుంది. సీఎం సహాయనిధి, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేశారు. డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరందరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి టీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వీరంతా తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్కు అండగా ఉంటున్నారు. ఫలించని మంత్రుల వ్యూహం... దిల్సుఖ్నగర్: మలక్పేట్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగు స్థానాలను ఎంఐఎం తిరిగి గెలుచుకోగా టీఆర్ఎస్ రెండు స్థానాలను కోల్పోయింది. అజంపుర, ఓల్డ్మలక్పేట్, చావుణి, అక్బర్బాగ్ డివిజన్లలో కొంత వ్యతిరేకత ఉన్నా ఎంఐఎంకు గట్టి ప్రత్యర్థులు లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా సాగింది.వరదల సమయంలో సరైన సహాయం అందకపోవడంతో మూసారంబాగ్, సైదాబాద్ డివిజన్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. దానికితో వరదసాయం అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్లో ప్రభుత్వ వ్యతిరేకత, వరదసాయం అందరికీ అందకపోవడంతో టీఆర్ఎస్ను ఓడించారు. ఇద్దరు మంత్రుల వ్యూహం ఫలించలేదు. అనూహ్యంగా బీజేపీ 5 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. టీఆర్ఎస్కు ఒక్కసీటూ దక్కలేదు. లోకల్ కేడర్ పట్టించుకోకవడం వల్లే.. హుడా కాంప్లెక్స్: లోకల్ కేడర్తో కాకుండా డివిజన్లతో సంబంధం లేని నేతల జోక్యమే అధికార పార్టీ పుట్టి ముంచిదా? అంటే అవుననే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఓటర్లతో ముఖాముఖి పరిచయాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన, బంధుగణం అధికంగా ఉన్న స్థానిక నేతలను పక్కన పెట్టి.. ఓటర్లతో ఏ మాత్రం పరిచయం లేని ఇతర ప్రాంత నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఒక్కో డివిజన్కు మంత్రి సహా ఎమ్మెల్యేలను ఇన్చార్జీలగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న లోకల్ కేడర్ను కాకుండా తమ నియోజకవర్గాల పరిధిలోని లీడర్లను రంగంలోకి దింపారు. ప్రచార సరళి, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీలో వీరే కీలకంగా వ్యవహరించారు. దీంతో లోకల్ కేడర్ మనస్తాపంతో పోల్ మేనేజ్మెంట్కు దూరంగా ఉంది. సరూర్నగర్ సిట్టింగ్ అభ్యర్థిపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినçప్పటికీ ఇతర నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక వారంతా దూరంగా ఉండిపోయారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. వరద సహాయం పంíపిణీలో చోటు చేసుకున్న అవకతవకలు కూడా బీజేపీ బలం పెంచుకునేందుకు పరోక్షంగా కారణమైంది. బీజేపీ సిట్టింగ్ స్థానం ఆర్కేపురంపై ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ భావించింది. ఆ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. అయినా ఇక్కడి ఓటర్లు మాత్రం సిట్టింగ్ అభ్యర్థి రాధాధీరజ్రెడ్డికే మళ్లీ పట్టం కటారు. ‘కార్వాన్’లో సత్తా చాటిన మజ్లిస్.. గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ మరోసారి సత్తాను చాటింది. గత ఎన్నికల్లో గెలిచిన అయిదు స్థానాల్లో ఆ పార్టీ మళ్లీ విజయం సాధించింది. ముగ్గురు సిట్టింగ్, ఇద్దరు కొత్తవారిని బరిలో దింపి టోలిచౌకి, నానల్నగర్, గోల్కొండ డివిజన్లలో మెజార్టీ మరింత పెంచుకుంది. నియోజకవర్గంలోని ఆరు స్థానాలలో అయిదు మజ్లిస్ గెలుపొందగా, జియాగూడ స్థానంలో కమలం వికసించింది. జియాగూడలో సిట్టింగ్ టీఆర్ఎస్ అభ్యర్థి మిత్ర కృష్ణ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. గట్టి పోటీ అనుకున్న లంగర్హౌస్లో మజ్లిస్ సిట్టింగ్ అభ్యర్థి మరోసారి గెలుపొందారు. కార్వాన్ నియోజకవర్గం మజ్లిస్కు కంచుకోటగా మరోసారి రుజువైంది. కార్వాన్, లంగర్హౌస్, నానల్నగర్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలుపొందారు. జియాగూడలో కమలం పదేళ్ల తర్వాత మళ్లీ వికసించింది. ఆరు డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అటు అసమ్మతి.. ఇటు మార్పు అంబర్పేట: కాచిగూడ డివిజన్లో గతంలో ఓడిన బీజేపీ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉండటం, దీనికి తోటు సిట్టింగ్ కార్పొరేటర్ రెబల్గా ఉండటంతో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్నె ఉమా రమేష్యాదవ్ గెలుపొందారు. నల్లకుంట డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి పదేళ్లు కార్పొరేటర్గా వ్యవహరించడంతో ఈ దఫా ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ అభ్యర్థి అమృతను గెలిపించారు. రెబల్గా నామినేషన్ వేసిన ఉద్యమకారుడు కట్ట సుధాకర్ను ఉపసంహరించడంలో.. సీనియర్ నాయకులను సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయలేకపోవడం ఓటమికి మరో కారణం. దీనికి తోటు ఈ డివిజన్లో ముంపు సాయం కూడా ప్రభావం చూపింది. గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా కొత్తవారైన దూసరి లావణ్యకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ మైనార్టీలతో పాటు ఎమ్మెల్యే సొంత డివిజన్ కావడంతో గులాబీ అభ్యర్థి విజయం సాధించగలిగారు. అంబర్పేట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్ పులి జగన్కు కాకుండా కొత్త అభ్యర్థి విజయ్కుమార్గౌడ్కు అధిష్టానం అవకాశం కల్పించింది. ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి నిరంజన్రెడ్డి అసమ్మతి నేతలను అతి కష్టంమీద బుజ్జగించడం, మైనార్టీ ఓటు బ్యాంకింగ్తో టీఆర్ఎస్ గెలిచింది. బాగ్ అంబర్పేట డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డిపై అసమ్మతి సెగతో పాటు కాలనీల్లో బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. వరద సాయంలో అవకతవకలూ బీజేపీ అభ్యర్థి పద్మావెంకట్రెడ్డికి కలిసివచ్చాయి. టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మూడు సిట్టింగ్ స్థానాలు స్వాహా.. అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో సాధించిన మూడు డివిజన్లను బీజేపీ దక్కించుకుంది. జాంబాగ్, గన్ఫౌండ్రీ, బేగంబజార్, గోషామహల్, మంగళ్హాట్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించగా దత్తాత్రేయనగర్ డివిజన్లో మాత్రం మజ్లిస్ విజయం సాధించింది. గత మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దత్తాత్రేయనగర్, జాంబాగ్లో మజ్లిస్ గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో జాంబాగ్ను బీజేపీ గెలుచుకుంది. దీంతో టీఆర్ఎస్ మూడు సీట్లతో పాటు మజ్లిస్ ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలా కలిసొచ్చి.. ఇలా వెనకబడి.. సనత్నగర్: సనత్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ మరోసారి విజయదుందుభి మోగించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చొరవతో పాటు ఇక్కడ మంచినీటి రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, వైకుంఠధామం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తికావడంతో పాటు అభివృద్ధే కారణంగా చెప్పాలి. అమీర్పేటలో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ శేషుకుమారి ఓటమి చవిచూశారు. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ ఆశించడంతో పాటు శేషుకుమారి అభ్యర్ధిత్వంపై బాహాటంగానే వ్యతిరేకించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు ఆమెకు పనిచేయకుండా ఓటమికి కారణమయ్యారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేసిన కేతినేని సరళకు ఉత్తర భారతీయుల ఓటింగ్ కలిసొచ్చింది. బన్సీలాల్పేటలో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హేమలత విజయానికి ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కారణంగా చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి స్పందన గట్టి పోటీ ఇచ్చినా ఆర్థిక, అంగబలం అంతగా లేకపోవడంతో ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. రాంగోపాల్పేట డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ అరుణగౌడ్ ఓటమికి స్థానికంగా కొంత బయటపడని వ్యతిరేకత. బీజేపీ అభ్యర్ధి సుచిత్ర గెలుపు వెనుక ఆ పార్టీ వేవ్తో పాటు స్థానికంగా సత్సంబంధాలు మెరుగ్గా ఉండడం, నార్త్ ఇండియన్ ఓట్లు శాతం ఎక్కువగా ఉండడం. బేగంపేట డివిజన్ నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి టి.మహేశ్వరికి గతంలో కార్పొరేటర్గా చేసిన అనుభవం, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ కలిసొచ్చాయి. -
కీలకంగా మారిన మజ్లీస్.. మద్దతు ఎవరికి?
జీహెచ్ఎంసీ మేయర్ ఎంపికలో ‘మజ్లిస్’ పాత్ర కీలకంగా మారింది. దాదాపు 30 శాతం సీట్లు దక్కించుకున్నఎంఐఎం మద్దతుపైనే మేయర్ ఎన్నిక ఆధారపడి ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.‘మేం ఎవ్వరి దగ్గరకు వెళ్లం.. మా దగ్గరికే వాళ్లు రావాలి’ అన్న రీతిలో ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల దృష్ట్యా ‘తాము కారెక్కడం కంటే తమ బండి ఎక్కితే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాం’ అని మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరో వైపు లోపాయికారీ ఒప్పందంతో టీఆర్ఎస్తో కలిసి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సాక్షి, సిటీబ్యూరో : మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేది అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ‘పార్టీలో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటాం’ అని సాక్ష్యాత్తు ఆయనే పేర్కొనడం కాస్త విస్మయం గొలుపుతోంది. చివరి వరకు విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చర్చిస్తామని చెప్పుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. (కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) ఆరేళ్ల బంధం.. గత ఆరేళ్లుగా అధికార టీఆర్ఎస్–మజ్లిస్ మధ్య దోస్తీ కొనసాగుతున్నప్పటికి ప్రతి ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీ పేరుతో ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగుతూ వచ్చారు. ఈసారి కూడా ఎవరికి వారే పోటీకి దిగగా.. టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి మజ్లిస్తో దోస్తీ గీస్తీ లేదని, గత పర్యాయం ఐదు సీట్లలో ఓడగొట్టాం.. ఈ సారి పది డివిజన్లలో ఓడిస్తామని చెప్పింది. దానికి మజ్లిస్ ఘాటుగానే స్పందించింది. పరస్పర విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరడంతో ఆరేళ్ల బంధం కాస్త బెడిసినట్టయింది. ఈ నేపథ్యంలో తిరిగి దోస్తీ కోసం ఒకరికి ఒకరు సంప్రదించుకునేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) సంఖ్యా బలంపై ధీమా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పక్షాన 44 మంది అభ్యర్థులు విజయం సాధించగా, మరో పది మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54కి చేరింది. అయితే మేయర్ పీఠం సాధించేందుకు ఈ బలం సరిపోదు. అందువల్ల టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమా..? లేక టీఆర్ఎస్ సహకారం తీసుకోవడమా? అనే రెండు మార్గాలు మాత్రమే మజ్లిస్ ముందు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మాదిరిగా పాలనలో భాగస్వాములై రెండున్నరేళ్లు మేయర్ పదవి చేపట్టడమా... లేక బేషరతుగా మద్దతిచ్చి డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడమా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం వెలువరించకుండా... వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (వాళ్లడిగితే.. ఆలోచిస్తాం) దారుస్సలాంలో సందడి మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం సందడిగా మారింది. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో వేర్వేరుగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. మేయర్ పీఠం అంశం పెద్దగా చర్చించనప్పటికీ ‘అధికారం ముఖ్యం కాదు.. ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. సమస్యలు పరిష్కరించి వారిని సంతృప్తిపర్చాలి’ అని ఆయన ఉద్బోధించారు. 51 స్థానాలకు గాను 44 డివిజన్లలో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
మంత్రులకు షాకిచ్చిన గ్రేటర్ ఫలితాలు
కమలానికి ఊపు... కారుకు కుదుపు.. పతంగి మెరుపు.. చేతికి షాకు.. గ్రేటర్ ఓటరు విలక్షణ తీర్పు వెలువరించాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ దక్కలేదు. మేయర్ సీటు రేసులో ఎవరికీ స్పష్టత ఇవ్వలేదు. ఊహించని ఫలితాలు.. ఎదురు దెబ్బలతో సిట్టింగ్లు గల్లంతయ్యారు. పెద్ద పార్టీల అభ్యర్థులకూ డిపాజిట్ దక్కక అవాక్కయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బకాగా... మరి కొందరు ఊరట చెందారు. 55 సీట్లతో అధికార టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠానికి కొద్ది దూరంలో నిలిచింది. 48 సీట్లతో బీజేపీప్రధాన ప్రతిపక్షమైంది. 44 సీట్లతో ఎంఐఎం మేయర్ ఎన్నికలో కీలకంగా మారింది. మొత్తంగా గ్రేటర్–2020 ఎన్నికలసమరం రసవత్తరంగా ముగిసింది. మేయర్ పీఠంపై సస్పెన్స్ను మిగిల్చింది. సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఫలితాలు నగర మంత్రులకు షాక్నిచ్చాయి. మంత్రులు సబిత, మహమూద్ అలీ, తలసానికి ఈ ఎన్నికలు అసంతృప్తినివ్వగా... కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఆనందాన్ని కలిగించాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి తన పరిధిలోని రెండు డివిజన్లలోను అభ్యర్థులు ఓటమి పాలుకావడం నిరాశను మిగిల్చింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన నియోజకవర్గంలో సగం సీట్లతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. రాజేంద్రనగర్ సెగ్మెంట్లో ఇన్చార్జిగా వ్యవహరించిన హోంమంత్రి మహమూద్ అలీ కూడా బల్దియా సమరంలో చతికిలపడ్డారు. మొత్తం ఐదు డివిజన్లలోనూ ప్రత్యర్థి పార్టీలే విజయం సాధించడం ఆయనకు ఆవేదన మిగిల్చింది. ఇక మంత్రులు జగదీశ్వర్రెడ్డి, గంగుల, నిరంజన్రెడ్డి, ఈటల ప్రచారం చేసిన డివిజన్లలో గులాబీకి చుక్కెదురైంది. పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి హరీశ్రావు.. ఈ మూడింటి గెలుపుతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. కాగా, సీఎం తనయ, ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా వ్యవహరించిన గాంధీనగర్లో కారుకు పరాభవమే మిగిలింది. దీంతో గ్రేటర్ ఫలితాలు మంత్రులకు షాకింగ్కు గురిచేశాయి. ఎల్బీనగర్లో అత్యధిక సీట్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం కమలం ధాటికి చెల్లా చెదురైంది. ఇక్కడ 11 డివిజన్లు ఉండగా, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. ఈ 13 డివిజన్లను బీజేపీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. ఇటీవల కురిసిన వర్షాలకు సరూర్నగర్, బీఎన్రెడ్డి, వనస్థలిపురం, నాగోల్, హస్తినాపురం డివిజన్లలో అనేక కాలనీలు నీటమునిగాయి. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వదర సహాయం అర్హులకు అందజేయకుండా కార్పొరేటర్లు, వారి బంధువులు, కార్యకర్తలు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయాలు ఇక్కడి ఓటర్లలో వ్యతిరేకతను పెంచాయి. వారసులకు దక్కని యోగం గ్రేటర్ ఎన్నికల్లో పలువురు అగ్ర నాయకుల వారసులుగా రంగంలోకి దిగిన వారిలో కొందరు గెలుపొందగా మరికొందరు ఓటమి పాలయ్యారు. వీరిలో రెండో సారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది మరోసారి గెలుపొందగా తొలిసారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది ఓటమిపాలవడం విశేషం. ఓడినవారిలో.. మాజీ మంత్రి, దివంగత నేత నాయని నర్సింహారెడ్డి వారసుడిగా రాంనగర్ డివిజన్ నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గాజుల రామారం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీచేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సతీమణి స్వప్నకు విజయం దక్కలేదు. సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా కవాడి గూడ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు పద్మ గాంధీనగర్ డివిజన్లో పోటీ చేసి గెలవలేకపోయారు. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి కుమారుడు బద్ధం మహిపాల్ రెడ్డి బంజారాహిల్స్ బీజేపీ ఆభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
గ్రేటర్.. వరదలో మునిగిన కారు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వరద దెబ్బ గట్టిగానే తగిలింది. విశ్వనగరం వైపు నగరాన్ని పరుగులు పెట్టిస్తున్నామని...‘మాది మాటలు కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన టీఆర్ఎస్... అందుకు నిదర్శనమే ఫ్లైఓవర్లు, రహదారులు, కేబుల్ బ్రిడ్జ్, స్కైవేల నిర్మాణమని ఢంకా బజాయించింది. అయితే అనుకోకుండా భాగ్యనగరాన్ని ప్రకృతి విలయం చుట్టుముట్టి కాలనీలు, బస్తీల్లోకి వరదలు వచ్చినా... అవి తాత్కాలిక ఇబ్బందులేనని, ప్రజలు తమవైపే ఉంటారని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వేసుకున్న అంచనాలను ఓటరు తలకిందులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు అందిస్తామన్న వరద సహాయం చేతికి అందకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. అయితే ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంలోనూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వరదల్లో చిక్కుకొని నష్టపోయిన వారికి రూ.10వేల ఆర్థిక సహాయమంటూ ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 6.50 లక్షల మందికి రూ.650 కోట్లు పంపిణీ చేసింది. మరో 2.50 లక్షల మందికి ఇంకా వరద సహాయం అందిస్తామని నేతలు ఎన్నికల ప్రచారం చేసినా ప్రకటించినా ప్రజలు మాత్రం ఆదరించలేదు. మరోవైపు వరద సహాయం పంపిణీలోనూ కార్పొరేటర్లు డబ్బులు నొక్కారంటూ ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీకి నష్టదాయకంగా మారిందనే ఈ ఫలితాల ద్వారా తేటతెల్లమైంది. దీనికితోడు బీజేపీని గెలిపిస్తే బాధితులకు రూ.25వేల వరద సహాయం అందిస్తామని ప్రకటించడం ఆయా అభ్యర్థుల విజయానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మటుకు వరదలు వచ్చిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయడం విశేషం. హోంమంత్రి ఇలాకాలో కారు పంక్చర్ హోంమంత్రి మహమూద్ అలీ ఇలాకా అయిన మలక్పేట నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా 5 ఎంఐఎం గెలుచుకోగా, 2 బీజేపీ కైవసం చేసుకున్నాయి. గతంలో ముసారాంబాగ్, సైదాబాద్ డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ గెలుపొందడం పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హోంమంత్రి, నియోజకవర్గ ఇంచార్జి, డివిజన్ల అధ్యక్షులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసినప్పటికీ ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఇతర పార్టీల నాయకులతో ప్రచారం చేయవద్దని ఒత్తిడి రావడంతో హోంమంత్రి తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ లేకపోతే కనీసం మూసారాంబాగ్, సైదాబాద్, అక్బర్బాగ్, ఓల్డ్ మలక్పేట డివిజన్లను గెలిచేవారమని పలువురు టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మలక్పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గ్రేటర్ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పాలి. -
గ్రేటర్లో మూడు ముక్కలాట
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2016లో నాలుగు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా అర్ధ సెంచరీకి అటు ఇటుగా నిలిచింది. 48 స్థానాలు గెలుచుకొని అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించింది. అయితే, అనూహ్య ఫలితాల వెనుకఅగ్రనేతల వ్యూహాలు.. స్థానికనేతల సమన్వయం ఆ పార్టీని విజయతీరాలకు చేర్చాయి. పార్టీలో చేరికలు.. అధికారపార్టీపైనవ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి. స్వల్పసమయంలో అగ్రనేతల పర్యటనల ఖరారు, భావోద్వేగ ప్రసంగాలతో టీఆర్ఎస్, మజ్లిస్ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ అధినేత సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక వర్గం ఓటర్లు కమలంవైపు మళ్లేందుకు కారణమయ్యాయి. (ఫలించిన వ్యూహం.. టార్గెట్ 2023) అమిత్షా చరిష్మా, జేపీ నడ్డా,యోగి ఆదిత్యనాథ్, తేజస్వీ సూర్య ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవడంలోకాషాయదళం సఫలీకృతమైంది. పట్టించుకోలేదనే ఆవేదన, సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటమికి దారితీసింది. ఈ పరిణామాలే 99 సీట్లు ఉన్న అధికారపార్టీని 55 స్థానాలకు పరిమితం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. భావోద్వేగ ప్రసంగాలు, అగ్రనేతల ప్రచార హోరుతో భాగ్యనగరంలో తొలిసారి కమలం వికసించింది. (టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సెటిలర్స్ తీర్పు) పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్ వ్యూహరచన.. అక్బర్ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. అక్కడక్కడా అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా.. ఓవైసీ సోదరుల ప్రచారంతో సీట్లు నిలుపుకుంది. జాంబాగ్ స్థానాన్ని కోల్పోయి.. కొత్తగా దాని స్థానే ఘాన్సీబజార్ను గెలుచుకుంది. కిషన్.. రాజాసింగ్కు అచ్చేదిన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈ ఎన్నికలు మధుర జ్ఞాపకంగా మారాయి. తన పరిధిలోనే గణనీయంగా సీట్లు గెలుచుకోవడమేగాకుండా.. ప్రచారపర్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. అలాగే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో అలకలు..బెదిరింపులతో పార్టీలో తొలుత వేడి పుట్టించినా.. ఆఖరికి తన నియోజకవర్గంలో సంపూర్ణ ఆధిక్యతను కనబరిచారు. వీరేగాకుండా.. ఓబీసీ మోర్చా లక్ష్మణ్, ఇతర నగర నేతలు కూడా తమ పరిధిలో సత్తా చాటారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం! గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. ఆ పార్టీ నేతల మధ్య సమన్వయలోపం, ప్రచారలేమీ, కనిపించని స్టార్ క్యాంపెయినర్లతో ప్రజల దరికి చేరలేకపోయింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి సెగ్మెంట్లలో మాత్రం రెండు సీట్లను గెలుచుకొని కాస్తోకూస్తో పరువు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఆనేక చోట్ల ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇక టీడీపీ గ్రేటర్లో తుడుచుకుపెట్టుకుపోయింది. సీట్ల మాట అటుంచితే పోటీ చేసిన ఏ స్థానంలో కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఎమ్మెల్యేలకు కలిసిరాని ఎన్నికలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి ఈ ఎన్నికలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. తన పరిధిలోని 11 సీట్లను ప్రత్యర్థి పార్టీ కైవసం చేసుకోవడం ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఉప్పల్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు కలిసిరాలేదు. తమ పరిధిలోని మెజార్టీ డివిజన్లను దక్కించుకోకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. -
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. హైటెక్ సిటీని తామే నిర్మించామని, చంద్రబాబు విజన్తోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పార్టీకి జీహెచ్ఎంసీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివి జన్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేక పోయారు. ఇప్పటికే గ్రామీణ తెలంగాణలో దాదాపు కనుమరుగయిన తెలుగుదేశం పార్టీ, జీహెచ్ఎంసీ ఫలితాలతో హైదరా బాద్లో ఖతం అయిందని, ఇక ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్ అయినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల సంద ర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా బోసిపోయింది. కనీసం ఒక్క నాయకుడు కూడా కార్యాలయానికి వచ్చి ఫలితాలపై ఆరా తీసే పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం. తల్లీ, కొడుకు పోటీ.. చేజారిన సీటు హయత్నగర్: వాళ్లిద్దరూ తల్లీ.. కొడుకులు. గ్రేటర్ ఎన్నికల్లో ఒకే డివిజన్ నుంచి పోటీలో నిలిచారు. ఇందులో తల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కాగా, కొడుకు స్వతంత్ర అభ్యర్థి. అయితే ఈ పోటీ చివరికి బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చింది. ఎలాగంటే... ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బీఎన్రెడ్డినగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరఫున ముద్దగోని లక్ష్మీప్రసన్న, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె కొడుకు రంజిత్గౌడ్, బీజేపీ నుంచి మొద్దు లచ్చిరెడ్డి పోటీ చేశారు. ముద్దగోని లక్ష్మీప్రసన్నకు 11,406 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డికి 11,438 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 32 ఓట్ల తేడా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీప్రసన్న కొడుకు రంజిత్ గౌడ్కు 39 ఓట్లు వచ్చాయి. ఆ 39 ఓట్లు లక్ష్మీప్రసన్నకు వచ్చి ఉంటే ఆమెనే విజయం సాధించి ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తల్లీ.. కొడుకు పోటీలో ఉండడంతో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ ఈ సీటును దక్కించుకుంది. సింగిల్ డిజిట్.. నాలుగో స్థానం సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి కుదేలైంది. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చిత్తయింది. 150 డివిజన్లకు 146 చోట్ల పోటీ చేసి కేవలం 2 స్థానాల్లోనే గెలుపొంది నాలుగో స్థానానికి పరిమిత మైంది. గతంలోనూ కాంగ్రెస్కు జీహెచ్ఎంసీలో ఇద్దరే సభ్యులుండగా ఇప్పుడు కూడా ఇద్దరే గెలిచారు. ఓట్ల శాతం పరంగా చూస్తే గతంకన్నా కొంత మెరుగుపడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నా... లభించిన స్థానాలు, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శన పేలవంగానే ముగిసిందని రాజకీయ ముఖచిత్రం వెల్లడిస్తోంది. మొత్తం బల్దియా పరిధిలో కేవలం 15–20 డివిజన్లలోనే ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ పరిమితం కావడం టీఆర్ఎస్కు ప్రత్యామ్నా యం తామేనన్న ఆ పార్టీ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కనీస పోటీ ఏదీ? గ్రేటర్ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజ యం సాధించి దూకుడు మీద ఉన్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించు కోవాలని, తద్వారా రాష్ట్రంలో టీఆర్ ఎస్కు దీటుగా నిలబడేది తామేనని ప్రజలకు సంకేతం ఇవ్వాలని ఆశిం చారు. కానీ అందుకు భిన్నంగా గ్రేటర్ తీర్పు రావడంతో భవిష్యత్తుపై కూడా ఆ పార్టీ నేతలకు బెంగ పట్టుకుంది. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహి స్తున్న మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న 47 డివిజన్లు, ఇతర శివారు స్థానాల్లో సత్తా చాటగలమని, పార్టీ కేడర్ బలంగా ఉన్నందున కనీసం డబుల్ డిజిట్ స్థానాల్లో విజ యం దక్కు తుందని కాంగ్రెస్ నేతలు లెక్కలేసు కున్నారు. అదే ధీమాతో ఎన్ని కలను ఎదుర్కొన్నారు. కానీ రేవంత్ కోటలోనూ కాంగ్రెస్ కంగు తింది. మైనార్టీలు, సెటిలర్లు, శివారు కాలనీల్లోని బస్తీల ప్రజలు తమకు అండగా నిలుస్తారనే కాంగ్రెస్ అంచ నాలు తారుమారు కావడంతో ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్తోపాటు సీఎల్పీ నేత భట్టి, ముఖ్య నాయకులంతా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. భవిష్యత్తు ఏమిటో..? గ్రేటర్ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను పునరాలోచనలో పడే స్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపుదిద్దు కుంటోందనే చర్చలు ఆ పార్టీ నేతల భవిష్య త్తుపై గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగ బోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో ఏం జరుగు తుందో ననే ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. ఇక్కడ కూడా ఇవే ఫలితాలు పునరావృ తమైతే తామిక మూడో స్థానంలో సెటిల్ కావడం ఖాయమేనని ఆ పార్టీ నేతలు బహిరంగం గానే వ్యాఖ్యానిస్తు న్నారు. పార్టీ ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ప్రజలపక్షాన దూకుడుగా వ్యవహరించా లని, లేదంటే ఎన్ని ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం వస్తుం దని వారంటున్నారు. మరి గ్రేటర్ తీర్పుతో కాంగ్రెస్ ఏం మారుతుందో.. ప్రత్యామ్నా యం దిశగా ఏ మేరకు ముందు కెళ్తుందో వేచి చూడాల్సిందే. -
టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సెటిలర్స్ తీర్పు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కీలకాంశాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ సీమాంధ్రకు చెందిన వారిలో అత్యధికులు ‘కారు’తోనే ప్రయాణిస్తున్నారని స్పష్టమైంది. అయితే ఉత్తరాది నుంచి వలసవచ్చిన, దక్షిణ తెలంగాణకు చెందిన ‘సెటిలర్స్’తీర్పు మాత్రం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వాళ్ళల్లో అత్యధికులు అభివృద్ధికే జై కొడుతూ టీఆర్ఎస్కే ఓటు వేసినట్లు ఈ ఫలితాలు పునరుద్ఘాటించాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు పలికారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పట్టం కట్టారు. ఫలితంగానే శేరిలింగంపల్లి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్ భారీగా సీట్లు దక్కించుకుంది. ఈ ఏరియాల్లో స్థిరపడిన వారిలో రాయలసీమ, దక్షిణాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ తమను అక్కున చేర్చుకున్న టీఆర్ఎస్తోనే కలసి నడుస్తున్నారు. ఫలితంగా శేరిలింగంపల్లిలో అత్య ధిక సీట్లు రాగా.. కూకట్పల్లిని టీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఉత్తరాది వారు బీజేపీతోనే.. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రం బీజేపీకి జై కొట్టారు. ఈ కారణంగానే కోర్ సిటీలోని అనేక ప్రాంతాలతో పాటు ఉత్తరాది వారు స్థిరపడిన గోషామహాల్, గన్ఫౌండ్రి, బేగంబజార్, జియాగూడ, హిమాయత్నగర్ తదితర డివిజన్లలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్షా, మంత్రి జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తది తరులు వీరిని ప్రభావితం చేయ గలిగారు. దక్షిణ తెలంగాణ వాసులు ఎక్కువగా నివసిం చే ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతా ల్లోనూ ఈ సారి టీఆర్ఎస్ పార్టీ తన మార్కు చూపించ లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్కు కాస్త పట్టు తక్కువగా ఉంది. ఇక గతంలో పోలిస్తే ఈసారి టెకీలు అతి తక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారందరూ అభివృద్ధికి పట్టం కడుతూ అధికార పార్టీకి జై కొట్టారు. ఈ కారణంగానే ఐటీ జోన్లో ఉన్న డివిజన్లలో ఒక్క గచ్చిబౌలి మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగిరింది. -
ఫలించిన వ్యూహం.. టార్గెట్ 2023
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కమలం వికసించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. టీఆర్ఎస్ కారు స్పీడును నిలువరించింది. 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకింది. దుబ్బాక విజయం ఇచ్చిన స్ఫూర్తితో గ్రేటర్లోనూ హవా కొనసాగించింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో రెండో స్థానంలో ఉన్న ఎంఐఎంను వెనక్కితోసింది. కాంగ్రెస్ను 4వ స్థానంలోకి నెట్టి రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలను పంపింది. దుబ్బాక కిక్కుకు తోడు జీహెచ్ ఎంసీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని కమల నాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో టార్గెట్ 2023 (అసెంబ్లీ ఎన్నికలే) లక్ష్యంగా తమ కార్యా చరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. (బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్) ఫలించిన వ్యూహం.. ప్రత్యేక కార్యాచరణ బీజేపీ అనుసరించిన వ్యూహం, ప్రత్యేక కార్యాచరణ ఫలితాలను ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమించి బాధ్యతలను అప్పగించి పనిచేయించింది. వారికి అదనంగా 26 కమిటీలు, పార్టీ శ్రేణులు బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశాయి. రోడ్షోలు, బస్సుయాత్రలతో ప్రచారం నిర్వహించారు. పనిచేసిన భూపేంద్రజాలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను విజయ తీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పంపించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, సీనియర్ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితర నేతల ప్రచారానికితోడు పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతల ప్రచారం బీజేపీకి మేలు చేసిందని పార్టీ వర్గాలు భావిస్తు న్నాయి. పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో మాట్లాడాల్సిన అంశాలను కూడా భూపేంద్రయాదవ్ సూచనల మేరకు రూపొందించి అమలు చేయడం కలిసొచ్చింది. కుల సమీకరణలు తోడుగా.. వివిధ కుల, విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశాలు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహద పడ్డాయి. మాజీమంత్రి డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. బీసీ సామాజిక వర్గాల్లో గౌడ్, యాదవ, మున్నూరుకాపులతోపాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పనిచేయడం కలిసివచ్చింది. టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య అవగాహన ఉందని యువత మెదళ్లలోకి ఎక్కించడంలో బండి సంజయ్ సఫలమయ్యారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, అక్ర మంగా వలస వచ్చిన వారిని, రోహింగ్యాలను ఏరివేస్తా మని చెప్పడం వారిని బీజేపీ వైపు మళ్లించింది. ఇక ఆపరేషన్ అసెంబ్లీనే.. ఓవైపు దుబ్బాక విజయం.. మరోవైపు జీహెచ్ఎంసీలో అత్యధిక స్థానాలు గెలుపొందడంతో బీజేపీ ఆనందంలో మునిగింది. ఈ విజయాలే సోపానాలుగా, ఈ ఎన్నికల్లో పని చేసిన తీరునే స్ఫూర్తిగా ముందుకుసాగాలని నిర్ణయించింది. రాష్ట్ర పార్టీ నేతలంతా ఇదే ఐక్యతతో మరో మూడేళ్లలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా పార్టీని అధికారంలోకి తేవచ్చన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాల వరకు పార్టీని తీసుకెళ్లడం పట్ల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి అనుకూల నినాదాలు చేశారు. అనంతరం సంజయ్తోపాటు పార్టీ ముఖ్య నేతలు కిషన్రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్రావు తదితరులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ బండి సంజయ్కి స్వీటు తినిపించి సంబురాలు జరుపుకున్నారు. ఉపయోగపడిన టీఆర్ఎస్పై వ్యతిరేకత ఆరేళ్లలో హైదరా బాద్ అభి వృద్ధి విషయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యా లను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. బ్యాలెట్ ఓట్లు 83 డివిజన్లలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రావడమే ఇందుకు నిదర్శనం. వరదసాయం పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా బీజేపీ వ్యతిరేకప్రచారాన్ని బలంగా తిప్పికొట్టగలిగింది. -
టీఆర్ఎస్కు కౌంట్డౌన్
గడీల పాలనను బద్ధలు కొట్టే దమ్మున్న పార్టీ బీజేపీనేనని, గడీల నుంచి సీఎం కేసీఆర్ను బయటకు తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. కారుకు సన్ స్ట్రోక్ తగిలిందని, కమలానికి సన్రైజ్ కలిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు కౌంట్డౌన్ మొదలైందన్నారు. ఎంఐఎంకు, టీఆర్ఎస్కు సీట్లు తగ్గాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. తాము అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోబోమని, హైదరాబాద్ ప్రజల సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. –సాక్షి, హైదరాబాద్ సారు, కారు.. ఇక రారు.. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని సంజయ్ చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా భారీగా పెరిగింది. కార్యకర్తల కంటే ఎక్కువగా ఎన్నికల కమిషనర్, డీజీపీ టీఆర్ఎస్ కోసం కష్టపడ్డారు. బీజేపీ విజయాన్ని ఎన్నికల కమిషనర్, డీజీపీకి అంకితం ఇస్తున్నాం. సారు, కారు.. ఇక రారు. 2023లో కారు షెడ్డుకు పోవడం ఖా యం. అర్ధరాత్రి ఎన్నికల కమిషనర్ తప్పుడు సర్క్యులర్ను విడుదల చేయటం దారుణం’ అని అన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకిస్తూ తీర్పు.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు తీర్పు ఇచ్చారని సంజయ్ పేర్కొన్నారు. ‘ఇదీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. భాగ్యనగర్ ప్రజలు సర్జికల్ స్ట్రైక్కు అవకాశం ఇవ్వలేదు. అయితే టీఆర్ఎస్పై సాఫ్రాన్ స్ట్రైక్ చేశాం. ప్రచారంలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఎన్నికల ఇన్చార్జి భూపేంద్రయాదవ్లకు ధన్యవాదాలు’అని చెప్పారు. కేటీఆర్కు ప్రజలే జవాబిచ్చారు: కిషన్రెడ్డి ‘కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన సవాల్ను స్వీకరించాలి. టీఆర్ఎస్ వేగంగా ప్రజల ఆదరణను కోల్పోతోంది. 2023లో బీజేపీఅధికారంలోకి రావడానికి ఈ గ్రేటర్ ఎన్నికలే ప్లాట్ఫాం. అక్రమ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదు. కూలిపోతున్న టీఆర్ఎస్లోకి తమ కార్పొరేటర్లు వెళ్లబోరు’అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: లక్ష్మణ్ ఈ ఫలితాలు టీఆర్ఎస్ పతనానికి నాంది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘టీఆర్ఎస్ మతోన్మాద మజ్లిస్ మైత్రిని ప్రజలు గుర్తించారు. అందుకే టీఆర్ఎస్ను ఓడించారు. నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తామని జాతీయ ఉపాధ్యక్షురా లు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టిన కోర్టు : సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఏ గుర్తు వేసినా ఓటు చెల్లుతుందని ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ను సస్పెండ్ చేసి, ఓటర్ల విశ్వాసాన్ని కోర్టు నిలబెట్టిందని బండి సంజయ్ చెప్పారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ‘ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని పెంచింది. ఇది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రజాతీర్పును గౌరవించలేని వ్యక్తికి సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ 12% నుంచి 18% శాతానికి ఎలా పెరిగింది. కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్టుండి 90 శాతానికి పోలింగ్ పెరిగింది. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందనే అనుమానం ఉంది. దీనిపై కూడా విచారణ జరపాలి’అని సంజయ్ వ్యాఖ్యానించారు. -
కార్పొరేటర్ సింధుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కొత్త మహిళా మేయర్ ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యుల బలం గులాబీ పార్టీకి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 98ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతు కూడగట్టుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. టీఆర్ఎస్ నుంచి ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలుపేర్లు వినిపిస్తుండగా... భారతీనగర్ డివిజన్ నుంచి గెలిచిన వి.సింధును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్కు పిలిపించుకున్నారు. దాంతో ఆమెనే మేయర్ పీఠం వరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆశావహులు చాలామందే ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్థన్రెడ్డి భార్య, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరంతా రెండో పర్యాయం గెలిచినవారే. వీరితోపాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. ఈసారి మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఓసీల నుంచే అవకాశం కల్పించనున్నారని బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సింధును పిలవడం ఇందుకు ఊతమిస్తోంది. జీహెచ్ఎంసీగా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి మహిళా మేయర్గా కార్తీకరెడ్డి బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. -
ఎంఐఎంని వెనక్కి నెట్టిన కమలం..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఎన్నికల ఫలితాలు ముగింపుకు చేరుకున్నాయి. మరొక డివిజన్లో ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో పోలీస్తే.. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి, పతంగి పార్టీకి షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్ని సాధించగా.. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద రెండో పార్టీగా నిలిచింది. ఇక ఈ సారి బల్డియా పోరులో ఫలితాలు తారుమారయ్యాయి. గ్రేటర్ ఓటర్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన ఎంఐంఎ ఈ సారి 43 మాత్రమే సాధించింది. ఇక గతంలో 4స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి.. రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి.. ఎంఐఎంని వెనక్కి నెట్టింది. కానీ పాత బస్తీలో మాత్రం పాగా వేయలేకపోయింది. అమిత్ షా భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికి పాతబస్తీలో తమకు తిరుగు లేదని పతంగి పార్టీ మరోసారి రుజువు చేసుకుంది. ఈ సారి ఎంఐఎం మూడో స్థానానికి పరిమితమయ్యింది. అయినప్పటికి మేయర్ ఎన్నికల్లో ఎంఐంఎ కీలక పాత్ర పోషించనుంది. (చదవండి: హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్) -
మేయర్ పీఠంపై ఉత్కంఠ..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐంఐ-బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతిస్తుందా.. లేదా.. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. (చదవండి: టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! ) గతంలో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఇలాంటి అవగాహనకు వస్తాయా.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారం పంచుకుంటాయా.. లేక ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
‘పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్పై స్పందిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరా హోరిగా పోరు సాగింది. టీఆర్ఎస్ 56 స్థానాలు దక్కించుకొని అతిపెద్ద పార్టీగా నిలవగా బీజేపీ 47 డివిజన్లలో విజయ కేతనం ఎగురవేసి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దుబ్బాక ఉప ఎన్నిక జోష్లో ఉన్న బీజేపీ గ్రేటర్లో మరింత దూకుడుగా వ్యవహరించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి భారీగా పుంజుకుంది. చదవండి: బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్.. జీహెచ్ఎంసీ ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన సవాల్ను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆదరణను వేగంగా కోల్పోతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్ ఎన్నికలు ప్లాట్ ఫామ్గా నిలిచిందన్నారు. చదవండి: టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులను సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. కూలిపోతున్న టీఆర్ఎస్ పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్లరని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్పై స్పందిస్తామన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా -
టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. రెండు చోట్ల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించగా, మరో రెండుచోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇకపోతే, బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్ జరిగింది. తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయడంతో అక్కడ రీకౌంటింగ్ జరిపారు. రీకౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మి అభ్యర్థికి పడటంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ అసలు అభ్యర్థి ఓడిపోయినట్టయింది. -
హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీఆర్ఎస్-56, బీజేపీ-48,ఎంఐఎం-44, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ప్రకటించినప్పటికి తాజా ఫలితాల్లో మాత్రం 56 స్థానాలకే పరిమితమయ్యింది. ఎలాగు ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోనున్నప్పటికి.. గ్రేటర్ ఫలితల్లో టీఆర్ఎస్కు భారీ పరాజయమనే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ పోరులో బీజేపీ, కారుకు బాగానే బ్రేక్ లేసిందనే చెప్పవచ్చు. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. శివారు కాలనీల్లో దూసుకుపోయిన కారు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ చివరకు మేజిక్ ఫిగర్ కూడా చేరలేదు. తాజా ఫలితాల్లో టీఆర్ఎస్ నగర శివార్లలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికి సిటీలో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. ఎన్ని ఉచిత హామిలిచ్చినా ఓటరు పెద్దగా పట్టించుకోలేదు. ఆరేళ్లలో టీఆర్ఎస్ సిటీలో పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేకపోగా.. తాజాగా వరదల సమయంలో.. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేటర్లు స్పందించిన తీరు నగరవాసికి నచ్చలేదు. దాంతో కేవలం 56 స్థానాలతో సరిపెట్టాడు. కేసీఆర్ ప్రకటించిన 10 వేల రూపాయల వరద సాయం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టం చేసింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లే ఓటింగ్ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. 4 నుంచి 48కు ఎదిగిన బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బల్దియాలో కూడా బలంగా తన ప్రభావం చూపించింది. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైమన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రేటర్లో బీజేపీ పుంజుకోవడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంఐఎం, అధికార పార్టీ నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రం పొందిన ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుపుతూ.. ప్రచారంలో దూసుకుపోయింది బీజేపీ. ఈ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించనప్పటికి రెండో స్థానంలో కొనసాగడం అంటే కమలానికి గెలుపుతో సమానం. ఇక గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ మరో సారి రుజువు చేసింది. ఇక గ్రేటర్ జోష్నే కొనసాగిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కారును కట్టడి చేయగల్గుతుందనడంలో సందేహం లేదు. (చదవండి: షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!) పాతబస్తీలో పట్టు నిలుపుకున్న మజ్లీస్ ఇక మజ్లీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోన్నక్కర్లేదు. పాతబస్తీలో పతంగి పార్టీకి మంచి పట్టుంది. 40కిపైగా స్థానాల్లో మజ్లీస్ విజయం సాధిస్తుందని ముందు నుంచి అంచనా వేసిందే. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి కూడా ఆ స్థానాలను నిలుపుకుంది. సింగిల్ డిజిట్కే పరిమితమైన హస్తం వరుస ఓటములతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. గ్రేటర్లో కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. అధికార పార్టీకి పోటిగా తాము గెలిస్తే ఏకంగా వరద సాయం 50 వేల రూపాయలు ఇస్తామన్నప్పటికి ఓటరు కాంగ్రెస్ను లైట్ తీస్కున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్కు కార్యకర్తల బలం ఉన్నప్పటికి పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయం లోపం.. ప్రచారానికి అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం వంటి అంశాలు కాంగ్రెస్కు ప్రతికూలంగా మారాయి. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా ట్వీట్) బోణీ కూడా కొట్టని తెలుగుదేశం పార్టీ గెలవమని తెలిసి కూడా 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఇక తెలంగాణలో టీడీపీ తన ఉనికిని పూర్తిగా మర్చిపోతే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. -
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: హస్తం ఖేల్ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్! ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. చదవండి: 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: బండి సంజయ్ -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: సైకిల్ పంక్చర్!!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేయగా ఒక్కటి కూడా గెలవలేదు. ఏ డివిజన్లోనూ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవటం గమనార్హం. ( గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..) కాగా, గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా 68 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఈ సారి 150 స్థానాల్లో పోటీ చేసి 49 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక టీఆర్ఎస్ 56, ఎమ్ఐఎమ్ 43 స్థానాలు సొంతం చేసుకున్నాయి. -
2023లో అధికారమే లక్ష్యంగా : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గానూ 47 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్లో సత్తా చాటింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 47 సీట్లను కైవసం చేసుకొని మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్క్ష్మణ్లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 2023లో తెలంగాణలో అధికారమే లక్క్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. (చదవండి : గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..) కాగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా హంగ్ ఏర్పడడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించి గ్రేటర్ పరిధిలో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 49( రెండు ఆధిక్యం), ఎంఐఎం 43, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. కాగా 100 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ ఒక్కస్థానం గెలవకపోగా చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతవ్వడం విశేషం. కాగా గ్రేటర్లో మేయర్ ఎన్నికకు ఎంఐఎం పార్టీ కీలకం కానుంది. -
బరిలో తోడల్లుళ్లు.. జూపల్లిదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లిలో టీఆర్ఎస్ క్లీన్స్విప్ చేసింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్రావు నగర్, ఉప్పల్లో కాంగ్రెస్ గెలుపు -
గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్ఎస్ 54 స్థానాల్లో విజయం సాధించగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం 58-60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఇప్పటివరకు 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ఎంఐఎం తాను పోటీ చేసిన 52 స్థానాలకు గానూ 39 స్థానాల్లో గెలిచి.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా పార్టీల వారిగా వివిధ పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. టీఆర్ఎస్ కాప్రా - స్వర్ణ రాజ్ చర్లపల్లి - బొంతు శ్రీదేవి శేరిలింగం పల్లి - రాగం నాగేందర్ బోరబండ - బాబా ఫసియుద్దీన్ భారతీ నగర్ - సింధూ ఆదర్శ్ రెడ్డి మెట్టుగూడ - రాసూరి సునీత సూరారం - మంత్రి సత్యనారాయణ బాలాజీ నగర్ - పగడాల శిరీష రంగా రెడ్డి నగర్ - శేఖర్ గౌడ్ కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్ కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణ పఠాన్ చెరువు - మెట్టు కుమార్ హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్ ఆల్వాల్ - చింతల విజయశాంతి రెడ్డి వెంకటాపురం - సబితా గౌడ్ జగద్గిరిగుట్ట - జగన్ వివేకానందనగర్ - మాదవరం రోజా గోల్నాక - దూసరి హఫీజ్ పేట్ - పూజిత కొండాపూర్ - హమీద్ పటేల్ యూసుఫ్ గూడ - రాజ్ కుమార్ పటేల్ ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్ నాచారం - శాంతి సాయిజేన్ ఖైరతాబాద్..విజయా రెడ్డి గాజులరామారం- రావుల శేషగిరి సోమాజిగూడ- వనం సంగీత బీజేపీ అమీర్ పేట్ - సరళ చిలుకా నగర్ - గోనె శైలజ హబ్సిగూడ - చేతన అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్ హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి గచ్చి బౌలి - గంగా ధర్ రెడ్డి అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్ జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి గుడిమల్కాపూర్ - కర్ణాకర్ హస్తినాపురం - బానోతు సుజాత వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి చైతన్య పురి - నర్సింహ గుప్త మోండా మార్కెట్- దీపిక బేగంబజార్- శంకర్ యాదవ్ గోశామహల్ 51- లాల్ సింగ్ మంగల్ హాట్ - శశి కళ జాంబాగ్ - రాకేష్ జైస్వాల్ గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ఎంఐఎం చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ డబీర్ పుర - ఎంఐఎం ఉప్పుగూడ - ఆబ్దాద్ తలాబ్ చంచలం - సమీనా బేగం నవాబ్ సహేబ్ కుంట - షీరీన్ కాతూన్ మెహెదీ పట్నం- మాజిద్ హుస్సేన్ సంతోష్ నగర్ - ముజ్ఫర్ హుస్సేన్ దత్తత్రేయనగర్ - జాకీర్ బక్రి మొగల్పుర - నస్రీన్ సుల్తానా ఛాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ రియాసత్ నగర్- మిర్జా ముస్తాఫా బేగ్ ఆనంద్ నగర్ - నసీరుద్దీన్ రమాన్సపుర- అబ్దుల్ ఖాదీర్ జహనుమా-అబ్దుల్ ముక్తదీర్ శాస్ర్తీపురం కాంగ్రెస్ ఏస్ రావ్ నగర్ - సింగిరెడ్డి శిరీషా రెడ్డి ఉప్పల్ - రజిత -
ఏఎస్రావు నగర్, ఉప్పల్లో కాంగ్రెస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రెండు డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే వీరిద్దరూ మహిళా అభ్యర్థులే కావడం విశేషం. ఏఎస్ రావు నగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్ (10వ డివిజన్) నుంచి మందముల్లా రజిత 5912 ఓట్లతో గెలుపొందారు. కాగా గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారనే చెప్పవచ్చు. ( జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ) ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. నేను చేసిన అభివృద్ధే గెలిపించింది: రజిత ప్రజా సంక్షేమం కోసం తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపించాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల్లా రజిత అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీలు మారతానన్న మాటలు అవాస్తవం అని స్పష్టం చేశారు. -
హస్తం ఖేల్ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం గ్రేటర్లో మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలుచోట్ల అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్పై మజ్లీస్ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం నమోదు చేసింది. (మెజార్టీ డివిజన్లలో బీజేపీ ఆధిక్యం) రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్ఎస్... బ్యాలెట్ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్ 40 డివిజన్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 20, ఎంఐఎం అభ్యర్థులు 16 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించిన.. గ్రేటర్లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్ మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. యూసఫ్గూడ (రాజ్కుమార్ పటేల్), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. ఏఎస్రావు నగర్లో కాంగ్రెస్ (శిరీషారెడ్డి) గెలుపొంది.. గ్రేటర్లో ఖాతా తెరిచింది. పలుచోట్ల టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని డివిజన్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంది. సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక గ్రేటర్ ఫలితాల్లో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. -
బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్ఎస్ పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. హిమాయత్నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 17, బీజేపీ 10, కాంగ్రెస్ జంగంమెట్ డివిజన్ : ఎంఐఎం 7, బీజేపీ 6 ఉప్పుగూడ డివిజన్ : బీజేపీ 5, ఎంఐఎం 4 చంద్రయాణగుట్ట డివిజన్ : ఎంఐఎం 1, టీఆర్ఎస్ 1 కంచన్బాగ్ డివిజన్ : బీజేపీ 2, ఎంఐఎం 1 రియాసత్నగర్ డివిజన్ : ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్ఎస్ 1 లలితాబాగ్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1 నేరేడ్మెట్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 3, నోటా 1 వినాయక్నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 1 బన్సీలాల్పేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 2 రాంగోపాల్పేట డివిజన్ : టీఆర్ఎస్ 2 బేగంపేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2 మోండామార్కెట్ డివిజన్ : బీజేపీ 9, టీఆర్ఎస్ 1 ఈస్ ఆనంద్బాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 3, కాంగ్రెస్ 1 ఫలక్నుమా డివిజన్ : ఎంఐఎం 2 నవాబ్సాహెబ్కుంట డివిజన్ : ఎంఐఎం 3 దూద్బౌలి డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1 రణ్మస్తపురా డివిజన్ : ఎంఐఎం 4 కిషన్బాగ్ డివిజన్: ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1, బీజేపీ 2 సైదాబాద్ డివిజన్ : బీజేపీ 30, టీఆర్ఎస్ 6 ముసారాంబాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1 ఓల్డ్ మలక్పేట్ డివిజన్ : టీఆర్ఎస్ 1 అజంపురా డివిజన్ : ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 చామిని డివిజన్: బీజేపీ 2 అడిక్మెట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్) : బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 రామ్నగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 5 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 హయత్నగర్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1 బోయిన్పల్లి డివిజన్ : టీఆర్ఎస్ 8, బీజేపీ 7 హైదర్నగర్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 భారతీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 గచ్చిబౌలి డివిజన్ : టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 వనస్థలిపురం డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1 చంపాపేట్ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 3 లింగోజీగూడ డివిజన్ : బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1 హస్తినాపురం డివిజన్ : బీజేపీ 2 పటాన్చెరు డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 కూకట్పల్లి డివిజన్ : బీజేపీ 24, టీఆర్ఎస్ 21, టీడీపీ 2, నోటా 2 సూరారం డివిజన్: టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2 గాజులరామారం డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 అల్వాల్ డివిజన్ : బీజేపీ 12, టీఆర్ఎస్ 6, నోటా1, చెల్లనివి 23 జీడిమెట్ల డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 4, చెల్లనివి 1 సుభాష్నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 9, బీజేపీ 3 కొండాపూర్ డివిజన్ : బీజేపీ 5 అల్లాపూర్ డివిజన్ : బీజేపీ 3 మూసాపేట్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, టీడీపీ 1 ఫతేనగర్ డివిజన్ : టీఆర్ఎస్ 1 కేపీహెచ్బీ కాలనీ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2 బాలాజీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 మన్సూరాబాద్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 5 కవాడీగూడ డివిజన్ : బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 మాదాపూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మియాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 హఫీజ్పేట డివిజన్ : బీజేపీ 4 చందానగర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మూసాపేట డివిజన్ : బీజేపీ 15, టీఆర్ఎస్ 8, టీడీపీ 1 బాలానగర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 జగద్గిరిగుట్ట డివిజన్ : బీజేపీ 1, టీఆర్ఎస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 20, బీజేపీ 14 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 1 బీఎన్రెడ్డి డివిజన్ : టీఆర్ఎస్ 10, బీజేపీ గాంధీనగర్ డివిజన్ : బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటా 1 భోలక్పూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 -
నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.106 చోట్ల పోటీ చేసిన టీడీపీకి.. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా, 48 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాగా, స్వస్తిక్ గుర్తుపై నెలకొన్న వివాదం కారణంగా నేరెడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఫలితం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలుపుదల చేశారు. రిటర్నింగ్ అధికారి.. ఎస్ఈసీకి నివేదిక పంపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు.. కుత్బుల్లాపూర్ (8): టీఆర్ఎస్-7, బీజేపీ-1 పటాన్చెరు (3): టీఆర్ఎస్ - 3 శేరిలింగంపల్లి (10): టీఆర్ఎస్-9, బీజేపీ-1 జూబ్లీహిల్స్ (7): టీఆర్ఎస్ - 4, ఎంఐఎం - 2, బీజేపీ -1 ముషీరాబాద్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 అంబర్పేట్ (5): బీజేపీ-3, టీఆర్ఎస్-2 గోషామహల్ (6): బీజేపీ-5, ఎంఐఎం-1 చార్మినార్ (5): ఎంఐఎం-5 చాంద్రాయణగుట్ట (7): ఎంఐఎం-6, బీజేపీ-1 బహదూర్పురా (6): ఎంఐఎం-6 యాకుత్పురా (7): ఎంఐఎం-5, బీజేపీ-2 మలక్పేట్ (6): ఎంఐఎం-4, బీజేపీ-2 మహేశ్వరం (2): బీజేపీ-2 ఉప్పల్ (10): టీఆర్ఎస్-6, బీజేపీ-2, కాంగ్రెస్-2 ఎల్బీనగర్ (11): బీజేపీ-11 రాజేంద్రనగర్ (5): ఎంఐఎం-2, బీజేపీ-3 మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ విజయం మైలార్ దేవుపల్లి డివిజన్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్రెడ్డి విజయం సాధించారు. సమీప అభ్యర్థి మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే సోదరుడు ప్రేమ్దాస్ గౌడ్పై గెలుపొందారు. ఫలితం ఆశించినంతగా రాలేదు: కేటీఆర్ గ్రేటర్ ఫలితం తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామని అన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేయర్ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మచ్చబొల్లారం డివిజన్లో వివాదం.. మచ్చబొల్లారం డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 36 ఓట్లతో తొలత టీఆర్ఎస్ గెలుపొందగా, రీ కౌంటింగ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. కౌంటింగ్ కేంద్రం ముందు బీజేపీ ఆందోళనకు దిగింది. బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్.. బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్ఎస్ పరాజయం పాలైంది. 32 ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థికి 39 ఓట్లు రాగా, 32 ఓట్లతో బీఎన్రెడ్డి నగర్ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తమ్కుమార్రెడ్డి రాజీనామా.. పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగమెట్లో హోరాహోరీ.. జంగమెట్లో ఉత్కంఠ నెలకొంది. పోటీ హోరాహోరి కొనసాగుతుంది. 603 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ కొనసాగుతుంది. గతంలో జంగమెట్ ఎంఐఎం సిట్టింగ్ సీటు కాగా, అక్బరుద్ధిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రాయణ గుట్ట అసెంబ్లీ పరిధిలోనిది. గోషామహల్లో ఆరు డివిజన్లు బీజేపీవే.. గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. బేగంబజార్ - శంకర్ యాదవ్, గోషామహల్ - లాల్ సింగ్, మంగళ్ హాట్ - శశి కళ, జాంబాగ్ - రాకేష్ జైస్వాల్, గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్లు విజయం సాధించారు. ప్రగతి భవన్కు సింధు ఆదర్శ్ రెడ్డి? గ్రేటర్ ఎన్నికల్లో 59 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మేయర్ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. 111 డివిజన్ భారత్ నగర్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ప్రగతి భవన్కు రావాలని పిలుపు అందుకున్నట్లు సమాచారం. కాగా సింధు ఆదర్శ్ రెడ్డి.. మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు. ఆల్విన్ కాలనీలో టీఆర్ఎస్ విజయం ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ 1249 ఓట్లతో గెలుపొందారు, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ 7470 ఓట్లతో విజయం సాధించారు. అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ 10310 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ డివిజన్లలో బీజేపీ విజయం.. హయత్నగర్, నాగోల్, మాన్సూరాబాద్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హయత్ నగర్ డివిజన్లో కళ్లెం నవ జీవన్రెడ్డి, నాగోల్ డివిజన్లో చింతల అరుణ సురేందర్ యాదవ్, మాన్సూరాబాద్ డివిజన్లో కొప్పుల నర్సింహారెడ్డి గెలుపొందారు. మౌలాలి, మూసాపేట్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మౌలాలి డివిజన్లో సునీత యదవ్, మూసాపేట్ డివిజన్లో కోడిచర్ల మహేందర్ గెలుపొందారు. బీఎన్ రెడ్డి నగర్లో రీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు బీఎన్ రెడ్డి నగర్లో అధికారులు రీ కౌంటింగ్ జరుపుతున్నారు. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమకు అనుమానం ఉందంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోరింది. దాంతో అధికారులు మళ్లీ కౌంటింగ్ జరుపుతున్నారు. దూసుకుపోతున్న టీఆర్ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. గోల్నాకా, మల్లాపూర్, ఫతేనగర్, సోమాజిగూడ, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మల్లాపూర్లో పన్నాల దేవేందర్ రెడ్డి, ఫతేనగర్లో పండాల సతీష్ గౌడ్, సోమాజిగూడలో వనం సంగీత, శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ గెలుపొందారు. గోల్నాకా డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దూసరి లావణ్య 2,716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంఐఎం, బీజేపీల మధ్య ఘర్షణ.. జంగంమెట్ డివిజన్ కౌంటింగ్లో ఎంఐఎం, బీజేపి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పుగుడా, జంగంమెట్లో బీజేపీ లీడ్ను జీర్ణించుకోలేకే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిసున్నారు. దాడిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, పోలీసుల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. అడిషనల్ సీపీ చౌహన్, ఎస్పీ కోటిరెడ్డి అరోరా కళాశాలకు చేరుకున్నారు. పోటాపోటీగా.. ఎంఐఎం-బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐంఎం, బీజేపీ పోటా పోటీగా దూసుకు వెళుతున్నాయి. ఇప్పటివరకూ ఎంఐఎం 31 డివిజన్లలో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కమల దళం కూడా 30 స్థానాలు కైవసం చేసుకుని 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ డివిజన్లలో బీజేపీ గెలుపు.. కొత్తపేట, సరూర్నగర్, గడ్డి అన్నారం, వినాయక్నగర్, రామంతపూర్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్కుమార్, సరూర్నగర్లో ఆకుల శ్రీవాణి అంజన్, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వినాయక్నగర్లో రాజ్యలక్ష్మి, అమీర్పేటలో కేతినేని సరళ, రామంతపూర్లో బండారు శ్రీవాణి గెలుపొందారు. చిలుకానగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖైరతాబాద్, కూకట్పల్లిలో టీఆర్ఎస్ గెలుపు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్.పీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వనస్థలిపురంలో బీజేపీ గెలుపు.. వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజన్, జగద్గిరిగుట్ట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు. మేయర్ సతీమణి విజయం గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు. కూకట్పల్లి జోన్లో ఇరవై డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూకట్పల్లి జోన్లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. సోమాజిగూడ,చందానగర్, నేరెడ్మెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది. పటాన్చెరు, క్రాపాలో టీఆర్ఎస్ విజయం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు, కాప్రా డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. పటాన్చెరులో కుమార్ యాదవ్, కాప్రాలో స్వర్ణరాజ్ విజయం సాధించారు. ఏఎస్రావు నగర్, ఉప్పల్ ‘హస్త’గతం గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్ రావు నగర్లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్లో మందముల్లా రజిత విజయం సాధించారు. చింతల్లో టీఆర్ఎస్లో విజయం హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. చింతల్ డివిజన్లో ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ఆభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు. అమీర్పేట్లో 960 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మాదాపూర్లో 4,999 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్, మియాపూర్లో 1935 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. రాజేంద్రనగర్లో 1614 ఓట్లతో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. గచ్చిబౌలిలో 1000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మల్లాపూర్లో 1,841 ఓట్లు, బాలాజీనగర్లో 7,501 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. సనత్ నగర్లో కారు విజయం సనత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. దత్తాత్రేయ నగర్లో ఎంఐఎం గెలుపు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన హవా కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి జాకిర్ బక్రీ గెలుపు దత్తాత్రేయ నగర్ డివిజన్లో విజయం సాధించారు. భారతినగర్లో టీఆర్ఎస్ గెలుపు సంగారెడ్డి జిల్లా భారతినగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. రంగారెడ్డి నగర్లో టీఆర్ఎస్ గెలుపు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ్శేఖర్ గౌడ్ విజయం సాధించారు. కూకట్పల్లి సర్కిల్లో అధికార టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. కూకట్పల్లి పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి.. వివేకానందనగర్ కాలనీ, హైదర్నగర్, అల్విన్ కాలనీలో కారుపార్టీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. బాలానగర్లో టీఆర్ఎస్ గెలుపు బాలానగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఆవుల రవీందర్రెడ్డి విజయం సాధించారు. చైతన్యపురిలో బీజేపీ విజయం పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా విజయం సాధించారు. నవాబ్ సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం ఎంఐఎం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నవాబ్ సాహెబ్ కుంట డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి షిరీన్ ఖాతూన్ గెలుపొందారు. ఇప్పటి వరకు ఏడు డివిజన్లలో విజయం సాధించింది. రియాసత్నగర్లో ఎంఐఎసం విజయం: ఎంఐఎం పార్టీ రియాసత్ నగర్ డివిజన్లో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి ముస్తఫా బేగ్ విజయం సాధించారు. బార్కాస్లో ఎంఐఎం గెలుపు ఎంఐఎం గెలుపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు డివిజన్లలో ఎంఐఎం గెలుపొంది. బార్కాస్లో ఎంఐఎం విజయం సాధిందిచి మరో డివిజన్ను తన ఖాతాలో వేసుకుంది. బార్కాస్లో ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం విజయం సాధించారు. ఆర్సీపురంలో టీఆర్ఎస్ విజయం టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. పలు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేష్యాదవ్ గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ ఖాతాలో నాలుగు డివిజన్లు చేరాయి. పుష్ప నగేష్ యాదవ్ సుమారు 5759 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోరబండలో టీఆర్ఎస్ విజయం బోరబండలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ తొలి గెలుపు.. పలు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగిస్తున్న బీజేపీ బోణి కొట్టింది. మంగళ్హాట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. పులు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. హైదర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు నువ్వా నేనా అనే తరహాలో కొనసాగుతన్న ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ మరో విజయం సాధించింది. హైదర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మూడు డివిజన్లు చేరాయి. అహ్మద్నగర్లో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం తన హవా కోనసాగిస్తోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో విజయం సాధించిన ఎంఐఎం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అహ్మద్నగర్లో ఎంఐఎం అభ్యర్థి రఫత్ సుల్తానా గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకు ఎంఐఎం నాలుగు డివిజన్లను గెలుచుకొని ముందంజలో ఉంది. చాంద్రాయణగుట్టలో 10వేల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. పలు డివిజన్లలో నువ్వా నేనా అనే తరహాలో ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో గెలుపు సొంతం చేసుకున్న మజ్లీస్ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంటోంది. కిషన్బాగ్లో ఎంఐఎం అభ్యర్థి విజయం హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో కిషన్బాగ్లో ఎంఐఎం విజయ సాధించింది. దీంతో ఎంఐఎం చెందిన మూడో గెలుపొందారు. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా విజయం సాధించారు. డబీర్పురాలో ఎంఐఎం అభ్యర్థి గెలుపు డబీర్పురా డివిజన్లో ఎంఐఎం రెండో విజయం నమోదు చేసుకుంది. ఈ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి అలందార్ హుస్సేన్ గెలుపొందారు. బార్కస్లో ఘర్షణ: బార్కస్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఖాతాలో ఏఎస్ రావు నగర్ కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టి ఏఎస్ రావు నగర్ డివిజన్లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. యూసఫ్గూడలో టీఆర్ఎస్ గెలుపు ఉత్కంఠ రేపుతున్న జీహెచ్ఎంసీ కౌంటింగ్లో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా యూసఫ్గూడలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్లో టీఆర్ఎస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. మెహిదిపట్నంలో ఎంఐఎం విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో చేరింది. మెహిదిపట్నం డివిజన్లో ఎంఐఎం మొదటి విజయం నమోదు చేసుకుంది. ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావటంతో తొలి రౌండ్లోనే ఫలితం తేలింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు 31 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 15, ఎంఐఎం 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పఠాన్చెరు, భారతీనగర్, చందానగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, హఫీజ్పేట్, హైదర్నగర్, చర్లపల్లి, కాప్రా, మీర్పేట్ హెచ్బీకాలనీ, రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గాజులరామారం డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక బీజేపీ హయత్నగర్, ఆర్సీపురం, భారతీనగర్, గోషామహల్, బేగంబజార్, హయత్నగర్, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో ఆధిక్యం కొనసాగుతోంది. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తర్వులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది. బీజేపీ ఆధిక్యం ఓట్ల లెక్కింపులో భాగంగా మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులో పార్టీల వారిగా.. బీజేపీ 92, టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 4, ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించాయి. బీజేపీ అభ్యంతరం జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ డివిజన్లోని బూత్ నంబర్ 8లో పోలైన ఓట్లు 471 కాగా, బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తోంది. తొలి రౌండ్ ఫలితాలపై ఉత్కంఠ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో తొలి రౌండ్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల వారిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. బీజేపీ 87, టీఆర్ఎస్ 30, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: 1926 కాగా, అందులో దాదాపు 40 శాతం చెల్లని ఓట్లు ఉన్నాయి. ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్టు ఎన్నికల కౌటింగ్ జరుగుతున్న క్రమంలో ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశం జారీ చేసింది. బీజేపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గెలుపు, ఓటముల దగ్గర మార్కింగ్ ఓట్లు ఉంటే.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తుది ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది. పెన్నుతో టిక్పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ హయత్నగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటికే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం ప్రదర్శించగా, టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. మెజార్టీ డివిజన్లలో బీజేపీకే పోస్టల్ బ్యాలెట్లు దక్కాయి. పోస్టల్ బ్యాలెట్లలో రెండో స్థానంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభం ఉత్కంఠ నడుమ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈసీ సర్క్యులర్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఈసీ సర్క్యులర్పై హైకోర్టులో బీజేపీ హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈసీ సర్క్యులర్ను అమలు చేస్తారా, లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్ ఉంటుంది. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కిస్తారు. తొలి రెండు రౌండ్లలోనే 136 డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశముంది. మూడోరౌండ్ తర్వాత 13 డివిజన్ల ఫలితాలు రానున్నాయి. రెడీ.. కౌంట్.. అనివార్య కారణాల నేపథ్యంలో రీ– పోలింగ్ జరిగిన ఓల్డ్ మలక్పేట సహా జీహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్ల లెక్కింపు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 30 కేంద్రాల్లో జరగనుంది. ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రాంతాలను సైతం కేటాయించారు.