G.Parameswara
-
‘నా భర్త చావుకు వాళ్లే కారణం’
సాక్షి, బెంగళూరు : తన భర్త ఆత్మహత్యకు ఐటీ అధికారుల వేధింపులే కారణమని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత పరమేశ్వర పీఏ రమేశ్ భార్య సౌమ్య ఆరోపించారు. ఐటీ అధికారులు తన ముందే తన భర్తను అనేక ప్రశ్నలు వేసి వేధించారని, ఏదో ఒక సమాధానం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల సీట్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో పరమేశ్వర, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పరమేశ్వర పీఏ రమేశ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో ఐటీ అధికారుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.(చదవండి : మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య) ఇక మృతుడు రమేశ్ భార్య సౌమ్య బుధవారం రామనగర తాలూకా మెళెహళ్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ తన భర్తను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర్కు తాను టైపిస్టును మాత్రమేనని.. అంతకు మించి తనకు ఏ విషయలూ తెలియవని రమేశ్ ఎంతచెప్పినా ఐటీ అధికారులు వినిపించుకోలేదన్నారు. పదేపదే డబ్బుల గురించి, కాలేజీ వ్యవహారాల గురించి గుచ్చిగుచ్చి అడిగి వేధించారన్నారు. చివరకు రమేశ్ తన బిడ్డపై ప్రమాణం చేసి చెప్పినా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని ఆరోపించారు. ఈ కేసులో తనను ఇరికించవద్దని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా రమేశ్ ఐటీ అధికారులకు చెప్పారన్నారు. వేధింపులకు పాల్పడి రమేశ్ చావుకి కారణమైన ఐటీ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆమె విఙ్ఞప్తి చేశారు. -
మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య
బెంగుళూరు: కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర పీఏ రమేష్ శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) బి.రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జ్ఞాన భారతి ప్రాంతంలో రమేష్ మృతదేహం లభించిందని, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు. రమేష్ కారులో ఒక లెటర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని, ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అయితే మెడికల్ కళాశాల సీట్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐటీ శాఖ పరమేశ్వర, ఆయన బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.(చదవండి : మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో రూ. 4.25 కోట్లు) ఈ క్రమంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పరమేశ్వర వెంట రమేష్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పరమేశ్వర స్పందిస్తూ రమేష్ చాలా మంచి వ్యక్తి అని, ఐటీ శాఖ సోదాల గురించి చింతించాల్సిన అవసరం లేదని ఉదయం రమేశ్తో చెప్పానని అన్నారు. కానీ, అంతలోనే ఏ ఒత్తిడి మేరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఐటీ అధికారులు వేధిస్తున్నట్లు రమేష్ తన సన్నిహితులతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఇంట్లో, ఆయన ట్రస్టుకు చెందిన మెడికల్ కళాశాలలో గురువారం ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వరకు సంబంధించిన 30 సంస్థలలో సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహిస్తున్న మెడికల్ కళాశాల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై పరమేశ్వర స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తే తనకేమి అభ్యంతరం లేదని, అన్ని పత్రాలను సమర్పించడానికి సిద్ధమని ప్రకటించారు. ఇక.. మరో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆర్.ఎల్ జలప్పకు చెందిన మెడికల్ ఆసుపత్రి, కళాశాలలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయంపై గురించి కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల అవినీతిని నిరూపించడం చేతకానందునే రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా.. ప్రభుత్వం తమ నాయకుల నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఐటీ సోదాలపై అధికార బీజేపీని కాంగ్రెస్ నిలదీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. The series of IT raids on @DrParameshwara, RL Jalappa & others, are politically motivated with malafide intention. They are only targeting @INCKarnataka leaders as they have failed to face us on policy & corruption issues. We won't budge to any such tactics!! — Siddaramaiah (@siddaramaiah) October 10, 2019 -
సిద్ధు, పరమేశ్వరలకు సోనియా పిలుపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణపై చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానించారు. వచ్చే నెల మూడో తేదీన ఢిల్లీలో ఉండేట్లు కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సూచించారు. మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై పార్టీ అధ్యక్షురాలితో జరిగే సమావేశంలో ఉభయులూ చర్చించనున్నారు. మరో వైపు పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. దీని వల్ల మరో అధికార కేంద్రం ఏర్పడే అవకాశాలున్నందున, ముఖ్యమంత్రి ససేమిరా అంటున్నారు. మంత్రి వర్గంలో ఆయనను చేర్చుకోవడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని పార్టీలో గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, తేనె తుట్టెను కదల్చడం ఆయనకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రితో జరిగే సమావేశం నిర్ణయాత్మకం కానుంది.