Health and Medical Department
-
TG: వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులున్నాయి.కాగా గత నెలలో 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మొత్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అయింది. అర్హులైన వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది.. నవంబర్ 17న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు
-
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర
-
ఏపీ వైద్యశాఖలో విప్లవాత్మక పథకాలు
-
వైద్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
-
వైఎస్ జగన్ పాలనలో బలోపేతమైన వైద్య ఆరోగ్య వ్యవస్థలు
-
వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రి: మంత్రి విడదల రజినీ
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనుచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజనీ పేర్కొన్నారు. మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు గొప్ప సేవలు అందిస్తున్నారని అన్నారు. మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనవని ప్రశంసించారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గతంలో ఎన్నడూ జరగనంతగా వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్ పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ మనసున్న ముఖ్యమంత్రి. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం కావాలి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే సీఎం ఆశయం. భావితరాలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇప్పటికే కొంత మేర చెల్లించాం. త్వరలోనే మిగతా వాటిని కూడా చెల్లిస్తాం. నాణ్యమైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడదు.’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన..షెడ్యూల్ ఇదే.. అపర సంజీవని ఆరోగ్యశ్రీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిలా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు తదితర అంశాలపై మంత్రి విడదల రజిని మంగళగిరిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,336 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసిందని, తమ ప్రభుత్వం కొత్తగా మరో 2,446 ప్రొసీజర్లను చేర్చిందని చెప్పారు. దీంతో ఏకంగా 3,255 ప్రొసీజర్లకు వైద్యం ఉచితంగా ప్రజలకు అందుతోందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసేదన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఆసరా కోసం రూ.445 కోట్లు, 108 వాహనాల నిర్వహణకు రూ.187 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.164 కోట్లు, ఈహెచ్ఎస్ కోసం రూ.140 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని వివరించారు. ఏపీలో 2,061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్ణాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, అడిషనల్ సీఈవో మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
AP: వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు ఏర్పాటు
విజయవాడ: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్ఆర్బీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 పోస్టులతో బోర్డును చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ బోర్డుకు చైర్మన్గా వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, మెంబర్గా వైద్య ఆరోగ్య శాఖ నుండి జేడీ(అడ్మిన్) స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకంలో తలమునకలవుతున్న రాష్ట్ర, జోనల్ , జిల్లా స్థాయి అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డు ఏర్పాటుతో హెచ్వోడీ, జోనల్,. జిల్లా స్థాయి ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించే వీలుంటుంది. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. -
ఏపీలో పీహెచ్సీల పనితీరుపై తప్పుడు ప్రచారం తగదు: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కానీ, కొన్ని పత్రికలు మాత్రం ప్రజలకు అందిస్తున్న వైద్యం విషయంలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పీహెచ్సీల పని తీరుపై హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్స్పల్ సెక్రటరీ కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కృష్ణబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీ మండలంలో అందుబాటులోకి పీహెచ్సీలను తీసుకువచ్చాము. టెలి మెడిసిన్ సదుపాయంతో అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెచ్చాము. పీహెచ్సీలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. పీహెచ్సీలో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నాము. మూడేళ్లలో వైద్యారోగ్య శాఖలో 45వేల నియామకాలు జరిగాయి. అందులో 4500 వరకు డాక్టర్ల నియామకాలు కూడా జరిగాయి. ఇంకా వైద్యుల నియామకాలు కొనసాగుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లీనిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రెఫరల్ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టు సహా అన్ని విభాగాల వైద్యులు ఉన్నారు. ప్రతీ పీహెస్సీలో కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్లర్లు లేరని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు ఉన్నప్పటికీ వారు లేరని పత్రికల్లో రాయడం సరికాదు. అన్ని చోట్ల వైద్యులు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్టులకు అన్ని రకాల ఇన్సెంటివ్లు ఇస్తున్నాము’ అని స్పష్టం చేశారు. -
కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
తిరువనసంతపురం: కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైరస్ సోకినట్లు పేర్కొంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందనవసరం లేదు విజింజంలోని ఎల్ఎంఎస్ఎల్పీ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం నోరోవైరస్ అంటే నోరోవైరస్ అనేది అంటువ్యాది. ఇది తీసుకున్న ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు. నోరో వైరస్ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి జాత్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ముందుగా అప్పుడే నవంబర్ 2021లో కేరళలో మొదటిసారిగా నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు. తాజాగా మరోసారి కేసులు వెలుగుచూశాయి. -
ముంగిళ్లలో వైద్యం
కణేకల్లుకు చెందిన సుబ్బయ్య దివ్యాంగుడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సాయంగా ఎవరూ లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. రెండు రోజుల తర్వాత 104 వాహనం గ్రామానికి రాగా వైద్యులే సుబ్బయ్య ఇంటివద్దకు వచ్చి మరీ పరీక్షలు చేశారు. అవసరమైన మందులూ అందించారు. బొమ్మనహాళ్కు చెందిన సుశీలమ్మ వృద్ధురాలు. వయసుమీద పడటంతో నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురికాగా 104 వైద్యులే ఆమె ఇంటికి వచ్చి చికిత్స చేశారు. ఇలా గ్రామీణ ప్రాంతాల వారికి ఎందరికో 104 వాహనం ద్వారా మెరుగైన వైద్యం అందుతోంది. రాయదుర్గం: వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ముంగిళ్లలోనే వైద్యసేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైద్య పరికరాలతో కదిలే కార్పొరేట్ ఆస్పత్రి లాగా రూపొందించిన 104 మొబైల్ మెడికల్ క్లినిక్ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వరంలా మారింది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, సాంక్రమిక∙వ్యాధుల రోగులకు సంజీవనిలా మారింది. రూ.201 కోట్లు ఖర్చు చేసి 1,088 వాహనాలను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... వాటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి 104, 108 వాహనాలుగా తీర్చిదిద్దింది. 2020 జూలై 1వ తేదీన ఈ వాహనాలన్నీ సీఎం జగన్మోహన్రెడ్డి విడుదల చేసి చరిత్ర సృష్టించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 1న అధునాతనమైన సౌకర్యాలతో కూడిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సీఎం విడుదల చేశారు. ప్రతి గ్రామానికీ నెలలో రెండుసార్లు 104 వాహనం ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్తుంది. సాధారణ జబ్బులతో పాటు చిన్నారుల్లో వచ్చే డయేరియా, కౌమారదశలో ఉన్నవారికి వచ్చే రక్తహీనత, సాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, చర్మవ్యాధులు, మలేరియా, చికెన్ గున్యా, లెప్రసీ, క్షయ, మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణకు 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్తో పాటు వాహనంలో 32 రకాల వైద్య పరికరాలు, 74 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనంలో వైద్యపరీక్షలు చేయడానికి డాక్టర్ సీటింగ్తో పాటు డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 12,03,429 మందికి వైద్య సేవలు 2020 జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 104 వాహనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా (అనంతపురం, శ్రీసత్యసాయి) వ్యాప్తంగా ఉన్న 62 వాహనాల ద్వారా 896 గ్రామ సచివాలయాల పరిధిలో 2022 మార్చి వరకు 21 నెలల్లో 12,03,429 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంటివద్దకే వైద్యం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చూసే 104 వైద్యులు 1.30 గంటల నుంచి నడవలేని లేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక భారం తగ్గింది నాకు షుగర్, బీపీ ఉన్నాయి. పట్టణానికి వెళ్లి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు చేయించుకుని, మందులు కొనుక్కురావడానికి నెలకు రూ.వెయ్యి ఖర్చు వచ్చేది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 104 వాహనాన్ని ప్రజల ముంగిటకే పంపి వైద్య సేవలు అందిస్తుండటంతో మాలాంటి వారికి ఆర్థిక భారం తగ్గింది. – సీతారామిరెడ్డి, కణేకల్లు క్రమం తప్పకుండా 104 వస్తుంది గతంలో నెలకోసారి, రెండు నెలలకు ఒకసారి వచ్చే 104 వాహనం ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా వస్తుంది. 104 వైద్యులు రోగులను పరీక్షించి మాత్రలు, ఇంజక్షన్లు వేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు, ఈసీజీ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. – తిప్పేస్వామి, బీఎన్హళ్లి గ్రామం, రాయదుర్గం మండలం 194 మంది సిబ్బందితో వైద్యసేవలు ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 62 ఉన్నాయి. 62 మంది డాక్టర్లు, 66 మంది డీఈఓ(డేటా ఎంట్రీ ఆపరేటర్)లు, 66 మంది డ్రైవర్లు మొత్తం 194 మంది సిబ్బంది ప్రతినెలా నిర్ణయించిన తేదీల్లో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనాల్లో 32 రకాల ఆధునిక పరికరాలతో పాటు పాము, తేలు, కుక్క కాటుకు మందులుంటాయి. –జి. కృష్ణమూర్తి, 104 ఉమ్మడి జిల్లా మేనేజర్ -
AP Budget 2022-23: ప్రజారోగ్యానికి పెద్దపీట
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2021–22తో పోలిస్తే 11.23 శాతం అదనంగా నిధులు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.13,830.43 కోట్లు కేటాయించగా ఈసారి రూ.15,384.26 కోట్లకు పెంచింది. దాదాపు కోటిన్నర కుటుంబాలను ఆదుకుంటున్న అపర సంజీవని లాంటి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2 వేల కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం రూ.541.06 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. ►నాడు–నేడుతో ఆస్పత్రులు బలోపేతం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల ముఖచిత్రం మారిపోయింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.1,603 కోట్లు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల అప్గ్రేడ్ కోసం రూ.350 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. కరోనాకు ఉచిత వైద్యం కరోనా బాధితులు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో తొలిసారిగా అర్హతతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,09,765 మందికి చికిత్స కోసం రూ.732.16 కోట్లు ఖర్చు చేసింది. తొలగిన చీకట్లు.. రాష్ట్రంలో 5.6 కోట్ల మందికి ఉచితంగా సమగ్ర, నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 16,64,919 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలున్న 8.50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు 1.55 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు. -
వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్’ ట్రీట్మెంట్
కంటికి కనిపించని కరోనా వైరస్ 2020లో మిగిల్చిన చేదు అనుభవాలు.. వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ తాలుకు చేదు జ్ఞాపకాలతో రాష్ట్ర ప్రజలు 2021లోకి అడుగుపెట్టారు. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఏప్రిల్, మే నెలల్లో ఊహించని రీతిలో వైరస్ రెండో విడతలో ఒక్కసారిగా విజృంభించింది. దీంతో 2021లో కూడా వైరస్ భయంతోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. తాజాగా.. ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి మరోసారి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11.94 లక్షల మంది వైరస్ బారినడ్డారు. వీరిలో 11.86 లక్షల మంది కోలుకోగా 7,384 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని రీతిలో వైరస్ విజృంభించినా సమర్థవంతంగా కట్టడి చర్య చేపట్టి జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. – సాక్షి, అమరావతి వేగంగా టీకా పంపిణీ 2021 జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విజయవాడ జీజీహెచ్లో పారిశుధ్య ఉద్యోగిని పుష్పకుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తొలిడోసు టీకా వేసుకుంది. ఆ రోజు నుంచి దశల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు టీకా పంపిణీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇలా సంవత్సరాంతానికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు టీకాను 100 శాతాన్ని అధిగమించగా.. 74.08 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా కట్టడికి రూ.3,683 కోట్లు ఇక ఈ ఏడాది నవంబర్ 24 నాటికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,683.05 కోట్లు ఖర్చుచేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో మెడికల్ ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్, మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ అనుభవాలతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన 175 ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. తద్వారా 24,419 పడకలకు ఆక్సిజన్ సరఫరా సమకూరుతోంది. ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు మరోవైపు.. మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.16,255 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇందులో భాగంగా 2021లో 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఈ ఏడాది మే 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిజానికి రూ.7,880 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా భారీగా నియామకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, కొత్తగా పోస్టులను సృష్టించి అక్టోబర్, నవంబర్ నెలల్లో 14,818 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఇది మొత్తం పూర్తికానుంది. నీతి ఆయోగ్ ప్రశంసలు దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న అత్యంత తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అంతేకాక.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని పేర్కొంది. నీతి ఆయోగ్ వెల్లడించిన 2019–20 ఆరోగ్య సూచీల్లో దేశంలో రాష్ట్రానికి నాలుగో ర్యాంకు దక్కింది. మాత, శిశు మరణాల కట్టడిలో ప్రభుత్వం సుస్థిర లక్ష్యాలను సాధించినట్లు ప్రశంసించింది. అలాగే, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యుల కొరత, ఆసుపత్రుల్లో వసతుల కల్పన మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గుడ్ గవర్నెన్స్ 2020–21 నివేదికలో పేర్కొంది. గతంతో పోలిస్తే పీహెచ్సీల్లో వైద్యుల అందుబాటు 6 శాతం పెరిగినట్లు తెలిపింది. కోవిడ్ కట్టడికి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది. రోగుల హోమ్ ఐసోలేషన్, వారి ఆరోగ్య పరిస్థితి నిత్య పర్యవేక్షణ, ఇతర చర్యలు భేషుగ్గా ఉన్నాయని తన అధ్యయనంలో పేర్కొంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: కోవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి ఆదేశాలు.. ►అధికారులు వ్యాక్సినేషన్ను మరింత ఉద్ధృతంగా చేయాలి..కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్ను వీలైనంత త్వరగా వినియోగించాలి. ►వ్యాక్సినేషన్ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్. టార్గెట్ పెట్టుకుని మరీ వ్యాక్సినేషన్ చేయండి. ►అందరూ కూడా మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకోవడమే కాక జనాలు గుమిగూడకుండా చూడాలి. ►మాస్క్ విషయంలో మళ్ళీ డ్రైవ్ చేయండి, గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి. ►క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే జరగాలి.. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయండి. ►ఆక్సీజన్ పైప్లైన్లు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోండి. ►గతంలో కోవిడ్ చికిత్సకోసం వాడుకున్న అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా.. లేవా.. సరిచూసుకోండి. ►ఎంప్యానల్ ఆసుపత్రులలో వసతులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ►క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్లను తిరిగి పరిశీలించండి. ►ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. ►జిల్లా స్ధాయిలో కలెక్టర్లను, లైన్ డిపార్ట్మెంట్లను సిద్దం చేయండి. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం... ►మాస్క్కు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే ఎన్ఫోర్స్ చేయండి. ►వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం. ►డిసెంబర్ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న టార్గెట్ పెట్టుకోండి, వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ►అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్స్ మాక్ డ్రిల్ చేసుకోవాలని అధికారులకు సూచన, ఎండ్ టూ ఎండ్ అన్నీ కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. ►హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లలో స్పెషల్ మెడికల్ టీమ్స్ను ఏర్పాటుచేసి ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలి. ►ఆర్టీపీసీఆర్ టెస్ట్లు మాత్రమే చేయండి, ర్యాపిడ్ టెస్ట్లు వద్దు. ►టెండర్లు పూర్తయిన మెడికల్ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్లు పూర్తిచేయండి. దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్ధితులు వివరించిన అధికారులు ►ఏపీలో రికవరీ రేట్ 99.20 శాతం, పాజిటివిటీ రేట్ 0.64 శాతం, రోజుకు యావరేజ్గా 197 కేసులు నమోదు, యాక్టివ్ కేసులు 2,140 ఉన్నాయి. ►104 కు కాల్స్ కూడా తగ్గిపోయాయని వెల్లడించారు. ►థర్డ్ వేవ్ వస్తే ఎదర్కోవడానికి సన్నద్దంగా ఉన్నమన్నారు. ►అవసరమైన ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉంచామన్న అధికారులు, ఆక్సీజన్ డీ టైప్ సిలెండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ►100 బెడ్స్ పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82.. వ్యాక్సినేషన్ ఒక డోస్ పొందిన వారు 87.43 శాతం.. రెండు డోస్లు పొందిన వారు 62.19 శాతం మంది ఉన్నారు. ►డిసెంబర్, జనవరి కల్లా అందరికీ రెండు డోస్లు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం. ఒమిక్రాన్పై ఏమన్నారంటే.. ►ఒమిక్రాన్ వేరియంట్లో మరింతగా మ్యుటేషన్స్ జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తుందని.. ఇది విస్తరిస్తున్న దేశాల గురించి అధికారులు వివరించారు. ►ఈ వేరియంట్ పై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతుందని వెల్లడించారు. ►ఈ వేరియంట్ను కనుగోవాలంటే జీనోమిక్ సీక్వెన్స్ కోసం ప్రతీ రోజూ 15 శాతం శాంపిల్స్ సీసీఎంబీకు పంపుతున్నామని అధికారులు తెలిపారు. ►కేంద్రం చెబుతున్నట్లుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ►సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హంగ్కాంగ్ నుంచి వస్తున్న వారిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ►12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం సూచించిందన్నారు అధికారులు. ►త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ►విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్పోర్ట్లో ఏపీ అడ్రస్ ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు అధికారులు. ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఏ.బాబు, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్.నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమీషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు. చదవండి: వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.. -
వరి కొనుగోలు కేంద్రాలుండవు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో చర్చించారు. అనంతరం కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. (చదవండి: 'ప్లాన్'తో పంటలేద్దాం..) యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు.. సుమారు ఐదు గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. బాయిల్డ్ రైసును కొనబోమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. కనుక రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం కోసం వరి సాగు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలదేని కేసీఆర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. తన సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందని అన్నారు. తన విధానాలతో రైతాంగాన్ని కేంద్రం గందరగోళ పరుస్తోందని తెలిపారు. లాభ నష్టాలు బేరీజు వేసుకుంటే అది ప్రభుత్వం అవుతుందా? అని నిలదీశారు. పలు దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై చర్చించిన సీఎం కేసీఆర్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొత్త వేరియంట్ నేపథ్యంలో ఏవిధంగా అప్రమత్తంగా ఉన్నామన్న దాని గురించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందజేశారు. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేశాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రలకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ గుబులు.. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్కు 185 మంది -
కంటిని కాపాడుకుందాం!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది.. ప్రధానమైనది నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందే. వీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి‘ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం అర్బన్: కళ్లను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పిల్లల కంటి సంరక్షణలో తల్లి పాత్ర కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పుట్టిన బిడ్డ కళ్లను తల్లి నిత్యం గమనిస్తూ ఉండాలి. నేత్రాల్లో ఎటువంటి మార్పులు ఉన్న ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్ బోర్డ్పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని, టీవీని దగ్గరుగా చూస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు కళ్లద్దాలు వాడాలి. ఆధునిక జీవనశైలి– కంటిచూపుపై దుష్పరిణామాలు గతంలో పిల్లలకు తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్ఫోన్ చూపిస్తూ తినిపిస్తోంది. దీనివల్ల పిల్లల కళ్లలో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా సెల్ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదు. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారు, కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా చూడాలి. కళ్లకు మధ్యలో విశ్రాంతిని ఇస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ నేత్రాలను పరిరక్షించుకోవాలి. వయోవృద్ధుల్లో భద్రత 35 సంవత్సరాలు దాటిన చాలామందిలో చదివేటప్పు డు ఇబ్బందికరంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులు, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దానివలన శాశ్వత అంధత్వాని కి గురికాకుండా కళ్లను భద్రంగా ఉంచుకున్నవారవుతా రు. ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లేనా ప్రతి ఏడాది సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కంటిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడగానే బీపీ, సుగర్ వ్యాధులకు గురవుతున్నారు. అటువంటి వారు డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. నిర్లక్ష్యం వద్దు కంటి చూపు, సంరక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. – ఎం.ఆర్.కె.దాస్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి అశ్రద్ధ చేయకండి మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంది. అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరు నెలలకు ఒక్కసారి కంటి వైద్యుడ్ని సంప్రదించాలి. – డాక్టర్ వి.దినేష్కాంత్, రెటీనా నేత్ర వైద్య నిపుణులు జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ కింద గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఈనెల 12వ తేదీ వరకూ నేత్ర పరీక్షలు ఇలా.. 60 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు: 3,24,764 మంది కంటి పరీక్షలు చేసినవారి సంఖ్య: 96,128 ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేసిన వారి సంఖ్య: 41,995 కాటరాక్ట్ రిఫర్ చేసిన వారి సంఖ్య :11,857 శస్త్ర చికిత్సలు చేసిన వారి సంఖ్య : 9,600 స్క్రీనింగ్ బృందాలు : 27 చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల సంఖ్య: 3,69,371 కంటి అద్దాలకు రిఫర్ చేసిన వారి సంఖ్య: 12,089 కంటి శుక్లాలు ఉన్న విద్యార్థులు: 14 మెల్లకన్ను శస్త్ర చికిత్సలు : 10 -
అదుపులోనే కరోనా.. మూడో వేవ్ వస్తే సర్వం సిద్ధం: తెలంగాణ కేబినెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరోనా స్థితిగతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అవకాశం: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, మహమ్మారి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉంన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంత్రివర్గం తెలిపింది. ఇందులో భాగంగా రోజుకు 3 లక్షల టీకాలు వేసేలా పూర్తి సన్నద్దతతో ఉండాలని మంత్రివర్గం నిర్దేశించింది. అవకాశం: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త వైద్య కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ ఏర్పాటుపై సమీక్షించారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రూ..133 కోట్లతో బెడ్స్, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్దికి సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని వైద్య శాఖాధికారులను ఆదేశించింది. మంత్రివర్గ నిర్ణయాలు గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ. రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు. -
Covid Cases in India: 2 కోట్లు దాటిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 3,57,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంక్రమించిన వారి సంఖ్య మొత్తంగా 2,02,82,833కు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులున్న రెండో దేశంగా భారత్ కొనసాగుతోంది. భారత్లో సంక్రమణ వేగం చాలా వేగంగా ఉంది. కేవలం 137 రోజుల్లో కరోనా సంక్రమణ కేసులు ఒక కోటి నుంచి రెండు కోట్లకు చేరుకున్నాయి. అంటే నాలుగు నెలల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. అంతకుముందు వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష నుంచి ఒక కోటికి చేరుకోవడానికి 360 రోజులు పట్టింది. అదే సమయంలో 3,449 మంది మరణించారు. వరుసగా ఏడు రోజులుగా 3 వేల మంది రోగులకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం వారంలో గణాంకాలను చూస్తే, ఈ వారంలో మరణాల సంఖ్య 41% పెరిగింది. ఈ సమయంలో 24,514 మంది రోగులు మరణించారు. ప్రపంచంలోని టాప్–10 దేశాలతో పోలిస్తే, భారత్తోపాటు టర్కీ, అర్జెంటీనా, జర్మనీ, కొలంబియా తదితర దేశాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇరాన్ వంటి మిగతా దేశాల్లో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న రోగుల సంఖ్య 3 లక్షల 20 వేల 289 గా ఉంది. ఇది దేశంలో మారుతున్న పరిస్థితులకు అద్దంపడుతోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 1 కోటి 66 లక్షల 13 వేల 292 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ సంబంధ గణాంకాలు ♦గత 24 గంటల్లో కొత్త కేసులు: 3,57,229 ♦10 రాష్ట్రాల్లోనే 71% కొత్త కేసులు ♦మొత్తం మరణాలు: 3,449 ♦గత 24 గంటల్లో కోలుకున్న రోగులు: 3,20,289 ♦గత 24 గంటల్లో చేసిన కరోనా టెస్ట్లు: 16,63,742 ♦దేశంలో పాజిటివిటీ రేటు: 21.47% ♦యాక్టివ్ కేసుల సంఖ్య: 34,47,133 ♦ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య: 2,02,82,833 ♦కోలుకున్న వారు: 1,66,13,292 ♦రికవరీ రేటు: 81.19% ∙మొత్తం మరణాలు: 2,22,408 ♦వ్యాక్సిన్ డోస్లు: 15,89,32,921 -
ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు!
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 35,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,096 కరోనా పాజిటీవ్గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 20 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 2,194 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 9 లక్షల 5వేల 266 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 35,592 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,06,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. -
ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు కీలక మార్పులు చేశారు. జాబితాలో పేరుండీ నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి మరోసారి టీకా వేసే అవకాశం ఇవ్వరాదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవడానికి కేటాయించినరోజు రాకపోతే, అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని, తద్వారా వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, చాలాచోట్ల ఆరోజు నిర్దేశించిన జాబితాలోని వారందరూ రావడంలేదు. కొన్నిచోట్ల 60 శాతం, మరి కొన్నిచోట్ల 70 శాతం మంది టీకాలకు వస్తున్నారు. మరికొందరు తీసుకోవ డానికి తిరస్కరిస్తున్నారు. దీంతో నిర్ణీత తేదీన వేయాల్సిన వ్యాక్సిన్ టార్గెట్ పూర్తి కావడం లేదు. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఈ నెల 19న 73,673మంది లబ్ధిదారులను లక్ష్యంగా నిర్దేశించగా 51,997 మందికే టీకాలు వేశారు. అంటే ఆరోజు వేయాల్సినవారిలో ఇంకా 21,676 మంది రాలేదు. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. చదవండి: (వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా) అప్పటికప్పుడు ఇతరుల పేర్లు నమోదు చేసి టీకా నిర్ణీత కేంద్రంలో ఎంతమందికి టీకా వేయాలన్న వివరాల జాబితా సంబంధిత అధికారి వద్ద ఉంటుంది. కోవిన్ యాప్లో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎవరెవరికి ఎప్పుడు వేయాలో తేదీ, టైం స్లాట్ ప్రకారం లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వెళ్తాయి. ఆ ప్రకారం లబ్ధిదారులు వస్తారు. ఇది సాధారణంగా జరిగే వ్యాక్సినేష¯Œ ప్రక్రియ. అయితే, చాలామంది గైర్హాజరుకావడం వల్ల లక్ష్యం నెరవేరడంలేదు. కాబట్టి గైర్హాజరైన వారి స్థానంలో అప్పటికప్పుడు అర్హులైన ఇతర లబ్ధిదారులకు టీకా వేస్తారు. అప్పటి కప్పుడు వారు అదేరోజు వ్యాక్సిన్ వేసుకు న్నట్లు కోవిన్ సాఫ్ట్వేర్లో వివరాలను నమోదు చేస్తారు. మున్ముందు ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి టీకాలు వేసే టప్పుడు, ఫ్రంట్లై¯Œ వర్కర్లకు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. సాధారణ ప్రజలకు వేసేటప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చని అంటున్నారు. ఇలా చేయకుంటే టార్గెట్ పూర్తికాక మానవ వనరులు, సమయం వృథా అవుతాయని భావిస్తున్నారు. తిరస్కరిస్తే మరోసారి టీకా వేయరు... కరోనా టీకా వేసుకోబోమని ఎవరైనా వచ్చి తిరస్కరిస్తున్నట్లు చెబితే, దాన్ని కోవిన్ యాప్లో నమోదు చేస్తారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్లో నమోదైన తర్వాత మరోసారి వారికి టీకాలు వేసే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. యాప్ను ఆ విధంగా తీర్చిదిద్దుతారని చెబుతున్నారు. ఇదిలావుండగా ఇప్పటివరకు కోవిన్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నుంచి 99.9 శాతం యాప్ ద్వారానే వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ను 50 శాతం యాప్ ద్వారా, మరో 50 శాతం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. గురువారం నిర్దేశించిన అన్ని కేంద్రాల్లో 35 వేలమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. -
రాష్ట్రంలో డిసీజ్ మ్యాపింగ్: ఈటల
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు.. తదితర జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయన్న దానిపై ‘డిసీజ్ మ్యాపింగ్’ చేయాలి. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్లు, మందులుండేలా చూడాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణ లకు శ్రీకారం చుట్టాలని ఈటల ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో, ఇతర ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో.. హైదరాబాద్లో కమాండ్ కం ట్రోల్ సెంటర్లో ఉండి చూడగలిగే విధంగా ఏర్పాట్లు చేయాలన్నా రు. పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల గడువు వివరాలను కంప్యూటరీకరించాలని సూచించారు. పీహెచ్సీల్లో అనవసర మందు లుంచవద్దన్నారు. మొదటిసారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపి డబ్బులు వెనక్కి తీసుకున్నా మ న్నారు. ప్రభు త్వాసుపత్రుల్లో రెఫరల్ విధా నం, ఆశ వర్కర్లు రోగులను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలన్నా రు. ప్రతి ఆసుపత్రిలో రిసెప్షన్ సెంటర్ ఉం డాలన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బంధువులకు ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. -
డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ను ప్రారంభించిన సీఎం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్కు.. నివేదికలోని అంశాలను సుజాతారావు వివరించారు. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని పలు లోపాలను కూడా కమిటీ బయటపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సు ఏదైనా సరే.. చివరి ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్తో ఉండాలని.. అప్రెంటిస్ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని..ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీకి సూచించారు. ఆయన కొనసాగిస్తూ... ‘ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు, బాత్రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందని సంబంధిత అధికారులతో పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో కొన్ని సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్ 1 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజక్ట్ అమలు మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజెక్టు కింద అమలు వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్ను విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల పెన్షన్ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికి కూడా నెలకు రూ. 5వేలు ఇవ్వాలని..ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలు ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు: ఆరోగ్యరంగంలో బడ్జెట్ చాలా వరకు జీతాలకే సరిపోతుంది పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్ అధికంగా ఉంది ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి ఇది నాది అన్న భావన ఉండడం లేదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి 30 శాతం మంది హృద్రోగ, క్యాన్సర్లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి ప్రతి 5వేలమందికి ఒక సబ్ సెంటర్ఉండాలి ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి యూత్ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి సబ్సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి ఒక కౌన్సెలర్ లేదా సోషల్ వర్కర్ ఉండాలి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి 2 బెడ్ ఐసీయూ సదుపాయం ఉండాలి ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి..వారి బేసిక్ శాలరీని పెంచాలి ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటల్ ఉండాలి కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు ఆప్తమాలజీ, ఈఎన్టీ కేర్ స్పెషలిస్టులు ఉండాలి అన్ని మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి హెచ్ఆర్ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి ఏడాదికి రెండు వారాలు హెచ్ఆర్లో శిక్షణ ఇవ్వాలి..ఖాళీలను భర్తీ చేయాలి నర్సింగ్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో నర్సింగ్ విద్య పటిష్టంగా లేదు నర్స్ ప్రాక్టీషినర్స్కు ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేయాలి నర్సింగ్కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి 30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు డ్రగ్ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి కనీసం 150 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి -
వైద్య విధాన పరిషత్ డాక్టర్లకు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న స్పెష లిస్టు వైద్యులకు వైద్యఆరోగ్య శాఖ షాక్ ఇచ్చింది. వైద్య విద్య అధ్యాపకుల పోస్టులకు సంబం ధించి అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో టీవీవీ పీ డాక్టర్లకు మొండిచేయి చూపింది. ఇన్ సర్వీస్ కోటా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిబంధనల ప్రకారం టీవీవీపీ స్పెషలిస్టు డాక్టర్లకు అవకాశమివ్వాలి. కానీ వైద్య విద్య అధ్యాపకుల నియామ కాల్లో వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాంతో తెలంగాణ వైద్యుల సంఘం నేతలు డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నరహరి ఆధ్వర్యంలో డాక్టర్లు సోమ వారం మంత్రి ఈటల రాజేందర్ను సచివాల యంలో కలిశారు. తమకు జరిగిన అన్యాయా న్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ సర్వీస్ కోటా భర్తీపై జీవో నెంబరు 154లో వైద్య విద్య కళాశాలల్లో పనిజేస్తున్న ట్యూటర్లు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, టీవీవీపీలో పీజీ అర్హత ఉన్న వారంతా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హులు. ఆ మేర కు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో టీవీవీపీ లో 120 మంది డాక్టర్లు, ప్రజారోగ్య సంచాల కుల పరిధిలో 220 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి అసిస్టెం ట్ ప్రొఫెసర్గా పోస్టింగ్ ఖాయమని టీవీవీపీ వైద్యులు భావించారు. కానీ డీహెచ్ పరిధిలో ఉన్నవారికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశమివ్వాలని వైద్యారోగ్యశాఖ సర్క్యులర్ ఇచ్చింది. ఈ విషయాన్ని వైద్య విద్యా సంచాలకులు దృష్టి కి తీసుకొచ్చారు. ఉపయోగం లేకపోవడంతో ఈటలను కలిశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్ సెంటర్ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్గా చేసుకుని స్కానింగ్ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్ సెంటర్కు రెఫర్ చేస్తున్నారు. చెకప్కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్ స్కానింగ్ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం. ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఆర్ఎంపీలు కూడా అక్కడికే.. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో ఆ స్కానింగ్ సెంటర్కే రెఫర్ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్ఎంపీలకు కమీషన్ వెళ్తుంది. -
వామ్మో... దోమలు...
సాక్షి, కోల్సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమలు విజృంభిస్తున్నాయి. నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్తో సంబంధం లేకుండా దోమలు వ్యాపిస్తున్న తీరుపై నగర ప్రజానికం ఆందోళన చెందుతోంది. దోమల దాడికి వందలాది మంది విషజ్వరాల భారిన పడ్డారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోనే దోమల బెడద ఎక్కువవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దోమల ధాటికి బల్దియా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దోమల నివాస ప్రాంతాలు డ్రెయినేజీల్లో పూడికలు తీయకపోడంతో పారిశుధ్యం పేరుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. ఖాళీ స్థలాలలో పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల తొలగింపుపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా దోమలకు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్ట పగలు కూడా ఇళ్ళల్లో ఉండాలంటే దోమల నివారణకు ‘ఆల్ఔట్’ పెట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాత్రిళ్లు మాత్రమే కుట్టే దోమలు ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న అదనపు ఖర్చు దోమల నివారణ కోసం కూడా ప్రతీ కుటుంబం ఇంటి బడ్జెట్లో అదనంగా కొంత మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దోమల నివారణకు మస్కిటో కాయల్స్, కెమికెల్స్తోపాటు బ్యాటింగ్ తదితర వాటి కోసం కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి సరుకులతోపాటు దోమల నివారణకు కూడా అదనపు వ్యయం చేయాల్సి రావడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. కానరాని నివారణ చర్యలు రోజురోజుకు పెరుగుతున్న దోమలను నివారించడంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు నీటి గుంటల్లో గంభూషియా చేపలను వెయ్యడం లేదు. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్, మలాథియిన్ స్ప్రె తదితర నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో మొక్కుబడిగా పూడిక తీయించి చేతులు దుల్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారించాను. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాపించవు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. – చిట్టూరి రాజమణి, నగర మేయర్ చర్యలు తీసుకుంటున్నాం దోమల నివారణకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మలాథియిన్ స్ప్రె చేయిస్తున్నాం. నీరు నిల్వ ఉన్న గుంటల్లో గంభూషియా చేపలను వేస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – కిషోర్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ -
‘ఆరోగ్యానికి’ అందని డీజిల్!
పేరుకుపోరుున బకాయిలు వాహనాలకు ఇంధనం పోయని బంక్ యజమాని కదలని వాహనాలు..పిల్లలకందని వ్యాక్సిన్లు ఎంజీఎం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు డీజిల్ దెబ్బ తగి లింది. బకారుులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శాఖ వాహనాలకు డీజిల్ పోసేందుకు బంకు యజమాని నిరాకరించాడు. దీంతో వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ ప్రచార వాహనాలు పదిహేను రోజులుగా ఎక్కడికక్కడే నిలిచిపోయూరుు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ వాహనాలకు డీజిల్ బకారుులు రూ.18లక్షల వరకు బంకు యజమానికి చెల్లించలేదు. జిల్లాలోని 69 పీహెచ్సీలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి వ్యాక్సిన్ను మూడు వాహనాల ద్వారా పంపిస్తుంటారు. దీనిని దఫాలవారీగా పంపిస్తారు. కాగా, జనవరి 27 నుంచి డీఎంఅండ్హెచ్ఓ వాహనాలకు డీజిల్ కొరత ఉండడంతో కొన్ని పీహెచ్సీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయిందని సదరు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. వాహనాలు పూర్తిస్థారుులో తిరగకపోవడంతో నగరంలోని సీకేఎం, జీహెచ్ఎం, ఎంజీఎం ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కూడా అంతంతగానే సాగుతోంది. అంతేకాక పల్స్పోలియో కార్యక్రమానికి వచ్చిన డీజిల్ నిధులను కూడా మా మూలు డీజిల్ డబ్బులు చెల్లింపులకు సైతం వాడుతున్నట్లు ఇమ్యూనైజేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు. కార్యాలయాలకే పరిమితం జనాభా నియంత్రణకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు నిరంతరంజిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే వైద్యాధికారులు, సిబ్బంది డీజిల్ కొరతతో కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన వైద్యులు డీజిల్ కొరత సాకుతో విధులకు ఎగనామం పెడుతున్నట్లు తెలుస్తోంది. పడకేసిన పాలన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పాలన పడకేసింది. డీజిల్ కొరత ఉన్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతోపాటు ఓ వర్గం కార్యాలయంలో కొన్నేళ్లుగా దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇప్పటికైనా జిల్లా అధికారి స్పందించి వెంటనే డీజిల్ కొరతను తీర్చి, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కడుపు పండితే వేదన.. కన్ను తెరిస్తే యాతన
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చతికిలపడింది. మాతా, శిశు మరణాల శాతం తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. ఎమ్మిగనూరు మండలంలో 11 నెలల్లో కాన్పు సమయంలో వంద మంది శిశువులు మృతి చెందగా.. 2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 25వేల కాన్పులు ఇళ్ల వద్ద జరగ్గా, కర్నూలు జిల్లాలోనే 11,599 నమోదవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడం కూడా మాతా శిశు మరణాల సంఖ్య రాష్ట్రంలోనే జిల్లాను రికార్డు స్థానంలో నిలుపుతోంది. కర్నూలు డివిజన్లో 31, నంద్యాల డివిజన్లో 27, ఆదోని డివిజన్లో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. తగినంత సిబ్బంది పని చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రచార, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మాతా శిశు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఏమి జరుగుతోంది.. జిల్లాలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే కాన్పు జరిగేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంది. ఇంటి వద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కలిగే లాభాలు, పారితోషికం వివరాలను తెలియజెప్పాలి. ఆయా పీహెచ్సీల పరిధిలో గర్భిణిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. కౌతాళం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హొళగుంద హెల్త్ సూపర్వైజర్, పెద్దతుంబళం హెల్త్ ఆఫీసర్, అర్దగేరి హెల్త్ అసిస్టెంట్.. ఇలా అనేక మంది జిల్లా కేంద్రంలో పని చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటేషన్లకు అర్హత లేని కాంట్రాక్టు వైద్య సిబ్బంది జిల్లా పరిసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేయించుకున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా గాడితప్పింది. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన ‘డెమో’ విభాగం ఉన్నా లేనట్లుగా మారింది. ఆదోని డివిజన్లోనే అధికం జిల్లాలోని ఆదోని డివిజన్లో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఆదోని డివిజన్ పరిధిలో(రూరల్) నెలలోపు శిశువులు 112 మంది, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 24 మంది, గర్భిణిలు ముగ్గురు చొప్పున చనిపోయారు. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే శిశు మరణాల శాతం 26.88, సంవత్సరంలోపు పిల్లలు 1.03, మాతృ మరణాలు 72.01 శాతం చొప్పున ఇక్కడే నమోదయ్యాయి. ఆదోని అర్బన్ ప్రాంతంలో నెలలోపు శిశువులు 105 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 6 మంది, ఒక గర్భిణి మరణించారు. ఇక్కడ శిశు మరణాల శాతం అత్యధికంగా 42.97 శాతం, మాతృ మరణాల శాతం 40.93గా ఉంది. మండలం మృతి చెందిన మరణించిన నెలలోపు గర్భిణిలు శిశువులు ఆత్మకూరు 36 04 ఆళ్లగడ్డ 26 01 కోడుమూరు 53 03 ఎమ్మిగనూరు 100 04 ఆలూరు 25 02 కర్నూలు రూరల్ 60 02 కర్నూలు అర్బన్ 42 05 కోయిలకుంట్ల 37 04 -
ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు!
అంతర్గత విచారణ పూర్తి డెరైక్టర్ ఆఫ్ హెల్త్కు నివేదిక నాటి 420 జీవోయే మూలమని నిర్ధారణ {sెజరీ కుంభకోణం విశాఖపట్నం: చింతపల్లి ట్రెజరీలో వెలుగుచూసిన కుంభకోణానికి వైద్యఆరోగ్యశాఖలో బాధ్యులైన వారిపై చర్యలకు ఆశాఖ ఉన్నతాధికారులు రంగంసిద్ధం చేస్తున్నారు. ఆశాఖ కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలమేరకు ఆ శాఖకు చెందిన చీఫ్అకౌంట్స్ఆఫీసర్ మూడు రోజులు జిల్లాలో మకాం వేసి అసలు ఏం జరిగింది, ఈ భారీ కుంభ కోణంలో ఎవరెవరిపాత్ర ఉంది? ఏఏ స్థాయి అధికారుల భాగస్వామ్యంతో ఈ వ్యవహారం సాగింది అనే కోణాలపై అంతర్గత విచారణ నిర్వహించారు. ఇందులో అప్పటి రాష్ర్టస్థాయి ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయానికి విచారణాధికారి వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ స్థాయి నుంచి చింతపల్లిస్థాయి వరకు చాలా మంది అధికారులు,సిబ్బంది పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 20 మంది వరకు ఈ కుంభకోణం పాత్ర ఉన్నట్టగా నిర్ధారణకు వచ్చినట్టు తెలియవచ్చింది. అప్పటి డీఎంఅండ్హెచ్వో పాత్ర ఈ కుంభకోణంలో కీలకమని భావిస్తున్నారు. ఈ అవినీతికి 2012లోనే ఆజ్యం పడినట్టుగా గుర్తించారు. అప్పట్లో నియామకాలు, బదిలీలు, పదోన్నతులతో పాటు జీతభత్యాల డ్రాయింగ్ , డిస్బర్స్ మెంట్స్కు సంబంధించి ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారికి దఖలు పరుస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్-420ను జారీ చేసింది. ఈ జీవోను అడ్డంపెట్టుకునే ఈ అవినీతి, అవకలకు జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. 2011-12లో 40మంది సిబ్బంది జీతభత్యాల కోసం రూ.80 లక్షల బడ్జెట్ కేటాయింపులు జరిపితే 2012-13కు వచ్చేసరికి ఏకంగా రూ.2.8కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం కాస్తా ఏకంగా ఐదు కోట్లకు చేరింది. ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది జీతభత్యాల నిమిత్తం ఇంతపెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిపితే పైనుంచి కింద వరకు ఏ ఒక్కరూ పసిగట్టకపోవడం చూస్తుంటే అందరి ప్రమేయం ఈ కుంభఖోణంలో ఉన్నట్టుగా అనుమానించాల్సి వస్తున్నదని విచారణాధికారి కామెంట్ చేసినట్టు చెబుతున్నారు. అసలు సిబ్బందే లేకుండా జరిపిన ఈ నకిలీ నియామకాలన్నీ సదరు జీవో ఎంఎస్-420ను ఆధారంగా జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. విచారణ నివేదికను వైద్యఆరోగ్యశాఖ కమిషనర్కు సమర్పించనున్నట్టుగా చెబుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని అవసరమైన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరిపై శాఖపరంగా సస్పెన్షన్లు విధించడంతో పాటు వారిపై క్రిమిన ల్ కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. -
సింహాచలమూ..తక్కువేం కాదు
మన్యంలో సంచలనమైన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతోంది. కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ట్రెజరీ అకౌంటెంట్ పేరు మాత్రమే ప్రధానంగా వినిపించేంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగి అక్రమాలు అధికారులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఆ శాఖలో యూడీసీగా పనిచేస్తున్న సింహాచలం 15 నెలల్లో ఏకంగా రూ.1.4 కోట్లు కొల్లగొట్టిన విషయం వెలుగు చూసింది. చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో అక్రమాలపై వెద్య,ఆరోగ్యశాఖ చీఫ్ అకౌంటెంట్(హైదరాబాద్) ఐ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం విచారణ ప్రారంభమైంది. పలు పీహెచ్సీల సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన వివరాలతోపాటు ట్రెజరీ ద్వారా డ్రా చేసిన నగదుకు సం బంధించిన వివరాలు, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట పంపిణీ చేసిన డీడీలు వంటి అంశాలపై లోతుగా విచారణ జరిపారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూ రు మండలాల్లోని తాజంగి, కోరుకొండ, సప్పర్ల, పెదవలస, జర్రెల, దారకొండ, రాజేంద్రపాలెం పీహెచ్సీలలో 43 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీరి వేతనానికి సరిపడే బడ్జెట్ కాకుండా రెట్టింపు రాబట్టుకుని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 2013-14 సంవత్సరానికి రూ.2.87 కోట్లు ట్రెజరీ అధికారులతో కుమ్మక్కయి వైద్యశాఖ ఉద్యోగులు కాజేసీన విషయం విదితమే. ఇందుకు సహకరించిన అకౌంటెంట్ అప్పలరాజు ఖాతాలోకి రూ.17 లక్షలు నేరుగా జమ కావడంతో ఇప్పటి వరకు ఇతడే ప్రధాన నిందితునిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్సీడీ ప్రభుత్వ ఆస్పత్రిలో యూడీసీగా పని చేస్తున్న సింహాచలం 2012-13లో కోరుకొండ, దారకొండ, పెదవలస పీహెచ్సీల్లో యూడీసీగా డిప్యుటేషన్పై బాధ్యతలు చేపట్టారు. ఆయా ఆస్పత్రులలో పనిచేస్తున్న గుమాస్తాలకు సరైన కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో బిల్లుల వ్యవహారాలన్నీ ఇతనికే అప్పగించారు. ఇదే ఆదునుగా భావించిన సింహాచలం కొందరు వైద్యశాఖ అధికారులతో కుమ్మక్కయి భారీ ఎత్తున నిధులు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు తెలిసింది. 2012 మే నుంచి 2013 మార్చి వరకు యూనియన్ బ్యాంకు చింతపల్లి బ్రాంచిలోని అకౌంట్ నంబర్లో రూ.1.4 కోట్లు జమ చేసుకున్నారు. అనంతరం అతనికి విశాఖ ఆర్సీడీ ఆస్పత్రికి బదిలీ అయింది. ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా వెలుగు చూసిన వెంటనే సింహాచలం కుంభకోణం బయటపడింది. కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న సింహాచలమే ఇంత భారీ అవినీతికి పాల్పడితే బడ్జెట్ కేటాయింపులకు ప్రధాన సూత్రధారులైన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లు కొల్లగొట్టిన సింహాచలం విశాఖపట్నం, రింతాడ ప్రాంతాల్లో విలువైన భవంతులు నిర్మించుకున్నాడని, మైదాన ప్రాంతాల్లో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఈ ప్రాంత ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆస్పత్రుల రికార్డులు పరిశీలన స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పీహెచ్సీల రికార్డులను తనిఖీ బృందంప్రాథమికంగా పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్సీలలో గతంలో పని చేసిన వైద్యాధికారులు, యూడీసీలు, గుమస్తాల వంటి వారి వివరాలను కూడా సేకరించారు. 2013-14కు సంబంధించి బ్యాంకుల ద్వారా డ్రా చేసిన అన్ని రకాల నగదు వివరాలను విచారణ బృందం పరిశీలించింది. శుక్రవారం కూడా కార్యాలయంలో విచారణ జరపనున్నామని వారు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జూనియర్ అకౌంట్ అధికారులు ప్రవీణ్కుమార్, చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ ,తదితరులు ఉన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్
హాజరైన నాలుగు జిల్లాల ఉద్యోగులు కడప రూరల్ : కడప నగరంలోని పాత రిమ్స్లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ శాఖ ఉద్యోగుల పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 104 మంది (పురుషులు) మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) నుంచి మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)లకు కౌన్సెలింగ్ జరిగింది. ఇన్చార్జి ఆర్డీ డాక్టర్ ఎన్.దశరథరామయ్య చాంబర్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథరామయ్య మాట్లాడుతూ నిబంధనలు, ఉద్యోగుల సర్వీసు ప్రకారం పదోన్నతులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డీడీ (అడ్మిన్) ఎల్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
జూడాలు బేషరతుగా విధుల్లో చేరాలి: మంత్రి రాజయ్య
జూడాలు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సిందే విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ జ్వరంగా చిత్రిస్తున్నాయి సాక్షి,హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టంచేశారు. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిందేనని, వారు ఇంకా జూనియర్ డాక్టర్లే అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ వ్యాధిగా చిత్రిస్తున్నాయని రాజయ్య విమర్శించారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ప్రభుత్వ బ్లడ్బ్యాంక్లలో రూ.7.50 కోట్ల ఖర్చుతో ప్లేట్లెట్ సెపరేషన్ మిషన్లను అందుబాటులో తెస్తామన్నారు. విషజ్వరాల వల్ల బాధ ఉంటుందే తప్ప మరణాలు ఉండవని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాల నివారణకు నిరంతరం వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. విషజ్వరాల మాట అటుంచి పాము, కుక్క కాటుకు మం దులు లేవంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని రాజయ్య అన్నారు. సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు తెలంగాణ సీఎం రోజుకు ఒక వేషం వేస్తున్నారని, జూడాల సమస్యలపై కేసీఆర్ నిర్మాణాత్మకంగా ఆలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జూడాల సమస్యలపై అఖిల పక్ష, మేధావుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజీడీఏ, ఐఎంఏలు జూడాలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ జూడాల సమస్యలు న్యాయమైనవని, కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యలపై బుర్రపెట్టి ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. సంవత్సరం పాటు జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధనలో కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ జూడాలను చ ర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా జూడాలు రూరల్ సర్వీసులు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లురవి, బీజేపీ లీగల్సెల్ నేత రామచందర్రావు, ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, టీజీడీఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, తెలంగాణ గెజిటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాల రీలే నిరాహార దీక్ష కొనసాగింది. -
అయోడిన్ కిట్టు..వాడితే ఒట్టు
* రెండేళ్లుగా నిలిచిన అయోడిన్ కిట్ల పంపిణీ * గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో అయోడిన్ లోపం * గుర్తించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం * అవగాహన ర్యాలీలతో సరి ఒంగోలు సెంట్రల్ : అయోడిన్..శరీరానికి అత్యావశ్యకమైన పోషకం. ప్రతి మనిషికి రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. ప్రకృతి ద్వారా లభించాల్సిన ఈ పోషకం వాతా వరణ కాలుష్యంతో శరీరానికి అందడం లేదు. అయోడిన్ ఉన్న ఉప్పును ఆహారంలో తీసుకుంటే.. ఆ లోపాన్ని భర్తీచేయొచ్చు. కానీ అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పును వాడటం లేదు. ఫలితంగా జిల్లాలోని అధిక శాతం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఆ పిల్లలు గాయిటర్ అనే గొంతు సంబంధిత వ్యాధికి గురవుతున్నారు. మరికొందరు బుద్ధిమాంద్యులుగా మారుతున్నారు. ప్రచారమే తప్ప..పరీక్షలేవీ.. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. ఆరోగ్యానికి అయోడిన్ మంచిదంటూ ప్రకటనలు, ర్యాలీలతో ఊదరగొట్టే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు..అయోడిన్ లోపాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య సిబ్బందికి పదే ళ్ల క్రితం నుంచి వైద్యాధికారులు అయోడిన్ పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నా సిబ్బంది వాటిని వినియోగించడం లేదు. దీంతో ఎలాగూ వాటిని వాడటం లేదని భావించిన అధికారులు రెండేళ్ల నుంచి సరఫరా నిలిపేశారు. చేయాల్సిందిదీ... పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో..ఇళ్లలో వినియోగించే ఉప్పులోని అయోడిన్ శాతాన్ని పరీక్షించి పిల్లల తల్లిదండ్రులకు ఆహార పరంగా సలహాలు ఇవ్వాలి. జిల్లాలో 920 పంచాయతీలుండగా అదే సంఖ్యలో ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీల్లో అయోడిన్ పరీక్ష కిట్లు ఉంటాయి. గ్రామ స్థాయిలో ఆరోగ్యసేవలందించే ఏఎన్ఎంలకు వీటిని అంది స్తారు. వీరికి ఆశ కార్యకర్తలు కూడా సహకరిస్తారు. డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములను చేశారు. ప్రతి ఇంట్లో వాడుతున్న ఉప్పు శాతాన్ని గుర్తించడానికి ద్రావకంతో కూడిన కిట్లు అందిస్తున్నారు. ఆ ద్రావకాన్ని ఉప్పులో వేస్తే మారే రంగు ఆధారంగా అయోడిన్ శాతాన్ని గుర్తిస్తారు. ఆ మోతాదులో ఎంత అయోడిన్ అవసరమో ప్రజలకు వైద్య సిబ్బంది సూచించాలి. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు గళ్ల ఉప్పును వాడుతున్నారు. దీని వలన శరీరానికి కావాల్సిన అయోడిన్ లభించడంలేదు. ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే అయోడిన్ కిట్లను సిబ్బంది ఏ రోజూ వాడిన దాఖలాలు లేవు. దశాబ్ద కాలం పాటు సరఫరా చేసిన కిట్లు ఉప కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్నా యి. ఫలితంగా కిట్ల సరఫరాను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అయోడిన్ లోపం తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కిట్ల సరఫరా నిలిచింది వాస్తవమే.. కే చంద్రయ్య, డీఎంహెచ్వో అయోడిన్ లోపం తెలుసుకునేందుకు గతంలో కిట్లు సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం వాటిని ఇవ్వడం లేదు. అయోడిన్ లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్, డైరక్టరేట్ హెల్త్ ఇన్చార్జ్ డాక్టర్ గీతా ప్రసాదిని పాల్గొంటారు. -
ప్రొఫెసర్ల తీరు మారేనా!
* వైద్య కళాశాలకు తరుచూ గైర్హాజరు * తీవ్రంగా పరిగణిస్తున్న కలెక్టర్ * నేడు వైద్యాధికారులతో సమీక్ష * సెలవులో వెళ్లిన ప్రిన్సిపల్ నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్రోస్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యసేవలు మెరుగు పర్చేందుకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించనున్నారు. మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై నివేదికను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జిజియాబాయి రెండు రోజులపాటు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం నిర్వహించిన సమీక్షలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. సమీక్ష సమావేశానికి 12 మంది ప్రొఫెసర్లు గైర్హాజరు కావడాన్ని తీ వ్రంగా పరిగణించిన కలెక్టర్ తనను కలిసేంత వరకు విధులలో చేరవద్దని ఆదేశించారు. దీంతో గైర్హాజరయిన ప్రొఫెసర్లు కలెక్టర్ తీసుకునే చర్యల నుంచి తప్పించుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ, డీఎంఈ కార్యాలయాలలో ప్రత్యేక పనులు ఉన్నందున కలెక్టర్ సమీక్షకు గైర్హాజరు అయినట్లు పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు అనారోగ్యం పేరిట మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని తెలిసింది. స్థానికంగా ఉండడానికి ఇష్టపడని కొందరు ప్రొఫెసర్లు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ వైద్య ఆరోగ్య శాఖలో 16 మంది వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, తరుచూ గైర్హాజరవుతున్నారని గత కలెక్టర్ ప్రద్యుమ్న వారి హెచ్ఆర్ఏను నిలిపి వేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ హెచ్ఆర్ఏ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఖంగుతిన్నారు. అయితే, అంతలోనే కలెక్టర్ బదిలీ కావడంతో ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. శాఖలోని ఓ అధికారి పర్సంటేజీల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తే హెచ్ఆర్ఏ విడుదల చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వైద్యులు ఒప్పుకోవడమే ఆలస్యం ఇన్చార్జి కలెక్టర్ను బురిడీ కొట్టించి హెచ్ ఆర్ఏ విడుదల చేయించుకున్నారు. వైద్యుల పని తీరు బాగోలేదని కలెక్టర్ హెచ్ఆర్ఏను నిలపి వేస్తే అధికారులు ఇన్చార్జి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి నిధులు మం జూరు చేయించుకోవడం గమనార్హం. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గోవింద్వాగ్మోరేను వివరణ కోరగా స్పందించలేదు. -
కదలని ఆరోగ్య శాఖ
డేంజరస్గా ‘డెంగీ’ - ఇప్పటికే ముగ్గురు మృతి - 35కు పైగా కేసులు నమోదు - ఊరూరా పారిశుధ్య లోపం - వాతావరణ మార్పులే కారణం నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా 22 కేసులను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వ్యాధి బారినపడి ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులు, పారిశుధ్య లోపమే డెంగీ వ్యాధి ప్ర బలడానికి ప్రధాన కారణంగా వైద్యశాఖ అధికారులు తేల్చారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాధులను అదుపుచేయడంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 35 కేసులు నమోదు... ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇద్దరు మృతి చెందడంతో పాటు 14 డెంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో గతనెల 12న నీరడి శ్రీజ డెంగీతో మృతిచెందింది. వర్ని మండలం రుద్రూరు గ్రామంలో మొహినొద్దీన్పటేల్ (65) అనే వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. లింగంపేట మండలం జగదంబ తం డాలో మరో వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. డిచ్పల్లి మండలం చంద్రాయన్పల్లిలో ఏడుగురికి డెంగీ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో గోదావరి అనే మహిళ , జుక్కల్ మండలం కండేబల్లూరులో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో సంధ్య, అర్షిత్ అనే పిల్లలు వ్యాధి బారినపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ... వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమవుతోంది. కాలానికి అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏడాది వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యటనలు నామమాత్రంగానే ఉన్నాయి. సగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పర్యటించకపోవడం గమనార్హం. ప్రతి నెల క్లస్టర్ వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా ఎలా ంటి ప్రయోజనం లేకుండా పోయింది. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి నివేదికలను చేరవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారిస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. అస్తవ్యస్తంగా పారిశుధ్యం గ్రామాలలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇదే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. గ్రామాలలో అపరిశుభ్రత నిర్మూలనకు ప్రతి మూడు నెలలకోసారి శానిటేషన్ నిధులను మంజూరు చేస్తున్నారు. ఇవి క్షేత్రస్థాయిలో ఖర్చుచేయడం లేదు. కొన్ని పీహెచ్సీలలో నిధులు ఖర్చు చేయ లేక తిరిగి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు శానిటేషన్ పేరున నిధులను దుర్వినియోగం కూడా కొనసాగుతోంది. శానిటేషన్ నిధులతో మురికి కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ, ఇవి సక్రమంగా అమలు కాకపోవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. దోమల ప్రభావం పెరిగింది జిల్లాలో దోమల ప్రభావం పెరిగింది. అందుకే డెంగీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 20 వరకు కేసులు నమోదయ్యాయి. వ్యాధి నిర్మూలనకు తీవ్రంగా కృషిచేస్తున్నాం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాధి ప్రబలిన చోట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. - లక్ష్మయ్య, జిల్లా మలేరియా నిర్మూలన అధికారి -
సీఎం సహాయ నిధికి తూట్లు!
* పేదలకు ముఖ్యమంత్రి పేషీలోనే చెక్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం * తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఇష్టానుసారం మంజూరే లక్ష్యం! * వైద్య, రెవెన్యూ శాఖల స్క్రూటినీకి మంగళం * రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రుల వ్యతిరేకత * ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిద్ధమైన ఫైలు * గతంలో చంద్రబాబు పేషీలోనే సీఎం సహాయ నిధి కుంభకోణం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి తూట్లు పొడిచేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఇందుకు పూనుకోవడం విడ్డూరం. ఆర్థిక స్థోమత లేని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రి బిల్లు అంచనా ఆధారంగా లేదా ఆసుపత్రికి చెల్లించిన బిల్లుల ఆధారంగా సీఎం సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేస్తుంటారు. ఈ నిధి రెవెన్యూ శాఖ ఆధ్వర్వంలో ఉంటుంది. రెవెన్యూ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇలాంటి సహాయూనికి సంబంధించిన అన్ని అంశాలూ పరిశీలిస్తారుు. అంతా సవ్యంగా ఉంటే రెవెన్యూ శాఖ సంబంధిత రోగి లేదా ఆసుపత్రికి చెక్లను ఇస్తుంది. అయితే ఇప్పుడు.. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే చెక్లను మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫైలును సిద్ధం చేశారు. తొలుత రూ.5 లక్షలు, అవి ఖర్చరుున తర్వాత మరో రూ.5 లక్షలు ఇలా ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు బదిలీ చేస్తుండాలని ఫైలులో పేర్కొన్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ఈ విధంగా బదిలీ చేసిన నిధుల నుంచి ముఖ్యమంత్రితో పాటు ఆయన కార్యాలయ అధికారులు తమకు నచ్చిన వారికి మంజూరు చేస్తూ నేరుగా సీఎం కార్యాలయమే చెక్లను ఇచ్చేస్తుందన్నమాట. ఈ ప్రతిపాదనను ఆర్ధిక, రెవె న్యూ శాఖల మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించి నట్లు సమాచారం. గతంలో ఏ ముఖ్యమంత్రు లు ఈ విధంగా చేయలేదని, ప్రభుత్వ నిధులను ఎటువంటి స్క్రూృటినీ లేకుండా సీఎం సహాయ నిధికి బదలారుుంచలేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయాలని భావించినా.. గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలి తప్ప ఇలా ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా చెక్లను మంజూరు చేయడం సరికాదని ఆ మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలకు అతీతంగా.. పేదల వైద్య చికిత్సలకు గాను సీఎం సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారని, ఒక దశ లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చారని వెల్లడించా రుు. సీఎం కార్యాలయానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్లు ఇచ్చే అధికారం కట్టపెట్టడం అంటే పరోక్షంగా నిధుల దుర్వినియోగానికి, కుంభకోణాలకు ఆస్కారం కల్పించినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. -
వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజారోగ్య శాఖలో పనిమంతులు కరువయ్యారు. కుర్చీలో కూర్చొని సేవలందించే అధికారులు మినహాయిస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసి జాగ్రత్త చర్యలపై నివేదికలిచ్చే కీలకమైన సిబ్బంది మాత్రం ఆ శాఖలో అందుబాటులో లేరు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సేవలు ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ఏళ్ళుగా ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో గ్రామాల్లో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జిల్లాలో 50 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పీపీ యూనిట్లు ప్రజలకు వైద్యసేవలందిస్తున్నాయి. ఇవిగాకుండా మూడువందల ఉపకేంద్రాల ద్వారా గ్రామాల్లో అత్యవసర సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్ పోస్టులు 17, సివిల్ సర్జన్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి భర్తీ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉండగా.. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎం పోస్టుల భర్తీ జిల్లా యంత్రాంగం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 122 ఆరోగ్య కార్యకర్త(పురుషులు)లకు గాను కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదేవిధంగా మహిళల కేటగిరీలో 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ళుగా ఈ పోస్టులు భర్తీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో వైద్య,ఆరోగ్య శాఖ సేవలు కుంటుపడుతున్నాయి. వారే కీలకం.. గ్రామాల్లో అపారిశుద్ధ్యం , తద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన అంశంలో ఆరోగ్య కార్యకర్త(పురుషులు)ల పాత్ర కీలకం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు రోగాల తీవ్రత ఎక్కువగా ఉంటే రాత్రింబవళ్లు పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వీరిదే. అదేవిధంగా ఉన్నతాధికారుల పర్యటనలు, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులపై నివేదికలు తయారు చేయడంలో ప్రధాన భూమిక వీరిదే. ఇంతటి కీలక బాధ్యతలున్న ఈ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన నిధుల వినియోగం గందరగోళంగా తయారైంది. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేయలేక పోవడం ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగజారుతున్న ‘ర్యాంకు’ వైద్యుల ఖాళీలు, సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు క్రమంగా దిగజారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఇటీవల అధికారులు సర్వే నిర్వహించగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. ఆస్పత్రులను పరిశీలిస్తే.. జిల్లాలో ఒక్క ఆస్పత్రి కూడా కేటగిరీ ‘ఏ’లోకి రాకపోవడం గమనార్హం. ‘బీ’ కేటగిరీలో 6 ఆస్పత్రులుండగా, ‘సీ’ కేటగిరీలో 12, ‘డీ’ కేటగిరీలో 32 ఆస్పత్రులున్నాయి. అత్యధికంగా డీ కేటగిరీలో ఆస్పత్రులు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు గైర్హాజరీ, విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి కనబర్చడంతోనే ఆస్పత్రుల స్థాయి పడిపోయిందంటూ ఇటీవల జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినసంగతి తెలిసిందే. -
కొనుగోల్మాల్
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.50 లక్షలు విలువ చేసే ఏసీలు, ఫ్రిజ్లు, బెంచీలు, టేబుళ్లు, ఫ్యాన్లు ఇతర పరికరాల కొనుగోళ్లలో గోల్మాల్ చోటుచేసుకుంది. ఏ వస్తువునైనా ఏపీహెచ్ఎంఐడీసీ ఇంజనీరింగ్ విభాగం (హైదరాబాద్) వారి ఆధ్వర్యంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కళాశాలలోని ఓ ఉన్నతాధికారి ఆ నిబంధనలు పాటించలేదని స్పష్టమౌతోంది. టెండర్లు పిలవకుండానే కొనుగోలు చే శారు. వైద్య ఆరోగ్య శాఖ హైదాబాద్లోని ఓ ఉన్నతాధికారి అనంతపురం మెడికల్ కళాశాలలోని ఉన్నతాధికారికి క్లాస్మేట్ కావడంతో ఇద్దరూ కలసి హైదరాబాద్లోని బాలానగర్లో ఈ పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ వస్తువుల కొనుగోళ్లలో 35 శాతానికి పైగా కమీషన్ ఉండేలా బిల్లులు సృష్టించారు. బిల్లుల మంజూరులో ఏడీ లోకనాథం సంతకం అవసరమైంది. సంతకం చేయాలని ఓ ఉన్నతాధికారి ఏడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా పరికరాలు కొనుగోలు చేశారని, అందులో నాసిరకం పరికరాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో విచారణ జరిగితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన ఏడీ సంతకం పెట్టడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో కళాశాలలోని ఆ ఉన్నతాధికారికి ఏడీకి మధ్య గొడవ రాజుకుంది. తాను కళాశాల ఇన్చార్జ్గా ఆదేశాలు జారీ చేస్తున్నాన ని, కచ్చితంగా సంతకం పెట్టి తీరాలని హుకుం జారీ చేయడమే కాకుండా డీఎంఈతో మాట్లాడి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బెదిరిచడంతో విధిలేని పరిస్థితిలో ఏడీ సంతకాలు చేసినట్లు సమాచారం. మార్కెట్లో రూ.15 వేలు విలువ చేసే ఫ్రిజ్ను రూ.30 వేలకు కొనుగోలు చేసినట్లు, ఒక్కో ఫ్యాన్ ధర రూ.1200 ఉంటే రూ.5 వేలకు కొనుగోలు చేసినట్లు, టేబుళ్లు, కుర్చీలు మార్కెట్ ధర కంటే మూడింతలు అధికధరకు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి మంజూరు చేయించుకున్నట్లు తెలిసింది. ఇందులో ఎవరికి వెళ్లాల్సిన వాటాలు వారికి అందినట్లు కళాశాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) విజిట్ అనంతరం ఇందులో సగం వస్తువులన్నీ మాయమైపోయినట్లు కళాశాల వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రతి ఎంసీఐ విజిట్ ముందు ఈ రకంగా వస్తువులన్నీ పాడయ్యాయని కొనుగోలు చేయడం మెడికల్ కళాశాలలో ఆనవాయితీగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. చేయి తడిపితేనే బిల్లు ఏడాది క్రితం చిత్తూరు జిల్లా నుంచి బదిలీపై అనంతపురం మెడికల్ కళాశాలకు వచ్చిన ఓ అధికారి డాక్టర్లకు సంబంధించిన బిల్లులు, ఇతర వాటికి సంబంధించి పైసలు ఇవ్వనిదే ఫైలు ముట్టుకోవడం లేదని పలువురు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి నోటీసుకు తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. మెడికల్ కళాశాల మొత్తం ముగ్గురు సిబ్బంది కనుసైగలతో నడుస్తోంది. ఆ ముగ్గురు అనంతపురంలో మెడికల్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి బదిలీ లేకుండా ఇక్కడే తిష్టవేసుకున్నట్లు తెలిసింది. మరో ఉద్యోగి.. ఉన్నతాధికారికి స్వయాన బంధువు కావడంతో ఇక్కడ ఏళ్లతరబడి పాతుకు పోయినట్లు సమాచారం. మొత్తం కళాశాలలో ఫ్లంబింగ్, టాయిలెట్స్, బాత్రూములు రిపేరీల పేరుతో ప్రతినెలా వేలాది రూపాయల బిల్లులు డ్రా చేయడంలో ఆ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు, దీనికి మరో ఇద్దరు ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు బేఖాతరు.. పరిపాలన బాధ్యతలు చూసే వైద్యులు.. క్లినిక్లు, ల్యాబ్లు నడపరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ స్వయంగా పెథాలజీ ల్యాబ్ నడుపుతున్నారు. ఇక్కడికి వచ్చే ప్రొఫెసర్లలో కొందరు ఉదయం 11 గంటలకే క్లినిక్లకు తిరుగు ముఖం పట్టినా ప్రిన్సిపాల్ ప్రశ్నించే సాహసం చేయడం లేదు. ఒక వేళ ప్రశ్నించినా మీరు కూడా ల్యాబ్ నడుపుతున్నారని ఆ ప్రొఫెసర్లు ఆమె పైనే దండెత్తే పరిస్థితి నెలకొంది. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రొఫెసర్లు కళాశాలకు వచ్చినా రాకపోయినా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఇన్ని సమస్యలు ఉన్న మెడికల్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడం వల్ల మిగిలిన వారిది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వం, జిల్లా మంత్రులు ఈ వ్యవహారంపై విచారణ చేయించి మెడికల్ కళాశాలను సంస్కరించకపోతే అదనపు సీట్లు రావడం ప్రశ్నార్థకం కానుంది. నేను రెగ్యులర్ ప్రిన్సిపాల్ను కాదు రెగ్యులర్ ప్రిన్సిపాల్ అయితే ల్యాబ్లు నిర్వహించకూడదు. నేను రెగ్యులర్ ప్రిన్సిపాల్ కాదు. అయినా తిరుపతి లాంటి ప్రాంతాల్లోనే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నేను నిర్వహించేది ఏముంది.. అయినా నేను విధులు ముగించుకున్న తరువాతే సాయంత్రం పూట ల్యాబ్కు వెళ్తాను. కళాశాలకు మేము ఎటువంటి వస్తువులూ నేరుగా కొనుగోలు చేయలేదు. మాకు ఏ వస్తువు కావాలన్నా డీఎంఈకి లేఖ రాస్తాం. ఆయన సరే అంటే నేరుగా కొనుగోలు చేస్తాం. లేదంటే ఏపీహెచ్ఎంఐడీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు తెలిపితే వారే పరికరాలు కొనుగోలు చేసి కళాశాలలో అమరుస్తారు. అంతేకానీ మేము కళాశాల కోసం ఏ పరికరాలూ కొనుగోలు చేయలేదు. - డాక్టర్ నీరజ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అనంతపురం -
వ్యాధులొస్తున్నాయ్.. వైద్యులు వెళ్తున్నారు!
రిమ్స్ క్యాంపస్: వర్షాకాలం వచ్చింది. పెద్దగా వానలు లేకపోయినా.. అప్పుడప్పుడూ కురుస్తున్న చిన్న వర్షాలకే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజనులో ఇటువంటి ప్రమాదం ఉంటుందన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందువల్ల పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు, ఇతరత్రా వనరులతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖదే. ఎప్పుడు ఎక్కడ అవసరమొచ్చిన తక్షణమే వైద్య సిబ్బందిని పంపించాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో వైద్యులే లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వారిలో కొందరు వైద్యు లు పీజీ కోర్సులు చేసేందుకు కొద్దిరోజుల్లో వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న వైద్యులతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాధులు ప్రబలే కాలంలో అలా సర్దుకుపోవడం సాధ్యమేనా.. పెలైట్ జిల్లాగా ఎంపిక చేసిన చోటే పరిస్థితి ఇలా ఉంటే వ్యా ధులను అదుపు చేయ డం ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి ప్రభుత్వం 143 వైద్యుల పోస్టులు మంజురు చేసింది. అయితే 101 పోస్టులకే రెగ్యులర్ నియామకాలు జరిగాయి. మరో 35 పోస్టుల కాంట్రాక్టు వైద్యులతో భర్తీ చేశామనిపించారు. అంటే 136 మంది వైద్యు లు ఉన్నట్లు లెక్క.. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్సీలకు ఇతర చోట్ల నుంచి వైద్యులను పంపించి ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.. ఇదే సమయంలో సరికొత్త సమస్య ఎదురైంది. రెగ్యులర్ వైద్యుల్లో 12 మంది పీజీ కోర్సు చేసేందుకు ఈ నెలాఖరున వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య 19కి పెరుగుతుంది. మరోవైపు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 35 మంది వైద్యుల కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30నాటికే ముగిసింది. దీన్ని డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎండార్స్మెంట్ రాలేదు. దీంతో కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. ఎండార్స్మెంట్ రాకపోయినప్పటికీ డీఎంహెచ్ంవో గీతాంజలి విజ్ఞప్తి మేరకు వీరంతా ఇప్పటివరకు విధులకు హాజరవుతున్నారు. వైద్యులు లేని పీహెచ్సీలకు ఇతర పీహెచ్సీల నుం చి సర్దుబాటు చేస్తుండగా దూరాభారమైనప్పటికీ వెళుతున్నారు. అయితే వైద్యుల సంఖ్య ఇంకా తగ్గిపోనుండటంతో ఇబ్బం దులు సైతం పెరగనున్నాయి. పెలైట్ జిల్లా అయినా దిక్కు లేదు వైద్య ఆరోగ్యశాఖ పరంగా శ్రీకాకుళాన్ని పెలైట్ జిల్లాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రకటిం చారు. ఆ మేరకు అవసరమైన పోస్టులను జిల్లాస్థాయిలోనే నియమించుకునే అధికారం ఉంది. గతంలో వైద్యుల కొరత ఏర్పడగానే ఇదే రీతిలో నియామకాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమ ఆదేశాలు లేకుండా ఎటువం టి నియామకాలే చేపట్టరాదని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడితే సమస్య తప్ప టం లేదు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టిసారించి పెలైట్ జిల్లా కింద వైద్యుల నియామకాన్ని జిల్లాస్థాయిలోనే చేపట్టేలా చూస్తే తప్ప వైద్యుల కొరత తీరదు. సకాలంలో ప్రజలకు వైద్యం అందదు. -
లింగ నిర్ధారణ కేంద్రాల రిజిస్ట్రేషన్లో అవకతవకలు
సాక్షి, కర్నూలు : ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించేందుకు.. సామాన్య రోగులను రక్షించేందుకు.. నిర్ణీత రుసుంతో వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఆచరణకు నోచుకోవడం లేదు. ఇది పరోక్షంగా అధికారులకు కల్పవృక్షంగా మారిందనే విమర్శలున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవడంతోపాటు నిర్ణీత ఫీజులను నిర్ణయించాలి. అలాగే లింగనిర్ధారణ(స్కానింగ్) కేంద్రాలపై నిఘా ఉంచి గర్భంలో ఉన్న బిడ్డ ఆడ, మగ అనేది తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ రెండింటి మాటున వైద్య ఆరోగ్య శాఖ వసూళ్ల పర్వం సాగిస్తోంది. నిబంధనల సాకు చూపి నజరానాలు పుచ్చుకోవడంతో చట్టం అమలు మచ్చుకైనా జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలను అతిక్రమించినా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రదర్శించాలనేది నిబంధనల్లో ఒకటికాగా, చాలాచోట్ల ఇది అమలుకు నోచుకోవడం లేదు. అక్కడక్కడ ఫీజుల బోర్డులు పెట్టినా అవి అలంకరణప్రాయమేనని తెలుస్తోంది. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇవీ నిబంధనలు..: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2002 ప్రకారం ప్రతి ప్రైవేటు వైద్యశాల నిర్ణీత ఫీజు చెల్లించి వైద్యశాఖ రిజిస్ట్రేషన్ పొందాలి. ఒకటి నుంచి 20 పడకల మధ్య ఆసుపత్రులైతే రూ. 3,750, 21-50 మధ్య రూ. 7,500, 51-100 మధ్య రూ. 10 వేలు చొప్పున ఫీజు చెల్లించాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఐదేళ్ల వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ క్రమబద్ధీకరించుకోవాలి. అర్హత గల వైద్యులు, పారామెడికల్, ల్యాబొరేటరీల్లో అర్హులైన సిబ్బంది ఉండాలనే నిబంధనలున్నాయి. పరీక్షలకు, శస్త్రచికిత్సలకు వసూలు చేసే ఫీజులను ఆస్పత్రుల వద్ద ప్రదర్శించి అమలు చేయాలి. వీటిలో ఏదో ఒక లొసుగు ఉండడం వల్ల అధికారులతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని ఆమోదముద్ర పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. లింగ నిర్ధారణ కేంద్రాల రిజిస్ట్రేషన్లో కూడా మతలబు జరుగుతోంది. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్కు రూ. 35 వేలు చొప్పున, ఆస్పత్రి లేకుండా నిర్వహించే వారికి రూ. 25 వేలు చొప్పున ఫీజుగా వసూలు చేస్తారు. దీనికి అనుబంధంగా అర్హులైన వైద్యుడు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయంలో వెసులుబాటు కల్పించినందుకు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఫీజులపై నియంత్ర ణ డొల్ల.. చట్టప్రకారం ఆస్పత్రుల వద్ద నోటీసు బోర్డులో నమోదు చేసిన ఫీజులు వసూలు చేయాలి. ఇది మచ్చుకైనా అమలు జరగడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ప్రసవానికి వచ్చిన వారి నుంచి రూ. 25 వేలు నుంచి రూ. 35 వేల వరకు వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. వివిధ రకాల పరీక్షలను సాకుగా చూపి బిల్లులు వసూలు చేస్తున్నా ఆడిగేవారు లేరు. రిజిస్ట్రేషన్ సమయంలో వైద్యాధికారులు వారికి వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకొని ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. బయో మెడికల్ వేస్ట్కు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణపత్రం సమర్పించాలి. ఇలాంటివి కొన్ని ఆస్పత్రులకు లేకపోయినా పట్టించుకునే వారు లేరు. జిల్లాలో ఇప్పటి వరకు 225 స్కానింగ్ సెంటర్లు, 296 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి. నిబంధనలు పాటించకపోతే మూసివేస్తాం: ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల మీద చర్యలు తీసుకుంటాం. ఏ చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారో ఆస్పత్రుల వద్ద తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేసి అమలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగాఫీజులు వసూలు చేసినట్లు రుజువైతే అలాంటి ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను మూసివేస్తాం. - నరసింహులు, డీఎంహెచ్ఓ -
ఇక ఊరూరా వైద్య సేవలు
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలో ప్రభుత్వ ఆ స్పత్రుల తీరు మరింతగా మెరుగుపడనుంది. ప్రతి పల్లెకు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తామని ఇటీవలే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ప్రకటించారు. ఇం దులో భాగంగానే, జిల్లాలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు కొత్త విధానాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలని కోరుతూ జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు ఇటీవలే ఉన్నతాధికారులకు ఓ నివేదికను సమర్పించారు. కొత్తగా మరిన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని నివేదించారు. ఇదీ పరిస్థితి జిల్లాలో ఇప్పటికే 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, 377 ఆరోగ్య ఉప కేంద్రాలు,ఆరు కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా మరో 25 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. జిల్లాలో 25.51 లక్షల జనాభా ఉంది. ప్రతి 30 వేల నుంచి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. అదే విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. అదనంగా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు కూడా సుముఖంగా ఉన్న ట్లు తెలిసింది. గతంలోనే తొమ్మిది ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారు. తిర్మన్పల్లి, చౌట్పల్లి, పోచంపాడ్, కిషన్నగర్, గోవింద్పేట, దేవునిపల్లి, పెగడపల్లి, ఏర్గట్ల, పుల్కల్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతి వచ్చిం ది. వీటి ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా భీమ్గల్, బాన్సువాడ డివిజన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి డి విజన్, నిజామాబాద్ రూరల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ముఖ్యంగా తండాలలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని విన్నవించారు. ఇందుకు అనుగుణంగా వై ద్యులు, సిబ్బం దిని అదనంగా నియమించనున్నారు. ఈ ఆస్పత్రులలలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. గర్భిణీలకు మందులు, ప్రసవాని కి సంబంధించి సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులను అక్కడే అందించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నారు. లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక సర్కిల్గా తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఎన్ఆర్హెచ్ఎం సర్వే ప్రకారం విశ్లేషణ జరుగుతోంది. జిల్లాలో పది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఏడు, బోధన్లో రెండు, కామారెడ్డిలో ఒకటి ఉన్నాయి. ఇందులో వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, కమ్యూనిటీ మొబైల్ ఆఫీసర్, ఇద్దరు అటెం డర్లు, ఒకరు ఫార్మసిస్టు ఉంటారు. స్థాయి పెరిగితే సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతి రోగానికి సంబంధించి మందులు, వైద్యసేవలు అందుబాటులో ఉంచుతారు. -
ఫీవర్రీ
అనంతపురం అర్బన్ : జిల్లాలో పెద్ద సంఖ్యలో రోగులు విష జ్వరాల బారిన పడ్డారు. పదుల సంఖ్యలో రోగులకు డెంగీ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అధికారుల్లో కలవరం మొదలైంది. గత ఏడాది డెంగీతో పదుల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం డెంగీ కేసులే లేవని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న కేసులు అవాస్తవమని, అవి రాపిడ్ కిడ్ మెథడ్తో చేశారని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు చెబుతున్నారు. ఎలీసా రీడర్తో వైద్య పరీక్షలు చేసిన తర్వాతే డెంగీనా? కాదా? అన్నది తేల్చాలంటున్నారు. రోగం ఏదైనా సత్వర చికిత్స అందించడానికి తీసుకుంటున్న చర్యల్లో వేగం మందగించింది. అయితే ఆరోగ్య శాఖలోని మలేరియా విభాగం మాత్రం నిద్రమత్తు వీడడం లేదు. వృథాగా ఎలీసా రీడర్ ఈ ఏడాది ఏప్రిల్లో ఎంపీ నిధుల (రూ.6 లక్షలు)తో ఎలీసా రీడర్ పరికరం కొనుగోలు చేశారు. దీన్ని వైద్య కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగంలో ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఈ పరికరంతో ఒక్క పరీక్ష కూడా చేయలేదు. అయితే ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలీసా రీడర్తోనే పరీక్షలు చేస్తున్నామని ఉత్త మాటలు చెబుతోంది. కాగా మైక్రోబయాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం కొన్నేళ్లుగా రాపిడ్ మెథడ్తోనే పరీక్షలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన ఎలీసా రీడర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. పరీక్షలు ప్రారంభించడానికి పూణె నుంచి డెంగీ ఎలీసా కిట్స్ రావాల్సి ఉందని, ఆ బాధ్యతను మలేరియా విభాగం తీసుకోవాని మైక్రో బయాలజీ విభాగం వారు చెబుతున్నారు. నిద్రమత్తులో వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో డెంగీ లక్షణాలతో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆత్మకూరు మండలం బీకే తండాకు చెందిన ఓ గర్భిణి, ఈదులపల్లికి చెందిన నరసమ్మ.. రామగిరి మండలం కొండాపురానికి చెందిన నారాయణ.. రాయదుర్గంకు చెందిన సోయెబ్లు డెంగీ లక్షణాలతో మృతి చెందిన వారే. అయితే అసలు డెంగీ కేసులే నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కానీ మైక్రో బయాలజీ విభాగం రికార్డులను పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి ఐదు కేసులు నమోదయ్యాయి. జనవరిలో 14 కేసులు రాగా ఇద్దరు, ఫిబ్రవరిలో 11 రాగా ఒకటి, ఏప్రిల్లో 65 రాగా ఒకటి, మేలో 28 రాగా ఒక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మలేరియా విభాగం క్షేత్ర స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాల్సి ఉన్నా ఆ ఉసే కన్పించడం లేదు. ఇదిలావుండగా ప్రైవేట్ ఆస్పత్రులలో డెంగీ లక్షణాలతో పదుల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. విజృంభిస్తున్న విష జ్వరాలు ఇటీవల వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2, 3, చిన్నపిల్లల ఓపీల్లో అధిక సంఖ్యలో జ్వర కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఓపీకి సుమారు 500 మంది రోగులు వస్తుండగా.. వంద మంది వరకు అడ్మిషన్ పొందుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వాతావరణంలో మార్పులు రావడంతో ప్రధానంగా చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియాతో బాధపడుతున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఓపీ అయిపోవడానికి మధ్యాహ్నం ఒంటి గంట పడుతోంది. ఇక్కడి వైద్యులు సిఫార్సు చేసిన పరీక్షలు చేయించుకోవడానికి రోగులు ల్యాబ్లకు వెళితే.. వాతావరణ మార్పుతో జిల్లాలో విష జ్వరాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్లేట్లెట్స్ కౌంట్ 50 వేలకు పడిపోగానే డెంగీ లక్షణాలంటూ పలువురు వైద్యులు పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. మలేరియా వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పడిపోచ్చు. ఆర్థిక స్థోమత ఉన్న వారు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగు దీస్తుండగా, పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కయ్యాయి. వందల మంది రోగులు వస్తుండటంతో వైద్యులు, సిబ్బంది అందుకు సమాయత్తమై వైద్యం అందించలేక సతమతమవుతున్నారు. ఇందులో డెంగీ కేసులు నిర్ధారణ అయితే తమకు చెడ్డ పేరు వస్తుందని డీఎంహెచ్ఓ బెంబేలెత్తుతున్నారు. -
జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి కృషి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చిత్తూరు(జిల్లాపరిషత్): చిత్తూరు జి ల్లాలో వైద్యరంగం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీని వాసరావు అన్నారు. శుక్రవారం ఉద యం కాణిపాకం వరసిద్ధి వినాయకు ని దర్శనానికి వచ్చిన ఆయన తిరు గు ప్రయాణంలో చిత్తూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే శివప్రసా ద్, సత్యప్రభతో పాటు, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, మాజీ ఎం పీ దుర్గారామక్రిష్ణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, చిత్తూ రు సహకార చక్కెర కర్మాగారం అధ్యక్షులు ఎన్పీ రామకృష్ణ, బీజేపీ నాయకులు బాబుప్రసాద్రెడ్డి కలసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ బెంగళూరు, చెన్నైకు మధ్య చి త్తూరు జిల్లా ఉందని, నిత్యం తిరుమలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని తెలిపారు. ఈ క్రమం లో ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరి గే అవకాశం ఉందని, దీనిని అధిగమించి క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని పేదప్రజలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాల్సి ఉందన్నారు. దీనికి గాను జిల్లాలోని ఎమ్మెల్యేలం తా సమావేశమై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి కోరారు. జిల్లాలో మండల స్థాయిలో ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, వీటిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినందున అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిత్తూరుకు చెందిన బీజేపీ నాయకు లు మంత్రిని కలసి చిత్తూలోని ప్రభు త్వ ప్రధాన వైద్యశాల సూపరింటెం డెంట్ను విధుల నుంచి తప్పించాల ని డిమాండ్ చేశారు. సూపరింటెం డెంట్ డాక్టర్ దేవదాసు అండతోనే ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆపార్టీ నాయకు లు రామభద్ర, అట్లూరిశ్రీనివాసు లు, దేవేంద్ర, ఆరణి తదితరులు జిల్లా కార్యదర్శి వెంకటేశ్ ఆధ్వర్యం లో మంత్రికి వినతిపత్రం సమర్పిం చారు. అనంతరం మంత్రి బీజేపీ నాయకురాలు స్వర్గీ య ఝాన్సీలక్ష్మీ ఇంటికి వచ్చారు. ఆమె కుమారుడు వెంకట్, కుటుం బీకులను కలసి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. -
వైద్య ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం
పనితీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక రిమ్స్క్యాంపస్, న్యూస్లైన్: వైద్యాధికారులు, వైద్యశాఖ ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సౌరభ్గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పురాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఎస్పీహెచ్వోలతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సిన వైద్య ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఎంతమాత్రం సరికాదన్నారు. దోనుబాయి పీహెచ్సీని ఇటీవల అకస్మికంగా తనిఖీ చేయగా..ఆ సమయంలో తాళాలు వేసి ఉందన్నారు. 24 గంటలు తెరచి ఉండాల్సిన పీహెచ్సీకి తాళాలు వేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మరికొన్ని పీహెచ్సీలను తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది సరిగ్గా ఉండకపోవటం వంటి సమస్యలను గుర్తించానన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. చాలామంది ఉద్యోగులు బాధ్యతరహితంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్వో కార్యాలయంలోని గుమస్తాలను పిలిచి ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో కలెక్టర్ ఆరా తీశారు. అయితే కొంతమంది తడబడటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలో తానే నిర్ణయించి జాబ్ షీట్ వేస్తానని చెప్పారు. ‘మార్పు’ కార్యక్రమం బాగా నిర్వహించినందుకు జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం దక్కిందన్నారు. ఇందుకు సీతంపేట, నరసన్నపేట పీహెచ్సీల సిబ్బంది బాగా సహకరించారని ఆయా పీహెచ్సీల వైద్యాధికారులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్.ఆర్.హెచ్.ఎం వివరాలను పొందుపరిచేందుకు గాను కొత్తగా వచ్చిన ల్యాప్టాప్లను పీహెచ్సీల వైద్యాధికారులకు పంపిణీ చేశారు. కాగా సమావేశానికి వస్తున్నప్పడు కార్యాలయంలోని లిఫ్ట్ పని చేయకపోవటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 25 వేలు ఖర్చు పెట్టి లిఫ్ట్ బాగు చేసుకోకపోతే ఎలా అంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అలాగే కార్యాలయంలో బూజు పట్టి ఉండటం చూసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉంటున్న కార్యాలయం ఇలా ఉండటం సరికాదని కలెక్టర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఏజేసీ మహ్మద్ షరీఫ్, డీఎంహెచ్వో ఆర్.గీతాంజలి, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వైద్యశిబిరాలు
సంగారెడ్డి అర్బన్, న్యూస్లైన్: జిల్లాలోని 1,678 పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ పద్మ మ ంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబి రాల్లో ఒక పారా మెడికల్ సిబ్బంది, ఒక స హాయకుడిని నియమించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో అత్యవసర చికిత్స, ప్రథ మ చికిత్స అందించడంతోపాటు మందులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలి పారు. అవసరమైన ఓటర్లకు వైద్య సేవలు అం దేలా మండల వారీగా ప్రత్యేకంగా బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సహాయం కోసం జిల్లాలోని పది క్లస్టర్లలో హెల్ప్లైన్ నం బర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్చేసి సహాయం కోరవచ్చ ని ఆమె సూచించారు. ప్రతి మండలానికి ఒక డాక్టర్ను నియమించి అద్దె వాహనాల ద్వారా పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. వీరు కాకుండా జిల్లాకు ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్టు ఆమె వివరించారు. పరిశీలకులు ప్రతి రెండు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారన్నారు. క్లస్టర్ హెల్ప్లైన్లే కాకుండా జిల్లా హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రతి నియోజకవర్గంలో రెండు పెద్ద ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించామని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అత్యవసర వైదాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఈ సేవలతోపాటు ఇరవై 104 వాహనాలు, జిల్లాలోని 108 వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. క్లస్టర్ మొబైల్ నంబర్ అందోల్ 9866838121 నర్సాపూర్ 9177254007 సదాశివపేట 9908894923 రామాయంపేట 7794806176 కోహీర్ 9949463466 నారాయణఖేడ్ 9440225893 దుబ్బాక 9848515118 గజ్వేల్ 9959750791 పటాన్చెరు 9949607036 సిద్దిపేట 9848260740 జిల్లా హెల్ప్లైన్ నంబర్లు 9849903773, 9966024444, 08455-274824లను సంప్రదించాలన్నారు. -
చక్కని జీవితానికి రెండు చుక్కలు
సాక్షి, నల్లగొండ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 3,69,905 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 3,44,950 మంది చిన్నారులకు మొదటి రోజు చుక్కలు వేశారు. అంటే 93.25 శాతం మంది పిల్లలకు చుక్కలు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు సమ్మెలో కొనసాగుతున్నా ఇంతటి భారీ స్థాయిలో చుక్కలు వేయడం విశేషం. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయనున్నారు. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 11,884 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల చక్కని జీవితానికి తోడ్పాటునందించారు. పోలియో రహిత సమాజం స్థాపిద్దాం నల్లగొండ టౌన్ : పోలియో రహిత సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో నిర్వహించిన రెండవ విడత పోలియో చుక్కల కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 5సంవత్సరాలలోపు పిల్లల వరకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఆమోస్, డీఐఓ ఏబీ నరేంద్ర, డెమో తిరుపతయ్య , ఆస్పత్రి సూపరింటెండెంట్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ సీటు..చిచ్చు
పరిపాలనా విభాగంలో కొత్త వివాదం రాజుకుంది. ఇటీవల జిల్లా పరిషత్ సీఈవోగా నియుమితులైన అనితాగ్రేస్ను జారుున్ చేసుకోకుండా కలెక్టర్ వెనక్కి పంపించటం చర్చనీయూంశంగా వూరింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అనితాగ్రేస్ను సీఈవోగా నియుమిస్తూ ఈనెల 18న రాష్ట్ర పంచాయుతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తన బాధ్యతలు చేపట్టేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టర్ను కలిశారు. ఆయున వివుుఖత చూపటంతో వెనుదిరిగి వెళ్లారు. గతంలో ఎన్నికల పని చేసిన అనుభవం లేదని, రిటర్నింగ్ ఆఫీసర్గా పని చేయుటం కష్టవువుతుందని చెప్పి ఆమెను తిప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. అదే సవుయుంలో ఈ వుూడు నెలలపాటు ఎన్నికల విధుల నిర్వహణకు వీలుగా రెవెన్యూ విభాగానికి చెందిన వారిని సీఈవోగా నియుమించాలని రాష్ట్ర పంచాయుతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కలెక్టర్ ఫాక్స్లో లేఖ పంపించినట్లు తెలిసింది. అప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో కలెక్టర్ ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం అధికారులందరిలో హాట్ టాపిక్గా వూరింది. తావుు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతో పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు సైతం కలెక్టర్ చర్యకు విస్తుపోరుునట్లు ప్రచారం జరిగింది. కేవలం రెవెన్యూ విభాగానికి చెందిన వారే ఎన్నికలు నిర్వహించటానికి సవుర్థులా... అనేది నాన్ రెవెన్యూ విభాగాలకు చెందిన గ్రూప్ వన్ అధికారుల్లో ఆందోళనకు తెర లేపింది. గతంలో పని చేసిన జెడ్పీ సీఈవోను తిరిగి జిల్లాకు రప్పించే ఆలోచనతోనే కలెక్టర్ ఈ చర్యకు పాల్పడ్డారనే వివుర్శలు వ్యక్తవుయ్యూరుు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేవు శాఖలో డెప్యూటీ డెరైక్టర్ స్థారుు అధికారిగా ఉన్న అనితాగ్రేస్ ప్రస్తుతం హైదరాబాద్లో వైద్య విధాన పరిషత్లో సంయుుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. కలెక్టర్ వివుుఖత వ్యక్తం చేయుటంతో తిరిగి వెళ్లిన అనితాగ్రేస్.. తిరిగి పంచాయుతీరాజ్ విభాగం ఉన్నతాధికారులను ఆశ్రరుుంచినట్లు తెలిసింది. ఈ వరుస పరిణావూలతో ఆమె సీఈవోగా జారుున్ అవుతారా..? వేరే చోట పోస్టింగ్కు ప్రయుత్నం చేసుకుంటారా..? అనేది చర్చనీయూంశంగా వూరింది.