internal clashes
-
దందాలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్లను ఎంపీ తన కంట్రోల్లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది. ⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు. చినబాబు అండతోనేనా? ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. -
తెలంగాణ బీజేపీలో చీలికలు
-
బీజేపీ ఎమ్మెల్యేల్లో వైరాగ్యం
-
కర్నూలులో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
కర్నూలు, సాక్షి: అధికార పార్టీలో పాత గొడవలు బయటికొస్తున్నాయి. అటు మంత్రాలయంలో, ఇటు కొడుమూరులో తమ్ముళ్లు రోడ్డు మీదకు చేరి తన్నుకున్నారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడి.. ఆస్పత్రి పాలయ్యారు. మంత్రాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ నేత రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వంట పథకం ఏజెన్సీ విషయాల్లో తొలుత వాగ్వివాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయి ఇరు వర్గాలు బాహబాహీకి దిగాయి. కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమం.. తన్నుకున్నేదాకా వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన నాయకుల మధ్య మొదలైన గొడవతో ఇరు శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో టీడీపీ నేత సురేష్కు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వం మా మధ్య చిచ్చు పెట్టింది ఎట్టి పరిస్థితిలో సమ్మె ఆగదు
-
టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది ?
-
KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది. ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది. వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత్లో పురోగతి.. భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్కు సవాలేనని పేర్కొంది. సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు. -
కాంగ్రెస్కు షాక్! కోమటిరెడ్డి ఎఫెక్ట్.. హైదరాబాద్కు కుంభం.. కారులో షి‘కారు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు. తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్ కుమార్రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్ చెప్పుకొచ్చారు. (బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్షాతో కరీంనగర్ ఎంపీ భేటీ, కీలక సూచన) కారెక్కనున్న కుంభం కాంగ్రెస్లో వర్గపోరుతో కుంభం అనిల్కుమార్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డితోపాటు అనిల్కుమార్రెడ్డి హైదరాబాద్లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది. (బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) -
కిషన్రెడ్డికి తొలిరోజే షాక్! బీజేపీలో మళ్లీ అసమ్మతి గోల.. వేదికపైనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డికి తొలిరోజే షాక్ తగిలింది. వేదికపైనే ఆ పార్టీ నాయకుల ఇంటిపోరు బయటపడింది. అసంతృప్త నేతలపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, కనీసం కిషన్రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతోనే తన పదవి పోయిందని బండి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎడమొహం, పెడమొహం ఇక వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కిషన్రెడ్డి ముందు నుంచే వెళ్లిన రాజగోపాల్రెడ్డి, కిషన్రెడ్డికి అటు వైపు, ఇటువైపు ఉన్నవారితో కరచాలనం చేశారు తప్ప ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. (చదవండి: తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్) అందుకే త్వరగా వెళ్లిపోయా.. మరోవైపు కిషన్రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమం నుంచి విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలు సైతం హాట్టాపిక్గా మారాయి. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది’ అని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం వెనుదిరిగానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. (చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్) -
పల్నాడు: రొంపిచర్లలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
సాక్షి, పల్నాడు: జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే.. గతంలో.. ఆరు నెలల కిందట బాలకోటిరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో ఈ దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ తీవ్రంగా యత్నించింది. నారా లోకేష్ను సైతం రంగంలోకి దించాలనుకుంది. అయితే.. ఈలోపే దాడికి తానే బాధ్యుడినంటూ స్థానిక టీడీపీ నేత పమ్మి వెంకట్రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. పార్టీలో విభేధాలు ఉన్నాయని, నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు.. డబ్బులు తాను ఖర్చు పెడుతుంటే బాలకోటిరెడ్డిని ప్రొత్సహిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయి.. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు అప్పుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. తాజా దాడి కూడా ఈ కోణంలోనే జరిగిందా? లేదా మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు
టీ గ్లాస్లో తుఫాన్ వచ్చిందట. అదేనండి.. గాజు గ్లాస్ పార్టీ.. కాకినాడ జిల్లాలో ఉన్నదే గుప్పెడు మంది. అందులోనూ ముఠాలు.. కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఉన్న ఇద్దరి మధ్యే వార్ నడుస్తుంటే.. మరో నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇక మూడు ముక్కలాట ఆడుకోవడమే అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. పిఠాపురంలో మూడు ముక్కలాట పార్టీ నిర్మాణం అనే మాటే వినిపించని జనసేనలో అక్కడక్కడా ఒకరిద్దరు నాయకులు కనిపిస్తారు. అలా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో కార్యకర్తలుగా చెప్పుకునేవారికి తలనొప్పులు ప్రారంభమయ్యాయట. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్గా కాకినాడ నగరంలోని మాజీ టిడిపి కార్పోరేటర్ మాకినీడి శేషుకుమారి వ్యవహరిస్తున్నారు. 2017లో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి కార్పోరేటర్గా గెలిచిన శేషుకుమారి మేయర్ పదవి ఆశించి భంగ పడ్డారు. వెంటనే టిడిపికి స్వస్తి చెప్పి గాజు గ్లాస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ తిరిగి కాకినాడ వెళ్ళకుండా పిఠాపురంలోనే రాజకీయాలు చేస్తున్నారు శేషుకుమారి. పిఠాపురానికే చెందిన జనసేన పిఎసి సభ్యుడు పంతం నానాజీతో శేషుకుమారికి కోల్డ్ వార్ సాగుతోంది. డాక్టర్ పాలిట్రిక్స్ ఇక ఇటీవలే పిఠాపురంకు చెందిన ప్రముఖ వైద్యుడు పిల్ల శ్రీధర్తో పాటుగా ఆయన సతీమణీ డా.పిల్ల దీపిక కూడా జనసేనలో చేరారు. వీరికి పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో ..శేషుకుమారితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న డాక్టర్ శ్రీధర్ నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తూ గత ఎన్నికల అభ్యర్థి శేషుకుమారి క్యాడర్ ను తనవైపు రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శేషుకుమారి కాకినాడకు చెందిన నేత కావడంతో ఆమెపై నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. ఇలా నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోగా.. మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనలో చేరేందుకు సిద్దమైయ్యారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి టిడిపిలో చేరిన వర్మ..2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఐతే నియోజకవర్గంలో టిడిపిపై ఉన్న వ్యతిరేకత 2024 ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న అంచనాతో వర్మ జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో మూడు ముక్కలాట తప్పదని అంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
-
Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ'
సాక్షి, కాకినాడ: స్వపక్ష నేతల మధ్య వైషమ్యాలను చక్కదిద్ద లేక చేతులెత్తేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై బురదజల్లే ఎత్తుగడతో తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజా స్పందన లేక అభాసుపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నాయకుడు ‘రాష్ట్రానికి ఇదేమి ఖర్మ’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నినాదంతో గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త నినాదం మాట దేవుడెరుగు.. కనీసం ఆయన పర్యటించే నియోజకవర్గాల పరిధిలోనైనా పార్టీ అంతర్యుద్ధాలను చక్కదిద్దారా అంటే అదీలేదు. ప్రజల నుంచి స్పందన లేక టీడీపీ అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చాన్నాళ్లుగా ముఖం చాటేశారు. తెలుగు తమ్ముళ్లు వర్గాల బాట పట్టిన చోటే ఆయన తన పర్యటనకు శ్రీకారం చుట్టడంపై పార్టీ వర్గాలూ విస్తుపోతున్నాయి. పర్యటన సాగే కొవ్వూరు, నిడదవోలుతో పాటు పొరుగున ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో తమ్ముళ్ల తగువులతో పార్టీ ఇప్పటికే మూడు ముక్కలైంది. సొంత సామాజికవర్గ నేతలు మాటలు ఆధారంగా ఏకపక్షంగా ఇన్చార్జిలను మార్చేయడం ఈ వివాదాలకు ఆజ్యం పోసింది. గోపాలపురం– కయ్యాలకాపురం గోపాలపురంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ముప్పిడి వెంకటేశ్వరరావును ఉన్నపళంగా ఇన్చార్జి నుంచి తొలగించాలరని ఎస్సీ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ ఇన్చార్జిగా మద్దిపాటి వెంకట్రాజును చంద్రబాబు నియమించారు. దీనిపై ముప్పిడి వర్గం బాబును కలిసింది. కారణం చెప్పాలంటూ నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీచేస్తారని ఆయన ప్రకటించారు. పర్యవసానంగా విభేదాల అగ్గి మరింత రాజుకుంది. వీరిద్దరూ తలోదారి పట్టినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ వైరుధ్యాల మధ్య జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి మద్ధతుగా నిలవడం చర్చనీయాంశమైంది. సంజాయిషీ కూడా అడకుండా కరివేపాకులా తీసిపడేసినందుకు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించేందుకు ముప్పిడి వర్గం గుట్టుగా పావులు కదుపుతోంది. నిడదవోలులో తలోదారి వైఎస్సార్సీపీ రాకతో అడ్రస్ గల్లంతైన నిడదవోలుకు చంద్రబాబు రానున్నారు. గత ఎన్నికల్లో 21వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఇక్కడ బాధ్య తలు అప్పగించవద్దంటూ ఆవిర్భావం నుంచి పార్టీ నేతలు మొత్తుకున్నారు. ఓటమి తరువాత బూరుగుపల్లి పార్టీని చాప చుట్టేసి కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆయన రావడాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ హడావిడి చేయడం ద్వితీయ శ్రేణికి రుచించడం లేదు. మున్సిపాలిటీలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. గత ఎన్నికల్లో చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ కుందూరు సత్యనారాయణ శేషారావుకు వ్యతిరేకంగా ఒక గ్రూపుతో టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణిలో మెజార్టీ నేతలు టిక్కెట్టు తెచ్చుకుంటే పనిచేస్తామని తెరవెనుక శేషారావుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఈ రెండు గ్రూపుల పంచాయతీ గురువారం చంద్రబాబు వద్దకు వెళ్లేలా ఉంది. కొవ్వూరు.. విభేదాల జోరు ఎస్సీలకు రిజర్వు అయిన కొవ్వూరులో గత ఎన్నికల్లో టీడీపీ ఘెరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. చంద్రబాబు గురువారం తన కార్యక్రమాన్ని కొవ్వూరు నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని కూడా నియమించుకోలేని దీనావస్థ ఉంది. కొవ్వూరులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి తమను అవమానానికి గురిచేశారని ఎస్సీ సామాజికవర్గీయులు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వంగలపూడి అనిత పత్తా లేకుండా పోయారు. 2014లో గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్ను గత ఎన్నికల్లో పక్కనపెట్టారు. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయన్ను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబు ఆధిపత్యం తగ్గకూడదనే దోరణిలో చంద్రబాబు ఉన్నారంటూ ద్వితీయశ్రేణి గర్హిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ‘ఇదేం ఖర్మరా.. బాబు’ అంటూ పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. బూత్ కమిటీలు వేసే పరిస్థితే లేదు చంద్రబాబు ఏలూరులో ప్రవేశించగానే ప్రజలందరూ ఇదే ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు. బూత్ కమిటీలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆ పార్టీ క్యాడర్ దూరంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలందరూ సంక్షేమ పథకాలు అందుకుని ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ఏంచెప్పి మభ్య పెడతారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోవడానికి జనాలు సిద్ధంగా లేరు. – రాజమహేంద్రవరంలో మీడియాతో మంత్రి రోజా -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట
-
Ramagundam: స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల స్వపక్షంలో విపక్షం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల పాత్ర సొంత పార్టీ వారే పోషిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో మేయర్ నిర్ణయాలను డిప్యూటీ మేయర్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. తెరాస కార్పొరేటర్లు నగరపాలక సంస్థ సమావేశాన్నే బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని గులాబీ పార్టీలో వర్గ విభేదాలు రచ్ఛకెక్కాయి. టీఆర్ఎస్ మేయర్పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏకపక్ష నిర్ణయాలపై అధికార పార్టీ వారే నిరసన గళం విప్పారు. రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే.. వాటిలో 37 డివిజన్లకు టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాన్ని అధికార పార్టీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు బహిష్కరించారు. మేయర్పై అసంతృప్తితో నిరసనకు దిగారు. సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో మేయర్ బంగి అనిల్ కుమార్ సమావేశాన్ని గంటన్నర పాటు వాయిదా వేశారు. నామినేషన్ల బిల్లుల చెల్లింపు ఎజెండాపై సమావేశాన్ని బహిష్కరించిన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో మేయర్ తన చాంబర్లో రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. నామినేషన్ పనులపై ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో వాటికి బిల్లులు ఎలా చెల్లిస్తారని కార్పొరేటర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎజెండాలో ఎందుకు పెట్టారని, పెట్రోల్ బంకు కోసం మున్సిపల్ ఆఫీసులోని స్థలాన్ని కేటాయిస్తూ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. డివిజన్లలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వారు మేయర్ మీద దండెత్తారు. మేయర్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఒక దశలో మేయర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని తెలిసింది. చివరికి శాంతించిన అధికారపార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఎజెండాలో చేర్చిన 430 అంశాలపై కౌన్సిల్లో చర్చించారు. రూ.280 కోట్ల నామినేషన్ పనుల బిల్లుల చెల్లింపు అంశాలను కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో వాటిని పక్కకు పెట్టారు. పెట్రోల్ బంక్కు స్థలం కేటాయింపు అంశాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ వ్యవహారంపై రామగుండంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు మాయం అయిన ఫైల్స్ మళ్లీ ఎజెండాలోకి ఎందుకు తీసుకు రావాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్లు, మేయర్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చేలా పాలన ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలోని వంటి పరిస్థితే సిరిసిల్లలోనూ ఏర్పడింది. అక్కడి విభేదాలను స్వయానా సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పరిష్కరించారు. కరీంనగర్లోనే ఉన్న రామగుండం కార్పొరేషన్లో కూడా ఇలాంటి పరిస్థితే రావడం గులాబీ పార్టీ పెద్దలకు తలనొప్పే అంటున్నాయి పార్టీ శ్రేణులు. -
చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే తమ్ముళ్ల వర్గపోరు బట్టబయలైంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లిలో నిర్వహించిన రోడ్డు షో సాక్షిగా తమ బలాబలాల నిరూపణకు సిద్ధమయ్యారు. గ్రూపు తగాదాలను తెరపైకి తెచ్చారు. స్వాగత ఏర్పాట్లు మొదలు పర్యటన ఆద్యంతం రెండు నియోజకవర్గాల్లో ఎవరికి వారే అన్నట్లు నేతలు వ్యవహరించారు. ఇక విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజుతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు సయోధ్య కుదరలేదు. దీంతో ఆరోగ్య కారణం చూపించి అధినేత పర్యటనకు ఆమె డుమ్మా కొట్టినట్టు తెలిసింది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలంలో ఉన్న సన్రే రిసార్ట్సులో చంద్రబాబు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ బస చేశారు. అక్కడ నుంచి ఆయన పర్యటన ప్రారంభానికి ముందు టీడీపీ నాయకులు చాలామంది అక్కడకు వెళ్లారు. ఆయన బయటకు వచ్చేవరకూ దాదాపు మూడు గంటల సేపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ చుట్టూ ఒక గ్రూపు, వారికి కొంత దూరంలో రాష్ట్ర మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు చుట్టూ కొంతమంది నాయకులు సిట్టింగ్ వేశారు. అశోక్ గ్రూప్లో సుజయకృష్ణ రంగారావు, ఆర్పీ భంజ్దేవ్, శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె పావని తదితర ఉన్నతవర్గ నాయకులు కనిపించారు. వారితో పాటే ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్ మాత్రమే కూర్చున్నారు. చదవండి: (Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం) కళావెంకటరావు గ్రూపులో మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కిమిడి గణపతిరావు, తెంటు లకు‡్ష్మనాయుడుతో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. తర్వాత అక్కడకు వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆ రెండు శిబిరాల దగ్గరకూ వెళ్లి నేతలకు ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. గీతకు దక్కని భరోసా... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనైనా తనకు విజయనగరం టికెట్ వస్తుందనే ఆశతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇటీవల తాడేపల్లిలో చంద్రబాబు ముందు పంచాయితీ (నియోజకవర్గ సమీక్ష)కి వెళ్లారు. తీరా ఆయన ఏమీ తేల్చకుండా అశోక్కే పగ్గాలు అప్పగించేశారు. దీంతో కినుక వహించిన గీత... ఇటీవల అశోక్ బంగ్లాలో నిర్వహించిన మినీమహనాడుకు గైర్హాజరయ్యా రు. విజయనగరం టీడీపీ వేదికపై మళ్లీ అదితికే ప్రాధాన్యం ఇవ్వడంతో గీత రాజకీయ భవిష్యత్తు కు భరోసా లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా చంద్ర బాబు పర్యటకు ఆమె డుమ్మా కొట్టేశారు. దాసన్నపేట కూడలిలో రోడ్షో ఆపి మాట్లేందు కు అశోక్, అదితి ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు పక్కన వారిద్దరే ఉన్నారు. గీత రాకపోవడానికి ఆరోగ్యం బాగోకపోవడమే కారణమని ఆమె అనుచరులు చెబుతున్నా అసలు కథ ఆధిపత్య పోరేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: (అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం) అర్ధరాత్రి నుంచి మొదలు... గురువారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో సన్రే రిసార్ట్స్కు చేరుకున్న చంద్రబాబుకు భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు ఆయన వర్గీయులతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాట్లు అన్నీ ఆయనే చూసుకున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్న డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్రావు వర్గీయులు ఎవరూ అక్కడ కనిపించలేదు. శుక్రవారం ఉదయం మాత్రం చంద్రబాబుకు ఎదురేగి డెంకాడ మండలానికి రాకముందే జాతీయ రహదారి టోల్గేట్ వద్ద కంది చంద్రశేఖర్రావు, ఆయన వర్గీయులు స్వాగతం పలికారు. అదే నెల్లిమర్ల నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న బంగార్రాజుకు పోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ వేర్వేరుగానే ఎవరి మండలాల పరిధిలో వారు బైక్ ర్యాలీ చేశారు. వారిద్దరినీ కాదని తనకు ఏమైనా నెల్లిమర్ల టికెట్ వస్తుందేమోనని కడగల ఆనంద్ నెల్లిమర్లలో సభ, ఇతరత్రా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇలా మూడు మండలాల్లో ముగ్గురు నాయకులు వేర్వేరుగా అధినేత ముందు తమ‡బల ప్రదర్శన నిరూపణకు భారీగానే చేతిచమురు వదిలించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
Sathya Sai District: వర్గపోరుతో సై‘కిల్’.. దిగజారుతున్న టీడీపీ పరిస్థితి
టికెట్ నాదే... అంతా నేనే. ఎవరొచ్చినా మన తర్వాతే. టీడీపీలో ప్రతి నాయకుడూ అనుచర వర్గానికీ, కార్యకర్తలకు చెబుతున్న మాటలివి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని తమ్ముళ్లు తలోదారి పట్టారు. ఫలితంగా శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులంతా వర్గపోరు రాజేస్తుండగా... కార్యకర్తలు జెండా పక్కనపెట్టి మిన్నకుండిపోయారు. సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీని కాపాడే నాయకుడు కరువయ్యారు. నేతల నడుమ వర్గపోరుతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భారీ స్థాయిలో మహానాడు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజం నింపామని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం కార్యకర్తలంతా నిస్తేజంలో ఉండిపోయారు. సొంతపార్టీలోనే వేరు కుంపట్లు రాజుకుంటుండగా కార్యకర్తలు ఏ కుంపటి దగ్గర చలికాచుకోవాలో అర్థం కాని పరిస్థితి. పల్లెకు పొగ పెట్టిన సైకం.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సొంత పార్టీకే చెందిన జేసీ ప్రభాకర్రెడ్డి.. పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి గట్టిగా పోరాడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోతాడని బహిరంగంగానే చెబుతున్నారు. పైగా తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలోనూ పల్లె బాగా వెనుకబడ్డారని తేలింది. దీంతో పాటు పల్లె రఘునాథరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు సైతం ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో సొంతపార్టీలోనే పల్లె ఒంటరిగా మిగిలిపోయారు. చివరకు సీఎంను విమర్శిస్తేనైనా చంద్రబాబు మెప్పు పొందచ్చునేమోనన్న ఆశతో ఆయన తన స్థాయిని మించి విమర్శలు చేస్తుండగా... నియోజకవర్గ ప్రజలు ఈయనపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (టీడీపీలో మహిళలకు గౌరవం లేదు) ధర్మవరంలో సూరికి సెగ.. భూదందాల్లో ఆరితేరిన వరదాపురం సూరికి ధర్మవరంలో నిరసన సెగ తగలుతోంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూరి బీజేపీలో చేరారు. తిరిగి ఇప్పుడు పచ్చజెండా కప్పుకోవాలని చూస్తుండగా... సూరీని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరారు. కండువా కప్పుకోవాలంటే ‘నేనే కండువా వెయ్యాలి, ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు’ అని శ్రీరామ్ విమర్శించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకుడెవరో కార్యకర్తలకు అర్థం కాక ఇప్పటికే మెజార్టీ కేడర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది. మిగిలిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కదిరిలో కందికుంటకు చెక్.. చెక్బౌన్స్ కేసులో శిక్ష పడిన మాజీ ఎమ్మెల్యే కందికుంట పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కదిరిలో టీడీపీ కేడర్ అత్తర్ చాంద్బాషా, కందికుంట వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. చాంద్బాషా 2014లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఇదే సమయంలో కందికుంటపై కేసులు నమోదయ్యాయి. దీంతో కందికుంట పక్కన పెట్టిన టీడీపీ కేడర్... అత్తార్ వైపు కూడా నడవలేక పోతోంది. గెలిపించిన పార్టీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లారని సొంత సామాజికవర్గమే అత్తార్పై గుర్రుగా ఉండగా.. కదిరి తెలుగు తమ్ముళ్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీకేకు దీటుగా సబిత .. పెనుకొండలో బీకే పార్థసారధి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు సరిగా చేయడం లేదని ఇప్పటికే ఆయనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీమంత్రి రామచంద్రారెడ్డి కూతురు సబిత ఇక్కడ టీడీపీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వర్గాన్ని కూడగడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీకేకు తలనొప్పిగా మారాయి. అసలు బీకేకు టికెట్ వస్తుందో రాదోనన్న పరిస్థితి నెలకొంది. చదవండి: (చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు) మడకశిరలో ఎవరికి వారే.. మడకశిరలో వింతపరిస్థితి. 2019లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిన ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉప్పూ నిప్పులా మారారు. దీంతో కార్యకర్తలూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఏ కార్యక్రమమైనా వేర్వేరుగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరో వర్గం ఓట్లు వేసే పరిస్థితి లేదు. అధిష్టానం ఇరువురినీ పిలిపించి రాజీ చేసినా తెల్లారేసరికి మళ్లీ గ్రూపులుగా విడిపోయారు. ఇలా వర్గపోరుతో కేడర్ మడకశిరలో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలూ ప్రభుత్వ పథకాలపై ఆకర్షితులవుతుండగా.. వారిని కాపాడుకోవడం తలకుమించిన భారమైంది. బాలయ్యను మర్చిపోయిన ‘పురం’వాసులు.. రెండున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం ప్రజలు పట్టం కడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణను గెలిపించినా ఏడాదికి ఒకసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు వర్గం, పార్టీ అనేది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురంలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో నియోజకవర్గ జనం ఎమ్మెల్యే బాలకృష్ణను పూర్తిగా మర్చిపోయారు. ఈ సారి అందుబాటులో ఉండేవారికి ఓటేస్తే బావుంటుందన్న ఆలోచన ఉన్నారు. ఇదే జరిగితే ఈసారి హిందూపురంలోనూ టీడీపీకి గల్లంతు ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
కమలంలో ‘ప్రొటోకాల్’ కలకలం! పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీలో ప్రొటోకాల్ కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర–2 ప్రారంభానికి ముందే ఇలాంటివి వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను వేదికపైకి పిలవకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించారని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. తమకు గౌరవం, ప్రాధాన్యతనివ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహించగా, జాతీయపార్టీ వారిని బుజ్జగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ఉల్లంఘన రూపంలో అసంతృప్తి బట్టబయలైంది. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే జాతీయ నాయకత్వాన్ని ఆశ్రయించాలని, వారం రోజుల్లో తగిన స్పందన రాకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్ భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది తొలివిడత ›ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ము గింపు సభ హుస్నాబాద్ దాకా, ఆ తర్వాత మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం దాకా పదిసార్లు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తన అనుయాయులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలు ఇతర ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఒంటెద్దు పోకడపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది. (చదవండి: తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? ) -
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
-
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈనెల 29న(ఎల్లుండి)పార్టీ ఆవిర్భావదివ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం పడివేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. -
రసాభాసగా టీఆర్ఎస్ సమావేశం
సాక్షి, వికారాబాద్(యాలాల): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణ శివారులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం టీఆర్ఎస్ యాలాల మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎంపీపీ బాలేశ్వర్గుప్త సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆతర్వాత ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్కు మైక్ అందిస్తుండగా.. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని, ముందుగా పార్టీ అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వరా..? అని ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ మండల అధ్యక్షుడికి మొదట మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ అప్పగించారు. ఇదే సమయంలో తాను రెండు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తానని విఠల్ నాయక్ చెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మధ్యలో కల్పించుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డిపై సిద్రాల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది యాలాల మండల పార్టీ సమావేశం.. తాండూరు మండలానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు’ అని గద్దించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యక్రమంలో మండల అధ్యక్షుడికే అవమానం జరిగితే ఎలా అని అసహనం వ్యక్తంచేస్తూ కొంతమంది సర్పంచ్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులకు నచ్చజెప్పడంతో సిద్రాల శ్రీనివాస్ ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల పార్టీకి కొందరు కొత్తబిచ్చగాళ్లు వచ్చారు’అనడంతో.. ఎంపీపీ బాలేశ్వర్గుప్త అడ్డుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో స్టేజీపై ఇలా మాట్లాడటం తగదన్నారు. రెండు రోజులుగా సమావేశ ఏర్పాట్లు జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా సమయానికి వచ్చి గొడవ చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా కార్యక్రమం ముగిసే వరకూ నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రోహిత్రెడ్డి, మహేందర్రెడ్డి కలి్పంచుకుని పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా చక్కదిద్దారు. -
టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత!
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు) తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు. -
జీ–23 నేతలతో సోనియా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలో సమూల మార్పులు జరగాలని ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించాలని, ఆగస్టులో సోనియాకు రాసిన లేఖలో అసమ్మతివాదులు అంచనా వేసినట్లు రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు తీవ్రమైన నష్టం జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు సోనియాగాంధీ శనివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో రాహుల్, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, హుడా, మనీష్ తివారీ, పవన్ కుమార్ బన్సల్, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అంబికా సోని, శశిథరూర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల అభిప్రాయాలను సోనియా అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించలేదు? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ ఏదీ జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, నాయకత్వ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సోనియా గాంధీ సమావేశంలో స్పష్టం చేశారు. ఏకే ఆంటోనీ, హరీష్ రావత్ వంటి కొందరు సీనియర్లు మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరారని తెలిసింది. అయితే ఈ అంశాన్ని చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల బాధ్యులపై మాటల దాడి గుజరాత్ ఉప ఎన్నికలు, భిహార్ ఎన్నికలకు బాధ్యులుగా ఉన్న రాజీవ్ సతవ్, రణదీప్ సింగ్ సుర్జేవాలాపై కొందరు నేతలు పరోక్షంగా మాటల దాడి చేశారని తెలిసింది. పార్టీలోని 99.9% నేతలు రాహుల్నే పార్టీ అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారని సుర్జేవాలా చేసిన ప్రకటనపైనా అభ్యంతరం వ్యక్తం చేశారని వినికిడి. -
బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో రచ్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్పై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి తిరుగుబావుటా ఎగురవేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 49 వార్డులు ఉండగా బీజేపీ 11 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఆదిలాబాద్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ జిల్లా నాయకులు టీఆర్ఎస్తో కుమ్ముక్కై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్నది ఆరోపణ. అంతకు ముందు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా కోర్ కమిటీలో నిర్ణయం లేకుండానే టికెట్ల పంపిణీ జరిగిందని అంటున్నారు. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా, మండల కమిటీ నాయకులు ముందుకు వచ్చామని పార్టీలోని కొందరు చెబుతుండగా, పాయల శంకర్ అధ్యక్షతనే జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 11 వార్డుల్లో కౌన్సిలర్లు గెలుపొందారని, అలాంటప్పుడు ఆరోపణలు అసమంజసమని పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు జిల్లా అధ్యక్షుడికి వంత పాడుతున్నారు. అంతేకాకుండా త్వరలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతోనే వ్యూహాత్మకంగా ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి. ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు జరుగుతున్నాయి జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కోర్ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్ల కేటాయింపు జరుగుతోంది. ఏకపక్షంగా అందజేస్తున్నారు. ఏక వ్యక్తి పాలన.. పార్టీ ఆఫీసు నామమాత్రం.. సమష్టి నిర్ణయాలు లేవు. రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడి వ్యవహారంపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టీపట్టనట్లు వ్యవహారిస్తున్నారని, రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యనేత అండదండలతోనే జిల్లా నాయకుడు పార్టీ అంటే నేనే అనే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్పై పార్టీ సీనియర్ నేత, జెడ్పీమాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావడం లేదు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. ఆదిలాబాద్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నాగురించి తెలుసు. – పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్ని నిరాశాభావం వెంటాడుతోంది. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న కుమ్ములాట పరంపర!
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటన అంశాలపై రెండు నెలలుగా అదుగో.. ఇదుగో అంటూ వార్తలు వచ్చి నప్పటికీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం వరకు పీటముడి వీడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అలా ఉంటే.. జిల్లాలో మాత్రం మరింత గందరగోళంగా మారింది. పినపాక మినహా మిగిలిన నాలుగు సీట్ల విషయమై ఇప్పటికీ గుంజాటన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు, అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో అసమ్మతులు రగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో అంటకాగడంతో ఇప్పటికే వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కూటమి పార్టీల మధ్య.. ముఖ్యంగా కాంగ్రెస్ – సీపీఐ మధ్య పొత్తులా, కత్తులా అనేలా పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం సీటు విషయంలో నెలకొన్న పీటముడి మరింత బిగుసుకుంది. ఈ క్రమంలో టికెట్ల వ్యవహారం మరింత వెనక్కు వెళుతుండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో.. ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మహాకూటమి శ్రేణుల్లో మహా ఉత్కంఠ నెలకొనగా, ఆశావహులు మాత్రం ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా మారిందంటే నామినేషన్ల చివరి రోజైన ఈనెల 19 వరకు కూడా జిల్లాలోని అభ్యర్థుల ప్రకటనను సశేషంగానే ఉంచుతారేమోననే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ‘అతి’ జాగ్రత్త కాస్తా ‘హస్త’వ్యస్తంగా మారుతుందేమోనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రెండు నెలల క్రితం ఉన్న సానుకూలత.. చివరికి ప్రతికూలంగా మారుతుందని వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇల్లెందు ఎవరికి దక్కేనో? ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు వెళ్లాయి. వీరిలో చీమల వెంకటేశ్వర్లు, హరిప్రియ, డాక్టర్ రామచంద్రనాయక్, దళ్సింగ్, ఊకె అబ్బయ్య హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టికెట్ను బంజారాలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. తాజాగా రేవంత్రెడ్డి వర్గీయురాలైన హరిప్రియ అనుచరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆమెకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా బరిలోకి దింపుతామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన అబ్బయ్య అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చారు. చీమల వెంకటేశ్వర్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో తనకు టికెట్ ఇవ్వడమే న్యాయమని, కచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోవైపు దళ్సింగ్, రామచంద్రనాయక్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభ్యర్థి ప్రకటన తర్వాత ఇక్కడ అసమ్మతి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆవిడేనా? అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీపడుతున్నప్పటికీ.. మొదటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి రేసులో ముందున్నారు. అయితే ఈ సీటు పొత్తుల్లో టీడీపీకి వచ్చే అవకాశం ఉండడంతో నాగమణి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉందని, టీడీపీ కేడర్ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిపోయిందని, కనుక నాగమణికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీకి ఇస్తే ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. కొత్తగూడెంలో కుమ్ములాట? కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్–సీపీఐ మధ్య చిక్కుముడి ఇంకా సాగుతూనే ఉంది. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్ఛిన్నమయ్యే స్థాయిలో గుంజాటన నడుస్తోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా సీటు ఇవ్వకపోయినా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూనంనేనికి కొత్తగూడెం టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈ నెల 8న పాల్వంచలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ గృహనిర్భంధం చేసుకున్నాడు.సీపీఐ నాయకులు రంగంలోకి దిగి రాహుల్ను బుజ్జగించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ మధ్య గట్టి పోటీ ఉండడంతో పార్టీ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించింది. వనమా పలువురు పార్టీ పెద్దల సహకారంతో టికెట్ రేసులో ముందంజలో ఉండగా, ఎడవల్లి కృష్ణకు టికెట్ ఇప్పించేందుకు రేణుకాచౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమాకే టికెట్ వస్తుందని వార్తలు రాగా, ఇప్పుడు ఎడవల్లికే టికెట్ అనే వార్తలు వస్తున్నాయి. ఎడవల్లికి టికెట్ కోసం రేణుక అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవంత్రెడ్డి నడిపించగలడా? భద్రాచలం నుంచి కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి లేరు. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న కృష్ణమోహన్, కృష్ణప్రసాద్ ఇద్దరూ కొత్తవారే. అయితే ఇక్కడ నుంచి రేవంత్రెడ్డి వర్గీయురాలైన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కను దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సీతక్క ములుగు టికెటే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ములుగు మరో మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను ఇక్కడికి పంపించాలనుకోగా, ఆయన కూడా ములుగు కోసమే పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానాన్ని సీపీఐకి ఇచ్చేందుకు సైతం కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
వర్గపోరులో కమలనాథులు
తాండూరు టౌన్: ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు. చివరికి వర్గ పోరులో కమలనాథులు విచ్చుకుపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాండూరులో బీజేపీ జెండా ఎగురేయాలని నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆపార్టీ శ్రేణులు పల్లెబాట పట్టారు. కార్యకర్తలంతా ఒకే తాటిపై నడుస్తూ వ్యతిరేక పార్టీలను ఢీకొంటూ, క్యాడర్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఒకే నాయకుడి నాయకత్వంలో కొనసాగుతున్న దాఖలాలు కనపడడంలేదు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న యూ.రమేష్కుమార్ ఓ వర్గంగా కొనసాగుతుండగా, ఎన్ఆర్ఐ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పటేల్ రవిశంకర్ మరో వర్గంగా చెలామణి అవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకే ఖచ్చితంగా వస్తుందని పటేల్ రవిశంకర్ ధీమాగా ఉన్నారు. తానూ బరిలో ఉన్నానంటూ రమేష్కుమార్ ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరువర్గాలు కలిసి పోరాటం చేసిన దాఖలాలు ఎక్కడా కనపడడంలేదు. దీంతో రమేష్కుమార్ సాయిపూర్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అక్కడే ఆయన వర్గానికి చెందిన, తటస్థంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు, నాయకులు సమావేశమవుతున్నారు. తాజాగా రవిశంకర్ తాండూరులోని బస్టాండు ఎదురుగా మరో కార్యాలయాన్ని బుధవారం ఏర్పాటుచేస్తున్నారు. ఒకే పట్టణంలో ఒకే పార్టీకి చెందిన రెండు కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. కలిసి ఉండాల్సిన వారు ఇలా విడిపోవడం వల్ల పార్టీకి నష్టమేనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా తాను ముందుగా ఏర్పాటుచేసిన కార్యాలయమే అధికారికమైందని, రవిశంకర్ ఏర్పాటుచేస్తున్న కార్యాలయం ఆయన వ్యక్తిగతమని రమేష్కుమార్ చెప్పడం విశేషం. రానున్న ఎన్నికల దృష్ట్యా అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా పెద్ద భవనంలో బస్టాండు ఎదురుగా పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తున్నామని రవిశంకర్ చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్లో సైతం రెండు వర్గాలు పోటాపోటీగా కొనసాగుతున్న విషయం విధితమే. ఏ పార్టీ వారైనా ఐకమత్యంతో, పార్టీ ప్రయోజనాల కోసం కృషి చేయకపోతే మనుగడ కష్టసాధ్యమే. -
ఎచ్చెర్లలో పచ్చతమ్ముళ్ల రచ్చ!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కళా ఇలాకాలో గ్రూపు తగాదాలు ప్రత్యర్థి వర్గానికి మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ వత్తాసు? పథకాల పంపిణీ నుంచి బదిలీల వరకూ ఒత్తిళ్లు తారస్థాయికి వర్గపోరు... నలిగిపోతున్న ప్రజలు కిమిడి కళావెంకటరావు... అధికార టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు! దసరాకు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు కచ్చితంగా ప్రాధాన్యం ఉన్న బెర్త్ దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది! కానీ సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూపు తగాదాలను చక్కదిద్దట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ తమ్ముళ్ల వీరంగం తారస్థాయికి చేరడం ఆ వాదనకు ఊతమిస్తోంది. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి అధికారుల బదిలీల వరకూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడం కళ్లకు కడుతోంది. చివరకు ఇటీవల రణస్థలంలో ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలనూ వివాదాస్పదం చేసేశారు. కళా ప్రత్యర్థి వర్గానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి బాబ్జీ దంపతులు వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకుల ఆధిపత్య గొడవల్లో తాము నలిగిపోతున్నామని అధికారులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం: నియోజకవర్గంలోని ప్రధానమైన ఎచ్చెర్ల మండలంలో కళా వర్గంతో పాటు కళా వర్గీయుల విధానం నచ్చని కొంతమంది టీడీపీ నాయకులు వేరే వర్గంగా కొనసాగుతున్నారు. వారికి జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి దంపతులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ నడుస్తోంది. నీరు-చెట్టు పథకం ఇతరత్రా పనుల కోసం కళాను ఆశ్రయించడానికి ఆయన వర్గం నాయకులే అడ్డుపడితే చేసిది లేక కొంతమంది తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ను ఆశ్రయిస్తున్నారు. అటు కళాను, ఇటు కూన రవిని కలవడానికి ఇష్టంలేని వర్గమంతా చౌదరి బాబ్జీ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పనుల పంపకంలో వివాదాలు తలెత్తుతున్నా రెండు వర్గాలు చివరకు అలా పరిష్కరించుకుంటున్నాయి. అయితే పార్టీలోకి చేర్పుల విషయంలో మాత్రం రచ్చవుతోంది. ఈ విషయంలో కళా వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తుండంతో మండల, గ్రామాల స్థాయిల్లోని వారి వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అజ్జరాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం వర్గ విభేదాలకు ఆజ్యం పోసింది. అలాగే కొయ్యాం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని పార్టీలో చేర్పించేందుకు చౌదరి వర్గం చేస్తున్న ప్రయత్నాలకు కళా వర్గం మోకాలొడ్డుతోంది. ఇదిలాఉంటే రోడ్డు మంజూరు చేయకపోతే తమ గ్రామంలో అడుగుపెట్టనివ్వబోమని కళా వర్గానికి చెందిన కొత్తపేట గ్రామ నాయకులు ఏకంగా జెడ్పీ చైర్పర్సన్కే హెచ్చరికలు జారీ చేశారు. రణస్థలంలో రణరంగమే తెలుగు తమ్ముళ్లు రణస్థలం మండలంలో ఏకంగా నాలుగు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎంపీపీ గొర్లె విజయకుమార్, బంటుపల్లి పంచాయతీకి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్ఈఆర్), పార్టీ మండల అధ్యక్షుడు సత్యేంద్రవర్మరాజు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు ఆయా వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు. నీరు-చెట్టు పథకం పనులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు, పాఠశాల యాజమాన్య సంఘాల ఎన్నికలు... ఇలా ప్రతి పనిలోనూ తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు యథాశక్తి పోటీపడుతున్నారు. ఈ పోటీ చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునే వరకూ వెళ్తోంది. అంతేకాదు పథకాల అమల్లో జాప్యం ఒక్కటే కాదు ప్రజలను చాలా ఇబ్బందులకూ గుర్తిచేస్తోంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతోందోనని అధికారులూ తలపట్టుకుంటున్నారు. లావేరులో ఆధిపత్య పోరు లావేరు మండలం టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ హవాకు అడ్డుకట్ట వేయడానికి పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏ పని చేయాలన్నా తన అనుమతి లేకుండా చేయవద్దని సురేష్ అధికారులకు చెబుతుండటమే దీనికి కారణం. లింగాలవలస, వెంకటాపురం, బెజ్జిపురం, పెదరావుపల్లి, బుడతవలస పంచాయతీలకు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి సురేష్కు చెక్ పెట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రణస్థలం మండలానికి చెందిన ఎన్.ఈశ్వరరావు (ఎన్ఈఆర్) మద్దతు కూడా లభించడంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. గతంలో ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన పి.వేణుగోపాలరావును సురేష్తో సన్నిహితంగా ఉంటున్నారనే బదిలీ చేయించారనే చర్చలూ జరిగాయి. జి.సిగడాంలోనూ బాహాబాహీ త్వరలో ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉన్న జి.సిగడాం మండలంలోనూ టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. కాంట్రాక్టు పనుల విషయంలో వాటాలు కుదరక ఇటీవల జాడ గ్రామంలో చోటుచేసుకున్న తగాదాలే దీనికి నిదర్శనం. ఈ మండలంలో ప్రధానంగా టీడీ వలస, మెట్టవలస, పెంట, డీఆర్ వలస గ్రామాల్లో వర్గపోరు ఎక్కువగా ఉంది. కళా వర్గీయుల వ్యతిరేక వర్గమంతా తమ పనుల కోసం ప్రభుత్వ విప్ రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, బాబ్జీలను ఆశ్రయించడం బహిరంగ రహస్యమే! -
టీటీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయి. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని అతలాకుతలం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వీరిద్దరిలో ఎవరిని సమర్థించాలో, ఎవరితో పాటు కలసి ముందుకు సాగాలో తెలియక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పార్టీ సాగుతున్న తీరు, మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటి పట్ల పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించకపోవడం పట్ల సీనియర్ నేతల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ తీరుపై సీనియర్ల కినుక... పార్టీలో రేవంత్రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యం పట్ల రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు, జిల్లాస్థాయిల్లోని నాయకులు సైతం కినుక వహిస్తున్నారు. రేవంత్రెడ్డి దుందుడుకు వైఖరి, ఆయా సమస్యలు, అంశాలపై స్పందిస్తున్న తీరును కూడా పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యనేతలు పీకల్లోతు కూరుకుపోయి తెలంగాణలో పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యాన్ని సైతం పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు సైతం తమ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు టీఆర్ఎస్లో చేరేందుకు అవకాశం లేక.. ఇటు కాంగ్రెస్లోనో, బీజేపీలోనో చేరలేక మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మా రడంతో రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే కోణంలో ముఖ్యనాయకుల్లో తీవ్రమైన అంతర్మథనం సాగుతోంది. జిల్లాస్థాయిల్లోనూ లుకలుకలు కష్టకాలంలో పార్టీ వెంట ఉండి నడుస్తున్నా, క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా జిల్లాస్థాయిల్లో ఎదగకుండా పార్టీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ నియంత్రించడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెలుగు యువతతో పాటు వివిధ అనుబంధ రాష్ట్ర కమిటీల ఏర్పాటు, ఆయా పదవుల నియామకాల్లో సీనియర్లకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం పట్ల పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. పెద్ద సంఖ్యలో కార్యవర్గంతో ఏర్పాటు చేసిన ఈ ‘జంబో కమిటీ’ల్లోనూ పార్టీని నమ్ముకున్న వారికి తగిన గౌరవం లభించక అంతర్గతంగా పార్టీలో నిరసన పెల్లుబుకుతోంది. -
కదిరి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరి టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట మధ్య వైరం పెరుగుతుంది. స్థానిక మార్కెట్ కమిటీ పదవులను కందికుంట వర్గీయులు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి గురువారం అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్ఏ చాంద్బాషాను కందికుంట వర్గం ఆహ్వానించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన నారా లోకేష్కు కందికుంటపై ఫిర్యాదు చేశారు. లోకేష్ జోక్యంతో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. -
పచ్చ పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు
తెలుగుదేశం పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు పాణ్యంలో మాజీ మంత్రుల మధ్య వివాదం అగ్గి రాజేసిన కాంట్రాక్ట్ వ్యవహారం తనకు విలువ ఏముంటుందని ఏరాసు కినుక అధిష్టాన వైఖరే అలజడికి కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు కర్నూలు: అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు- అప్పటికే ఉన్న నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాణ్యం నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కాంట్రాక్టు విషయంలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కేఈ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడంపై పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందులోనూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని మరీ కాంట్రాక్టు ఇప్పించడం పట్ల ఆయన కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు సిమెంట్ కంపెనీకి నంద్యాల నుంచి శ్లాబ్ సరఫరా కాంట్రాక్టును కేఈ కుటుంబానికి ఇప్పించినట్టు సమాచారం. ఈ కాంట్రాక్టు విలువ నెలకు రూ.50 లక్షల మేరకు ఉంది. విషయం తెలుసుకున్న ఏరాసు.. నియోజకవర్గంలో వారికి పనులు ఇప్పించడమా అని వాపోతున్నారు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గం ఇన్చార్జ్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు గుప్పుమంటుండగా... తాజాగా కాంట్రాక్టు వ్యవహారం మరింత అగ్గి రాజేసింది. పాణ్యం పోరు పదనిసలు వాస్తవానికి పాణ్యం నియోజకవర్గ విషయంలో అటు కేఈ కుటుంబానికి.. ఇటు ఏరాసుకు మధ్య రగడ నడుస్తోంది. పాణ్యంపై సదరు రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్కు కన్ను ఉంది. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తనకు అప్పగించాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఇందుకోసం నూతన సంవత్సర వేడుకలను ఆయన వేదికగా చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిచి ఓర్వకల్లు సమీపంలోని రాక్గార్డెన్ వేదికగా భారీ పార్టీ ఇచ్చారు. ఇందుకు అనేక మంది అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. అదేవిధంగా మా ఊరు- జన్మభూమి సభలను కూడా వేదికగా చేసుకుని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. విషయం తెలుసుకున్న ఏరాసు.. హడావుడిగా విదేశాల నుంచి తిరిగి వచ్చి మరీ సభల్లో పాల్గొన్నారు. అయితే, కేఈ ప్రభాకర్ ప్రయత్నాలు సఫలం కాలేదు. పాణ్యం ఇన్చార్జిగా ఏరాసే ఉంటారని అధిష్టానం స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని చల్లపరచడానికా అన్నట్టు ట్రాన్స్పోర్టు కాంట్రాక్టు అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఏరాసు గుర్రుగా ఉన్నారు. అధిష్టానమే ఇలా చేస్తే ఎలా? ప్రశాంతంగా ఉన్న పార్టీలో అధిష్టానం వైఖరితోనే అలజడి రేగుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఇప్పటికే కోడుమూరు నియోజకవర్గంలో విష్ణుకు, మణిగాంధీకి మధ్య వార్ మొదలయింది. గూడూరు జాతర వేదికగా ఏకంగా రథోత్సవాన్ని నిలిపి మరీ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు మణిగాంధీ యత్నించారు. జాతర వేదికగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇక నంద్యాల, ఆళ్లగడ్డలో రోజుకో వైరం తెరమీదకు వస్తోంది. ఏకంగా సీఎం సాక్షిగా ఇరు వర్గాలను రాజీ కుదర్చాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇంకో గ్రూపును ప్రోత్సహించే పేరుతో పార్టీ పెద్దలే అగ్గిరాజేస్తే ఎలా అని నియోజకవర్గ ఇన్చార్జీలు వాపోతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. -
బందరు టీడీపీలో అసంతృప్తి
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం (బందరు) టీడీపీలో ముసలం పుట్టింది. పచ్చ తమ్ముళ్ల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పట్టణ మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాబా ప్రసాద్కు వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. బాబా ప్రసాద్పై టీడీపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. బందరు మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ కి... ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మధ్య దూరం బాగా పెరిగింది. ఈ విషయంపై స్థానిక నాయకులు జోక్యం చేసుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు... పార్టీ అగ్ర నాయకులతో భేటీ కానున్నారు.