-
హాలీవుడ్ నటుడు జానీ డెప్ అరుదైన ఫోటోలు
-
డ్రగ్స్ ఇచ్చాడు, అలా ఫస్ట్ టైం జానీతో బెడ్ షేర్ చేసుకున్నా..
హాలీవుడ్ హీరో జానీ డెప్ మీద సంచలన ఆరోపణలు చేసింది అతడి మాజీ ప్రేయసి ఎలెన్ బార్కిన్. తాము తొలిసారి శారీరకంగా కలవడానికి ముందు అతడు తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని ఆరోపించింది. ఆ సమయంలో అతడు బాగా తాగి తనను కంట్రోల్ చేయడమే కాక నోటికొచ్చినట్లు మాట్లాడాడని పేర్కొంది. జానీ మీద అంబర్ హెరాల్డ్ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఆమె ఆరువేల పేజీలున్న కోర్టు డాక్యుమెంట్స్లో పై వ్యాఖ్యలు చేసింది. జానీ ఎప్పుడూ తనను కట్టడి చేయాలని చూసేవాడంది. ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు ఈర్ష్య పడేవాడంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? మీరిద్దరూ రాత్రంతా ఏం చేశారు? వంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఒకసారి తన వీపు మీద ఏదో గీత పడితే నేను ఎవరితోనో బెడ్ షేర్ చేసుకున్నానని అనుమానించాడని వాపోయింది. ఒకసారి తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని, అప్పుడే తామిద్దరం తొలిసారిగా బెడ్ షేర్ చేసుకున్నామని పేర్కొంది. కొన్ని నెలలపాటు తమ బంధం కొనసాగిందని, ఆ సమయంలో వారానికి మూడు, నాలుగు రోజులు ఒకరింటికి మరొకరం వెళ్లి కలుసుకునేవాళ్లమని తెలిపింది. చాలావరకు జానీ పూటుగా మద్యం సేవించి, ఆ మత్తులోనే ఉండేవాడని చెప్పింది. అతడు కొకైన్, గంజాయి, హాలూసినోజెనిక్ వంటి డ్రగ్స్ సేవించడం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చింది. అయితే మందు, లేదంటే సిగరెట్ తాగేవాడని, అందరి మీదా అరుస్తాడని, ఓసారి తనమీదకు మందు బాటిల్ విసిరాడని ఆరోపణలు చేసింది. కాగా అంబర్ హెరాల్డ్, జానీ డెప్ ఒకరి మీద ఒకరు వేసుకున్న పరువు నష్టం కేసులో ఫైనల్గా జానీ డెప్ గెలిచిన విషయం తెలిసిందే! చదవండి: భర్తను టార్చర్ పెట్టిన హీరోయిన్, ట్రెండింగ్లో బాయ్కాట్ ఆలియా.. తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ -
జానీ డెప్కు క్షమాపణ కోరుతూ రూ.2355 కోట్లు ఆఫర్!
'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ స్టార్ జానీ డెప్. కెరీర్ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అతడి భార్య అంబర్ హెరాల్డ్తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత జుగుప్సాకర రీతిలో ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో చివరాఖరకు జానీ విజయం సాధించాడు. అయితే అంబర్ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమా చేసేందుకు నిరాకరించాయి. ఇప్పుడు అతడు కోర్టులో నిర్దోషి అని నిరూపితమవడంతో తిరిగి జానీతో కలిసి పని చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే దానికంటే ముందు డిస్నీ అతడికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు(301 మిలియన్ డాలర్స్) ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా కరేబియన్ ఆఫ్ పైరేట్స్లోని ఐదు భాగాల్లో జాక్ స్పారోగా జానీనే నటించాడు. మరి జానీ వారిని క్షమిస్తాడా? నెక్స్ట్ పార్ట్లో అతడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే! జానీ- అంబర్ కేసు విషయానికి వస్తే.. 2015లో జానీ డెప్, అంబర్హర్డ్ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే మనస్పర్థలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మీద తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2018లో అంబర్ సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ రాయగా.. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో జానీ కోర్టుకెక్కాడు ఇందుకుగానూ 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రతిగా 2020 ఆగస్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానంటూ అంబర్ హెరాల్డ్ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. చదవండి: ఒకేసారి రిపీట్ కానున్న 10 జంటలు.. ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! -
ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్ వరుసగా యూకేలోని మ్యూజిక్ కన్సర్ట్స్కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్ జెఫ్ బెక్తో కలిసి బ్రిటన్లో బర్మింగ్హెమ్లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్న జానీ డెప్ రెస్టారెంట్కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు. చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్ దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా బర్మింగ్హోమ్లోని ‘వారణాసి’ రెస్టారెంట్లో జానీ డెప్ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టెయిల్స్, రోజీ ‘ఆంపైయిన్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్ డిషెస్ టేస్ట్ చేసిన జానీ డెప్ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్ వెయిటర్స్ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు. చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్? దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తమ రెస్టారెంట్లో డిన్నర్కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ట్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో అతిపెద్ద రెస్టారెంట్స్లో ఇండియన్ ‘వారణాసి’ రెస్టారెంట్ ఒకటి. -
ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్
సానుభూతితో అయినా గెలుపు దక్కుతుందనుకుంటే.. ఆ నటికి ఘోరమైన ఓటమి ఎదురైంది. గృహ హింస వేధింపుల కేసు ఓడిపోవడంతో పాటు పరువు నష్టం రాబట్టడంలోనూ ఎదురు దెబ్బే తగిలింది. ఒక మగాడు.. అందునా కాస్త పేరున్న హీరో కావడంతో జానీ డెప్ సక్సెస్ను ఆయన అభిమానగణం, ప్రత్యేకించి.. పురుష సమాజం భారీగానే సెలబ్రేట్ చేసుకుంది. పుట్టెడు దుఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు ఒక అసాధారణమైన పెళ్లి ప్రపోజల్ వచ్చింది. జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. మాజీ భార్య అంబర్కు డెప్ ఇంకా 2 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అదే సమయంలో డెప్కు అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అయితే అంత పరిహారం చెల్లించే పరిస్థితిలో తను లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు ఆమె తరపు న్యాయవాది. ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అంబర్ హర్డ్కు పెళ్లి ప్రపోజల్ పంపాడు. అది మామూలుగా లేదు! ఆ ముసలోడి(జానీ డెప్ను ఉద్దేశించి) కంటే నేనే నయం అంటూ ఓ ఆడియో వాయిస్ను అంబర్ హర్డ్కు పంపాడు ఆ వ్యక్తి. సౌదీ అరేబియాకు చెందిన సదరు వ్యక్తి ఓ షేక్గా తెలుస్తోంది. వాయిస్ నోట్ ద్వారా అంబర్ హర్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు సందేశం పంపాడు. అంబర్.. నీ దారులన్నీ మూసుకుపోతున్నాయ్. నేను తప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లెవరూ లేరు. కొందరు నిన్ను ద్వేషిస్తూ.. తిడుతున్నారు. అందుకే.. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా. ఈ సమాజం నిన్ను అంగీకరించకపోయినా.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అల్లా దయ నీ మీద ఉంటుంది. నువ్వు గొప్పదానివి. అయినా జనాలు నిన్ను కావాలనే మెచ్చుకోరు. ఆ ముసలోడి కంటే నేనే నయం. నన్ను పెళ్లి చేస్కో. నాతో సంతోషంగా ఉంటావ్’’ అంటూ వాయిస్ నోట్ పంపాడు ఆ వ్యక్తి. Bee4andafter_kw అనే అకౌంట్ నుంచి ఆ వాయిస్ నోట్ విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Bee4andafter_kw 🇰🇼 (@bee4andafter_kw) అంబర్ హర్డ్(36), జానీ డెప్ (58) .. 2015లో వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాదికే ఈ సెలబ్రిటీ జంట కాపురం రచ్చకెక్కింది. దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు. వాషింగ్టన్ పోస్ట్లో గృహ హింస బాధితురాలిని అంటూ ఆమె రాసిన కథనంపై 50 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కోర్టుకు ఎక్కాడు జానీ డెప్. ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. వర్జీనీయా ఫెయిర్ఫాక్స్ కోర్టులో ఆరువారాల పాటు సాగిన విచారణ తర్వాత.. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరినీ పరువు నష్టం పొందేందుకు అర్హులే అని పేర్కొన్న కోర్టు.. జానీ డెప్ వైపే తీర్పు ఇవ్వడంతో అప్పటిదాకా అంబర్ హర్డ్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్లంతా హర్షం వ్యక్తం చేయసాగారు. చదవండి: అంబర్ హర్డ్ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement