-
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
మనల్ని గెలిపించిన ప్రజలకు మంచి చేస్తే ఆ కిక్కే వేరు..
-
సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లో మా పేరు ఉందని నిరూపించగలరా..?. గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయ్యిందా.. లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయ్యిందా..? చెప్పే దమ్ము నీకు ఉందా?. మద్యం దొరికిన రైస్మిల్ ఓనర్కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..?’’ అంటూ మంత్రి కాకాణి సవాల్ విసిరారు.‘‘ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతున్నాడు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5 వేల మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.. ఓటర్లకి డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చెయ్యమని సీఈసీకి ఫిర్యాదు చేశాను. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి..ఎక్కడో మద్యం దొరికితే డాన్ని కూడా నాకు ఆపాదిస్తారా..?. మా ఎలక్షన్ కూడా సోమిరెడ్డే చేస్తున్నాడు.. నేను ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెబుతున్నాడు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. -
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
-
నీకు నిజంగా సిగ్గు ఉంటే.. టీడీపీ సోమిరెడ్డికి కాకాని స్ట్రాంగ్ కౌంటర్
-
సీఎం జగన్ ను హత్య చేసేందుకే.. బొండా బ్యాచ్ స్కెచ్
-
సర్వేపల్లి బరిలో మళ్లీ వారే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లాలో సర్వేపల్లి నియోజకర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విస్తారంగా సముద్ర తీరం ఉంది. వేలామందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. దాని ఆధారంగా అనేక పరిశ్రమలున్నాయి. సర్వేపల్లిలో రాజకీయాలు హాట్హాట్గా ఉంటాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఉంటారని ఎప్పుడో నిర్ణయమైంది. అయితే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కొద్దిరోజులు ఉత్కంఠ నెలకొంది. దీనికి చంద్రబాబు నాయుడు తెరదించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికే అవకాశం కల్పించారు. మూడోసారి పాత ప్రత్యర్థులైన మంత్రి కాకాణి, సోమిరెడ్డిల మధ్య మూడో పర్యాయం పోటీ నెలకొంది. జిల్లాలో చూస్తే పాతకాపుల మధ్య పోటీ సర్వేపల్లిలోనే నెలకొనడం విశేషం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి తలపడ్డారు. కానీ కాకాణి విజయం సాధించారు. 14లో 5,500 ఓట్లు, 19లో 14 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడినా సోమిరెడ్డిని చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవిని అడ్డు పెట్టుకుని 2019 ఎన్నికల్లో సర్వేపల్లి బరిలో నిలబడి అస్త్రశస్త్రాలు ప్రయోగించి మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. అదే బలం కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయనకు కంచుకోట. దీనిపై సోమిరెడ్డి మంత్రి హోదాలో ఫోకస్ పెట్టి ఎన్నో రాజకీయ విన్యాసాలు చేశారు. కాకాణి స్వగ్రామం తోడేరులో ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నా తర్వాత వారు సొంత గూటికే చేరుకున్నారు. 2019లో ఎన్ని కుయుక్తులు పన్నినా ఒక్క పొదలకూరు నుంచి కాకాణి సోమిరెడ్డిపై 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పుడు కూడా సోమిరెడ్డి పొదలకూరు మండలంపైనే తన దృష్టిని నిలిపి గోవర్ధన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. క్యూ కట్టి.. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టి మరీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వారిని సోమిరెడ్డి నిరోధించలేకపోతున్నారు. దీంతో తమ పార్టీకి చెందిన వారికే కండువాలు కప్పి వైఎస్సార్సీపీ నుంచి వలసలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేగంగా అభివృద్ధి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్రెడ్డి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు కల్పించారు. పంటలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భూపట్టాల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, పరిశ్రమల స్థాపన, నాన్ఫిషన్మెన్ ప్యాకేజీ తదితర పనులను పూర్తి చేశారు. దశాబ్దాల నాటి సమస్యలకు గడప గడపకు మనప్రభుత్వంలో మంత్రి పరిష్కారం చూపారు. దీంతో సర్వేపల్లిలో మరోసారి కాకాణి విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల ప్రచారంలో టీడీపీ సోమిరెడ్డి మంత్రి కాకాని అదిరిపోయే సెటైర్లు
-
నీకు టికెట్ ఇచ్చినందుకు నేను ఫుల్ హ్యాపీ..
-
సోమిరెడ్డిపై మంత్రి కాకాని సెటైర్లు
-
నేతన్నలకు ఎల్లప్పుడూ సీఎం జగన్ అండగా ఉంటారు
-
'సిద్ధం' చూసి 'యుద్ధం' చేయలేక పోతున్నాడు బాబు
-
2024లో జగనే సీఎం: కాకాణి గోవర్థన్ రెడ్డి
సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. పగటి వేశాగాళ్లు వలే సంవత్సరానికి ఒకసారి బయటి వచ్చి పద్యాలు, మాటలు చెప్పి.. చందాలు పట్టుకొని పోయిన విధంగా ఇవాళ మరల చంద్రబాబు బయటకు వచ్చారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభలో కాకాణి ప్రసంగించారు. ‘చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు చేస్తున్నారు. సీఎం జగన్పై విమర్శలు చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి సీఎం జగన్ ఒకసారి బటన్ నొక్కితే.. తాను ఐదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నానని నాలుక మడతబెట్టి మాట్లాడుతున్నాడు. అమ్మ ఒడిపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పడు మళ్లీ మాట మార్చాడని మండిపడ్డారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు... 2024లో జగనే సీఎం అవుతారు’ అని కాకాణి అన్నారు. -
గడచిన ఐదేళ్లలో 40శాతం గోదాముల సామర్థ్యం పెంపు
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ జనాబ్ కరిముల్లా షేక్ అమీన్ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్ ట్రిట్మెంట్తోపాటు శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీ జి.ఓంకార్రెడ్డి, పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఏపీ సర్కార్ ఎక్కువ సాయం
-
‘కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో చంద్రబాబూ!’
సాక్షి, నెల్లూరు: ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులే అవుతారు.. జీరోలైన మిమ్మల్ని కూడినా.. గుణించినా వచ్చేది జీరోనే.. నెల్లూరు చేరికలతో ప్రజలంతా ఇక తన వెంటే అన్నట్లు చంద్రబాబు ఢాంబికాలు పలుకుతున్నారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోటీ చేయటానికి అభ్యర్థులు దొరికితే...ప్రజలు మద్దతు పలికినట్లేనా?. ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలో చూపించడానికి సంసిద్ధం అంటున్నావా చంద్రబాబూ? అంటూ ధ్వజమెత్తారు. మంత్రి కాకాణి ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరనింద టీడీపీలో చేరికల కార్యక్రమం అని శనివారం నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు ఆ వేదికగా అనేక విమర్శలు చేశారు. ఎంతో అనుభవం, పరిణితితో చంద్రబాబు మాట్లాడతారని ఆశిస్తారు. కానీ చంద్రబాబు చాలా దిగజారిపోయాడు. చంద్రబాబు ప్రసంగంలో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు అంటాడు. ప్రజలు, ఓటర్లు లేరు. నాయకుల చేరికలు చాలు బలపడటానికి అని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబుకు పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లు ఆకర్షితులై.. ప్రజలు మద్దతు పలుకుతారని అనుకోవటం పెద్ద పొరపాటు. నాయకులు చేరినంత మాత్రాన ప్రజలు టీడీపీ వెంట నడిచే పరిస్థితి ఉందా అన్నది చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు సమాధానమే చెప్పట్లేదు చంద్రబాబుకు సిద్ధం సభలో సీఎం జగన్ కొన్ని ప్రశ్నలను సంధించారు. ప్రజలకు చంద్రబాబు ఏ మేలు చేశారో స్పష్టంగా చెప్పమన్నారు. ప్రతి కుటుంబానికి చంద్రబాబు వల్ల మేలు జరిగిందా? వైఎస్ఆర్ సీపీలాగా ఇది ముఖ్యమంత్రిగా నా వల్ల ఈ మేలు జరిగిందని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఈ గ్రామంలో ఇది అభివృద్ధి చేశానని చెప్పే పరిస్థితీ లేదు. గ్రామాల్లో ప్రజలకు ఏమి ఇచ్చావో.. చెప్పలేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు, రైతులు, మహిళలకు ఏ మేలు చేశారో చంద్రబాబు చెప్పుకోలేరు. బహిరంగ సభల్లో వాటికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ ఆత్మస్తుతి వల్లె వేస్తున్నారు. మరి, చంద్రబాబు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదురయ్యాయి. టీడీపీ ఎందుకు బంగాళా ఖాతంలో కలసి పోయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. మరోసారి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధం అంటున్న సీఎం జగన్ అధికారం ఇచ్చిన ప్రజలకు ఐదేళ్లు సేవ చేశాం. మరోసారి ప్రజల సేవ చేసేందుకు మేం సిద్ధం అని సీఎం జగన్ సిద్ధమన్నారు. దానికి చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. అంటే.. గతంలో హామీలు ఇచ్చి జనాలను ఎలా మోసం చేశానో అదే పంథాలో కొనసాగటానికి సిద్ధమని చెప్పదల్చుకున్నారా? మరలా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని మోసం చేయటానికి సంసిద్ధమని చంద్రబాబు చెబుతారా?. తద్వారా ప్రజలను తీరని ద్రోహం చేయటానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారా? జగన్మోహన్రెడ్డి నేను చెప్పాను.. ప్రజలకు ఇచ్చాను.. మరలా అవకాశం ఇస్తే.. మీ కుటుంబానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటానికి సిద్ధమని జగన్ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను, పొరుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు తప్ప.. సొంతంగా ఇది చేస్తానని చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు మోసగాడు అని బ్రాండ్ పడిపోయింది. ఇచ్చిన మాట మీద బాబు నిలబడడు. జనాలను మోసం చేస్తాడని ఓటేస్తే మనం నష్టపోతామనే భావం ప్రజల్లో ఉంది. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు వలస వెళ్లింది చంద్రబాబే చంద్రబాబు తనకున్న మోసగాడు అనే బ్రాండ్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సీఎం జగన్ మోహన్ రెడ్డిని దూషించటం మొదలు పెట్టారు. నిన్న నెల్లూరు టీడీపీ సభలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమైనా చెప్పగలిగారా? ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పావా? చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? తన్నుకుంటే పోతే అభ్యర్థులు బయటపడతారా? అసలు చంద్రబాబు నీ నియోజకవర్గం, సొంత గ్రామం ఏదో చెప్పు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది ఎక్కడ? సొంతూరు నారావారిపల్లె ఉండేది ఎక్కడ. చంద్రగిరి నియోజకవర్గంలో. నీ గ్రామంలో గెలవలేక.. కుప్పంలో నిలబడిన వాడివి.. మిగతా వారిని ఇక్కడ తన్నితే.. అక్కడ పడ్డారని సిగ్గులేకుండా మాట్లాడటం ఏమిటి? ఒక్కసారి చంద్రబాబు నీ గతాన్ని తరిచి చూడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది, వైఎస్ రాజశేఖరరెడ్డిది పులివెందుల నుంచి. తన సొంత ప్రాంతం అయిన పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నీ సొంత ప్రాంతం నుంచి పోటీ చేయలేని నువ్వు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? నీ నోటికి అడ్డూఅదుపూ లేవా? నీ కొడుకుది ఏ ఊరు. తంతే మంగళగిరి ఎందుకు బోర్లా పడ్డాడు. మరొకరిని నువ్వు ఎగిసి తంతే ఆత్మకూరులో ఎందుకు పడ్డాడు. పవన్ కల్యాణ్ది ఏ ప్రాంతం. ఆయన ఏవిధంగా గాజువాక, భీమవరంలో పోటీ చేశాడు. ఒక దగ్గర పోటీ చేసి గెలవలేక.. వేరే దగ్గరకు వెళ్లిన మీరు సిగ్గులేకుండా విమర్శలు చేయటం దౌర్భాగ్యం. చంద్రబాబును నెగటివ్ షేడ్తో ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు స్థాయికి తగని మాటలు మాట్లాడి.. ఆక్రోశం, ఆవేశాన్ని వెల్లగక్కటం తప్ప.. ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ప్రారంభం అయింది. నెగిటివ్ షేడ్తో చూస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారు. మీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేసింది చంద్రబాబే చంద్రబాబు నాయకులను పేర్చుకుని కూర్చుకుని టీడీపీ బ్రహ్మాండం అంటున్నారు. మరి, ఇంతవరకు చంద్రబాబు.. సీట్లు ప్రకటించలేకపోతున్నాడు. ఒక సీటు ప్రకటిస్తే.. వాడు డబ్బులు పెట్టుకుంటాడా? లేకపోతే ఇంకో కార్యకర్తను తొక్కైనా డబ్బున్నోడికి ఇవ్వండి. జనసేనతో అవసరం ఉంది మనవాడిని ముంచైనా వాడికి టిక్కెట్ ఇవ్వండన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 175 సీట్లు ప్రకటించకుండా బీజేపీకి కొన్ని ఎత్తిపెట్టి.. టీడీపీ జెండా మోసిన వాడిని మొన్నటి దాకా టిక్కెట్ ఇస్తానన్న చంద్రబాబు ఇవాళ అన్యాయం చేయటానికి సిద్ధపడ్డాడు. టీడీపీతో ప్రజలు.. ఓటర్లు లేరని చెప్పకనే చెప్పిన చంద్రబాబు నిజంగా చంద్రబాబుకు బలమే ఉంటే.. ఎందుకు ఇతర పార్టీల అండదండల కోసం అర్రులు చాస్తూ తిరుగుతున్నాడు. ఎందుకు ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాట పడుతున్నాడు. నాయకులు వచ్చినంత మాత్రాన ప్రజలు వస్తారా? పార్టీలతో పొత్తులు చేసుకున్నంత మాత్రాన ప్రజలు వస్తారా? అన్ని పార్టీలు, నాయకులు కలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పినవన్నీ చేశాడని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ ఏవీ చేయలేదని ప్రజలే చెబుతారు. ప్రస్తుతం పొత్తులు ఎలా పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కొన్ని చోట్ల అభ్యర్థులు దొరికితే జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అని ఎన్నిసార్లు చంద్రబాబు అనలేదు. 2014లో నెల్లూరు ప్రజలు చంద్రబాబుకు కేవలం మూడు సీట్లే ఇచ్చారు. ఈసారి నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదం. చంద్రబాబు ముఖం చూసి జనాలు ఎవరైనా ఓటేస్తారా? కొంతమంది నాయకులను రకరకాలుగా మభ్యపెట్టి తీసుకెళ్లావు. అంతమాత్రాన టీడీపీ బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పగలుగుతారు. కడిగిన ముత్యానివే అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకో బాబూ! నెల్లూరు జిల్లాకు చంద్రబాబు వచ్చినప్పుడు కాకాణి కోర్టు దొంగ అన్నారు. సీబీఐ విచారణపై చంద్రబాబు ప్రకటిస్తాడని అనుకున్నా. మరి, చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే.. సీబీఐ విచారణ వేయించుకుని ఎక్కడా అవినీతికి పాల్పడలేదని సందేశం ఏమైనా ఇస్తాడని అనుకున్నా. కానీ, తోక ముడిచి చంద్రబాబు పారిపోయాడు. అంటే.. చంద్రబాబుకు ధైర్యం లేదా. అవినీతిపరుడు అని ఒప్పుకున్నట్లేనా. దోచుకున్న మాట వాస్తవమని ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నీతిమంతుడు అయితే.. అవినీతితో కోట్లు సంపాదించకపోతే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? పైగా కోర్టులకు వెళ్లి విచారణను అడ్డుకున్నది చంద్రబాబే. పైగా కడిగిన ముత్యానివి అనటం ఏమిటి? చంద్రబాబుది ముత్యం మొహమేనా? పైగా నన్ను ఇంతమాట అంటారా అని చంద్రబాబు అనటం సరికాదు. జనాలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బావుంటుంది. ఏమి నైతికత ఉంటే.. వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తే కనీస అర్హత ఉందా? నీ గబ్బు నోట వెంట జగన్ పేరు ఉచ్ఛరించటమే అపశృతిగా భావిస్తున్నాం. చంద్రబాబు నీచుడు, అబద్ధాల కోరు, నీతిమాలినవాడు. బలహీనులైన పవన్, బాబులను కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుని నడుస్తున్నామని అంటాడు. 2019 ఎన్నికలకు ముందు పవన్ ఊగిపోయాడు. నా కుటుంబ సభ్యులు, మా అమ్మను దూషిస్తే వదిలిపెడతానా అన్నాడు. ఆ రోజున లోకేశ్ చేత దూషించిన సంగతి చంద్రబాబు మర్చిపోయాడా? గతాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఇద్దరు బలహీనపడిపోయారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు బలహీనులు కలిస్తే.. బలహీనులు అవుతారు కానీ.. బలవంతులు కాలేరు. శూన్యమైన మీరు కూడిన.. గుణించినా మీకు వచ్చేది శూన్యమే. చంద్రబాబు, పవన్ ఎక్కువగా ఊహించుకుని మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థుల మార్పు ఉంటుందన్నారు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. చంద్రబాబు కూడా నిన్నగాక మొన్న ప్రకటించి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నట్లు వారి చేత ప్రకటన ఇప్పిస్తున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు మళ్లీ అభ్యర్థులను చంద్రబాబు మారుస్తారు. పవన్ 5 సీట్లు తప్ప 19 సీట్లలో అభ్యర్థులు ఎవరో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. ఏ పార్టీ అయినా అభ్యర్థులను మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ. ఒక్కో పార్టీ విధానం ఒక్కోలా ఉంటుంది. ఎవరైతే బలంగా ఉంటాడో వారికి సీటు ఇవ్వాలనేది పార్టీ అధినాయకుడు ఇష్టం. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఎక్కడైనా పొరపాటు జరిగితే.. స్థానిక నాయకుడిపై ఆదరణ చూపించకపోతే అది ఎన్నికల ప్రక్రియపై పడుతుంది. అందుకే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు. మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారో అన్న దానికి సమాధానం చెప్పలేదు. టీడీపీ, జనసేన కన్నా బీజేపీ మెరుగ్గా ఉన్నట్లు ఉంది. అభ్యర్థులను ఖరారు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన నాయకులకు కండువా కప్పే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. సర్వేపల్లిలో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని చంద్రబాబును మీడియా వారే అడగాల్సింది. నాపైన సోమిరెడ్డి తిరుగుతున్నారు. ఆయనకు ఇవ్వకపోవటం ధర్మం కాదు. మనసు బాధేసింది. ఇంత సీనియర్కు అన్యాయం జరిగిందని ఆ బాధను నేను మీడియా ముందు వ్యక్తపరిచాను. ఎన్ని సందర్భాల్లో సొంత అన్నదమ్ములు ఎన్నికల్లో పోటీ చేయలేదు. వీరంతా ఒక్కటై.. జగన్పై విమర్శలు చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ మీద ఆమె కోడలు పోటీ చేయలేదా? సంజీవ్ గాంధీ ఒకవైపు.. రాజీవ్ గాంధీ మరోవైపు రాజకీయంగా ఉన్నారు. ఒకే కుటుంబంలో సభ్యులు ఒకరిపై మరొకరు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. షర్మిల చెప్పే మాటలకు ఎంత క్రెడిబులిటీ ఉన్నది అనేది జనాలు చూస్తారు. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీకి వచ్చారు. రాజకీయాల్లో కొంతమంది అనుకూలం, మరికొంతమంది ప్రతికూలంగా ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ. ఉమ్మడి నెల్లూరులో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత మందిని నేను చేర్చుకుంటున్నాను. సోమిరెడ్డి మరికొంత మందిని చేర్చుకుంటున్నారు. చేరికల ఆధారంగా గెలుపు ఓటములు ఆధారపడవు. రాజధాని కబ్జా చేసిన చంద్రబాబు నోటి వెంట (తప్పు చేయలేదు) అలాంటి మాటలు రాకూడదు. దానిపైన కూడా క్వాష్ పిటిషన్ వేసి కోర్టుకు వెళ్లాడు. నెల్లూరులో వేమిరెడ్డికి పోటీగా విజయసాయిరెడ్డి వచ్చారని ఫ్రస్టేషన్తో చంద్రబాబు ఊగిపోయాడు. ఎన్నికల్లో సర్వేపల్లిలో నేను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రత్యర్థిగా చంద్రబాబు ఎవరిని దింపినా భయపడే పరిస్థితి లేదు. సమన్వయకర్త అంటేనే.. అభ్యర్థి. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి -
పవన్ కళ్యాణ్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
చెప్పిన దానికన్నా ఎక్కువ సాయం జగన్ చరిత్రలో నిలిచిపోతాడు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
-
మిరప నామ సంవత్సరం–2024
సాక్షి, అమరావతి: 2024వ సంవత్సరాన్ని మిరప నామ సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించింది. మిరపలో కొత్త వంగడాల రూపకల్పన, సాగువిస్తరణ, నాణ్యమైన దిగుబడు లు, విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇయర్ ఆఫ్ చిల్లీ కార్యక్రమాన్ని వర్చువల్గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ వరకు చేపట్టనున్న కార్యాచరణను విడుదల చేశారు. మిరప ఉత్ప త్తి, ఉత్పాదకత, ఎగుమతులలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని మంత్రి చెప్పా రు. మిరపలో అధిక దిగుబడులనిచ్చే 21 వంగడాలను విడుదల చేయడమే కాకుండా, రైతులకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతను రూపొందిస్తూ, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోన్న ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీని అభినందించారు. మిరపలో ప్రాసెసింగ్ కు, ఫ్లేక్స్, సాస్ తయారీకి అనువైన రకాలను తయారు చేయాలని సూచించారు. వర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకీరామ్ మాట్లాడుతూ మిరపపై పరిశోధనలు ప్రారంభించి వందేళ్లు పూర్తి చేసుకున్న ఘనత గుంటూరు లాంలోని ఉద్యాన పరిశోధన స్థానానికి ఉందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ కమిషనర్ డా.ఎస్.ఎస్.శ్రీధర్, జాతీయ కూరగాయల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డా.టీకే. బెహరా, అఖిలభారత కూరగాయల సమన్వయ పథకం అధిపతి డాక్టర్ రాజేష్ కుమార్, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.నారం నాయుడు పాల్గొన్నారు. ఇయర్ ఆఫ్ చిల్లీ యాక్షన్ ప్లాన్ ♦ మేలైన సస్యరక్షణ పద్ధతులు, పంటకోత అనంతరం యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఆర్బీకేల ద్వారా రైతులకు నెలవారీగా శిక్షణ ♦ మిరపసాగులో నూతన సాంకేతికతపై రైతులు–శాస్త్రవేత్తల ముఖాముఖి చర్చలు ♦ జిల్లాల వారీగా మిరప రైతులు,ఉద్యానశాఖ అధికారులకు సదస్సులు, సమ్మేళనాలు ♦ వర్సిటీ పరిధిలోని కళాశాలలు, పరిశోధనా స్థానాలు, కేవీకేలలో ప్రత్యేక మిరప ఉద్యాన మేళాలు ♦ మన గ్రామం..మన విశ్వవిద్యాలయం ద్వారా దత్తత గ్రామాల్లో మిరపసాగుపై ఆర్బీకేల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ♦ మిరప సదస్సుల నిర్వహణ ద్వారా మిరపపై పరిశోధనలు చేసే జాతీయ,అంతర్జాతీయ శాస్త్రవేత్తలను రైతుల చెంతకు తీసుకురావడం. -
కృష్ణపట్నం పోర్టుపై అనవసర రాజకీయం చేస్తున్నారు: కాకాణి
-
పోర్టులో కంటైనర్ సేవలు యథావిథిగా కొనసాగుతున్నాయి: మంత్రి
-
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి ఫైర్
-
సోమిరెడ్డి పిచ్చికుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు
-
సీబీఐతో విచారణకు సిద్ధమా..?
-
‘ఒక్క కేసులో అయినా సీబీఐ విచారణకు సిద్ధమా?’
గుంటూరు, సాక్షి: చంద్రబాబుకి నీతిమంతుడని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. బాబుపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి చంద్రబాబుకి సవాల్ విసిరారు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ తేల్చినా కూడా తనపై తప్పుడు రాతలు ఆగడం లేదని అన్నారాయన. ‘‘గతంలో నాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్ ని కూడా కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. సీబీఐ విచారణకి ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టుకి చెప్పా. సీబీఐ విచారణ గత ఏడాదిగా విచారణ జరిపింది. ఛార్జి షీట్లో స్పష్టంగా నా ప్రమేయం లేదని తేలింది. పోలీసులపై సోమిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టమైంది. సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్.. అంతేగానీ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు. రెండేళ్లగా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రుజువైంది. దీనిపై చంద్రబాబు, లోకేష్ నేల టిక్కెట్ సమాధానం చెప్పాలి.. నేల టిక్కెట్ అంటే సోమిరెడ్డి. మీకు అనుకూలంగా వస్తే అత్యున్నత సంస్ధ అంటారు. అదే వ్యతిరేకంగా వస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెప్తారు. మీ వారికి బెయిల్ వస్తే న్యాయస్ధానాలు న్యాయం జరిగినట్లు.. లేకపోతే న్యాయస్ధానాలపై దాడులకి సిద్దపడతారు. చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారు. చంద్రబాబూ.. నీపై నమోదైన కేసులలో ఒక్క కేసులోనైనా నువ్వు సీబీఐ విచారణకి సిద్దమా?. మీ(చంద్రబాబు) పాత్ర లేకుంటే ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదు. నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకి సిద్దమా? లేదా? స్పష్టత ఇవ్వాలి. నువ్వు నీతిమంతుడివైతే సీబీఐ విచారణ జరిపించుకోవాలి. 24 గంటల లోపుల నా సవాల్ కి స్పందించాలి. నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతిపరుడని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు, టీడీపీ హయాం కంటే రైతులకు మేం ఎక్కువ మేలు చేశాం. టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకి సిద్దమా?. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే.. ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారు అంటూ మంత్రి కాకాణి చురకలు అంటించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ రాశివారికి నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి
అక్రమ రిజిస్ట్రేషన్పై కలెక్టర్ సీరియస్
‘వాగ్దేవి’ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు
మామిడికి మార్కెట్ కష్టాలు
No Headline
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
వైన్స్ ఘటనలో 8 మంది రిమాండ్
జడ్చర్లలో భారీ వర్షం
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై కేసు నమోదు
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement