Top Stories
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
జియో సరికొత్త రికార్డ్.. అదేంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్కు బీసీసీఐ కండిషన్!
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
జిమ్లో మృణాళ్.. గ్లామర్తో కృతి శెట్టి.. మురారి పోస్టర్తో మహేశ్
Shree Naval Kishori: పద్ధతిగా పాపులర్ అయ్యింది
ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
తాడిపత్రిలో హై టెన్షన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
జియో సరికొత్త రికార్డ్.. అదేంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్కు బీసీసీఐ కండిషన్!
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
జిమ్లో మృణాళ్.. గ్లామర్తో కృతి శెట్టి.. మురారి పోస్టర్తో మహేశ్
Shree Naval Kishori: పద్ధతిగా పాపులర్ అయ్యింది
ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి: వైఎస్ జగన్
తాడిపత్రిలో హై టెన్షన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
సినిమా
![Darshan To Help Renukaswamy's Family?](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/darshan.jpg.webp?itok=Lw_28hTx)
దర్శన్ పశ్చాత్తాపం.. రేణుకాస్వామి భార్యకు సాయం చేయనున్నాడా..?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దర్శన్ను పెళ్లికి ఆహ్వానించిన 'కాటేరా' దర్శకుడుదర్శన్ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు.
![R Narayana Murthy Discharged From NIMS Hospital](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/1_12_1.jpg.webp?itok=IvFHLg9m)
ఆసుపత్రి నుంచి ఆర్. నారాయణ మూర్తి డిశ్చార్జ్
ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కూడా ఆయన్ను పరామర్శించారు. నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనకు చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్పతో పాటు అక్కడి వైద్యులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నాని ఆయన చెప్పారు.
![Singer Lekshmi Jayan Wonderful Talent, Netizen Commented as Transgender](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/Singer-Lekshmi-Jayan.jpg.webp?itok=wwsiSK4R)
సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్
కొందరు పురుషులకు స్త్రీ గొంతుతో మాట్లాడటం వచ్చు. ఆడవారి గొంతును అనుకరించి పాటలు కూడా పాడతారు. అయితే విడ్డూరంగా ఓ మహిళ అబ్బాయిలా మాట్లాడగలదు, పాటలూ పాడగలదు. ఆవిడే సింగర్ లక్ష్మి జయన్. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈమె మలయాళ బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. రేడియో హోస్ట్గానూ పని చేసిన ఈమె అనేక కార్యక్రమాల్లో హాజరై తన గొంతుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలోనూ తన టాలెంట్ చూపించింది.రెండు వర్షన్లు తానే..రోజా సినిమాలోని పరువం వానగా పాట మలయాళ వర్షన్ను ఆలపించింది. ఈ సాంగ్లో వచ్చే మేల్, ఫిమేల్ వర్షన్ రెండింటినీ తనే పాడింది. సెకన్లలోనే తన గొంతును మార్చుతూ అద్భుతంగా పాట పాడుతున్న ఆమె వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు ఆమె ప్రతిభను మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ట్రాన్స్జెండర్ అని తప్పుగా అభిప్రాయపడుతున్నారు. దీంతో లక్ష్మి అభిమాని ఒకరు ఇటువంటి కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.తెలీకుండా మాట్లాడొద్దుసింగర్ లక్ష్మి వందశాతం మహిళే. తనకు ఓ బాబు కూడా పుట్టాడు. ఆమె బిగ్బాస్ స్టార్, వయొలనిస్ట్, టీవీ యాంకర్, రేడియో జాకీ.. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. తనెవరో తెలియకపోతే తెలుసుకోండి. అంతేకానీ ఏది పడితే అది మాట్లాడొద్దు అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. இதுபோல சில பெண்கள் இரு குரல்களில் பாடுகிறார்கள். ஆனா இந்தப் பெண்ணின் ஆண் வாய்ஸ் செம கம்பீரம் pic.twitter.com/wRoKB8NXjM— 𝗙𝗶𝗹𝗺 𝗙𝗼𝗼𝗱 𝗙𝘂𝗻 & 𝗙𝗮𝗰𝘁 (@FilmFoodFunFact) July 19, 2024 చదవండి: ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: హీరోయిన్
![Actor Madhavan Shares His Weight Loss Method](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/madhavan_0.jpg.webp?itok=fQQlqGqt)
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024
క్రీడలు
![Vikram Rathour Likely to Replace VVS Laxman As NCA Head: Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/vvs2.jpg.webp?itok=B59Nrlf0)
NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్బై.. కొత్త హెడ్ అతడే!
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్సీఏ హెడ్గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్తక్ పేర్కొంది.సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్ను ముగించారు.ఎన్సీఏ హెడ్గా విక్రం రాథోడ్}మరోవైపు.. 2021లో ఎన్సీఏ హెడ్గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.అతడి స్థానంలో ఎన్సీఏ హెడ్గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్తో మరోసారి మాట్లాడనున్నారు.అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ మెంటార్గా రీ ఎంట్రీ?కాగా ఎన్సీఏ హెడ్గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
![Harbhajan Singh Disgruntled At Gambhir Agarkar Snubbing Sanju Hard to](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/abhisanju.jpg.webp?itok=B2XGkLZ-)
Ind vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?
శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో గెలిచింది.ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.సెంచరీలు చేసినా పట్టించుకోరా?అదే విధంగా.. సంజూ శాంసన్కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కూడా పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.ఖేల్ ఖతమేనా?పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం. దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్లతో వన్డే సిరీస్లు ఆడనుంది.చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ!
![Paris Olympics 2024: India 4th Place Heartbreaks When So Near But So Far](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/1234_1.jpg.webp?itok=zxI1Mitr)
Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.ఫుట్బాల్ జట్టుమెల్బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్కు దూసుకువెళ్లింది.నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్తో మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్బాలర్గా నిలిచాడు.సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్ఎస్ఆర్) అఫ్గనిస్తాన్పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.అయితే, యూఎస్ఎస్ఆర్తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పరుగుల రాణికి చేదు అనుభవంలాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టెన్నిస్లో చేజారిన కాంస్యంలాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్లో భారత్కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్తో జరిగిన మారథాన్ మ్యాచ్లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.ఇక ఇదే ఒలింపిక్స్లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్లో డిస్క్వాలిఫై అయింది.మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.లండన్ ఒలింపిక్స్లోనూ ఇలాగేఈసారి షూటింగ్లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.మరో‘సారీ’ ఇదే ‘కర్మ’ భారత్ నుంచి ఒలింపిక్స్లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.టోక్యోలోనూ కలిసిరాలేదుదాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.అయితే, కీలకమైన సెమీస్లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.ఇదే ఒలింపిక్స్లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్కు పసిడి అందించారు.చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్లో టీమిండియా స్టార్!
![Nayar, Doeschate Set To Join Colombo-bound Indian Team; T Dilip Retained - Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/gauti2.jpg.webp?itok=_MGA-P-S)
టీమిండియా అసిస్టెంట్ కోచ్లు వీరే.. దిలీప్ రీఎంట్రీ!
టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా అతడు భారత జట్టుకు మార్గనిర్దేశనం చేయనున్నాడు.ఈనెల 27 నుంచి ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో గౌతీ సహాయక సిబ్బంది కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్లో గంభీర్తో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డష్కాటే టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.దిలీప్ రీఎంట్రీ!అదే విధంగా.. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన టి.దిలీప్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొలిక్కిరానట్లు సమాచారం.సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిక్బజ్ కథనం ప్రచురించింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.కాగా మోర్నే మోర్కెల్ సైతం గంభీర్తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా గౌతీ రెండేళ్లు సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోర్నే మోర్కెల్ కూడా లక్నో సిబ్బందిలో ఉండటం గమనార్హం.ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుతో గంభీర్తో పాటు దిలీప్, నాయర్ కూడా సోమవారం బయల్దేరనున్నట్లు సమాచారం. టెన్ డష్కాటే మాత్రం తర్వాత జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.ఆరోజే గంభీర్ ప్రెస్మీట్టీ20, వన్డే సిరీస్ల కోసం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి కొలంబోకు సోమవారం పయనం కానున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది. ఈ సిరీస్తో గంభీర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనుండగా.. లంకకు వెళ్లే ముందు అతడు మీడియా ముందుకు రానున్నాడని తెలిపింది.టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా టీమిండియా శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. టీ20 జట్టుకు సూర్య, వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు.
బిజినెస్
![elon musk Congratulates PM NarendraModi for 100 million followers on x](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/modi01.jpg.webp?itok=QIDYHquB)
ఎక్స్లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్ అభినందనలు
ఎక్స్ ప్లాట్ఫామ్లో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇలాన్మస్క్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్గా మారంది.‘అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు’ అని మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీకి ఎక్స్లో 100.1 మిలియన్ల(10 కోట్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని..‘ఎక్స్లో వంద మిలియన్లు! ఈ శక్తివంతమైన మాధ్యమంలో చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను ఆదరించినందుకు సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Congratulations PM @NarendraModi on being the most followed world leader!— Elon Musk (@elonmusk) July 19, 2024ఇదీ చదవండి: విండోస్లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులుఇలాన్మస్క్ 189 మిలియన్లుబరాక్ ఒబామా 131 మిలియన్లుక్రిస్టియానొ రొనాల్డో 112 మిలియన్లు జస్టిన్ బీబర్ 110 మిలియన్లురిహన్నా 108 మిలియన్లుకాటిపెర్రీ 106 మిలియన్లునరేంద్రమోదీ 100 మిలియన్లుటేలర్ స్విఫ్ట్ 95.3 మిలియన్లుడొనాల్డ్ ట్రంప్ 87.5 మిలియన్లులేడీ గగా 83.1 మిలియన్లు
![Microsoft outage should be a wake up call SEBI Chairperson](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/sebi.jpg.webp?itok=pjKfRQUe)
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బగ్తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
![Microsoft incident is not a cyber attack: CrowdStrike CEO](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/microsoft01.jpg.webp?itok=Koof2uM-)
విండోస్లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్లను బ్యాకప్ చేశాం. విండోస్లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్సైట్ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
![Gold and Silver Price Today 20 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/gold_1.jpg.webp?itok=fdrLfJGN)
పసిడి హ్యాట్రిక్ జోష్.. నగల దుకాణాలకు రష్!
పసిడి ప్రియుల ఆనందం కొనసాగుతోంది. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం (జూలై 20) పసిడి రేట్లు మోస్తరుగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు కొనుగోలుదారులను నగల దుకాణాల వైపు నడిపిస్తున్నాయి.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.380 తగ్గి రూ. 73,970 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.350 తరిగి రూ.67,800 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరల్లో ఇదే స్థాయిలో మూడో రోజూ తరుగుదలఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.350 తగ్గి రూ.67,950 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,120 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.68,400 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,620 వద్దకు వచ్చింది.వెండి ధరలు స్వల్పంగా..దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర కేజీకి రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,650 లకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ
![Special story on Eminant Sculptor dr Snehalatha Prasad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/Dr.Snehalatha_Prasad.jpg.webp?itok=JuwfibKo)
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్లోని జోద్పూర్లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్సబ్జెక్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లు, ఆర్ట్ టాక్లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పుణేలో పర్యావరణ శిల్పంపుణేలోని వాకాడ్లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం. తెలంగాణా కోసం చార్మినార్పుట్టింది రాజస్టాన్లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్లు, నట్లు తదితర స్క్రాప్తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.చెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట!
![Good sleep Kids](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/663.jpg.webp?itok=O1fhdtz2)
హాయిగా నిద్రపోతున్నారా?
చిన్న పిల్లలకి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర వారి ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాదు.. వారిలో రోగనిరోధక శక్తిని, మేధాశక్తిని పెంచుతుంది. ⇒నిద్రకు ఒక సమయాన్ని కేటాయించడం మంచిది. ఇది వాళ్ళ స్లీప్ సైకిల్ని క్రమబద్ధపరచడమే కాకుండా పిల్లల్ని మరింత శక్తిమంతంగా తయారు చేస్తుంది. వేళకు పడుకోవడం.. లేవడం అందరికీ అవసరమే. ⇒సుఖ నిద్రకు ప్రతిరోజూ చేసే క్రమానుసార పనులు ఎంతగానో దోహదపడతాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంపుదలకు దోహదపడుతుంది.⇒పడుకునే ముందు స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, నైట్ డ్రెస్ వేసుకోవడం, కథలు వింటూనో, చెబుతూనో నిద్ర΄ోవడం.. పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వారికి బంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడానికీ ఉపకరిస్తుంది. ⇒పరిపూర్ణ నిద్రకి, పడకగదికి అవినాభావ సంబంధం ఉంది. పరిశుభ్రమైన పడకగది ఆరోగ్యమైన నిద్రతో పాటు అన్నిరకాల అనారోగ్యాలనూ దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ గాడ్జెట్స్ను, టివీ వంటి వాటిని పడకగదిలో లేకుండా చేయడం ద్వారా మగతనిద్రను దూరం చేయవచ్చు. ⇒పడుకునే ముందు జంక్ ఫుడ్ తినడం, కాఫీ తాగడం నిద్రాభంగం కలిగిస్తుంది. వీలైనంత వరకూ రాత్రి భోజనంలో పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తినడం మంచిది.
![Can be taken back elderly properties](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/47474.jpg.webp?itok=0J0SS2Rt)
పిల్లలకు బహుమతిగా ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు...
పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్ సిటిజన్స్ యాక్ట్) సెక్షన్ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్ సిటిజన్స్కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది. ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు... తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ డీడ్లో ఒక ఎక్స్ప్రెస్ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్ప్రెస్ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి. ఇంటినుంచి తరిమివేయవచ్చుసీనియర్ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది. ముఖ్యమైన గమనికలు⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, ఎమ్ఎఫ్లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి. వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్ని నియమించుకోవాలి. ⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అవగాహన అవసరంవృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు మెయింటనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.– ఎ.పి.సురేష్, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్
![java plum health benefits](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/2255_0.jpg.webp?itok=837jVXIb)
ఆషాఢంలో అల్ల నేరేడు
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, ఆషాఢంలో ఎండ వేడిమి తగ్గి, శరీరం నుంచి చెమట రూపంలోనూ, మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్లో నేరేడు పండు తినడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో పాఠాలుగా చదువుకుంటాం. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, వాతావరణంలోని మార్పులకు దేహం సరయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడుని ఔషధంలా ఉపయోగించాలని, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే విషపదార్థాలను బయటకు పంపించడానికి నేరేడు మంచి మందనీ. దానిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ గ్రహించాలి. నేరేడు మనకు ఇంకా ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ⇒ చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.⇒పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.⇒రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.⇒మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.⇒నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.⇒వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.⇒జిగట విరేచనాలతో బాధపడే వారు నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో΄ాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.⇒కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.⇒ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.⇒జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.⇒మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.⇒పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.వీరు తినకూడదు..అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో΄ాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది.
ఫొటోలు
![Paris Olympics 2024: Meet Indian Badminton Stars Competing This Time](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Paris%20Olympics%202024%20Meet%20Indian%20Badminton%20Stars%20Competing%20This%20Time%20%281%29.jpg.webp?itok=HhFrQy2J)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Paris%20Olympics%202024%20Meet%20Indian%20Badminton%20Stars%20Competing%20This%20Time%20%281%29.jpg.webp?itok=HhFrQy2J)
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్ బృందం ఇదే (ఫొటోలు)
![Heavy Devotees At Simhachalam Giri Pradakshina Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Heavy%20Devotees%20At%20Simhachalam%20Giri%20Pradakshina%20Photos%20%2830%29.jpg.webp?itok=AHjiN60D)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/Heavy%20Devotees%20At%20Simhachalam%20Giri%20Pradakshina%20Photos%20%2830%29.jpg.webp?itok=AHjiN60D)
విశాఖ సింహాచల గిరి ప్రదక్షిణకు తరలి వచ్చిన భక్తజనం (ఫొటోలు)
![Anasuya Bharadwaj Latest Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/222_1.jpg.webp?itok=D4ERfnaM)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/222_1.jpg.webp?itok=D4ERfnaM)
హాలీవుడ్ బ్యూటీలా అనసూయ.. లుక్ అదిరిపోలా! (ఫోటోలు)
![Aapke Dum Hai Toh: Shami Warning Over Wedding Rumours With Sania Mirza Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/18_1.jpg.webp?itok=T9TJ_IHM)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/18_1.jpg.webp?itok=T9TJ_IHM)
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
![Top 10 accounts with highest X followers in the world](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/111_0.jpg.webp?itok=8KyVEf3S)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/20/111_0.jpg.webp?itok=8KyVEf3S)
ప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
National View all
![title](/sites/default/files/article_images/2024/07/20/neet.jpg)
నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల అరెస్ట్
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు
![title](/sites/default/files/article_images/2024/07/20/usaya.jpg)
ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక
![title](/sites/default/files/article_images/2024/07/20/rahul-amit-shah.jpg)
రాహుల్కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీప
![title](/sites/default/files/article_images/2024/07/20/AAP.jpg)
హర్యానా ఎన్నికలపై ఆప్ ఫోకస్.. ఐదు హామీలు ఇవే..
చండీగఢ్: కొద్ది రోజుల పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది.
![title](/sites/default/files/article_images/2024/07/20/budget01_0.jpg)
ఎల్లుండి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి.
International View all
![title](/sites/default/files/article_images/2024/07/20/Gaza_Child_After_Mother_Dea.jpg)
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు.
![title](/sites/default/files/article_images/2024/07/20/Netanyanhu.jpg)
పాలస్తీనాకు ఫేవర్గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..
దిహేగ్: పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమి
![title](/sites/default/files/article_images/2024/07/20/Kamla.jpg)
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్త
![title](/sites/default/files/article_images/2024/07/20/fire-accident.jpg)
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/20/iss.jpg)
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..?
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/20/Texas_Austin_NRI.jpg)
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.
![title](/sites/default/files/article_images/2024/07/20/fire-accident.jpg)
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI2.jpg)
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా
![title](/sites/default/files/article_images/2024/07/18/Australia_telugustudents.jpg)
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో విషాదం చోటు చేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/18/NRI1.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
క్రైమ్
![15 ganja smugglers arrested](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/ganjaa.jpg.webp?itok=0y-VKV3C)
15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. యాంటి నార్కోటిక్ సెల్, టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను విజయవాడ కమాండ్కంట్రోల్ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.ప్రధాన నిందితుడు పింక్రౌత్..పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్ను అరెస్ట్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్రౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్స్టేషన్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ అబ్దుల్ హబీబ్, విజయవాడ అజిత్ సింగ్నగర్కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్కు చెందిన కొమ్ము రాకేశ్, విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, షేక్ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్సింగ్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు.
![Atrocities against girls under the influence of ganja](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/anitha_0.jpg.webp?itok=icOFpaoR)
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు.
![Ndps Case On Youtuber Praneeth Hanumantu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/youtuber%20praneeth.jpg.webp?itok=e0x77J-k)
HYD: యూట్యూబర్ ప్రణీత్ హన్మంతుపై గంజాయి కేసు
సాక్షి,హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై గoజాయి కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసినందుకుగాను ప్రణీత్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ప్రణీత్ గంజాయి సేవించినట్టు తాజాగా మెడికల్ రిపోర్ట్లో తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్లను పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నాడు. ఇతడిని మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
![Hydrama at the hospital](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/drama.jpg.webp?itok=wDYY8zZs)
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.
వీడియోలు
![TDP Janasena And BJP Leaders Expecting Posts In AP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/pad.jpg.webp?itok=A47iIaP8)
![TDP Janasena And BJP Leaders Expecting Posts In AP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/pad.jpg.webp?itok=A47iIaP8)
పదవుల కోసం కొట్లాట..
![Kapu Ramachandra Reddy vs Kalava Srinivasulu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/kap.jpg.webp?itok=1eMA2iGt)
![Kapu Ramachandra Reddy vs Kalava Srinivasulu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/kap.jpg.webp?itok=1eMA2iGt)
కాపు VS కాల్వ వాడుకుని ఇరికించారు..!
![Red Corner Issued to Accused in Telangana Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/po_3.jpg.webp?itok=rbK7z2uk)
![Red Corner Issued to Accused in Telangana Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/po_3.jpg.webp?itok=rbK7z2uk)
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
![Huge Loss to Farmers Due to Flash Flood Hit Villages in Eluru District](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/cr_0.jpg.webp?itok=4s91JUPC)
![Huge Loss to Farmers Due to Flash Flood Hit Villages in Eluru District](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/cr_0.jpg.webp?itok=4s91JUPC)
ఏలూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్..రైతులకు భారీ నష్టం
![10 Crore Worth Heroin Drugs Caught in Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/av.jpg.webp?itok=Zn_S_nx2)
![10 Crore Worth Heroin Drugs Caught in Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/av.jpg.webp?itok=Zn_S_nx2)
పట్టుబడ్డ రూ. 10 కోట్ల డ్రగ్స్ ఎవరికి అమ్మడానికంటే
![Chittoor YSRCP Incharge Vijayananda Reddy about TDP Attack on YSRCP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/tk_0.jpg.webp?itok=ToDKfAu3)
![Chittoor YSRCP Incharge Vijayananda Reddy about TDP Attack on YSRCP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/tk_0.jpg.webp?itok=ToDKfAu3)
ఏపీలో బీహార్ పరిస్థితులు.. చేతులెత్తేసిన పోలీసులు
![Full Coverage On Parliament Budget By Sakshi TV](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/prg.jpg.webp?itok=YREPT6C7)
![Full Coverage On Parliament Budget By Sakshi TV](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/prg.jpg.webp?itok=YREPT6C7)
బడ్జెట్ పై మెగా కవరేజ్
![CPI Ramakrishna about Attack on MP Mithun Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/on.jpg.webp?itok=MRbAaSBn)
![CPI Ramakrishna about Attack on MP Mithun Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/on.jpg.webp?itok=MRbAaSBn)
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
![MP Alla Ayodhyarami Reddy Straight Warning to Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/arj.jpg.webp?itok=zZ51enDM)
![MP Alla Ayodhyarami Reddy Straight Warning to Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/arj.jpg.webp?itok=zZ51enDM)
అర్జంటుగా దాడులు ఆపాలి.. లేదంటే? చంద్రబాబుకు వార్నింగ్
![YSRCP Leader MC Vijayananda Reddy Fire TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/o_1.jpg.webp?itok=bFvfRLM7)
![YSRCP Leader MC Vijayananda Reddy Fire TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/20/o_1.jpg.webp?itok=bFvfRLM7)
35 రోజుల చంద్రబాబు పాలన.. విజయానందరెడ్డి ఫైర్
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక విధానాలను వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్