Legal advice
-
వారిపై క్రిమినల్ కేసు వేయచ్చు
కొన్ని సంవత్సరాల క్రితం నగర శివార్లలో కొత్తగా ఏర్పడనున్న కాలనీలో ఒక భూమి కొని రిజిస్టర్ చేసుకున్నాను. కాలనీలో చాలామంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. మేము ఇల్లు కడుతుంటే కొందరు స్థానికులు వచ్చి మా స్థలాన్ని వాళ్లకు అమ్మేయమని బలవంతపెట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘‘మీరు దళితులని తెలియక భూమిని అమ్మాము. మీవల్ల పక్క ప్లాట్లకు ధర తగ్గుతుంది. కాలనీలో మీరు ఒక్కరే దళితులు. ప్రస్తుత మార్కెట్ ధర ఇస్తాము వెళ్లిపొండి’’ అన్నారు. మేము వినలేదని, కక్ష సాధింపుగా మాది అక్రమ కట్టడం అంటూ అధికారులకు ఫిర్యాదు చేసి ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ అధికారులు కూడా వారితో కుమ్మక్కయ్యారు. మాకు అర్థంలేని నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మాకు తగిన సలహా ఇవ్వగలరు.– వీరన్న స్వామి, హైద్రాబాద్ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా కుల వివక్ష చూడటం, అందులోనూ హైదరాబాద్ వంటి మహా నగరాలలో కూడా వివక్ష ఇంకా ఉండటం బాధాకరం. ఇటీవలే మీ లాంటి ఒక కేసు చూశాను. మీరు ముందుగా పోలీసులని ఆశ్రయించి సదరు వ్యక్తులపై ఎస్.సి. ఎస్.టి. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయండి. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 (జ)–(జ) ప్రకారం ఎస్.సీ – ఎస్.టి.ల ఆస్తిని గానీ, వారికి కేటాయించిన భూములను గానీ, నివాసముంటున్న స్థానాన్ని గానీ అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, లేదా అక్రమంగా వారి పేరు తొలగించడం – అలాగే వారి సంపదలో, నీటి సరఫరాలో, వ్యవసాయ దిగుబడి మొదలగు అంశాలలో జోక్యం చేసుకోవడం, వారి ఆస్తులకు భంగం కలిగించడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలు అధికార దుర్వినియోగం చేసే ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తాయి. అవసరమైతే, మీ హక్కులకు భంగం కలిగించే విధంగా మునిసిపల్ అధికారుల పాత్ర ఉంటే సదరు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. ఎస్.సి. – ఎస్.టి. చట్టం చాలా పటిష్టమైనది. ఎన్నో తప్పులు – అందుకు తగ్గ కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసు ఏదైనా, కేవలం ‘‘కులం పేరుతో దుర్భాషలాడారు’’ అని మాత్రమే కేసులు పెట్టడం సర్వసాధారణం ఐపోయింది. అది తప్పు. ఈ చట్టం ప్రకారం మీరు ఒక న్యాయ సలహాదారు/సామాజిక కార్యకర్తను మీ వెంట పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్ళవచ్చు. అది మీ హక్కు. సరైన రీతిలో కేసు నమోదు చేస్తే మీకు ఖచ్చితమైన న్యాయం దొరుకుతుంది. క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా మునిసిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు కాబట్టి వారిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. మీ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత లాయర్ సలహా మేరకు సివిల్ కోర్టును ఆశ్రయించాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. – శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్ఫండ్ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?– రాహుల్, ఖమ్మం ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?– సుందర్, హైదరాబాద్చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు. ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు. (చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!) -
కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా? - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్హెచ్.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా మెయింటెనెన్స్ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత మెయింటెనెన్స్స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 144 బీఎన్ఎస్ ( పా సీ.ఆర్.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి. నాకు, నా మూడేళ్ల కొడుకుకి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్ చట్టం లోని సెక్షన్ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్ చేయ వచ్చు. -
బ్యాంకు వారిని సెటిల్ మెంట్ అడగవచ్చు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద 2019 లో దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం వారే రాయితీ కలిగించి బ్యాంకు నుంచి హామీరహిత రుణం ఇప్పించగా, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. కొన్ని నెలలపాటు వ్యాపారం బాగానే సాగింది. కానీ కోవిడ్ సమయంలో వ్యాపారం మూతపడింది. భారీ అద్దె, జీతాలు, పైగా బ్యాంకు నెలసరి వాయిదా చెల్లింపుల వలన వ్యాపారం మూతపడాల్సి వచ్చింది. అద్దె భరించలేక వ్యాపారం ఆపేసి సామాగ్రి మొత్తం అమ్మేశాము. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని – మా వద్ద ఉన్న నగదును కలిపి బ్యాంకు వారికి చెల్లించాము. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకు వారు కోర్టు నోటీసులు పంపడమే కాకుండా ‘30 లక్షలు ఉద్దేశపూర్వకంగా చెల్లించలేదు’ అంటూ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి నా దగ్గర లేదు. పరిష్కారం చూపగలరు.– సంతోష్, నిజామాబాద్ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. కోవిడ్ కి ముందు బ్యాంకు రుణాలు తీసుకున్న చాలా మంది ఇలాగే దివాలా తీయడమే కాక పలు రకాల కేసులు కూడాఎదుర్కొంటున్నారు. బ్యాంకు వారు సాధారణంగా డి.ఆర్.టి. (డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో కేసు వేసి బకాయిలను వసూలు చేసుకుంటూ ఉంటారు. మీరు పొందినది హామీ రహిత రుణం అన్నారు కాబట్టి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. అదే విషయాన్ని మీరు డి.ఆర్.టీ.కి తెలియ జేసి, ఎలాంటి పరిస్థితులలో మీ వ్యాపారం మూతపడవలసి వచ్చినదో చెప్పండి. అలాగే మీకు సహకారం అందించిన ప్రభుత్వ విభాగానికి కూడా ఒక దరఖాస్తు పెట్టుకుంటూ ఈ విషయాలను వివరించండి.చీటింగ్ కేసులు పెట్టడం కూడా ఈ మధ్య బ్యాంకు వారు సర్వసాధారణంగా చేస్తున్నారు. బహుశా సివిల్ కేసులలో రికవరీ కష్టం అనుకున్న సందర్భాల్లో రుణగ్రస్తులను ఒత్తిడికి గురి చేయడానికి ఇలా చేస్తున్నట్టు గమనిస్తున్నాము. ఎందుకంటే రుణం చెల్లించనంతమాత్రాన ప్రతి కేసూ చీటింగ్ పరిధిలోకి రాదు. మీ కేసులో మీరు అసలు బ్యాంకు వారిని సంప్రదించలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద ప్రభుత్వం వారే మిమ్మల్ని ఎంచుకొని రుణం ఇప్పించారు. మీరు ఆ వ్యాపారాన్ని కూడా మీ శక్తిమేరకు నడిపారు. వ్యాపారం మూతపడటంలో కూడా మీపాత్ర లేదు. కోవిడ్ లో కొన్ని వేల వ్యాపారాలు మూతపడ్డాయి. కాబట్టి చీటింగ్ కేసు మీ మీద రుజువు కావడం దాదాపు సాధ్యపడదు. చీటింగ్ కేసులో సాధారణంగా అరెస్టు చేయరు. స్టేషన్ బెయిలు ఇస్తారు. పోలీసువారికి అన్ని విషయాలను ఆధారంతో సహా సమర్పిస్తే, వారు ఫైనల్ రిపోర్టు వేసి మరీ క్లోజ్ చేసిన కేసులు నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ వద్ద ఉన్న అన్ని రుజువులు పోలీసువారికి అందజేయండి. ఒకవేళ కోర్టు దాకా వెళ్లినా, ‘మొదటినుంచి వీరు మోసపూరిత భావన కలిగి ఉన్నారు’ అని (బ్యాంకు ) ప్రాసిక్యూషన్ ద్వారా ఋజువు చేయవలసి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అలా ఋజువు చేయటం బ్యాంకువారికి కష్టమే కావచ్చు. మీ లోను విషయంలో మీరు బ్యాంకు వారిని సంప్రదించి సెటిల్మెంట్ కూడా కోరవచ్చు. మిగిలిన మొత్తంలో కొంత మాఫీ చేసి, సెటిల్ చేసేందుకు బ్యాంకువారు కూడా ముందుకు వస్తారు. కుదరని పక్షంలో కేసులను ఎదుర్కొనేందుకు దగ్గర్లోని లాయర్ను సంప్రదించండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comచేయవచ్చు. -
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు. తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.– విజయ, హైదరాబాద్మీ మేనకోడలు ఒక మేజర్. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి. కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్ ఇప్పించండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)(చదవండి: యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్) -
వరకట్న నిషేధ చట్టం ముస్లింలకు వర్తిస్తుందా? లేదా?
నాకు పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది. మేము ముస్లిమ్స్. పెళ్లి సమయంలో నా భర్త తరపు వాళ్లు కోరిన మొత్తాన్ని ఇచ్చాము. మేమిద్దరమూ ఉద్యోగులమే... నెలకు చెరొక లక్ష జీతం. ఇప్పుడు మేము విడిపోవాలని అనుకుంటున్నాం. అయితే నేను కేసుపెడితే కట్నం ఇచ్చినందుకు మమ్మల్ని కూడా జైల్లో పెడతారు అని నా భర్త బెదిరిస్తున్నాడు. వరకట్న నిషేధ చట్టం ముస్లింలకు వర్తించదు అని అంటున్నాడు. అది నిజమేనా? దయచేసి వివరణ ఇవ్వండి. –షేక్ కవిత, తిరుపతి వరకట్న నిషేధ చట్టం అన్ని మతాల వారికి వర్తిస్తుంది. కొందరు ‘మెహర్’ను విడాకులతో పొరబడుతుంటారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం ఇచ్చినా తీసుకున్నా రెండు నేరాలే. కానీ, కట్నం ఇచ్చినవారు ఒత్తిడికి లోనై ఇస్తారు కాబట్టి, కట్నం ఇచ్చిన వారికి శిక్షపడే ప్రమాదం తక్కువే. అలా కట్నం ఇచ్చిన వారందరినీ శిక్షిస్తూ పోతే వరకట్న నిషేధ చట్టం ఉద్దేశ్యానికే అర్థం లేకుండా పోతుంది. మీ విషయంలో మీ భర్త కూడా ఒప్పుకుంటే సామరస్యంగా విడిపోయి ఎవరి జీవితం వారు చూసుకోండి. పిల్లలు ఉంటే, మీ భర్త కూడా పిల్లల మెయింటెటెన్స్ పంచుకోవాల్సి వస్తుంది.చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?-శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు సందేహాల నివృత్తికోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
చిన్నారుల రక్షణ బాధ్యత అందరిదీ!
నేను ఇటీవల ప్రచార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో పోక్సో చట్టం అనే పదాన్ని తరచు వింటున్నాను. దీని గురించి వివరించగలరా?– సంకా పవన్ కుమార్, తెనాలిచిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోంది. అంతకుముందు చిన్నారులపై లైంగిక దాడులు లేవని కాదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉన్న కఠినమైన పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులను బయటకు తీసుకు వచ్చింది. 2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి 31–మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా తెలంగాణలో 2,731 – ఆంధ్రప్రదేశ్లో 11,774 కేసులు నమోదయ్యాయి. గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా 20 శాతం చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరిగినట్లుగా చెబుతున్న అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వెలుగులోకి వస్తున్న కేసుల కన్నా నమోదు కాని కేసుల సంఖ్య రెండింతల పైమాటే!చట్ట ప్రకారం మైనర్ బాలిక/బాలుర పై ఏ విధమైన లైంగిక హింస లేదా దాడి జరుగుతున్న విషయం తెలిసినవారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక దాడి జరిగిందన్న ఖచ్చితమైన సమాచారం మాత్రమే కాదు. లైంగిక దాడి జరిగి ఉండవచ్చు లేదా దాడి జరిగి ఉండే ఆస్కారం ఉంది అన్న సందేహం ఉన్న వారు కూడా ఫిర్యాదు చేయాలి. అలా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వాలు, అలాగే మీడియా కూడా తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజానిది కూడా!లైంగిక హింస, లైంగిక దాడి, మైనర్ల ఫోటోలు – వీడియోలు అశ్లీల చిత్రాలకి వాడడం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు/వీడియోలు కలిగి ఉండడం వంటివి కూడా పోక్సో చట్టం కింద నేరాలే. ఆటిజం వంటి మానసిక ఎదుగుదల లేమి, మతిస్థిమితం లేని పిల్లలపై, అలాగే చిన్నపిల్లలపై అధికారం కలిగిన వ్యక్తులు (తల్లిదండ్రులు, టీచర్లు, కొన్ని ప్రత్యేక వృత్తులలో ఉండే అధికారులు మొదలైన వారు) లైంగిక దాడులకు పాల్పడినట్లయితే అవి ‘అతి తీవ్రమైన’ నేరాలుగా పరిగణించబడతాయి. అందుకుగాను యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, బాలలకు ఎటువంటి లైంగిక ఇబ్బంది కలుగుతుందేమోనన్న సందేహం ఉన్నా తక్షణం పోలీసులకి తెలియజేయడం అందరి బాధ్యత. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు)(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
అలాంటి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం..!
నేను ఒక విశ్రాంత ఉద్యోగిని. నా సర్వీస్ మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుని ఒక ప్రైవేటు స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వారు లిస్టింగుకు సిద్ధంగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ వస్తుందని నమ్మించడంతో అందులో పెట్టుబడులు పెట్టాను. 18 నెలల లోపు సదరు కంపెనీలు స్టాక్ లిస్టింగ్ అవ్వకపోతే, తామే తిరిగి మా స్టాక్ కొనుక్కుంటాము అని అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు. నాలాగే చాలామంది చేత కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది కానీ ఏం లాభం లేదు పైగా మా స్టాక్ అమ్మేస్తాము అంటే తిరిగి కొనుక్కోవట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పగలరు.– ఒక విశ్రాంత ఉద్యోగి, హైదరాబాద్ పూర్వ అనుభవం, వ్యాపార పెట్టుబడులలో నైపుణ్యం కలిగిన వారు అన్లిస్టెడ్ షేర్లు కొంటూ ఉండటం, స్టార్టప్ కంపెనీలలో ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక వ్యాపారమే. ఏంజెల్ ఇన్వెస్టర్స్, క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటూ వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు అవలంబిస్తుంటారు. నచ్చిన సంస్థలలో వారు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది వారి హక్కు.అన్లిస్టెడ్ కంపెనీలలో కొన్న షేర్లకు రిస్కు కూడా అధికంగానే ఉంటుంది. దీనిని ఒక వ్యాపారం లాగా చేసే వారు నష్టాలకు కూడా సిద్ధపడి పెట్టుబడులు పెడుతుంటారు. కానీ మీలాగా జీవితం మొత్తం కష్టపడి సంపాదించి రిటైర్ అయిన తర్వాత, కేవలం లాభాలు ఆశించి మాత్రమే అధిక మొత్తంలో ఇలాంటి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కంపెనీలు ఏమైనా ఆర్థిక నేరాలు చేసినా, అవకతవకలు జరిగినా, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కంపెనీ నష్టపోతే లేదా దివాలా తీస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చింది మీరు షేర్లు కొన్న కంపెనీ అయి ఉండి, మీకు, సదరు కంపెనీ మేనేజ్మెంట్ వ్యవహారాలకు మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే, మీరు కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ద్వారా కూడా కేసు వేయవచ్చు. మీకు అగ్రిమెంట్లు చేసింది మధ్యలో వున్న బ్రోకింగ్ కంపెనీ అయితే, NCLTని ఆశ్రయించలేరు. ఇటీవలే ఒక కంపెనీ వారు మీలాంటి వారి వద్ద అధిక మొత్తంలో పెట్టుబడులను సేకరించి, అగ్రిమెంట్లు చేసి కూడా ఎవరికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదయి, కొందరిని అరెస్టు కూడా చేశారు. ఆ కేసు ఇంకా విచారణ దశ లోనే ఉంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. మీరు ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారు, వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే దిశలో దర్యాప్తు చేయవలసిందిగా కోరండి. సివిల్ కేసు ద్వారా కూడా మీ డబ్బులు తిరిగి పొందవచ్చు.గమనిక ఇటీవల కాలంలో ఒక్క హైదరాబాదులోనే సైబర్ నేరగాళ్లు కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అంటూ చాలా కేసులే నమోదయ్యాయి. ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అనుభవం కలిగిన వారి సలహా మేరకు, చట్టరీత్యా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!) -
మీ చెక్ బౌన్స్ అయితే ఎలా? ఏం చేయాలి?
నేను ఒక వ్యక్తి దగ్గర 2019 జనవరి లో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. కానీ కోవిడ్ వేవ్ రావడం వల్ల ఉద్యోగం పోయి అనుకున్న సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. డబ్బు తీసుకునేటప్పుడు ష్యూరిటీ కింద ప్రామిసరీ నోటు, డేట్ వేయని రెండు చెక్కులు ఇచ్చాను. పోయిన నెలలో ఆ చెక్కులు నాకు చెప్పకుండా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు. చెక్ బౌన్స్ కేసు వేస్తాము అంటూ లీగల్ నోటీస్ కూడా పంపించారు. నేను డబ్బు కట్టేస్తాను అని వారికి తెలియజేయగా, ‘ఇప్పుడు తీసుకున్న దానికి మూడింతలు ఇవ్వాలి, లేకుంటే నీ మీద చీటింగ్ కేసు పెడతాము, జైలుకు వెళతావు’ అని బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తగిన పరిష్కారం చూపగలరు. – మానవేందర్, విజయవాడఅవతలి వాళ్లు మీ మీద చీటింగ్ కేసు పెడతామని అనగానే భయపడవలసిన అవసరం లేదు. కోర్టు వాయిదాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ సరైన న్యాయసలహా పొందితే తప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా వర్ణించి, క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. చాలా సందర్భాలలో హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం అలాంటి కేసులను కొట్టివేశాయి. మీ కేసులో కూడా సివిల్ కేసును క్రిమినల్ పరిధిలోకి తీసుకు రావడానికి చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని రుజువైతే కేసు కొట్టివేస్తారు.ఇకపోతే... చెక్కు బౌన్స్ కేసులో వచ్చిన నోటీసుకు సరైన గడువులోపు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమాధానంలోనే చెక్కు మీద రాసినంత నగదు చెల్లిస్తాము అని అంగీకరిస్తూ కూడా మీరు నోటీసుకు రిప్లై ఇవ్వవచ్చు. ఒకవేళ నోటీసులో తప్పులు ఉన్నట్లయితే వాటన్నింటినీ తిరస్కరిస్తూ మీరు ప్రపోజల్ చేయవచ్చు. ఒకవేళ వాళ్లు అప్పటికీ కేసు వేస్తే, కోర్టుకు కూడా మీ వాదనలు తెలియపరుస్తూ, సగటు అప్పు చెల్లిస్తాము అని చెప్తే, కోర్టు మీ అభ్యర్థనను పరిగణించి అందుకు అనుగుణంగా తీర్పు చెబుతుంది. అప్పుడు మీకు జైలు శిక్ష పడకపోవచ్చు. అయితే చెక్ బౌన్స్ కేసులలో నిందారోపితులు డబ్బులు కట్టేస్తాము అన్నంత మాత్రాన నేరం లేకుండా పోదు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెప్తుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసును మాత్రం కొంత సీరియస్గానే పరిగణించండి. మీ లాయర్ గారి సలహా మేరకు కేసు నడపాలా లేక రాజీ కుదుర్చుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. మీరు డబ్బులు ఇవ్వాలి అనేది నిజమే అని చెప్తున్నారు కాబట్టి, లాయర్ గారి ద్వారా లేదా కోర్టు అనుమతి ద్వారా కూడా మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చుకోవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. ఇదీ చదవండి: మార్నింగ్ టీ కప్తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్! -
హోం వర్క్ చేయకుంటే గోడకుర్చీ వేయిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్.. నేను హోంవర్క్ చేయకుంటే మా టీచర్ నన్ను గోడకుర్చీ వేయించవచ్చా? పిల్లలను కొట్టే తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చా? నేను సొంతింట్లో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం అందుతుంది? అదెలా పొందాలి? ప్రేమికుడి దగ్గరకి వెళ్లాలనుకుంటున్నాను. వివాహమైన నెల రోజులకు విడాకులు సాధ్యమేనా?’పెళ్లైన 30ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవచ్చా?.. ఇలాంటి విచిత్ర ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ టెలీ–లా పోర్టల్కు పోటెత్తాయి. న్యాయ సలహాల కోసం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోర్టల్ను ఆశ్రయించారు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారిలో 12 ఏళ్ల మైనర్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం విశేషం. గత సంవత్సరం పోర్టల్ను ఆశ్రయించిన వారి సంఖ్య కోటి దాటడం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 19 లక్షల మంది పోర్టల్ను ఆశ్రయించారు. ఎక్కువ మందితో ఉత్తర్ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షలకు పైగా, తెలంగాణలో రెండు లక్షలకు పైగా వ్యక్తులు టెలి–లాను ఆశ్రయించారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కలి్పంచి వారికి న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘టెలి–లా’పోర్టల్ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ పోర్టల్కు పౌరుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అత్యంత తీవ్రమైన సమస్యలతో పాటు అసంబద్ధమైన విషయాలపైనా న్యాయ సలహాలు కోరుతున్నారు. దీని ద్వారా.. కొన్ని చోట్ల పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన నేరాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు సైతం పోర్టల్ అందుకుంది. న్యాయ సలహాలే కాకుండా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ‘టెలి–లా’పోర్టల్ను పెద్దసంఖ్యలో పౌరులు ఆశ్రయించి తగు సూచనలు, సలహాలు పొందారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని రకాల చట్టపరమైన సమస్యలపై లీగల్ సర్విసెస్ అథారిటీకి చెందిన న్యాయవాదులు సంప్రదింపులు, సహాయంతోపాటు దిశానిర్దేశం చేస్తారు. 2024 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల నుండి 1,06,18,641 మంది న్యాయ సలహా కోసం పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1,0492,575 మందికి న్యాయ సహాయం, సంప్రదింపులు కూడా అందించారు. ‘టెలి–లా’ను ఆశ్రయించిన టాప్ ఐదు రాష్ట్రాల్లో యూపీ తొలిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 1,902,911 మంది ఆశ్రయించగా 1,888,805 మంది సలహాలు పొందారు. మధ్యప్రదేశ్లో 1,126,681 మంది పోర్టల్ను ఆశ్రయించగా 1,125,191 మంది సలహాలు పొందారు. మహారాష్ట్ర నుంచి 838,214 మంది ఆశ్రయించగా 834,149 మంది సలహాలు పొందారు. జమ్మూకశ్మీర్ నుంచి 694,208 మంది ఆశ్రయించగా 687,375 మంది సలహాలు పొందగలిగారు. రాజస్థాన్ నుంచి 650,980 మంది ఆశ్రయంగా పొందారు. వీరిలో 646,394 మందికి లాయర్లు సలహాలు ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక నుంచి 401,838 మంది టెలి–లా పోర్టల్ను ఆశ్రయించగా 369,859 మంది సలహాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 341,884 మంది పోర్టల్ను ఆశ్రయించగా 341,424మంది సలహాలు పొందారు. తెలంగాణ నుంచి 300,171 మంది ఆశ్రయించారు. వీరిలో 294,977 మందికి న్యాయవాదులు సలహాలు ఇచ్చారు. తమిళనాడు నుంచి 286,107 మంది ఆశ్రయంగా పొందగా 284,408 మంది సలహాలు పొందారు. కేరళ నుంచి 40,746 మంది పోర్టల్ను సలహాలు, సూచనలు అడగ్గా 36,891 మందికి సలహాలు ఇచ్చారు. -
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?
మేము 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు కొన్నాము. ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒరిజినల్ దస్తావేజులు పోయాయి. మేము రెవెన్యూ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ కాపీలను తీసుకున్నాము. ఆ కాపీల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కొనుక్కునే వారికి చెప్పగా వారు వెనుకడుగు వేస్తున్నారు. కొందరేమో ‘కాగితాల పని మేము చూసుకుంటాము కానీ పాతిక లక్షలు తక్కువ ఇస్తాం..’ అంటున్నారు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు. – విజయ్ వర్ధన్, వరంగల్ఇంటి రిజిస్ట్రేషన్ / పూర్వ ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు కొనేవారు కొంత సంకోచించడం సమంజసమే. ఒరిజినల్ దస్తావేజులని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి తర్వాత అదే ఆస్తిని మరొకరికి అమ్మడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ తాకట్టు ఈ.సీ లో కూడా కనపడదు కాబట్టి కొనుక్కునేవారు అమాయకంగా మోసపోతూ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం అయిపోయింది. టైటిల్ డీడ్ డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అనే నిబంధన లేకపోవడం ఇందుకు కారణం. ఒరిజినల్ దస్తావేజులు లేని కారణం చూపించి మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు మాత్రమే కొంటాము అని చాలామంది అంటారు. ఒరిజినల్ పత్రాలు లేనంత మాత్రాన ఆ స్థలం కానీ, ఇల్లు కానీ మీది కాకుండా పోదు, మీకు మీ ఆస్తిని అమ్మే హక్కు లేకుండా పోదు! మీరు తక్షణమే మీ ఇంటి పత్రాలు పోయాయి అని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వండి. అదేవిధంగా మీరు ఒక లాయర్ ద్వారా పేపర్ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రకటన కాపీలను మరలా పోలీసు వారికి అందించాలి. పోలీసు వారు ‘ఫలానా వారి దస్తావేజులు పోయాయి, తిరిగి వెతికినా దొరకడం లేదు’ అని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ (నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్) జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ను తీసుకొని మీరు రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్ కాపీలు ఇస్తారు. అలా పొందిన పత్రాలు ఒరిజినల్ దస్తావేజులతో సమానం. మీరు వివరించిన పరిస్థితులలో అమ్మే వారికి –కొనేవారికి కూడా ఇది సురక్షితమైన పరిష్కారం.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!) -
మిమ్మల్ని ఒత్తిడి చేసే అధికారం వారికి లేదు..!
మేము ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు. – బి.నారాయణ, హైదరాబాద్సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి. సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు. అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు..!
నేను ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.– జి. రామ్మోహన్, కందుకూరుభూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్–లైన్’ అప్లికేషన్/దరఖాస్తు చెయ్యండి. ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.సివిల్ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిన్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు పెట్టొచ్చా..!
ప్రశ్న: మేము లోన్ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వద్దనుంచి నిర్మాణదశలోనే ఫ్లాట్ కొన్నాము. ఒప్పందం ప్రకారం పది నెలల లోగా ఫ్లాటు మాకు పూర్తి చేసి ఇవ్వాలి. కానీ సంవత్సరం అయినా ఇంకా పూర్తి చేయలేదు. లోను నెలవారీ వాయిదాలు కట్టడం కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? పరిష్కారం చెప్పగలరు. – టి.ఆర్. రాజేశ్వరి, హైదరాబాద్సర్వసాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థ వారు, మీరు రాసుకునే ఒప్పంద పత్రం అంటే అగ్రిమెంట్లో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి, మీకు అందజేయక΄ోతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనం ఏం చేస్తారో రాసుకుంటారు. కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వటం లేదా మీ తరఫున నెలవారీ లోను డబ్బులు సదరు కంపెనీ వారే కట్టేలా ఒప్పందాలు కూడా రాసుకుంటారు. మీ ఒప్పందపత్రంలో కూడా అటువంటి కండిషన్ ఏమైనా ఉందేమో చూసుకోండి.ఏది ఏమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మీరు సదరు రియల్ ఎస్టేట్ సంస్థపై వినియోగదారుల రక్షణ చట్టం కింద కేసు వేయవచ్చు. మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికి తోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు, పొందవచ్చు. అదనంగా... ఒకవేళ మీరు కొన్న ఫ్లాట్ ్ర΄ాజెక్టు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయి ఉంటే అదనంగా రెరాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ అగ్రిమెంటు, ఆస్తి కొనుగోలు పత్రాలు తీసుకొని దగ్గర్లోని లాయర్ని కలవండి. మొదటగా ఒక నోటీసు పంపి, అప్పటికీ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే, పైన తెలిపిన విధంగా దావా వేసి న్యాయం పొందవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు లేదా మీ తరఫున మరెవరినైనా ‘ఆథరైజ్డ్ పర్సన్’గా నియమించుకోవచ్చు. 50 లక్షల దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో, 50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు రాష్ట్ర ఫోరంలో అలాగే రెండు కోట్ల పైన విలువ గల దావాకి జాతీయ వినియోగదారుల ఫోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (చదవండి: జాబ్కి అప్లై చేసిన 48 ఏళ్లకు కాల్ లెటర్..ఐతే..!) -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్గా లీ హ్యూన్ -
బిల్గేట్స్పై ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్గేట్స్పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ని మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఈ సంస్థ బిల్గేట్స్ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్గేట్స్ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్గేట్స్ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్ హోల్డర్స్.. బోర్డును కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్’ మీద ఫోకస్ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్గేట్స్ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు. చదవండి: ‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’ సంబంధిత కథనాలు: గేట్స్ వెకిలి మెయిల్స్.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్! -
ఇక పోస్టాఫీసుల్లో న్యాయసేవల సమాచారం..
సాక్షి,విశాఖపట్నం : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు పోస్టాఫీసుల్లో న్యాయసేవలకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవదానం హరిహరనాథ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు పోస్ట్మ్యాన్లకు న్యాయ సహాయం కోసం అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్.సోమశేఖరరావు, అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ పాల్గొన్నారు. చదవండి: Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి -
న్యాయ సలహాలు విస్తృతంగా అందించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాఘవరావు లీగల్ (కడప అర్బన్) : ప్రజలకు లీగల్ లిటరసీ సంస్థ ద్వారా ఎక్కువ మందికి న్యాయ సలహాలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎస్.రాఘరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి 2011-12, 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు ఆడిట్ రిపోర్టును కమిటీ ఆమోదించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు మాసాలలో జిల్లాలో నిర్వహించిన లోక్అదాలత్, కేసుల పరిష్కారం, లిటరసీ క్యాంపుల నిర్వహణ, లీగల్ సర్వీసుల ద్వారా ఎంత మందికి న్యాయ సలహాలు అందించడం జరిగిందనే అంశాలపై సమీక్షించారు. లోక్ అదాలత్ ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాజంపేట పరిధిలో భూ సేకరణకు సంబంధించి ఎక్కువ వివాదాలు, రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నమోదవుతున్నందున రెవెన్యూ అధికారులతో సమన్వయ పరుచుకుని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో లీగ్-ఎయిడ్-క్లినిక్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ టి.రఘురాం, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అన్వర్బాషా, జీపీ పి.సుబ్రమణ్యం, జె.ప్రభాకర్, అదనపుఎస్పీ (ఆపరేషన్స్) రాహుల్దేవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సూపర్’ వైద్య సీట్లపై సర్కారు దృష్టి
⇒ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదన ⇒ విభజన చట్టంలో స్పష్టత లేక అయోమయం ⇒ అన్ని సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే యోచన ⇒ న్యాయ సలహా తీసుకోవాలని సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడమో లేక రాష్ర్టంలో ఉన్న సీట్లను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్కే దక్కుతుండటం దీనికి కారణం. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ సహా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 198 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వీటిలో 110 సీట్లు తెలంగాణలో, 65 సీట్లు ఏపీలో ఉన్నాయి. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ప్రభుత్వ వాదన ప్రకారం తెలంగాణలో 110 సీట్లుంటే.. రాష్ట్ర విద్యార్థులకు దక్కేవి 48 సీట్లు మాత్రమే. 65 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఏపీకి మాత్రం 96 సీట్లు దక్కుతున్నాయి. మిగిలిన 54 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటున్నాయి. తెలంగాణలోని సీట్లన్నీ ఇక్కడి విద్యార్థులకే దక్కాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ 15 శాతం ఓపెన్ కేటగిరీని వదిలేసినా 100 సీట్లయినా దక్కాల్సిందేనని వాదిస్తున్నాయి. ఉదాహరణకు నిమ్స్లో బ్రాడ్ స్పెషాలిటీలో 28 సీట్లుంటే అందులో ఏపీకి 16, తెలంగాణకు 7 సీట్లు దక్కుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రం ఐదు సీట్లున్నాయి. నిమ్స్ పీజీ సూపర్ స్పెషాలిటీలో 50 సీట్లుంటే అందులో ఏపీకి 30, తెలంగాణకు 12 సీట్లు మాత్రమే దక్కుతాయి. ఆ రెండు సెక్షన్లు పరస్పర విరుద్ధం విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం వచ్చే పదేళ్ల వరకు ఉన్నత విద్యలోని పాత కోటా సీట్లను గతంలో ఉన్నట్లే భర్తీ చేయాలి. అయితే సెక్షన్ 97 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సీట్లు ఉండాలని పేర్కొన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. విభజన చట్టంలో గందరగోళం ఉన్నప్పటికీ సెక్షన్ 97 ప్రకారం తెలంగాణలోని సీట్లను తెలంగాణవారితోనే భర్తీ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ‘తెలంగాణలోని ఉన్నత విద్యలో రాష్ట్రస్థాయి సీట్లకు అయ్యే ఖర్చు, ఫ్యాకల్టీ, విద్యార్థుల ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. ఏపీ ఒక్క పైసా కేటాయించలేదు. ఆ రాష్ట్ర విద్యార్థులు మాత్రం 64 శాతం సీట్లు పొందుతున్నార’ని జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ అంటున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామన్నారు. కాగా, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని, ఆ తర్వాతే తగిన చర్యలు చేపడతామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
న్యాయ సలహా కేంద్రాలకు కొత్త హంగులు
నిజామాబాద్ లీగల్, న్యూస్లైన్: గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో న్యాయ సలహాలు అందించడానికి ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. న్యాయ సలహాల కోసం కోర్టుల వద్దకు వెళ్లనవసరం లేకుండా ప్రజల వద్దకు న్యాయ సలహాలు అందించడం ఈ కేంద్రాల లక్ష్యం. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండి ప్రజలకు చట్టపరమైన విషయాలలో ఉచితంగా సలహాలను అందిస్తారు. న్యాయ సలహాల కేంద్రాల పేర్లను న్యాయ పరిరక్షణ, అభివృద్ధి కేంద్రాలుగా వ్యవహరిస్తూ ప్రతి కేంద్రం వద్ద నూతనంగా బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కాకుండా ఇతర రోజులలో సలహాలు కోరే ప్రజల సౌకర్యార్థం అన్ని కేంద్రాల వద్ద ఆయా పంచాయతీల సహకారంతో ఒక ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చే స్తున్నారు. సలహాలను కోరేవారు దాఖలు చేసే పత్రాలను ఈ పెటె ్టలో వేస్తే న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి పరిశీలించి తగు న్యాయ సహాయం అందిస్తారు. అలాగే న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తదితర ఫోన్ నెంబర్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.