Matthew Hayden
-
రోహిత్ నా సోదరుడు.. మరింత ఎనర్జీతో ఆడాలి: హేడన్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతన్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(33), రోహిత్ శర్మ (0)ఉన్నారు. నాలుగో రోజు ఆటలో భారత్ భవితవ్యం వీరిద్దరిపైనే ఆధారపడి ఉంది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆటలో రోహిత్ తనదైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయాలని హేడెన్ సూచించాడు. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు."రోహిత్ శర్మ ఫార్మాట్ ఏదైనా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తాడు. వన్డే క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు, పొట్టి ఫార్మాట్లలో అతడు రికార్డులే అందుకు నిదర్శనం. కానీ ఇప్పుడు అతడు ఏంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. బ్రిస్బేన్లో రోహిత్ తన కోసమైనా ఫుల్ ఎఫెక్ట్తో ఆడాలి. అతడు కొన్ని రోజుల విరామం తర్వాత అడిలైడ్లో ఆడాడు. బహుశా అందుకే రోహిత్ కాస్త నిదానంగా ఆడాడు. నేనే అతడితో పాటు క్రీజులో ఉండి ఉంటే, డిఫెన్స్ ఆడటం ఇష్టం లేదని చెప్పేవాడిని. రోహిత్ తన స్టైల్లో దూకుడుగా ఆడాలి. అతడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. శక్తి, బాగా ఆడాలనే సంకల్పం అతడిని ముందుకు నడిపిస్తాయి. రోహిత్ నా సోదరుడు.. గొప్ప సంకల్పం, పూర్తి ఎనర్జీతో ఆడాలని కోరుకుంటున్నాను" అని హేడన్ స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: అదొక చెత్త క్రికెట్ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్ దిగ్గజం -
'అతడొక అద్భుతం.. కానీ ఆసీస్ బౌలర్ల నుంచి కఠిన పరీక్ష తప్పదు'
టీమిండియా యవ సంచలనం యశస్వీ జైశ్వాల్పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడని హేడన్ కొనియాడాడు. అయితే రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి యశస్వీ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడని అతడు అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. భారత్కు క్రికెట్కు దొరికిన విలువైన ఆస్తి. అతడి స్ట్రోక్ప్లే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యశస్వీ కవర్స్పై నుంచి ఆడే షాట్స్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బౌన్సీ పిచ్లపై ఎలా ఆడుతాన్నది చూడాలి. జైశ్వాల్ బంతిని హార్డ్గా హిట్ చేయడం మనం చాలా సార్లు చూశాం. కానీ ఆస్ట్రేలియా పిచ్లలో హార్డ్ హిట్టింగ్ చేయడం అంత ఈజీకాదు. వరల్డ్క్లాస్ బౌలర్ల నుంచి జైశ్వాల్కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లను ఎదుర్కొనేందుకు యశస్వీ సిద్దంగా ఉండాలి. అదే విధంగా మైదానాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అక్కడ సిక్స్లు కొట్టడం అంత సులభం కాదు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోతే ఫీల్డర్కు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఆసీస్ కండీషన్స్లో జైశ్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని సీఈఏట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్లో హేడన్ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడిన జైశ్వాల్ 70.07 స్ట్రైక్ రేటుతో 1028 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది. -
వన్డే ప్రపంచకప్ ఆల్టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్కు షాకిచ్చిన సన్రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
అలా అయితే కోహ్లి జట్టులో ఉండీ దండగ: ఆసీస్ మాజీ స్టార్
టీ20 ప్రపంచకప్-2024లో భారత తుది జట్టు కూర్పు గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్గా పంపాలని.. లేదంటే జట్టులో అతడికి స్థానం ఇవ్వటమే దండగ అని పేర్కొన్నాడు.యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాలని.. కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను మిడిలార్డర్లో ఆడించాలని హెడెన్ సూచించాడు. కాగా వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టగా.. కోహ్లి మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓపెనింగ్ జోడీ ఎవరు?ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. యశస్వి- కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని ఇటీవల తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్ మిడిలార్డర్లో రావాలితాజాగా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లను వరుసగా పంపలేం. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కోహ్లి యశస్వితో కలిసి ఓపెనింగ్ చేయాలి. లేదంటే అతడికి నా జట్టులో చోటే ఉండదు. సూపర్ ఫామ్లో ఉన్న అతడు ఓపెనర్గా వస్తేనే బాగుంటుంది.ఇక రోహిత్ శర్మ.. అతడొక విలక్షణమైన ఆటగాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఏమాత్రం సంకోచించడు. అంతర్జాతీయ టీ20లలో అతడు నాలుగో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తే బాగుంటుంది’’ అని హెడెన్ అభిప్రాయపడ్డాడు.నాలుగో నంబర్లో రోహిత్ శర్మ.. గణాంకాలు ఇవీటీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇప్పటి వరకు 151 టీ20లు ఆడి.. 3974 పరుగులు చేశాడు. ఇందులో 27 సార్లు అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి.. 481 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.కాగా 2022లో రోహిత్ ఎనిమిది సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి.. రెండు ఫిఫ్టీల సాయంతో 188 పరుగులు(స్ట్రైక్రేటు 122.87) సాధించాడు. ఇక ఐపీఎల్లో 91 ఇన్నింగ్స్లో మిడిలార్డర్లో వచ్చిన హిట్మ్యాన్.. 130కి పైగా స్ట్రైక్రేటుతో 2565 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హత సాధించగా.. సన్రైజర్స్ క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలుస్తుందని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఫైనల్కు ముందు కేకేఆర్కు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ వ్యవధిలో ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలపై కేకేఆర్ స్పెషల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్కు కలిసిస్తోందని నేను భావిస్తున్నాను.అంతేకాకుండా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నావరకు అయితే కేకేఆర్దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్లో హేడన్ పేర్కొన్నాడు. -
T20 WC: కోహ్లి ఒక్కడు ఉంటేనే గెలుస్తారా?.. అతడి కంటే..
‘‘విరాట్ కోహ్లి ఒక్కడే టీమిండియాకు వరల్డ్కప్ అందించగలడా? గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలో అతడు అద్భుతంగా ఆడాడు. గణాంకాలు సైతం చాలా బాగున్నాయి.ఎన్నో రికార్డులు సాధించాడు కూడా. ఏ టోర్నీలోనైనా అతడికి ఇవి అలవాటే. అయితే, సెలక్టర్లు అతడి అనుభవానికి ఓటేస్తారా?.. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తారా? అన్నదే ప్రశ్న.నిజానికి ఈసారి వరల్డ్కప్ టోర్నీ అమెరికా- వెస్టిండీస్లో జరుగనుంది. కరేబియన్ దీవుల్లోనైనా పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అమెరికా పిచ్లపై ఏ జట్లకు పెద్దగా అవగాహన లేదు.ఇక విండీస్ పిచ్లపై మిడిల్ ఓవర్లలో కచ్చితంగా ఎక్కువ శాతం స్పిన్నర్లే అటాక్కు దిగుతారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే వారు వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. అక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం విరాట్ కోహ్లికి సవాలే.అలాంటపుడు శివం దూబే, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు మనకు గుర్తుకు వస్తారు. స్పిన్ బౌలింగ్లో వీళ్లు చితక్కొట్టగలరు. టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం గుర్తుండే ఉంటుంది.గతేడాది నవంబరులో వరల్డ్ చాంపియన్స్ అయిన మమ్మల్ని 4-1తో వాళ్లు చిత్తు చేశారు. అప్పుడు రాణించిన రుతురాజ్ గైక్వాడ్ గురించి కనీసం ఒక్కరు కూడా చర్చించకపోవడం విచారకరం.నాటి సిరీస్లో జైస్వాల్ సైతం సెంచరీలు బాది సత్తా చాటాడు. కేవలం అనుభవానికి పెద్ద పీట వేయకుండా.. ఎవరైతే వరల్డ్కప్ టోర్నీలో గెలిపించగల సత్తా కలిగి ఉంటారో వారినే ఆస్ట్రేలియా క్రికెట్ ఎంపిక చేస్తుంది.మరి బీసీసీఐ అనుభవం వైపు మొగ్గు చూపుతుందా? లేదంటే యువ హిట్టర్లకు అవకాశం ఇస్తుందో తెలియదు’’ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్కప్లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేస్తాడన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు హెడెన్.అనుభవం కంటే కూడా ప్రస్తుతం జట్టుకు అవసరమైన ఆటగాళ్లను ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుందో బీసీసీఐ సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కాగా కోహ్లి ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్లో కలిపి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉండటం విశేషం. అయితే, స్ట్రైక్రేటు 147.49గా నమోదైన నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..
Suryakumar fails again in Asia Cup match vs Bangladesh: ఆసియా కప్-2023 టోర్నీలో రాక రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకోయాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 34 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే సాధించాడు. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. షాట్ సెలక్షన్లో తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాడు. ఈ నేపథ్యంలో.. వన్డేల్లో సూర్య కంటే మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ను కాదని.. అతడికి అవకాశం ఇచ్చిన బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అతడిని కాదని నీకు ఛాన్స్ సంజూను కావాలనే పక్కనపెట్టి.. ఈ టీ20 నంబర్ 1 బ్యాటర్కు ఇంకెన్ని ఛాన్స్లు ఇస్తారని.. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని చురకలు అంటిస్తున్నారు. వన్డే వరల్డ్కప్-2023 జట్టులో సూర్యకుమార్ను ఆడిస్తే ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఏడేళ్లు బెంచ్ మీదే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ప్రస్తుతం సూర్య మైండ్సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నపుడు ఏడేళ్లు బెంచ్ మీదే కూర్చున్నా. ఐపీఎల్, ఫస్ట్క్లాస్ క్రికెట్లో సూర్య స్ట్రైక్రేటు 170కి పైగా ఉంది. అయితే, వన్డేల్లో మాత్రం అతడు ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అలాంటి మైండ్సెట్ మార్చుకో సూర్య అందుకే ఎలాగైనా 50 ఓవర్ ఫార్మాట్లో రాణించి అభిమానుల నుంచి గౌరవం పొందాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి మైండ్సెట్ నుంచి సూర్య బయటపడాలి. విమర్శల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనపై ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా పడుతుంది. అభద్రతాభావం మనల్ని వెంటాడుతుంది’’ అని సూర్యకుమార్ యాదవ్కు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్లో సూర్య తప్పక రాణిస్తాడని తాను భావిస్తున్నానని.. అయితే ఈసారి తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. వన్డేల్లో సంజూ గణాంకాలు ఇలా కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేల్లో సూర్య.. 24.41 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్.. 13 వన్డేలాడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. చదవండి: SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు -
WC 2023: వరల్డ్కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్కు ప్రధాన జట్టులో చోటిస్తే బాగుంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. ఇషాన్ కిషన్ను కూడా ఆడించాలని సూచించాడు. ప్రపంచకప్ పోటీలో పది జట్లు కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో పాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ ట్రోఫీ కోసం పోటీలో నిలిచాయి. అనుకున్న ఫలితం రావాలంటే ఇక సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉండటం సహజం. ఈ నేపథ్యంలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి సరైన సమయంలో రాణిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదు. పుష్కరకాలం తర్వాత మరోసారి స్వదేశంలో ప్రపంచ విజేతగా నిలవగలదు. ఈ నేపథ్యంలో వరల్డ్కప్నకు ఎంపిక చేసే జట్టు సెలక్టర్లకు సవాలుగా మారింది. ఇక ఆసియా కప్ ఈసారి.. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న తరుణంలో ఈ ఈవెంట్లో ఆడే జట్టే ప్రపంచకప్ ప్రొవిజినల్ టీమ్ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చెప్పాడు. సంజూకు ఛాన్స్.. వాళ్లిద్దరికీ షాక్ ఈ క్రమంలో ఆసీస్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్టార్ స్పోర్ట్స్ షోలో భారత జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లో మణికట్టు స్పిన్నర్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈవెంట్కు తాను ఎంచుకున్న 15 మంది జట్టులో రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్కు స్పిన్నర్లుగా స్థానం కల్పించాడు. మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్లకు షాకిచ్చాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ను హెడెన్ తన జట్టుకు ఎంపిక చేయడం విశేషం. అదే సమయంలో సీనియర్లకే పెద్దపీట వేసిన ఆసీస్ లెజెండ్ యువ సంచలనం తిలక్ వర్మను విస్మరించాడు. కాగా ఈ వరల్డ్కప్లో టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023కి మాథ్యూ హెడెన్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్. చదవండి: అలా అయితే.. 2011 వరల్డ్కప్ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: కోహ్లి A champion’s touch! 🏆 Former Aussie WC winner, @HaydosTweets has unveiled his #TeamIndia squad for the #CWC2023! 🌟 Would you make any changes to this dream team? 👀 Tune-in to the #WorldCupOnStar October 5, 2 PM onwards | Star Sports Network & Disney+ Hotstar#Cricket pic.twitter.com/lAxvbPJLgi — Star Sports (@StarSportsIndia) August 26, 2023 -
వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు
Matthew Hayden On Indias World Cup Squad: వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి టీమ్స్ ఇప్పటికే తమ ప్రిలిమనరీ జట్లను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్కప్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్లో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్కప్కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 15 మంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్ 15లోపు ఐసీసీకి బీసీసీఐ సమర్పించనుంది. కాగా ఈ టోర్నీతో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, వరల్డ్కప్కు భారత జట్టు ఇదే.. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యలతో కూడిన భారత జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంచుకున్నాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్కు చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వికెట్ కీపర్లగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరికీ హేడన్ ఛాన్స్ ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర్పటేల్కు మాత్రమే చోటు దక్కింది. అదే విధంగా స్పెషలిస్ట్ బ్యాటర్లగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్కు హేడన్ అవకాశం కల్పించాడు. మరోవైపు సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు హేడన్ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హేడన్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ మరియు అక్షర్ పటేల్. చదవండి: IBSA World Games 2023: భారత్కు సిల్వర్ మెడల్ -
రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి..
ICC ODI WOrld CUp 2023: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్గా షాదాబ్ ఖాన్ను ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. టీమిండియాకు రవీంద్ర జడేజాలాగా పాక్కు షాదాబ్ ఉన్నాడని వ్యాఖ్యానించాడు. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ-డీ క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్, అహ్మదాబాద్లలో ఒక్కో మ్యాచ్లు ఆడనున్న దాయాది జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్కతాలో రెండేసి మ్యాచ్లు ఆడనుంది. జడ్డూలా త్రీడీ ప్లేయర్.. డేంజరస్ హిట్టర్ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఆసీస్ మాజీ ఆల్రౌండర్ మాథ్యూ హెడెన్ పాకిస్తాన్కు ఈ మెగా ఈవెంట్లో షాదాబ్ ఖాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ‘‘షాబాద్ ఖాన్ అద్బుతమైన ఆటగాడు. తనకంటూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ- డైమెన్షనల్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించగల ప్రమాదకర హిట్టర్. బంతితోనూ అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు అత్యద్భుతమైన ఫీల్డర్ కూడా! ఒక్కోసారి ఫీల్డింగ్ ఎఫర్ట్స్తో కూడా వరల్డ్కప్ గెలిచే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు మరి! కాబట్టి.. ఈసారి పాకిస్తాన్కు ఈ స్పిన్ ఆల్రౌండర్ కీలకం కానున్నాడని చెప్పవచ్చు’’ అని మాథ్యూ హెడెన్ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాదాబ్ ఖాన్.. బౌలింగ్ ఆల్రౌండర్. అందుకే అలా పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ 24 ఏళ్ల రైట్హ్యాండ్ బ్యాటర్ కీలక సభ్యుడు. ఇప్పటి వరకు ఆడిన 56 వన్డేల్లో 631 పరుగులు సాధించడంతో పాటు.. 73 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. ఈ నేపథ్యంలో బ్యాటర్, బౌలర్గా రాణించడంతో పాటు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న షాబాద్ను హెడెన్ త్రీడీ ప్లేయర్గా అభివర్ణించాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! -
కీలక మ్యాచ్ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో రోహిత్ (7 బంతుల్లో 8) విఫలమైన అనంతరం కామెంట్రీ బాక్స్ ఉన్న హేడెన్ మాట్లాడుతూ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేయడం రోహిత్ శర్మకు ఇది కొత్తేం కాదు.. జట్టుకు అవసరం ఉన్నప్పుడు అతను రాణించడం నేనెప్పుడు చూడలేదు.. అది టీమిండియా కావొచ్చు లేదా ముంబై ఇండియన్స్ కావచ్చు.. తన దృష్టిలో రోహిత్ ఒక ఫెయిల్యూర్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అలాగే ఈ సీజన్లో ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో రోహిత్ పాత్ర శూన్యమని.. గత కొనేళ్లుగా అతను తరుచూ విఫలమవుతున్నా, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల ప్రదర్శన కారణంగా విమర్శల నుంచి తప్పించుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. హేడెన్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ఆడినా, ఆడకపోయినా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడని వెనకేసుకొస్తున్నారు. రోహిత్ను విమర్శించే అర్హత హేడెన్కు లేదని ధ్వజమెత్తుతున్నారు. హిట్ మ్యాన్.. టీమిండియాకు అలాగే ముంబై ఇండియన్స్కు అందించిన విజయాలు మర్చిపోకూడదని అంటున్నారు. కాగా, మే 26న గుజరాత్ టైటాన్స్తో జరిగిన నాకౌట్ క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో (60 బంతుల్లో 129) విజృంభించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఆదిలోనే వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన ముంబై.. మరో 10 బంతులు మిగిలుండగానే 171 పరుగులకే చాపచుట్టేసింది. కీలక మ్యాచ్లో రోహిత్ శర్మ (8) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ (61), తిలక్ వర్మ (43), గ్రీన్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: ‘ఫైనల్’ ధమాకా.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్లకు పిచ్లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్కు టర్న్ అవుతోంది. ఇండోర్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం -
టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!
టీమిండియాపై టెస్టు సిరీస్ గెలిచి 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు మరో సారి నిరాశ ఎదురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం పొందిన ఆసీస్.. తమ కలను నేరవేర్చుకునే అవకాశం కోల్పోయింది. చివరిగా 2004లో భారత్ గడ్డపై ఆసీస్ టెస్టు సిరీస్ నెగ్గింది. ఇక తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా దారుణ ప్రదరర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొవాడనికి తలలు పట్టుకున్నారు. అయితే మూడో టెస్టుకు దాదాపు వారం రోజుల సమయం ఉండడంతో.. ఆసీస్ జట్టు ఢిల్లీలోనే తమ ప్రాక్టీస్ను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు సాయం చేసేందుకు ఆ జట్టు మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ముందుకొచ్చాడు. హేడెన్ ప్రస్తుతం ఈ సిరీస్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. "కష్టాల్లో ఉన్న ఆసీస్ జట్టుకు నా వంతు సాయం అందించేందుకు 100 శాతం సిద్దంగా ఉన్నాను. అది రాత్రి లేదా పగలు ఏ సమయంలో పిలిచినా వెళ్లి సాయం చేస్తాను. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. వాళ్ల సొంత గడ్డపై భారత స్పిన్నర్లను ఎదుర్కొవడం అంత సులభం కాదు. బౌలర్ల మైండ్ సెట్ను అర్ధం చేసుకోవాలి. అయితే అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరం ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా ఉంది. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా గవర్నింగ్ కౌన్సిల్లో కనీసం ఒక్క మాజీ ఆటగాడైనా ఉండాలి. అప్పుడే వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చు." అని విలేకరుల సమావేశంలో హెడన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్కు ముందు చెన్నైకి గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు! -
సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా!
టి20 ప్రపంచకప్ 2022 నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో పాకిస్తాన్ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి.. దీంతో పాక్ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్ ఆడిన మూడు మ్యాచ్ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్ జట్టేనా సెమీస్లో కివీస్పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్ పాకిస్తాన్ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. పాక్ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్ దాదాపు సక్సెస్ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి పాకిస్తాన్ విజేతగా నిలిస్తే హేడెన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్ను ఎప్పుడైతే మెంటార్గా ఏంచుకుందో అప్పుడే పాక్ సగం సక్సెస్ అయినట్లే. అయితే హేడెన్ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్ మ్యాచ్లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్కు ముందే అంటే సెప్టెంబర్లోనే మాథ్యూ హెడెన్ను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్లో సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రధాన కోచ్ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్ ప్రధాన కోచ్గా సక్లెయిన్ ముస్తాక్ ఉన్నాడు. పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్ కోచ్గా ఉన్న హేడెన్కు ఆసీస్ పిచ్లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్ను మెంటార్గా నియమించిన పీసీబీ మహ్మద్ యూసఫ్ను బ్యాటింగ్ కోచ్గా ఎన్నుకుంది. హేడెన్ అనుభవాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్ మ్యాచ్ ఉదాహరణ. ముందు బౌలింగ్తో కివీస్ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్లో లేని బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు అసలు మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే మ్యాచ్ ముగియగానే హేడెన్ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సూపర్-12 దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్ పాకిస్తాన్దే అని ప్రతీ మ్యాచ్కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్కప్లాగే ఇప్పుడు కూడా పాక్ టైటిల్ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్ దిశానిర్ధేశం పాక్ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్ రూమ్లో హేడెన్ ఇచ్చిన స్పీచ్ను పీసీబీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్లో ఇంగ్లండ్ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్ జట్టులో ప్రస్తుతం బౌలింగ్ విభాగం నెంబర్వన్గా ఉంది. షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్, నసీమ్ షా పేస్ త్రయానికి తోడుగా మమ్మద్ నవాజ్ స్పిన్ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్ పేసర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్ రిపీట్ కాబోతుందని.. పాకిస్తాన్దే కప్ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్కు అంత సీన్ లేదని.. మ్యాచ్ కచ్చితంగా వన్సైడ్ అవుతుందని.. ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు. చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! -
'వెళ్లిపోయాకా ఈ మాట చెప్పడం ఎందుకు?'.. హెడెన్కు చురకలు
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాను మెంటార్గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్లో ఆఖరి నిమిషంలో వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టి సెమీస్లో అడుగుపెట్టింది. నవంబర్ 9న(బుధవారం) న్యూజిలాండ్తో పాక్ అమితుమీ తేల్చుకోనుంది. ఇక మాథ్యూ హెడెన్ డిఫెండింగ్ చాంపియన్గా ఈ ప్రపంచకప్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా సూపర్-12 దశలోనే వెనుదిరగడంపై స్పందించాడు. ''ఈ ప్రపంచకప్కు ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లుగా అనిపించలేదు. జరుగుతున్నది ఒక ప్రీమియమ్ ఈవెంట్. ప్రీమియమ్ ఈవెంట్ అంటే ఎలా ఉండాలి.. అన్ని శక్తులు సిద్ధం చేసుకొని బరిలోకి దిగాలి. కానీ దురదృష్టవశాత్తూ ఆసీస్ జట్టు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ప్రపంచకప్లో ఆడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదా దశలో అడుగుపెట్టిన ఆసీస్ ఇవాళ సూపర్-12లోనే నిష్క్రమించడం కాస్త బాధ కలిగించింది. గత నాలుగైదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ను అందరం గమనిస్తూ వస్తున్నాం. కొన్ని డిపార్ట్మెంట్లలో మార్పు అవసరం.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్లో మునుపటి పేస్ను చూడలేకపోతున్నాం. కీలకమైన మ్యాచ్కు మిచెల్ స్టార్క్ దూరమవడం జట్టు లయను దెబ్బతీసింది. అలాగే డేవిడ్ వార్నర్ ప్రదర్శన చూసుకుంటే గత వరల్డ్కప్కు ఈసారి పొంతన లేనట్లుగా ఉంది. అతనొక ప్రీమియమ్ ప్లేయర్. కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అతనే కాదు మిగతా ఆసీస్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హెడెన్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఘాటుగా స్పందించారు. ''నువ్వు ప్రస్తుతం పాక్ జట్టుకు మెంటార్గా ఉన్నావు. ముందు మీ జట్టులోని లోపాలను సరిదిద్దుకుంటే మంచింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వెళ్లిపోయాకా ఇప్పుడు మాట్లాడడం ఏంటి'' అని కామెంట్ చేశారు. చదవండి: టీమిండియాతో సెమీస్కు ముందు ఇంగ్లండ్కు మరో బిగ్ షాక్..! Kane Williamson: కెప్టెన్గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా -
హెడెన్ బంపరాఫర్ మిస్ చేసుకున్న పాక్ బౌలర్స్
టి20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ల ద్వారా సరైన ప్రాక్టీస్ లభించలేదు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో ఓటమిపాలైన పాకిస్తాన్కు రెండో మ్యాచ్ వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. వార్మప్ మ్యాచ్లు ముగియడంతో ఇక పాకిస్తాన్ నేరుగా అక్టోబర్ 23న(ఆదివారం) మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. అయితే టీమిండియాతో పోరుకు ముందు బ్రిస్బేన్లో పాక్ జట్టు మెంటార్.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ త్రో చాలెంజ్ కాంపిటీషన్ నిర్వహించాడు. త్రో చాలెంజ్లో భాగంగా ఎవరైతే బంతిని స్టేడియం బయటకు విసురుతారో వాళ్లకు వంద డాలర్ల ఖరీదైన గిఫ్ట్ను ఇస్తానని చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్కు పాక్ పేసర్లు నసీమ్ షా, మహ్మద్ వసీమ్ జూనియర్లు సై అన్నారు. తాను బంతిని స్టేడియం వెలుపలికి విసరగలనన్న నమ్మకం ఉందని వసీమ్ పేర్కొన్నాడు. అయితే చెప్పినట్లుగా బంతిని బయటకు విసరడంలో మాత్రం విఫలమయ్యాడు. నసీమ్ షా కూడా త్రో చాలెంజ్లో ఫెయిలయ్యాడు. ఇద్దరు విఫలమవడంతో హేడెన్ వంద డాలర్ల గిఫ్ట్ను తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) చదవండి: రాణించిన కుశాల్ మెండిస్.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన -
'అతడు బాగా అలిసిపోయాడు.. తిరిగి వచ్చి అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గత కొన్ని మ్యాచ్ల నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భువీ పూర్తిగా తేలిపోతున్నాడు. ఆసియాకప్-2022లోనూ ఆప్గానిస్తాన్పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ కూడా భువనేశ్వర్ విఫలమయ్యాడు. ఈ సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భువీ.. తన అఖరి రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్కు ముందు భువీ పేలవ ఫామ్ భారత జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవీ నాన్స్టాప్గా క్రికెట్ ఆడి అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని హేడన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్కు విశ్రాంతి అవసరం భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 అనంతరం హేడన్ మాట్లాడూతూ.. "బ్యాటర్ల కంటే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఆలసిపోతారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. విరాట్ కోహ్లి కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. అతడు కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని జట్టులో మళ్లీ చేరాడు. ఇప్పుడు విరాట్ తిరిగి తన ఫామ్ను పొందాడు. కాబట్టి భువీ కూడా విశ్రాంతి తీసుకుని వచ్చి చెలరేగుతాడు. ఏ బౌలరైనా బాగా అలసి పోతే.. అతడు బంతితో ఏకాగ్రత సాధించలేడు. భువీ అద్భుతమైన బౌలర్. అతడికి కాస్త విశ్రాంతి లభిస్తే తన ఫామ్ను తిరిగి పొందుతాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో బుమ్రా, భువీ జోడీ భారత జట్టుకు కీలకం కాబోతుంది అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భువీకి రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు -
'అవమానించాలని కాదు.. అసలు దినేశ్ కార్తిక్ రోల్ ఏంటి?'
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్కు ఫినిషర్ అనే ట్యాగ్ తగిలించి బీసీసీఐ అతనికి జట్టులో చోటు కల్పించింది. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కార్తిక్ ఫినిషర్గా అదరగొట్టాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ల్లో టీమిండియా తరపున ఫినిషింగ్ పాత్రలో మెరిశాడు. ఇక ధోని తర్వాత సరైన ఫినిషర్ దొరికాడు అని అభిమానులు భావించేలోపే అతని స్థానాన్ని బీసీసీఐ ప్రశ్నార్థకం చేసింది. ఫినిషర్ అంటే చివరగా వచ్చి ధాటిగా ఆడడం అని అందరికి తెలుసు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడిన ప్రతీ టి20 సిరీస్కు కార్తిక్ను ఎంపిక చేస్తూ వచ్చింది. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఎక్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. మరి బీసీసీఐ ఫినిషర్ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో అక్షర్ పటేల్ తర్వాత దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక ఫినిషర్ అని పేర్కొని ఆరో స్థానంలో పంపకుండా.. అక్షర్ పటేల్ తర్వాత పంపడం ఏంటని విరుచుకుపడ్డారు. కార్తిక్ క్రీజులోకి వచ్చే సమయానికి పట్టుమని పది బంతులు కూడా ఉండడం లేదు. తొలి బంతినే హిట్టింగ్ చేయాలనడం కరెక్ట్ కాదు.. ఏ బ్యాటర్ అయినా కుదురుకోవడానికి రెండు, మూడు బంతులు తీసుకుంటాడు. మరి అలా చూసుకుంటే కార్తిక్కు అసలు కుదురుకోవడానికి టైం కూడా ఉండడం లేదు. ఇక ఫినిషర్ పాత్రకు ఎలా న్యాయం చేయగలడు. ఇదే విషయమై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' దినేశ్ కార్తిక్ను అవమానించాలని కాదు.. అసలు అతని రోల్ ఏంటనేది నాకు క్లారిటీ లేదు. ఫినిషర్ అనేవాడు పూర్తిస్థాయి బ్యాటర్స్ ఔటైన తర్వాత బరిలోకి దిగుతారు. కానీ ఆల్రౌండర్ తర్వాత కార్తిక్ బ్యాటింగ్కు రావడం అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇలా చేస్తే రోహిత్ స్ట్రాటజీ వర్క్వుట్ కాదు. అందుకోసం బ్యాటింగ్ ఆర్డర్లో కార్తిక్కు ప్రమోషన్ ఇవ్వాల్సిందే. టి20 ప్రపంచకప్ వరకు కార్తిక్కు ఇచ్చిన ఫినిషర్ రోల్ను సమర్థంగా వాడుకోవాలి.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్, బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం నాగ్పూర్ వేదికగా జరగనున్న రెండో టి20లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని టీమిండియా భావిస్తోంది. ఇక రెండో టి20 కోసం నాగ్పూర్ చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మినహా వాళ్లంతా వేస్ట్! అధిక బరువు కారణంగా.. కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త -
T20 World Cup 2022: పాకిస్తాన్ మెంటార్గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్..
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసంతమ జట్టు మెంటార్గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ను పిసిబీ నియమించింది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో కూగా హేడెన్ పాకిస్తాన్ మెంటార్గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించింది. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది టోర్నీలో పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతర సహాయక సిబ్బందితో కలిసి హేడెన్ పనిచేయున్నాడు. కాగా అతడు ఆక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో పాటు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో ఆడనుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్11న దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
"అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉంది.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడు"
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఇక మంగళవారం (మే 17) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో త్రిపాఠి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో త్వరలోనే భారత జట్టు తరపున త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. కాగా త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు త్రిపాఠి ఎంపికయ్యే అవకాశం ఉంది. "రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ధాటిగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంత గానే ఆకట్టుకుంది. అతడు విధ్వంసకర ఆటగాడు. బంతిని మైదానంలో అన్ని వైపులా కొట్టగలడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బౌలింగ్కు త్రిపాఠి అద్భుతంగా ఆడగలడు. అతడు త్వరలో భారత జట్టులోకి వస్తాడని నేను అశిస్తున్నాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్లపై ఆడే సత్తా త్రిపాఠికి ఉంది" అని హేడెన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: అతడి వల్లే సన్రైజర్స్కు విజయాలు.. బుమ్రా బౌలింగ్నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్కు ఎంపిక చేయండి! -
T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా
మాథ్యూ హేడెన్.. జస్టిన్ లాంగర్.. వీరిద్దరు ఒకప్పుడు ఆసీస్కు ఓపెనింగ్ జోడీ. 2000 దశకంలో వీరు ఆసీస్ క్రికెట్ను ఒక ఊపు ఊపేశారు. ప్రధానంగా టెస్టుల్లో ఈ జోడీ అత్యంత భయంకరమైన జోడీగా గుర్తింపు పొందింది. టెస్టుల్లో ఆసీస్కు అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా నిలిచింది. టెస్టు క్రికెట్లో ఈ జోడి ఆసీస్ తరఫున నాల్గో అత్యుత్తమ ఇన్నింగ్స్ను నమోదు చేయడం వారు సక్సెస్ఫుల్ జోడీగా చెప్పడానికి ఒక ఉదాహరణ. 2004లో శ్రీలంకపై చేసిన 255 పరుగుల వీరి తొలి వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ ముఖాముఖి పోరులో కాదు.. కోచ్లుగా అమీతుమీ తేల్చకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్లో భాగంగా మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటే, ఆసీస్కు జస్టిన్ లాంగర్ కోచ్గా ఉన్నాడు. కాగా, గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్పై ఆసీస్ విజయం సాధించడంతో లాంగర్దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్పై ఆసీస్ విజయం సాధించడంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 2010 తర్వాత టీ20 వరల్డ్కప్లో ఆసీస్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఓవరాల్గా ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్లో ఆసీస్ రెండుసార్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించింది. మరొకవైపు ఈ వరల్డ్కప్లో బ్యాటింగ్లో పాకిస్తాన్ రాణించడంతో హేడెన్ హీరో అయ్యాడు. తొలి మ్యాచ్ మొదలుకొని చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ పదును పెరిగింది. ఇది గత పాకిస్తాన్ క్రికెట్ జట్టేనే అన్నట్లుగా మెరిసింది. ఇందుకు హేడెన్ ప్రధాన కారణమనే చర్చ తెరపైకి వచ్చింది. హేడెన్ బ్యాటింగ్ వ్యూహాలతోనే పాకిస్తాన్ అద్బుతమైన ఫలితాలు సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 జట్లు తలపడే టీ 20వరల్డ్కప్లో పాక్ జట్టు సెమీస్కు చేరుతుందనే అంచనాలు పెద్దగా లేవు. 2019 వన్డే వరల్డ్కప్లో ఘోరమైన ప్రదర్శన కారణంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడమే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ పాకిస్తాన్ సెమీస్కు రావడమే కాకుండా, బెస్ట్ ఆఫ్ ఫోర్లో గట్టిపోటీ ఇచ్చింది. ఈ వరల్డ్కప్ సెమీ ఫైనల్లో తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు పాకిస్తాన్ ఫైనల్కు చేరుతుందని అంతా అనుకున్నారు. బోర్డుపై 177 పరుగుల టార్గెట్ను ఉంచడంతో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని భావించాడు. కానీ మాథ్యూ వేడ్, స్టోయినిస్ల మెరుపు ఇన్నింగ్స్లు ఆసీస్ను గెలిపించాయి. ఒకవేళ నిన్నటి మ్యాచ్లో పాకిస్తాన్ గెలుచుంటే ఆ క్రెడిట్ కచ్చితంగా హేడెన్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఆసీస్ ఫైనల్కు చేరడంతో మిత్రడు హేడెన్పై లాంగర్దే ఆధిక్యమైంది. దీంతో ‘ఎవరు గెలిస్తే ఏముంది’.. గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా అని హేడెన్ సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
హేడెన్కు ఖురాన్ను బహుకరించిన రిజ్వాన్.. పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mohammad Rizwan Gifts Holy Quran To Matthew Hayden: ఆసీస్ లెజెండరీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పర్యవేక్షనలో పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఇవాళ(నవంబర్ 11) రెండో సెమీ ఫైనల్స్లో భాగంగా బలమైన ఆసీస్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్, ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట రిజ్వాన్, పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్కు పవిత్ర ఖురాన్ యొక్క ఇంగ్లీష్ వర్షెన్ను బహుకరించాడు. ఈ విషయాన్ని హేడెనే స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పాక్ క్రికెట్ జట్టు యొక్క ఆధ్యాత్మిక సంస్కృతికి ఆకర్శితుడినయ్యానని, స్వతాహాగా క్రిస్టియన్నే అయినప్పటికీ ఇస్లాం పట్ల ఆసక్తితో ఉన్నానని వ్యాఖ్యానించాడు. రిజ్వాన్ తనకు ఇస్లాం విశ్వాసాల గురించి ఉపదేశిస్తుంటాడని.. అవి తనను బాగా ప్రభావితం చేశాయని.. ఈ క్రమంలో తాను కూడా క్రమం తప్పకుండా ఖురాన్ను చదవడం ప్రారంభించానని తెలిపాడు. ఈ సందర్భంగా హేడెన్ రిజ్వాన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిజ్వాన్ అసాధారణమైన బ్యాటర్ అని, అంతకుమించి ఛాంపియన్ హ్యుమన్ అని కొనియాడాడు. రిజ్వాన్ తనకు పవిత్ర కానుకను బహుకరించిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఇవాళ ఆసీస్తో జరగనున్న కీలక సెమీస్ సమరంలో రిజ్వాన్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. గత రెండు రోజులుగా రిజ్వాన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు పాక్ వర్గాల సమాచారం. చదవండి: Aus Vs Pak: పాకిస్తాన్దే విజయం.. చరిత్రను తిరగరాస్తుంది: టీమిండియా మాజీ క్రికెటర్ -
భారత్, పాక్ పోరుకు ఏదీ సాటి రాదు!
Matthew Hayden Comments On India- Pak match: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కనిపించే వైరానికి మరేదీ సాటి రాదని ఆ్రస్టేలియా మాజీ ఆటగాడు, పాక్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ అభిప్రాయ పడ్డాడు. ఆటగాడిగా తన కెరీర్లో యాషెస్ సమరాన్ని గొప్పగా భావించినా...ఒక ప్రేక్షకుడిగా చూసే కోణంలో భారత్, పాక్ మ్యాచ్పై ఉండే ఆసక్తి ఎక్కడా కనిపించదని అతను అన్నాడు. ఈ సారి భారత్పై పాక్ విజయం సాధిస్తుందని హేడెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్కీపర్ రిషబ్ పంత్ల నుంచే పాక్కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. కాగా అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో తలపడనుంది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్ -
ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్
Pakistan Has Major Threat From KL Rahul And Pant Says Matthew Hayden: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగబోయే హై ఓల్టేజ్ మ్యాచ్పై పాక్ బ్యాటింగ్ సలహాదారు, ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్కీపర్ రిషబ్ పంత్ల నుంచే పాక్కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. రాహుల్ ముప్పు నుంచి తప్పించుకుంటే.. రిషబ్ పంత్ రూపంలో మరో ఉపద్రవం కాసుకుని ఉంటుందని అలర్ట్ చేశాడు. వీరిద్దరూ ప్రత్యర్ధి ఎవరైనా విచక్షణారాహిత్యంగా విరుచుకుపడతారని, ఇది పాక్కు చాలా ప్రమాదమని, వీరిని త్వరగా పెవిలియన్కు పంపగలిగితే పాక్ సగం విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఇదే సందర్భంగా ఆయన పాక్ సారధి బాబర్ ఆజమ్పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజమ్ గొప్ప నాయకుడని.. ధోని, ఇయాన్ మోర్గాన్లా అతడు కూడా జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని అన్నాడు. భారత్, పాక్ మ్యాచ్ అంటే సహజంగానే ఇరు జట్ల కెప్టెన్లపై ఒత్తిడి ఉంటుందని, అయితే ఈసారి ఇది బాబర్పై కాసింత ఎక్కువగానే ఉందని పేర్కొన్నాడు. బాబర్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా భారత బౌలర్లు అతన్నే టార్గెట్గా చేసుకుంటారని, ఈ విషయంలో పాక్ సారధి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించాడు. కాగా, పాక్తో పోరుకు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ల్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో అక్టోబర్ 24న దాయాది పాక్ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్లో పాక్పై భారత్దే పైచేయిగా ఉంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాక్ చేతిలో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. చదవండి: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు -
ఐపీఎల్లో ధోనినే నా అత్యంత విలువైన ఆటగాడు...
Matthew Hayden Comments on Ms Dhoni Captaincy: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే ప్లేఆప్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్2021లో ఎంఎస్ ధోనీ తన అత్యంత విలువైన ఆటగాడని అతడు తెలిపాడు. ఐపీఎల్ రెండోదశలో ధోని కెప్టెన్సీ వ్యూహాల కారణంగా చెన్నై వరుస విజయాలు సాదిస్తుందని.. ఈ ఘనత పూర్తిగా అతడికే చెందుతుందని హేడెన్ ఆభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో ధోని రాణించక పోయినప్పటి తన చాణుక్య బుర్రతో ఆ జట్టును నడిపిస్తున్నాడని అతడు వెల్లడించాడు. ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ తన భుజాన వేసుకున్నాడు అని ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ వివరించాడు. అంతేగాక కెప్టెన్గా జట్టు ఎంపిక లో ధోని మార్క్ సృఫ్టంగా కనిపిస్తుందని హేడెన్ తెలిపాడు. కాగా చెన్నై దుబాయ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో నేడు తలపడనుంది. చదవండి: పాకిస్తాన్ హెడ్ కోచ్గా మాజీ దిగ్గజ ఆటగాడు! -
అతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan and Hayden Comments ON Venkatesh iyer: ఐపీఎల్ ఫేజ్2లో చేలరేగి ఆడుతున్న కోల్కతా నైట్రైడర్స్ యువ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్పై మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మాథ్యూ హెడెన్ కూడా వెంకటేష్ అయ్యర్ను అభినందించారు. భవిష్యత్తులో అయ్యర్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఎన్నో చూడవచ్చు అని పఠాన్ ప్రశంసించాడు. " తన మొదటి మ్యాచ్లో అయ్యర్ విశ్వరూపం చూపించాడు. అతడు కొన్ని షాట్లు, కవర్ డ్రైవ్లు బాగా ఆడాడు. భవిష్యత్తులో అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్లు ఆశించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ పోస్ట్-మ్యాచ్ షోలో భాగంగా ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ల బౌలింగ్ను అయ్యర్ అలవోకగా ఎదుర్కొన్నాడు అని పఠాన్ తెలిపాడు. మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఫన్నీగా అతడిని ప్రశంసించాడు. "అతడు క్రికెట్ ఆడటానికి తన తల్లి నుంచి అనుమతి పొందాడు. తల్లి మాట విన్న వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే మిత్రులారా.. మనమందరం అదే కోవకు చెందిన వాళ్లం కదా ”అని హేడెన్ చెప్పాడు. చదవండి: న్యూజిలాండ్, ఇంగ్లండ్లు పాక్ పర్యటన రద్దు చేసుకోవడంపై మండిపడ్డ ఆసీస్ ఓపెనర్ -
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం.. బ్యాటింగ్ కోచ్గా విధ్వంసకర ఓపెనర్
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్నకు ముందు పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కోచ్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇద్దరు విదేశీయులకు అవకాశం కల్పించింది. ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్ను బ్యాటింగ్ కోచ్గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పెరుపొందిన హెడెన్ 103 టెస్టులు, 161 వన్డేలు , 9 T20I లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజా... తన మొదటి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక టీ20 జట్టు ప్రకటించిన నాటి నుంచి పాక్ క్రికెట్లో ముసలం రేగిన సంగతి తెలిసిందే. తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్ హెడ్కోచ్ మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న ఇండియా, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: Gambhir: మనం ఇంకా రాహుల్ అసలైన బ్యాటింగ్ చూడలేదు.. -
Matthew Hayden: ఇండియా గురించి ఇష్టారీతిన మాట్లాడకండి!
సిడ్నీ: కోవిడ్-19పై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోందని, త్వరలోనే మహమ్మారిని తరిమికొట్టి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. స్థానిక పరిస్థితుల గురించి తెలియకుండా ఆ దేశం గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంటూ పరోక్షంగా విమర్శకులకు చురకలు అంటించాడు. ఈ ఆసీస్ ఆటగాడికి భారత్ అంటే ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు తానే ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు. ఇక ఇండియాను తన రెండో ఇల్లుగా భావించే హెడెన్, కరోనా సంక్షోభం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాకెన్నో పాఠాలు నేర్పిన దేశం పట్ల నాకెంతో ప్రేమ, సానుభూతి ఉన్నాయి. ఇండియాతో పాటు అక్కడి మనుషులతో నాకు ఏదో తెలియని బంధం ఉంది. భిన్న సంస్కృతుల సమ్మేళనం. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటే నాకేదో తెలియని చిరాకు, విసుగు పుడుతుంది. ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే, అత్యధిక జనాభా ఉన్న ఇండియా తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే, అక్కడి ప్రజలు చాలా దయగలిగిన వారు. ఇతరుల పట్ల ప్రేమానురాగాలు చూపిస్తారు. త్వరలోనే వారు మళ్లీ మునుపటి జీవితాన్ని గడుపుతారు. మూడు దశాబ్దాలుగా ఓ యాత్రికుడిగా, ఓ సోదరుడిగా వారి ఆప్యాయతను పొందుతున్నాను. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అలాంటి అందమైన దేశం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది సరికాదు. కరోనాపై పోరులో భారత్ బాగానే పనిచేస్తోంది. కఠిన సమయాల్లో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Ab De Villiers: వేరే లెవల్.. ధోని, కోహ్లి మాదిరిగానే! -
హెడెన్ నాతో 2-3 ఏళ్లు మాట్లాడలేదు.. బాధేసింది.. కానీ
న్యూఢిల్లీ: ఆటలో గెలుపోటములు సహజం. క్రీడా స్పూర్తితో ముందుకు సాగితే మైదానం వెలుపల ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతోనైనా ఇట్టే కలిసిపోవచ్చు. ముఖ్యంగా సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే అవి కెరీర్పరంగా కూడా ఉపయోగపడతాయి. కానీ, చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి దూరంగా ఉండాల్సి వస్తే బాధ పడటం సహజం. టీమిండియా వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్పకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీ20 వరల్డ్ కప్- 2007 నాటి మ్యాచ్లో భాగంగా చోటుచేసుకున్న స్లెడ్జింగ్ కారణంగా మ్యాథ్యూ హెడెన్తో చాలాకాలం పాటు అతడితో మాట్లాడలేకపోయానని ఊతప్ప తాజాగా వెల్లడించాడు. సౌరభ్ పంత్ యూట్యూబ్ షో.. ‘వేకప్ విత్ సౌరభ్’లో ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ ఆ మ్యాచ్లో గౌతీ(గౌతం గంభీర్), నేను.. ఆండ్రూ సైమండ్స్, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హాడిన్ స్లెడ్జింగ్ను తిప్పికొట్టాం. అయితే, ఒక వ్యక్తిగా, బ్యాట్స్మెన్గా నాకెంతో స్ఫూర్తిగా నిలిచిన మాథ్యూ హెడెన్తో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం కాస్త కష్టంగా తోచింది. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నన్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. నేను కూడా తనకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నాను. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అది అక్కడితో ముగిసిపోలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు, మూడేళ్ల పాటు అతడు నాతో మాట్లాడలేదు. నాకు దూరంగా ఉండేవాడు. అది నన్ను చాలా బాధించింది. ఆ మ్యాచ్లో మేం గెలిచాం. కానీ, నా రోల్మోడల్తో మాట్లాడే అవకాశం కోల్పోయాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, తన కెరీర్లోనే అత్యంత గొప్పదైన మ్యాచ్ అదేనని, ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించామని గుర్తుచేసుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోని సేన ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్లు ఆడిన ఊతప్ప వరుసగా 934, 249 పరుగులు చేశాడు. చదవండి: 10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్ -
సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు ఆడుంటే
బ్రిస్బేన్: 1988 నుంచి 32 ఏళ్ల పాటు బ్రిస్బేన్ మైదానంలో ఓటమెరుగని ఆసీస్కు టీమిండియా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ ఓడిపోవడంపై మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయం ప్రకారం బోర్డర్ గవాస్కర్ ట్రోపీని గబ్బాలో మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఆతిథ్య జట్టుకు 2-1తేడాతో పరాభవం జరిగేదికాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్ 'ప్రతీ ఏడాదిలో సమ్మర్ సీజన్లో ఆసీస్ ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా.. గబ్బా వేదికగానే ఆరంభమవుతుంది. కానీ ఈసారి ఆ రూల్కు సీఏ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఒకవేళ గబ్బాలో మొదటిటెస్టు జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆసీస్కు గబ్బా వేదిక బాగా కలిసొచ్చిన మైదానం.. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు. ఇక్కడ తొలి మ్యాచ్ జరగుంటే ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేది. కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ను అడిలైడ్లో ప్రారంభించింది. అంతేగాక టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడాల్సి ఉండేది.. దీంతో పాటు పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్(వాకా) మైదానంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అంటూ తెలిపాడు. -
నా దృష్టిలో అతడే గొప్ప.. కానీ నా ఓటు కోహ్లికే!
సిడ్నీ: గత దశాబ్ద కాలంగా టీమిండియాను ప్రభావితం చేస్తున్న ఆటగాళ్ల గురించిన చర్చలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మూడు ఐసీసీ ట్రీఫీలను భారత్కు అందించి విజయవంతమైన కెప్టెన్గా ధోని ముద్ర వేస్తే.. కోహ్లి క్రీజులో ఉంటే చాలు గెలుపుపై నిశ్చింతగా ఉండొచ్చు అనేలా రన్మెషీన్ అనేకానేక అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. వికెట్ కీపర్గా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో మిస్టర్ కూల్ ఖ్యాతికెక్కితే.. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్గా కోహ్లి నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక బెస్ట్ క్రికెటర్గా వీరిద్దరిలో ఒకరికే ఓటు వేయాలంటే చాలా మంది ఎటూ తేల్చులేకపోతారు. అభిమానుల విషయం పక్కనపెడితే, క్రికెట్ ప్రేమికులు మాత్రం ఈ చర్చలో ఎటువైపు నిలబడాలో తెలియక సతమతమవుతారు. అయితే తాను మాత్రం ఇందుకు మినహాయింపు అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. (చదవండి: దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్) భారత్కు వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టిన కెప్టెన్ కూల్ ధోనీనే తన దృష్టిలో గొప్ప ఆటగాడు అని స్పష్టం చేశాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన హెడెన్.. ‘‘ఎంఎస్ ధోని ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. వరల్డ్ కప్ సాధించడం అనేది ఒక ఆటగాడి జీవితంలో అతి పెద్ద మైలురాయి. వన్డే ఫార్మాట్లో ఎన్ని మ్యాచ్లు ఆడినా, ఈ మెగా టోర్నీ విషయానికొచ్చేసరికి ఏవిధంగా సన్నద్ధమయ్యామనేదే ముఖ్యం. ఆ సమయంలో కేవలం ఒక మంచి నాయకుడిగా ఉంటే మాత్రమే సరిపోదు. ధోనిలాగా మిడిలార్డర్లో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్గా కూడా ఉండాలి’’ అని చెప్పుకొచ్చాడు. నా దృష్టిలో అయితే కోహ్లినే టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాత్రం కోహ్లికే ఓటు వేయడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది అతడే అని తేల్చిచెప్పాడు. క్రికెట్ కనెక్టెడ్ షోలో వీరిద్దరు ఈ మేరకు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లి సైతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు. ధోని నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టు క్రికెట్లో భారత జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. -
‘అక్తర్ నన్ను చంపుతానన్నాడు’
సిడ్నీ: ప్రపంచ క్రికెట్లో స్లెడ్జింగ్ విషయంలో ఆస్ట్రేలియాకు ఆ జట్టే సాటి. ప్రత్యర్థి జట్టును ముందుగానే తన వ్యాఖ్యలతో భయపెట్టడంలో కానీ, ఫీల్డ్లో దిగాక స్లెడ్జ్ చేయడంలో కానీ ఆసీస్ క్రికెటర్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. ఇందులో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ బాగా ఆరితేరిన వాడు. అయితే అదే హేడెన్ను పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ భయపెట్టాలని చూశాడట. 2002లో యూఏఈలో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా తనను చంపుతానని అక్తర్ భయపెట్టిన విషయాన్ని హేడెన్ చెప్పకొచ్చాడు. అయితే దీన్ని ఘనంగా తాను స్వాగితించినట్లు హేడెన్ తెలిపాడు.(‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’) ఇది మ్యాచ్కు ముందు ఒకానొక సందర్భంలో జరగిందని హేడెన్ తెలిపాడు. కాగా, మ్యాచ్ మొదలయ్యాక అక్తర్ బౌలింగ్ రనప్ తీసుకునే క్రమంలోనే తిట్ల దండకం అందుకునే వాడన్నాడు. అయితే ఇలా రనప్ చేస్తూ బ్యాట్స్మన్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి యత్నించిన అక్తర్పై ఫిర్యాదు చేయడమే కాకుండా అతనికి 18 బంతులు సమయం కూడా ఇచ్చినట్లు తెలిపాడు. తనను చంపుతానన్న చాలెంజ్కు మూడు ఓవర్ల సమయం ఇచ్చినట్లు తెలిపాడు. తనను ఔట్ చేసి విమానం గాల్లో ఎగిరినట్లు సంబరాలు చేసుకో అని సూచింనట్లు కూడా తెలిపాడు. తన దృష్టిలో అక్తర్ ఒక బి-గ్రేడ్ యాక్టర్ అని హేడెన్ తెలిపాడు. అయితే బౌలింగ్ రనప్ చేస్తూ దూషించడాన్ని తీవ్రంగా పరిగణించానన్నాడు. అప్పుడు అంపైర్గా ఉన్న వెంటకరాఘవన్కు విషయాన్ని సీరియస్గా వివరించానన్నాడు. గేమ్లో ప్రతీది ఇస్తా. ప్రతీ దానికి కట్టుబడి ఉంటా. కానీ ఏది చేసినా గేమ్ ప్రొటోకాల్కు లోబడే ఉండాలి. నువ్వు పరుగెడుతూ దూషించడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. నేను అంతకంటే ఎక్కువ చేస్తా. నాకు అక్తర్తో సమస్య ఉంది’ అని చెప్పినట్లు హేడెన్ తెలిపాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హేడెన్ 119 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఆ మ్యాచ్ను ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. -
‘ఆ బ్యాట్తో ధోని ఆడొద్దన్నాడు’
సిడ్నీ: తనకు నచ్చిన ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్ గురించి చెన్నై సూపర్ ఇన్నింగ్స్(సీఎస్కే)ఆటగాడు సురేశ్ రైనా ఇటీవల చెబుతూ.. ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ బ్యాట్ నుంచి 2010లో వచ్చిన అద్భుతమైన ఇన్నింగ్సేనని చెప్పాడు. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో హేడెన్ 43 బంతుల్లో 7 సిక్స్లు, 9 ఫోర్లతో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఆ మ్యాచ్లో సీఎస్కే ఘన విజయం సాధించింది. అదే తన ఫేవరెట్ ఐపీఎల్ మూమెంట్ అని రైనా చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఇన్నింగ్స్ను ఆడిన క్రమంలో మంగూస్ బ్యాట్ను ఉపయోగించాడు హేడెన్. పొడవాటి హ్యాండిల్తో పాటు ఆ బ్యాట్ బ్లేడ్ కుదించినట్లు ఉండటమే దీని ప్రత్యేకత. చాలా సందర్భాల్లో మంగూస్ బ్యాట్ను ఉపయోగించి హేడెన్ సక్సెస్ అయ్యాడు. కాగా, ఆ సమయంలో ఢిల్లీతో చెలరేగిపోయిన ఆ బ్యాట్ను ఉపయోగించవద్దన్నాడట సీఎస్కే కెప్టెన్ ధోని. ఈ విషయాన్ని తాజాగా హేడెన్ స్పష్టం చేశాడు. దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో హేడెన్ గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ తర్వాత మంగూస్ బ్యాట్ను ఉపయోగించడానికి ధోని ఒప్పుకోలేదు. ఆ బ్యాట్ను ఎంతమాత్రం ఉపయోగించవద్దన్నాడు. నీ కోసం ఏమైనా ఇస్తాను కానీ దాన్ని మాత్రం వాడద్దని ధోని సూచించాడు. (నా ఫేవరెట్ ఐపీఎల్ మూమెంట్ అదే: రైనా) ఇది రిస్క్తో కూడుకున్న అంశం కాబట్టే ధోని అలా చెప్పాడు. నా ఫ్రాంచైజీని కష్టాల్లోకి నెట్టడం ఇష్టంలేక ధోని సూచనను పాటించా. దాదాపు ఏడాదిన్నర కాలం మంగూస్ బ్యాట్ను ప్రాక్టీస్లో ఉపయోగించా. ఆ బ్యాట్ 20 మీటర్లు ముందుకు ఉంటుంది. పొడవైన హ్యాండిల్ ఉండటంతో బంతిని ముందుగానే హిట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్యాట్తో ప్రమాదం కూడా ఎక్కువే. అంచనా తప్పితే ఔట్ కాక తప్పదు. ఇదే విషయాన్ని ధోని ఒక్క మాటలో వాడొద్దని చెప్పాడు. నా ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురి చేయకూడదని ఉద్దేశంతో దాన్ని వినియోగించడం ఆపేశా. మంగూస్ బ్యాట్ను ఉపయోగించడం కచ్చితంగా సాహసోపేత నిర్ణయమే. నా గేమ్ను మెరుగవుతుందనే దీన్ని ఉపయోగించా. ఆ బ్యాట్తో ఆడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. మంగూస్ బ్యాట్తో ఆడటం నాకు చాలా ఇష్టం. ఆ బ్యాట్తో ఆడటం సరదాగా ఉంటుంది. ఇంటి దగ్గర మాత్రం మంగూస్ బ్యాట్తో ప్రాక్టీస్ చేసేవాడిని’ అని హేడెన్ తెలిపాడు. ఈ వీడియోను సీఎస్కే తన అధికారికి ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.(ఆడొచ్చు కానీ... మజా ఉండదు) #Thala Dhoni to Haydos: "I'll give you anything you want in life, to not use this bat! Please do not use this bat!" 😂🦁💛 @HaydosTweets #AnbuDenLions @RuphaRamani pic.twitter.com/Hm5wSCzLWH — Chennai Super Kings (@ChennaiIPL) May 8, 2020 -
నా ఫేవరెట్ ఐపీఎల్ మూమెంట్ అదే: రైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరగడం అనేది డైలమాలో పడింది. ప్రస్తుతం క్రికెటర్లంతా ఇంట్లోని ఉంటూ ఏదొక ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకంగా లాక్డౌన్ రోజుల్ని ఆస్వాదిస్తూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఆడిన ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ మై ఐపీఎల్ మూమెంట్ హాష్ ట్యాగ్తో సురేశ్ రైనాకు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన రైనా.. ఐపీఎల్లో నచ్చిన ఇన్నింగ్స్ గురించి చెబుతూ పదేళ్ల నాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నాడు. 2010లో అప్పుడు ఢిల్లీ డేర్డెవిల్స్ పేరుతో ఉన్న జట్టుపై హేడెన్ చేసిన 93 పరుగుల్నితన ఫేవరెట్ ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్గా రైనా చెప్పాడు. (ఐపీఎల్ కన్నా ప్రాణం మిన్న) ఆ మ్యాచ్లో మంగూస్ బ్యాట్ను ఉపయోగించిన హేడెన్ 43 బంతుల్లో 7 సిక్సర్లు, 9 ఫోర్లతో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. ఇది తన ఓవరాల్ ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్ అన్నాడు. ఆ మ్యాచ్కు సారథిగా ఉన్న రైనా 49 పరుగులు చేశాడు. ‘ ఆ మ్యాచ్లో మనం మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. నేను 49 పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్గా కూడా ఉన్నా. మనం గెలుస్తామనే నమ్మకాన్ని కల్పించావు హేడెన్. అది నీ బ్యాట్ నుంచి వచ్చిన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్. ఆరోజు మీ సంతకం చేసిన ఇచ్చిన బ్యాట్ ఇంకా నాతోనే ఉంది. ఆ విషయం గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నా’ అని రైనా పేర్కొన్నాడు.(కోచ్ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా?) -
కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్
ముంబై : మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాభవం మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హేడెన్ కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రసుత్తం హెడెన్ కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 'విరాట్ కోహ్లి ఇప్పటివరకు 243 మ్యాచ్లు ఆడగా అందులో 180 ఇన్నింగ్స్ల్లో మూడో స్థానంలో ఆడి 63.09 స్ర్టైక్ రేట్తో 10వేల పరుగులకు పైగా సాధించాడు. అతనికి అచ్చి వచ్చిన స్థానం నుంచి కోహ్లి ఎందుకు తప్పుకోవాలి. అందరూ భారత ఓటమి గురించే మాట్లాడుతున్నారు గానీ ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కోసం కోహ్లి తన స్థానాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందే' అంటూ హేడెన్ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్లో రోహిత్కు విశ్రాంతి కల్పించడంతో ధావన్,రాహుల్లు ఓపెనింగ్లో రాగా కోహ్లి మూడో స్థానంలో వచ్చాడు. అయితే లంకతో జరిగిన సిరీస్లో రాహుల్తో పాటు జట్టులో పునరాగమనం చేసిన ధావన్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో రాహుల్, ధావన్లలో ఎవరికి చోటు కల్పించాలనేదానిపై సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇక చేసేదేంలేక కోహ్లి తన మూడో స్థానాన్ని రాహుల్కు ఇచ్చేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 1751 పరుగులు చేశాడు. దీంట్లో 7 శతకాలు, 8అర్థశతకాలు ఉన్నాయి. 2015 నుంచి 6సార్లు నాలుగోస్థానంలో బరిలోకి దిగిన కోహ్లి అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఆరు ఇన్నింగ్స్ల్లో వరుసగా 9,4, 3, 11, 12, 7, 16 పరుగులు చేశాడు. -
చెన్నై వీధుల్లో హేడెన్ మారువేషంలో ఇలా..!
-
చెన్నై వీధుల్లో హేడెన్ ఇలా..!
చెన్నై: ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ విసిరిన సవాల్ను చాలెంజ్గా స్వీకరించాడు ఆ దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్. ప్రస్తుత ఐపీఎల్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న హేడెన్.. చెన్నై టి.నగర్లో మారువేషంలో షాపింగ్ చేశాడు. తెల్ల పట్టు లుంగీ, లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించడంతోపాటు తనను ఎవరూ గుర్తు పట్టకుండా గడ్డం పెట్టుకున్న హేడెన్ షాపింగ్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం చెన్నైలో షాపింగ్ చేయాలంటూ హేడెన్ను వార్న్ సవాల్ చేశాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న హేడెన్.. ఇలా షాపింగ్ చేసి చూపించాడు. -
‘ఆ స్పిన్నరే ప్రమాదకరం’
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లు రెగ్యులర్ స్పిన్నర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో ఎవరు అత్యుత్తమం అనే విషయంపై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ స్పందించాడు. చహల్ కంటే కుల్దీప్ యాదవ్ ఎక్కువ ప్రమాదకరమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. గాల్లోనే బంతి దిశను మార్చే కుల్దీప్ యాదవ్ చాలా ప్రమాదకరమైన స్పిన్నర్గా హేడెన్ పేర్కొన్నాడు. ‘ఆఫ్ స్పిన్నర్లకన్నా లెగ్ స్పిన్నర్లకు వైవిధ్యంగా బౌలింగ్ చేసే అవకాశమెక్కువ. షేన్ వార్న్ తరహాలో బంతిని గాల్లోనే దిశ మార్చేలా బౌలింగ్ చేయగల సత్తా కుల్దీప్ సొంతం. ఇదే అతడి ప్రధాన బలం. ఇక, చహల్ ఎక్కువగా వికెట్ టు వికెట్ బంతులు విసిరేందుకు ఇష్టపడతాడు. కానీ కుల్దీప్లాగా గాల్లోనే బంతి దిశను మార్చలేడు. అందుకే నేనిప్పుడు ఆడి ఉంటే చహల్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకే ఇష్టపడతా. నా దృష్టిలో కుల్దీప్ను ఆడటం కష్టం’ అని అన్నాడు. -
‘పాండ్యా కన్నా మావాడే బెటర్’
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే మాటల యుద్దం. అందులోనూ స్వదేశంలో ఘోర ఓటమి అనంతరం టీమిండియా పర్యటన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు కవ్వింపులకు దిగుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కోహ్లి సేనకు ఆసీస్ ఆటగాళ్లతో ఇబ్బందులు తప్పవంటున్నాడు. ముందుగా ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్పై ప్రశంసల జల్లు కురిపించాడు. స్వదేశమైనా, విదేశమైనా తనదైన రీతిలో రెచ్చిపోవడమే స్టోయినిస్కు తెలుసంటూ కితాబిచ్చాడు. ఈ సందర్భంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రస్తావిస్తూ.. పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. పాండ్యా ఇంకా మెరుగుపడాలని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవరుచుకోవాలని హెడెన్ సూచించాడు. ధవన్కు ఇబ్బందులు తప్పవు.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కు ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్తో ఇబ్బందులు తప్పవని ఈ ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు హెచ్చరించాడు. కమిన్స్ తన వైవిద్య బంతులతో ధవన్ను బోల్తా కొట్టిస్తాడనన్నాడు. స్వింగ్, షార్ట్ పిచ్ బంతులు ఆడటంలో పరిణితి సాధించాలని ధవన్కు సూచించాడు. అయితే భారత్ మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. చహల్తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్కు ఇబ్బందేనని వివరించాడు. భారత్ పిచ్లపై మ్యాక్స్వెల్ రాణించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఈ యువ స్పిన్నర్ 40 వన్డేల్లో 71 వికెట్లు, 29 టీ20ల్లో 45 వికెట్లు తీశాడని.. దీంతోనే చహల్ ప్రతిభ అర్థమవుతుందని హెడెన్ తెలిపాడు. ఇక భారత్ పర్యటనలో ఆసీస్ జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ నెల 24న తొలి టీ20 జరగనుంది. స్వదేశంలో ఆసీస్పై సిరీస్లు గెలిచి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్లోకి అడుగుపెట్టాలని కోహ్లిసేన భావిస్తుండగా.. స్వదేశంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ జట్టు ఆరాటపడుతోంది. -
సెహ్వాగ్కు కౌంటర్ ఇచ్చిన హేడెన్
మెల్బోర్న్: బేబీ సిట్టర్.. ఈ మధ్య క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం ముమ్మాటికీ రిషభ్ పంతే. ఇటీవల ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు పంత్ బేబీ సిట్టర్ పేరుతో హాట్ టాపిక్గా మారాడు. దీనిపై ఏకంగా స్టార్ స్పోర్ట్స్ యాడ్ తీసేసింది. ఇందతా టీమిండియా కోసమే అనుకోండి. ఈ నెల చివర్లో భారత పర్యటనకు ఆసీస్ రానున్న తరుణంలో ఈ యాడ్ను రూపొందించింది స్టార్ స్పోర్ట్స్. అందులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్ అవతారం ఎత్తాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ రెండు రోజుల క్రితం యూట్యూబ్లో, సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కాగా, దీనిపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధానంగా ఆసీస్ జట్టు జెర్సీలతో యాడ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. వరల్డ్కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా స్పందించిన హేడెన్.. యాడ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ను, యాడ్ రూపొందించిన స్టార్ స్పోర్ట్స్లను ట్యాగ్ చేశాడు. #BeWarned Never take Aussie’s for a joke Viru Boy @virendersehwag @StarSportsIndia Just remember who’s baby sitting the #WorldCup trophy https://t.co/yRUtJVu3XJ — Matthew Hayden AM (@HaydosTweets) 11 February 2019 -
హేడెన్ గాయాన్ని తమిళనాడు మ్యాప్తో పోల్చాడు..
కేప్టౌన్: ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తలకు అయిన గాయంపై విభిన్నంగా స్పందించాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్. మాథ్యూ హేడెన్ గాయాన్ని తమిళనాడు మ్యాప్తో పోల్చాడు రోడ్స్. ‘హేడెన్... నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా? బుడ్డీ నిజమైన నిబద్ధత కలిగి ఉన్నావ్.. నిన్ను అనుసరించి కొంతమంది అదే విధంగా టాటూలు వేసుకునే అవకాశం ఉంది’ అని హేడెన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోకు కామెంట్ చేశాడు. తమిళనాడుతో హేడెన్కు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన హేడెన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దీన్ని ఉదాహరిస్తూ జాంటీ రోడ్స్ కామెంట్ చేశాడు. గత శుక్రవారం హేడెన్ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్లాండ్ దీవులకు హాలిడే ట్రిప్కు వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్బ్రోక్ ఐస్ల్యాండ్లో తన కొడుకు జోష్తో కలిసి సరదాగా సర్ఫింగ్ గేమ్ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ విషయాన్ని హేడెన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్స్టాగ్రామ్లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘జోష్తో సర్ఫింగ్ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగ్మెంట్స్ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటా’ అని పేర్కొన్నాడు. -
తీవ్రంగా గాయపడ్డ ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీక్రికెటర్, విధ్వంసకర బ్యాట్స్మన్ మాథ్యూ హెడెన్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం హెడెన్ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్లాండ్ దీవులకు హాలిడే ట్రిప్ వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్బ్రోక్ ఐస్ల్యాండ్లో తన కొడుకు జోష్తో కలిసి సరదాగా సర్ఫింగ్ గేమ్ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ విషయాన్ని హెడేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్స్టాగ్రామ్లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘జోష్తో సర్ఫింగ్ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను.’అని పేర్కొన్నాడు. ఆసీస్ తరపున 103 వన్డేలు, 161 టెస్ట్లు, 9 టీ20లాడిన హెడెన్ 2009లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్ 2008లో భారత్తో తన చివరి వన్డే ఆడాడు. View this post on Instagram Ok. Last attention seeking post I promise. Just wanted to say a big thank you to all our mates on Straddie who have been so supportive.✅🏄🏽♂️🙏 Especially Ben & Sue Kelley for the fast diagnosis with MRI, CT scan. Fractured C6, torn C5,C4 ligaments safe to say I truly have dodged a bullet. Thank you everyone ❤️ On the road to recovery 🏄🏽♂️🎣 A post shared by Matthew Hayden (@haydos359) on Oct 7, 2018 at 3:44am PDT -
‘అందుకే రషీద్ ఖాన్ విఫలం’
బెంగళూరు: ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. భారత్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో విఫలం కావడంపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ స్పందించాడు. అసలు రషీద్ ఎందుకు వైఫల్యం చెందాడో అనే దానిపై విశ్లేషించాడు. ‘టెస్టు క్రికెట్ అనేది లాంగెస్ట్ పార్మాట్. ఈ ఫార్మాట్లో ముందుగా పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పరిమిత ఓవర్ల క్రికెట్కు, టెస్టు క్రికెట్కు చాలా తేడా ఉంటుంది. సాంప్రదాయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి చాలా ఓర్పు కావాలి. ఇక్కడ మొదటి రోజు నుంచి బౌలింగ్తో ఎటాక్ చేయడం సరికాదు. ఎప్పుడైతే బంతిని రషీద్ అందుకున్నాడో ఆ క్షణమే దూకుడుగా బౌలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అందులోనూ రషీద్కు తొలి టెస్టు పిచ్. అటువంటప్పుడు సాంప్రదాయరీతిలో బౌలింగ్ను ఆరంభిస్తే బాగుండేది. దూకుడుతో కూడిన బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నాడు’ అని మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ చెత్త రికార్డు -
ధోని చాలా డిస్టర్బ్ చేశాడు
సాక్షి, బెంగుళూరు: చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఎంఎస్ ధోని, అంబటి రాయుడు సిక్సర్లతో చెలరేగిపోయారు. ధాటిగా ఆడి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 5 వికెట్ల తేడాతో చైన్నై జట్టు అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్కే జట్టుపై అభిమానులు, క్రికెట్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక చాలాకాలం తర్వాత సిక్సర్ల మోత మోగించి జట్టుకు అనూహ్య విజయాన్నందించిన ‘మిస్టర్ కూల్’ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ధోని వీరోచిత హిట్టింగ్పై ట్వీటర్లో కామెంట్లు చేశాడు. ‘ఓరి దేవుడా కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కల్గించారు. చైన్నైకి అద్భుత విజయాన్ని అందించారు. కానీ నా నిద్ర మాత్రం డిస్టర్బ్ అయ్యింది. ఎంతైనా ఎంఎస్ ధోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్ వేయాల్సిందే...(విజిల్ పోడు)’ అంటూ హెడెన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అంబటి రాయుడి విజృంభణ ఈ ఐపీఎల్ సీజన్ చివరి వరకు కొనసాగుతుందంటూ హెడెన్ ఆకాంక్షించారు. Oh my God....please let me sleep🙏 why did you have to make @ChennaiIPL so awesome, @msdhoni the real universe boss and @RayuduAmbati Mr Iceman you have me so excited for the rest of this years @IPL I can’t sleep #WhistlePodu #unbelievable @StarSportsIndia — Matthew Hayden AM (@HaydosTweets) April 25, 2018 -
'ఆ సపోర్ట్ భజ్జీ కంటే కూడా అశ్విన్కే ఉంది'
న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఎనిమిది వికెట్లతో ఆకట్టుకున్న భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మూడొందల టెస్టు వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్ గా రికార్డు సాధించాడు. ఒక ఆఫ్ స్పిన్నర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తనదైన మార్కును చూపెడుతున్న అశ్విన్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా అశ్విన్ ను ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ కొనియాడుతూ.. మరో నాలుగైదేళ్ల పాటు అతను ఆడితే క్రికెట్ గ్రేట్ జాబితాలో చేరిపోవడం ఖాయమన్నాడు. అయితే ఆఫ్ స్పిన్నర్లతో పోలిస్తే అశ్విన్ కంటే కూడా హర్భజనే అత్యంత ప్రభావం చూపిన బౌలర్గా హేడెన్ అభివర్ణించాడు. 'అశ్విన్ ఒక గొప్ప స్పిన్నర్.. అందులో ఎటువంటి సందేహం లేదు. మూడొందల టెస్టు వికెట్లను వేగవంతంగా సాధించిన అశ్విన్ నిజంగా అభినందనీయుడే. హర్బజన్ తరహాలో అశ్విన్ కూడా ఒక స్పిన్ మాస్టర్. కాకపోతే అశ్విన్లో హర్భజన్ వంటి దూకుడు లేదు. హర్బజన్ ఆడే రోజుల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించేవాడు. ప్రధానంగా మాతో జరిగిన మ్యాచ్ల్లో హర్భజన్ ఆడకపోతే భారత జట్టు ఇబ్బందుల్లో పడేది. ఆ సమయంలో భారత విజయాల్ని హర్భజన్ భుజ స్కందాలపై మోసేవాడు. ఆనాడు హర్భజన్కు సరైన ఫాస్ట్ బౌలింగ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు అశ్విన్ కు చక్కటి ఫాస్ట్ బౌలింగ్ సహకారం మెండుగా ఉంది. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో మొహ్మద్ షమీ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, బూమ్రా వంటి పేసర్లు ఉన్నారు. వీరంతా అశ్విన్ తన పని తాను చేసుకుపోవడానికి ఉపయోగపడుతున్నారు. దాంతో ఫాస్ట్ బౌలర్ల సహకారం హర్భజన్ కంటే కూడా అశ్విన్కు ఉందనే చెప్పాలి. ఈ కారణం చేత భజ్జీ తరహాలో దూకుడైన బౌలింగ్ అశ్విన్ కు అవసరం లేదు'అని హేడెన్ విశ్లేషించాడు. -
ఆ క్రికెటర్ను గాయపర్చడం ఎంతో ఇష్టం: అక్తర్
ఇస్లామాబాద్: క్రికెట్ ప్రపంచంలో ఫాస్ట్బౌలర్లలో పాకిస్తాన్ ప్లేయర్, 'రావల్పిండి ఎక్స్ప్రెస్'గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ ఒకడు. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధిస్తూ దిగ్గజ క్రికెటర్లను సైతం పలుమార్లు గాయాలపాలు చేసేవాడు అక్తర్. ఇంకా చెప్పాలంటే అతడి కెరీర్లో దాదాపు 19 మంది బ్యాట్స్మెన్ గాయపడి డ్రెస్సింగ్ రూముకు వెళ్లిపోయారట. క్రికెట్ హిస్టరీలోనే అంతమంది క్రికెటర్లను రిటైర్డ్ హర్ట్గా పంపించిన బౌలర్ అతడే కావడం అక్తర్ బౌలింగ్ దాడిని తెలుపుతుంది. క్రికెట్ నుంచి రిటైరైన చాలా రోజుల తర్వాత పాక్ ప్లేయర్ కొన్ని విషయాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లను గాయపర్చడం తనకెంత మాత్రం ఇష్టం ఉండదని అక్తర్ తెలిపాడు. అయితే తన కెరీర్లో ఒక క్రికెటర్ను మాత్రం గాయపర్చాలని తాపత్రయ పడేవాడినని వెల్లడించాడు. ఆ బ్యాట్స్మెన్ మరోవరో కాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. 'బ్యాట్స్మెన్లను గాయపర్చడం నాకు ఇష్టం ఉండదు. కానీ మాథ్యూ హెడేన్ను మాత్రం గాయాలపాలు చేయడం నాకిష్టం. ప్రాక్టీస్ మ్యాచ్లు, టెస్లులలో ఎన్నోసార్లు అనుకున్నది సాధించాను. ప్రస్తుతం మాత్రం మేమిద్దరం మంచి మిత్రులమని' తన ట్వీట్లో అక్తర్ పేర్కొన్నాడు. It was Matthew Hayden I wanted to hit badly during my playing days & I did that many times during test & practice games&now we r best mates. — Shoaib Akhtar (@shoaib100mph) 25 July 2017 But now we are best of friends now & I think he's 1 of the most generous & kind human being I ever met is Matthew Hayden. — Shoaib Akhtar (@shoaib100mph) 25 July 2017 -
ఆధునిక భారత ముఖచిత్రం..‘కోహ్లీ’
చెన్నై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధునిక భారత్ ముఖ చిత్రమని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను పోల్చమని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హెడెన్ కోహ్లీ, స్మిత్లను పోల్చడం కష్టమేనని, ఇద్దరూ సహజ సిద్దమైన ఆటగాళ్లేనని వ్యాఖ్యానించాడు. ఇరు జట్లకు బలమైన నాయకులన్న హెడెన్. కెప్టెన్సీలో మాత్రం తేడా ఉందన్నాడు. ఆసీస్ క్రికెటర్ల సమస్య గురించి ప్రస్తావించగా త్వరలోనే సమస్య పరిష్కారమవుతందని భావిస్తున్నాని తెలిపాడు. టెస్టులు క్రికెట్కు చాల ముఖ్యమైనవని, ఐసీసీ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలియదు కానీ క్రికెట్ మనుగడకు అవి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇక టెస్టులకు టీ20ల ముప్పు అన్న వాదనను హెడన్ కొట్టిపారేశాడు. ఏ ఫార్మాట్ అభిమానులు ఆ ఫార్మాట్ను ఆదరిస్తారని వారిని దృష్టిలో ఉంచుకోని ఐసీసీ ప్రణాళికలు చేయాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించిన ఈ ఆసీస్ క్రికెటర్, జట్టు తిరిగి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు పెద్ద అభిమాని అని.. రెండు సంవత్సరాలుగా ఆజట్టు దూరమవ్వడం ఎంతగానో నిరాశపరిచిందని హెడన్ చెప్పుకొచ్చాడు. పాక్ చాంపియన్స్ ట్రోఫి గెలవడం అంతుపట్టని అంశమని భారత్పై పాక్ గెలుస్తుందని ఊహించలేదని హెడన్ వాపోయాడు. -
విరాట్ కు ఆసీస్ దిగ్గజం మద్దతు
సిడ్నీ: రెండో టెస్టు సందర్భంగా ఆసీస్ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వైఖర్ని ఆ దేశంలోని పలువురు క్రికెటర్లతో పాటు అక్కడి మీడియా తీవ్రంగా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు అదే టెస్టులో ఆసీస్ ఓపెనర్ రెన్ షాను 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ కు దిగిన విరాట్ కోహ్లిపై ఆ దేశ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ నుంచి అనూహ్య మద్దతు లభించించింది. ప్రధానంగా విరాట్ తన చర్యలతో గౌరవాన్ని కోల్పోతున్నాడంటూ ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ వ్యాఖ్యలతో హేడెన్ విభేదించాడు. క్రమశిక్షణ, టెంపర్మెంట్, బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ వంటి అనేక విషయాలు ఆటలో ముడి పడి ఉంటాయని హేడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అవన్నీ ఆటలో భాగంగానే చూడాలని హేడెన్ పేర్కొన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక గుర్తింపు పొందిన ఆటగాడు గౌరవం కోల్పోవడం ఉండదని తన అభిప్రాయంగా పేర్కొన్నాడు. ఆ గేమ్ లో విరాట్ శ్రుతి మించి వ్యవహరించలేదన్నాడు. తాను ఎప్పుడూ ఆడినా దూకుడుగా ఉంటూ ప్రత్యర్ధి ఆటగాళ్ల నుంచి గౌరవాన్ని సంపాదించుకునే వాడినని, విరాట్ విషయంలో కూడా ఇప్పడు అదే జరుగుతుందని హేడెన్ తెలిపాడు. తమతో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు కించపరిచే విధంగా ఉందని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి ఆటగాడ్ని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం అగౌరపరచడమేనని విమర్శించాడు. దాంతో పాటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నాడు. ఈ తరహా మాటల యుద్ధానికి విరాట్ ఫుల్ స్టాప్ పెట్టి.. తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందన్నాడు. ఒత్తిడికి లోనవుతున్న విరాట్ తన గౌరవాన్ని కూడా కోల్పోతున్నట్లు కనబడుతుందని హేలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. -
వారిద్దరే మార్చేశారు: గంగూలీ
కోల్ కతా: క్రికెట్ మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్ పై టీమీండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ టెస్టు క్రికెట్ లో బ్యాటింగ్ నిర్వచనం మార్చేశారని ఓ టాక్ షోలో చెప్పాడు. టెస్టుల్లోనూ వేగంగా పరుగులు సాధించొచ్చని నిరూపించారని పేర్కొన్నాడు. ‘ఆధునిక క్రికెట్ లో ఓపెనర్లు పరుగులు చేయకపోతే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి సెహ్వాగ్, హేడెన్ కారణం. ఎందుకంటే వీరిద్దరూ వేగంగా పరుగులు సాధించేవారు. జస్టిన్ లాంగర్ కూడా వేగంగానే పరుగులు చేసేవాడు. అయితే వీరూ, హేడన్ మాత్రమే టెస్టు క్రికెట్ బ్యాటింగ్ నిర్వచనం మార్చార’ని గంగూలీ వ్యాఖ్యానించాడు. బాగా ఆడిన ఆటగాడిని ప్రోత్సహించిన వాడే విజయవంతమైన కెప్టెన్ అవుతాడని ఇదే షోలో పాల్గొన్న సెహ్వాగ్ అన్నాడు. ‘గంగూలీ నన్ను ప్రోత్సహించడం వల్లే భయం లేకుండా ఆడేవాడినని. నేను అవుటైనా తర్వాత బ్యాటింగ్ దిగేది ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్షణ్, ధోని లాంటి హేమహేమీ ఆటగాళ్లు కాబట్టి రీలాక్స్ గా ఉండేవాడిన’ని సెహ్వాగ్ వెల్లడించాడు. -
'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్'
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆటతీరు, బ్యాటింగ్ స్టయిల్ బాగుంటుందని మెచ్చుకున్నాడు. 'నిలకడ, పవర్ కలగలిపి బ్యాటింగ్ చేయడం కోహ్లి ప్రత్యేకత. మైదానంలో అతడు కదిలే విధానం, ఆట పట్ల ఉన్న అనురక్తి విరాట్ వ్యక్తిత్వానికి అదనపు బలం. అతడి ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఇష్టపడతార'ని హేడెన్ అన్నాడు. కోహ్లి వ్యవహారశైలి తమకెంతో నచ్చుతుందని చెప్పాడు. 'కోహ్లి దూకుడును మేమంతా ఇష్టపడతాం. ఆట పట్ల చూపే అంకితభావం అతడిలో కన్పిస్తుంటుంది. విరాట్ వ్యవహారశైలి ఆస్ట్రేలియా క్రికెట్ కు తగినట్టుగా ఉంటుంది. అంపైర్లతో వాదించడం, అతడి పోరాట పటిమను అభిమానులు ప్రేమిస్తార'ని హేడెన్ పేర్కొన్నాడు. కోహ్లి కంటే డేవిడ్ వార్నర్ శక్తివంతుడని అన్నాడు. ఐపీఎల్-9లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో కోహ్లి, వార్నర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
వారికి విదేశాల్లో గెలుస్తామనే నమ్మకం లేదు!
బ్రిస్బేన్: విదేశాల్లో గెలుస్తానే నమ్మకం లేకపోవడంతోనే టీమిండియా జట్టు వరుస ఓటములను కొనితెచ్చుకుంటుందని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో వారికి ఎదరురైన చేదు అనుభవమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. టీమిండియా అందివచ్చిన అవకాశాల్ని చేజిక్కించుకోవడంలో విఫలమయ్యి రెండు టెస్టుల్లో ఓటమి పాలైందన్నాడు. ఇందుకు వారికి విదేశాల్లో గెలుస్తామనే నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణమన్నాడు. రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు శిఖర ధావన్-విరాట్ కోహ్లీల వివాదం కూడా టీమిండియా ఓటమిపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. ఏ ఆటగాడైనా భయంతో విఫలమైతే మాత్రం జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉండదని శిఖర్ ధావన్ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు.