Nandyal District Latest News
-
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్పై తీసుకెళ్లి.. బాలిక డెడ్బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
‘అఘాయిత్యాలపై స్పందన.. ఇంత ఆలస్యమా అనితమ్మా?’
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా ఏవో కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక చించేస్తాం.. పొడిచేస్తాం అన్నారు. తీరా అధికారంలో కొలువుదీరి నెల తిరిగేసరికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ఒకవైపు రాజకీయ ప్రతీకార చర్యలతో పాటు మరోవైపు హత్యలు, హత్యాచారాలు, మిస్సింగులు పెరిగిపోయాయి. అయితే వీటిపై ఇటు చంద్రబాబు ప్రభుత్వంగానీ, ఈ తరహా ఘటనలపై గతంలో ఊగిపోయి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్నుగానీ సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపించాయి. ఈ తరుణంలో.. నంద్యాల ముచ్చుమర్రి దారుణ ఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనితను ముచ్చుమర్రి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆమె ఆ గ్రామానికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగి పది రోజులు కావొస్తోంది. గత ఆరు రోజులుగా అధికార యంత్రాంగం ఎడతెరిపి లేకుండా బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. హోం మంత్రి పదవిలో ఉండి కూడా అనిత ఆలస్యంగా స్పందించడం.. తాజాగా ఇవాళ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్పైనా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించిందక్కడ. తాజాగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘‘ముచ్చుమర్రిలో చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. చిన్నారి కోసం ఎన్డీఆర్ బృందాలు వెతికినా మృతదేహాం లభించలేదు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం. మరోవైపు.. విజయనగరంలో ఆరు నెలల పనికందుపై అత్యాచారం చేశారు. తాగిన మైకంలో వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఈ ఘటనలపై సమీక్ష నిర్వహించారు. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు. ముచ్చుమర్రి ఘటన, విజయనగరం ఘటనపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. ముచ్చుమర్రి ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా సీఎం చంద్రబాబు స్పందించింది లేదు. డిప్యూటీ సీఎం పవన్ స్పందించినా అది సరైన రీతిలో లేదనే చర్చా సోషల్ మీడియాలో నడిచింది. మరోవైపు ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కానీ అటువైపు కూడా చూడలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించి హోం మంత్రిని ముచ్చుమర్రికి వెళ్లాలని ఆదేశించారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రభుత్వంపై విసుర్లు విసిరిన ఆమె.. ఇప్పుడు అధికారంలో హోం మంత్రిగా మొక్కుబడిగా ఏదో ప్రకటన చేశారు. మరోవైపు.. ముచ్చమర్రి మైనర్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక అదృశ్యం కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్, జాలర్లతో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు
నంద్యాల: పగిడ్యాల, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్గా మారింది. రోజులు గడుస్తున్నాయే తప్పా బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. గురువారం వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ రెండు బృందాలను రప్పించి ప్రత్యేక కెమెరాలతో ముచ్చుమర్రి పంప్హౌస్ నీటిలో గాలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన గాలింపులో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.‘దృశ్యం’ సినిమాలాగా నిందితులు రోజుకో సమాచారం చెప్పి పోలీసులను విచారణలో తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఘటన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. క్షణం.. క్షణం ఉత్కంఠతో బాలిక బంధువులు, కుటుంబీకులు ఎదురుచూస్తూ పంప్హౌస్ వద్ద విషాదంలో మునిగిపోయారు. గాలింపు చర్యలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ రఘువీర్రెడ్డి పర్యవేక్షించారు.అనంతరం బాధిత కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించారు. నేర నిర్ధారణ అయితే నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఐదు రోజులైనా తమ పాప ఆచూకీని కనిపెట్టలేదని, పోలీసుల అదుపులో ఉన్న నిందితులను చూపించాలని డిమాండ్ చేశారు. సాయంత్రంలోగా మృతదేహం ఆచూకీ కనిపెట్టాలని, ఎన్నాళ్లు సాగదీస్తారని అధికారులపై బాలిక బంధు వులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిందితుల కుటుంబీకులను పిలిచి పోలీసులకు ఎందుకు విచారించడం లేదని, మృతదేహం మాయంలో వారి హస్తం ఉంటుందని అనుమానాలను వ్యక్తం చేశారు. నిందితులు మైనర్లు కావడం వలన అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ బాధితులకు తెలిపారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ను కలిసి బాలిక మృతదేహాం ఆచూకీని తొందరగా గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న బాలిక కుటుంబీకులు, బంధువులు నేరం రుజువైతే కఠిన చర్యలు..బాలిక హత్య కేసులో మైనర్లు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్హౌస్లో బాలిక మృతదేహాం ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల చేపట్టిన గాలింపు చర్యలను కలెక్టర్ పర్యవేక్షించారు.అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో పురోగతి సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామన్నారు. అనంతరం సీపీఐ జిల్లా నాయకులు రమేష్బాబు, జిల్లా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, తాలుకా అధ్యక్షులు బోయ వెంకటరమణ నాయుడు, లాయర్ వెంకటరాముడు, ఎంఆర్పీఎస్ నాయకులు బాధితులను శిక్షించాలని వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దాసు, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగేశ్వరరావు ఉన్నారు.నిందితుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలి..నందికొట్కూరు: కొత్త ఎల్లాల గ్రామంలో బాలికను దారుణంగా హత్య చేసిన నిందితులు మైనర్లు కావడంతో వారి తల్లిదండ్రులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు, కుటుంబీకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పోలీసు స్టేషన్కు ఎదురుగా వారు ధర్నా చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఐదు రోజులు గడిచినా తమ అమ్మాయి ఆచూకీ గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో నిందితుల తల్లిదండ్రుల పాత్ర ఉందని, వారిని ఇంత వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నంద్యాల: బోనుకి చిక్కిన మ్యాన్-ఈటర్ చిరుత!
కర్నూలు, సాక్షి: ఒక మనిషి చంపి.. పచ్చర్ల సమీప గ్రామ ప్రజలకు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కుక్క కోసం వచ్చి బోనులో చిరుత చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. పచ్చర్ల టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేయగా.. గత అర్ధరాత్రి చిరుత వచ్చి చిక్కుకుపోయింది. ఈ చిరుత మూడు రోజుల కిందట మెహరున్నీసాను చంపడంతో పాటు మరో ఇద్దరిపైనా దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీల పైనా కూడా దాడి చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చివరికి.. చిరుతను బంధించడంతో పచర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా లేక తిరుపతి జూ కు తరలిస్తారా అనేది చూడాలి.మరోవైపు.. మహానంది సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ పరిసరాల్లో గత ఆరు రోజుల నుంచి ప్రతి రోజు తిరుగుతున్న మరో చిరుత.. భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారిస్తుండటంతో మహనందిలో భారీగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. -
No Headline
● వ్యవసాయ రంగానికి జగన్ సర్కార్ పెద్దపీట ● బ్యాంకుల ద్వారా విస్తృతంగా రుణాలు ● టీడీపీ హయాంలో కన్నా రెట్టింపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ● చంద్రబాబు హయాంలో వరికి రూ. 25 వేలు రుణపరిమితి ● వైఎస్సార్సీపీ పాలనలో రూ. 43 వేలు ● అన్ని పంటలకు పెరిగిన రుణ పరిమితి ● ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయం -
కామేశ్వరీదేవికి వెండి కాసుల హారం
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి మహానందికి చెందిన రిటైర్డ్ వీఆర్ఓ సత్యనారాయణ దంపతులు శుక్రవారం వెండి కాసుల హారం అందించారు. ఈ మేరకు వారు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం డొనేషన్ కౌంటర్ వద్దకు చేరుకుని ఏఈఓ యర్రమల మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డికి హారం అందించారు. 59 గ్రాముల బరువు ఉందని, వెండి కాసుల హారానికి బంగారు పూత వేయించినట్లు దాతలు చెప్పారు. హోమ్ ఓటింగ్ దరఖాస్తుకు 22 వరకు గడువు కోవెలకుంట్ల: 85 సంవత్సరాలు వయస్సు పైబడిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆయా కేటగిరిలకు చెందిన ఓటర్లు ఫారం–12డీని సమర్పించాల్సి ఉంది. పూర్తి వివరాలతో నింపిన ఫారాన్ని ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 25న గురుకుల ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్ఎస్ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్జేసీ, డీసీసెట్ – 2024 మధ్యాహ్నం 2.30గంటల నుండి 5గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్టికెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. నేడు ‘ఏకలవ్య’ పరీక్ష కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష బీ క్యాంప్లోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ లక్ష్మిగుర్రప్ప తెలిపారు. జిల్లాకు చెందిన విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని ఇక్కడ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన సీట్లలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందని, ఎండలు అధికంగా ఉన్నందున పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 10 గంటలకంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. శాస్త్రోక్తంగా చౌడేశ్వరిదేవి పల్లకీ సేవ బనగానపల్లె: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసి పల్లకీలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. -
రూ. 55 వేలు పంట రుణం తీసుకున్నాను
రబీసీజన్లో 1.50 ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేశాను. గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పెట్టుబడి కోసం పంట రుణానికి దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు అధికారులు రూ. 55 వేలు పంట రుణం ఇచ్చారు. ఆ రుణంతో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసి వ్యవసాయానికి వినియోగించున్నాను. – రవికుమార్రెడ్డి, రైతు, ఉయ్యాలవాడ పెట్టుబడికి భయమే లేదు నాకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఏటా జొన్న, పప్పుశనగ పంటలు సాగు చేస్తున్నాను. గతంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా రూ. 13,500 పెట్టుబడిసాయం, బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తుండటంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. – సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్ల -
ఫరూక్.. పరేషాన్ !
● నంద్యాల టీడీపీలో నేతల మధ్య కుదరని సయోధ్య ● ఫరూక్ నామినేషన్కు డుమ్మా కొట్టిన భూమా బ్రహ్మానందరెడ్డి ● చివరకు సాదాసీదాగా టీడీపీ అభ్యర్థి నామినేషన్ ● స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని బ్రహ్మంపై అనుచరుల ఒత్తిడి నంద్యాల: నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఫరూక్ నామినేషన్కు రావాలని ఫరూక్ తనయుడు ఫిరోజ్ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. 2019 ఎన్నికల నుంచినంద్యాల టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ అధిష్టానం ఇటీవల తప్పించి మాజీ మంత్రి ఫరూక్ను ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేవలం ఇన్చార్జ్గా మాత్రమే నియమించామని, టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదని, అధిష్టానం చెప్పడంతో భూమా బ్రహ్మానందరెడ్డి కొన్ని రోజులు టికెట్ తనకే వస్తుందన్న భావనతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే చివరకు పార్టీ టికెట్ కూడా ఫరూక్కు ఇవ్వడంతో బ్రహ్మం టీడీపీ అధిష్టానంపై అలకబూనారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్లతో పాటు నారా భువనేశ్వరి సైతం ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ పెద్దల సమక్షంలో రాజీ అయినట్లు ఫొటోలు దిగారే తప్ప ఇంత వరకు భూమా బ్రహ్మానందరెడ్డి ఫరూక్కు ఓటు వేయాలని ఎక్కడ చెప్పకపోవడంతో పాటు, ఫరూక్ ప్రచారాల్లో సైతం పాల్గొన లేదు. శుక్రవారం ఫరూక్ నామినేషన్కు రావాలని ఫరూక్ తనయుడు ఫిరోజ్ స్వయంగా భూమా బ్రహ్మం ఇంటికి వెళ్లి పిలిచినా గైర్హాజరు కావడంతో ఫరూక్కు షాక్ తగిలింది. మొదట కార్యకర్తలతో భారీగా వెళ్లి నామినేషన్ వేయాలనుకున్న ఫరూక్ చివరకు బ్రహ్మం రాకపోవడంతో సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి ఒకసెట్, జైభారత్ నేషనల్ పార్టీ తరపున సయ్యద్ మహమ్మద్ సికిందర్బాషా, నందికొట్కూరు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు రాగా ఇందులో బహుజన సమాజ్ పార్టీ తరఫున గద్దల లాజర్, ప్రజాబంధ్ పార్టీ ఇండియా అభ్యర్థిగా పల్లె నాగరాజు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏటా పెట్టుబడిసాయం..
కోవెలకుంట్ల: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. విత్తనం మొదలుకొని పంట ఉత్పత్తుల కొనుగోలు వరకు అడుగడుగునా తోడుగా ఉంటోంది. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500 నగదు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. గత టీడీపీ సర్కార్ హయాంలో ఉన్న దానికన్నా గరిష్ట రుణపరిమితి గణనీయంగా పెంచి రైతులకు చేయూత నిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల హెక్టార్లు, రబీ సీజన్లో 1.14 లక్షల హెక్టార్లలో రైతులు వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, పెసర, పొగాకు, కంది, ఉల్లి, వేరుశనగ, మిరపతోపాటు ఉదాన్యవన పంటలైన మామిడి, సపోట, చీని, ద్రాక్ష, అరటి, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన రుణపరిమితి ఇలా 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంటరుణాలకు సంబంధించి స్కేల్ఆఫ్ ఫైనాన్స్ పెరిగేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో నాబార్డు, లీడ్బ్యాంకు, ప్రధాన బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్డీసీ) సమావేశమై వాస్తవ పరిస్థితులపై చర్చించి రుణపరిమితి ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి పంపించి రుణపరిమితి ఖరారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా చేపట్టి రైతులకు అరకొరగా రుణాలు ఇచ్చేవారు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. అయితే 2019 తర్వాత రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణ సదుపాయం కల్పిస్తూ వస్తోంది. 2018లో వరి సాగుకు బ్యాంకుల ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ. 18 వేలు రుణం ఇవ్వగా ప్రస్తుత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 43 వేలు అందజేస్తున్నారు. వేరుశనగకు రూ. 18 వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ. 38 వేలకు పెంచడం గమనార్హం. ఇలా వివిధ ప్రధాన పంటలకు రుణపరిమితిని భారీగా పెంచారు. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు రైతులు పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల కోసం బ్యాంకులను వినియోగించుకుంటూ పంట రుణాలు పొందుతున్నారు. భీమునిపాడులోని రైతు భరోసా కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వివిధ పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఖరీఫ్ సీజన్కు ముందే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తోంది. జూన్లోనే మొదటి విడతలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిషాన్ కింద రూ. 7,500, అక్టోబర్లో రూ. 4 వేలు, జనవరి నెలలో రూ. 2వేల చొప్పున అందజే స్తోంది. పెట్టుబడి సాయంతోపాటు గ్రామ సచివాలయాలకు అనుగుణంగా జిల్లాలో 394 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణాల రెన్యువల్, కొత్తగా పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత కల్పించింది. పంట పెట్టుబడులు, ఆయా పంటల్లో వస్తున్న దిగుబడులను బేరీజు వేసుకుని గరిష్ట రుణపరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారు చేసి రైతులకు మేలు చేస్తోంది. -
ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా
పంట 2018లో 2024లో (ఎకరాకు రూ.) (ఎకరాకు రూ.) వరి 18,000 43,000 వేరుశనగ 18,000 38,000 జొన్న 12,000 25,000 మొక్కజొన్న 16,000 33,000 కంది 12,000 20,000 పప్పుశనగ 20,000 34,000 పత్తి 31,000 42,000 పచ్చిమిరప 49,000 76,000 ఎండుమిరప 66,000 1 లక్ష మల్బరీ 55,000 1.05 లక్షలు టమాట 55,000 90,000 ఉల్లి 30,000 44,000 కరివేపాకు 35,000 47,000 అరటి 55,000 1.20 లక్షలు దానిమ్మ 56,000 97,000 కర్భూజ 35,000 55,000 ద్రాక్ష 80,000 లక్ష మామిడి 25,000 38,000 చెరకు 38,000 45,000 -
నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో 44.2, బండిఆత్మకూరులో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలోరెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. -
చైతన్య సెల్ఫీ
ప్రతి ఓటు విలువైనదని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఓటు సెల్ఫి పాయింట్ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లెక్సీని కలెక్టర్ ప్రారంభించారు. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. – నంద్యాల -
ప్యాపిలిలో టీడీపీకి భారీ షాక్
ప్యాపిలి: మండలంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి క్యాడర్ దూరమవుతుండటంతో కుదేలవుతోంది. వరుస షాకులతో ఆ పార్టీ నేతలు, నియోజకవర్గ నాయకులు నిశ్చేష్టులై చూస్తు న్నారు. శుక్రవారం ప్రచారం నిమిత్తం ప్యాపిలికి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సమక్షంలో ఏకంగా టీడీపీకి మద్దుతు ఇస్తున్న 500 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రజనీ రెడ్డి, భూశెట్టి చిన్న సుంకయ్య ఆధ్వర్యంలో ప్యాపిలి, కలచట్ల, ఎస్.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పార్టీలో చేరిన వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కలచట్ల నుంచి రమేశ్, రామాంజి, నాగేశ్వరరావు తదితరులతో పాటు 200 కుటుంబాలు, ప్యాపిలి నుంచి ముక్కెల్ల వెంకటరాముడు, కమలాకర్, గణేశ్, మహేశ్, తరుణ్, భాస్కర్, శంకర్, వెంకటేశ్ తదితరులతో పాటు 100 కుటుంబాలు, 50 మంది మహిళలు, కలచట్ల, ఎస్.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి తులసిరెడ్డి, రంగమునిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులతో పాటు 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీ మారినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని వారు స్పష్టం చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన 500 కుటుంబాలు -
22న ఎమ్మెల్యే కాటసాని నామినేషన్
● మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 9 నామినేషన్లు ● నంద్యాల పార్లమెంట్కు ఇద్దరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ ● శ్రీశైలం స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకసెట్, టీడీపీ అభ్యర్థి రెండు సెట్లు దాఖలు ● భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా, చిత్రంలో ఎంపీ అభ్యర్థి పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి, బుడ్డా శేషారెడ్డి తదితరులునంద్యాల: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలో ఒక పార్లమెంట్ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పార్లమెంట్ స్థానానికి నంద్యాల కలెక్టర్రేట్లో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉన్న నాయకులను మాత్రమే లోపలికి పంపించారు. గురువారం నంద్యాల పార్లమెంట్కు ఇద్దరు, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మహమ్మద్ అతుల్లాఖాన్ ఒకసెట్, బహుజన సమాజ్ పార్టీ తరపున చిన్న మౌలాలి ఒకసెట్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ తరఫున శిల్పాచక్రపాణిరెడ్డి ఒక సెట్, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ సి.నాగేశ్వరరావు ఒకసెట్, టీడీపీ అభ్యర్థులుగా బుడ్డా రాజశేఖర్రెడ్డి ఒకసెట్, బుడ్డా శైలజా ఒకసెట్ నామినేషన్లు దాఖలు చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా విష్ణువర్ధన్రెడ్డి, బి.శ్రావణకుమార్ చెరో ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేయగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున షేక్మహమ్మద్ ఫాజిల్ ఒక సెట్ దాఖలు చేశారు. అట్టహాసంగా శిల్పా నామినేషన్ శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పాచక్రపాణిరెడ్డి గురువారం ఉదయం 11.10 గంటలకు ఆత్మకూరులో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ప్రచార వాహనంపై శిల్పాచక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు హబీబుల్లా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నామినేషన్ అనంతరం వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్వచ్ఛందంగా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్భయంగా ఓట్లు అడుగుతున్నారంటే ప్రజలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ ధైర్యమన్నారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఎన్ని హామీలు అయినా ఇస్తారని, ఆయన దొంగ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో నేడు లేరన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు, కూటమి నాయకులకు ప్రజలు గుర్తు వస్తారని, చంద్రబాబు, పవన్కళ్యాణ్, పురందేశ్వరిలు ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తున్నారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కిందని, మాట ఇస్తే 100శాతం అమలు చేసి తీరుతామన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని, ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మొదటి రోజు ప్రశాంతం శ్రీశైలం నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్సీపీ, టీడీపికి చెందిన ఇద్దరు అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో పోలీసులు ఆత్మకూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకు న్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఉదయం 11 గంటల తర్వాత వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీడీపీ అభ్యర్థులు బి.రాజశేఖర్రెడ్డి, బి.శైలజ నామినేషన్లు దాఖలు చేయడానికి వేర్వేరుగా సమయం ఇచ్చి నామినేషన్లు వేయించడంతో అంతా ప్రశాంతంగా ముగిసింది.నాలుగు నియోజకవర్గాల్లో నిల్.. జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగగా అందులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. పాణ్యం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఈనెల 22వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మె ల్యే స్వగృహం నుంచి ర్యాలీ ప్రారంభమై కర్నూలు కలెక్టరేట్ వరకు సాగుతుంది. పాణ్యం ఈఆర్ఓ కార్యాలయంలో నామినేష్ పత్రాలను దాఖలు చేస్తారు. నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం
విజయం మీదే..నంద్యాల(సిటీ): ‘పదేళ్లు జెండా మోసినా ప్రయోజనం లేదు. ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం. కనీసం పొత్తు ధర్మం పాటించని టీడీపీ వెంట నడవలేము’ అంటూ జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో నంద్యాలలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రటరీ, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వనాథ్తో పాటు ఆ పార్టీ నేతలు సాయి, అమర్నాథ్రెడ్డి, రాము, చాంద్ బాషా, అశోక్, షఫీలతో పాటు సుమారుగా 300 మంది గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిశోర్రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. నంద్యాల పట్టణ అభివృద్ధి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి టీడీపీ నాయకులు ఏమైనా చేసింది ఉందా.. అని ప్రశ్నించారు. కేవలం ఇతరులపై బురదజల్లే రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. గత సంవత్సరంలో 221 రోజుల పాటు నిత్యం ప్రతి గడపకూ వెళ్లి వారి కష్టసుఖాలను తాను తెలుసుకున్నానన్నారు. నంద్యాలను జిల్లా కేంద్రంగా, మెడికల్ కళాశాల, రోడ్లు, ఉర్దూ జూనియర్ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి ఈ కొద్ది సంవత్సరాలలో జరిగిందన్నారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్ వివిధ శాఖలలో పని చేసి నంద్యాలకు ఏం చేశారో చెప్పుకోగలరా అంటూ ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరిన నంద్యాల నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ విశ్వనాథ్ మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ వారికి సేవ చేస్తున్న నాయకుని వెంట నడవడం కూడా హర్షించదగ్గ విషయమన్నారు. గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మోసినా ఎలాంటి పొత్తు ధర్మం లేకుండా టీడీపీ నాయకులు తమపై చిన్న చూపు చూశారన్నారు. పార్టీ కోసం నిత్యం పని చేసినా సముచిత గౌరవం దక్కలేదన్నారు. కనీసం ప్రచారం చేద్దామని అడిగినా నంద్యాల టీడీపీ నాయకులు కనీసం తమకు ప్రాధాన్యత కల్పించలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు శిల్పారవి వెంట నడవడమే ఉత్తమమని పార్టీని వీడి నేడు వైఎస్సార్సీపీలో చేరడం జరిగిందన్నారు. నాయకుడంటే ప్రజలలో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తాను ఎలాంటి లబ్ధికోసం పార్టీలో చేరలేదన్నారు. యువతకు జగన్మోహన్రెడ్డి, ఇక్కడ శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి ఆదర్శమన్నారు. అనంతరం పలువురు జనసేన నాయకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా వైఎస్సార్ కుటుంబంలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో పనిచేసే వారికి తప్పనిసరిగా సమాన గౌరవం ఉంటుందన్నారు. డోన్లో గురువారం ఇంటింటి ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను మంత్రి వివరిస్తూ వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనసేనను వీడిన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రటరీ వైఎస్సార్సీపీలో చేరిన 300 మంది జనసేన శ్రేణులు సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి -
అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టండి
నంద్యాల: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు పక్కాగా నమోదు చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్.మణికందన్, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్ తొట్టుపురం అశోకన్, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు టికారాం మీనాలు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయా నియోజకవర్గాల సహాయ ఎన్నికల, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. అలాగే కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించి నమోదు చేసేందుకు సహాయ వ్యయ పరిశీలకులు చురుకుగా, సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించుటకు ప్రణాళిక రూపొందించుకుని రోజువారీ నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు చురుకుగా పనిచేసి అభ్యర్థుల ఖర్చు వివరాలను జాగ్రత్తగా లెక్కకట్టాలని సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియ తదితర అంశాలన్నింటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఇప్పటి వరకు రూ.4.73 కోట్ల విలువైన నగదు, లిక్కర్, ఇతర వస్తువులను సీజ్ చేశామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
నందికొట్కూరు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుౖగైన విద్య అందుతుందని రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన గ్రంథాలయ భవనం, సమావేశం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం మహోన్నత సమాజ నిర్మాణానికి పునాదులన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని మేధస్సును పెంపొందించుకోవాలన్నారు. రుసా నిధులతో నూతన భవనాలను నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం ప్రొఫెసర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. సునీత, అధ్యాపకులు డాక్టర్ ఎం. అన్వర్ హుసేన్, గ్రంథాలయ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటైన 21 జంటలు కౌతాళం: మదిరె గ్రామంలోని ఉటగనూరు తాత మఠంలో గురువారం 21 జంటలు ఒక్కటయ్యాయి. మఠం ధర్మకర్త పంపారెడ్డి తాత, గ్రామస్తుల ఆధ్వర్యంలో సామూహిక వివాహలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంపారెడ్డి తాత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా దాతల సహకారంతో సామూహిక వివాహాలను జరిపించామన్నారు. నూతన వధువరులను వివిధ పార్టీల నేతలు అంక్షితలతో ఆశీర్వదించారు. ఈ జంటలకు దాతలు ఉచితంగా మంగళ సూత్రాలు, కాలిమెట్లను అందించారు. నగదు స్వాధీనం శిరివెళ్ల: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం శిరివెళ్ల మెట్ట వద్ద వాహనాల తనిఖీలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవిందపల్లె నుంచి బైక్పై వస్తున్న వెంకటాపురానికి చెందిన రైతు వెలుగొండయ్య వద్ద రూ. 1.70 లక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నా మని ఎస్ఐ సురేష్ తెలిపారు. నగదు ఎక్కడిది అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. కందులు రూ.11,309 కర్నూలు(అగ్రికల్చర్): కందుల ధర జోరుమీద ఉంది. రోజురోజుకు ధర పురోగమనంలో ఉండటం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 27 మంది రైతులు 116 క్వింటాళ్ల కందులు తీసుకొచ్చారు. కందుల కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడ్డారు. కనిష్ట ధర రూ.2,056, గరిష్ట ధర రూ.11,309 లభించింది. కందుల సగటు ధర కూడా రూ.11,309 నమోదైంది. దాదాపు అన్ని లాట్లకు ధర రూ.11 వేలపైనే లభించడం విశేషం. -
పెరిగిన భగభగలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలు పెరిగిపోయాయి. వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం మంత్రాలయంలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని ఐదు మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 44 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత రి కార్డు స్థాయికి చేరుతోంది. ఈ జిల్లాలో 8 మండలాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్, రుద్రవరం మండలాల్లో 45.6 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 45.4, మిడుతూరులో 45.2 ఆత్మకూరు, బండిఆత్మకూరుల్లో 45.1, గోస్పాడులో 45.0 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. నందికొట్కూరులో 44.5, మహానందిలో 44.4, సంజామలలో 44.3, పాణ్యంలో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు -
జూన్ 1న కళాశాలలు పునఃప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు సైతం మొదలుకానున్నాయి. ఈ మేరకు తాజాగా ఇంటర్మీడియెట్ బోర్డు 2024–25 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్, షెడ్యూల్ విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలలు 222 రోజులు పనిచేయనున్నాయి. 2025 మార్చి 31 ఆఖరి పనిదినంగా, ఏప్రిల్ 1 నుంచి 2025 జూన్ ఒకటి వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సాంస్కృతిక వారోత్సవాలను అక్టోబర్ ఆఖరివారంలో నిర్వహించాలని, స్పోర్ట్స్ వారోత్సవాలను నవంబర్ ఆఖరివారంలో నిర్వహించాలని, అలాగే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫెయిర్ను 2025 జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. 2020 మార్చిలో విజృంభించిన కరోనా వైరస్ (కోవిడ్)తో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ ప్రభుత్వ పకడ్బందీ చర్యలతో రెండేళ్ల నుంచి పూర్తిస్థాయిలో గాడిలో పడింది. ఈ ఏడాది 2024లో యథావిధిగా జూన్ 1వ తేదీన కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 139 జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 57 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం క్యాంపెయినింగ్ నిర్వహించారు. కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్లు, డిజిటల్ విద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా బోధన, అధ్యాపకుల పనితీరు, బోధన విధానాలు, ఇంటర్ విద్యతో లభిస్తున్న భవిష్యత్ అవకాశాలను తెలియజేసి ఆకర్షితులను చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో గణనీయంగా అడ్మిషన్లు జరిపేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ బోర్డు వార్షిక క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తామని ఆర్ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సెలవులు ప్రకటిం చడం జరుగుతుందన్నారు. -
ఆ శిలాఫలకాలకు కోడ్ వర్తించదు
నంద్యాల(సిటీ): సార్వత్రిక ఎన్నికల కోడ్ కంటే ముందే అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన శిలాఫకాలకు ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) నిబంధనలు వర్తించవని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గురువారం తెలిపారు. ఎంసీసీ అమలులో ఉన్నప్పు డు లబ్ధిదారులకు పంపిణీ చేయదలచిన లబ్ధికార్డులు, ప్రతిష్టించిన శిలాఫలకాలపై సీఎంలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు వెలువరించడం చట్టరీత్యా నిషేధమన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముద్రించే విద్యుత్ బిల్లులు, నీటి పన్ను రశీదు తదితర వాటిపై ఎలాంటి రాజకీయ పార్టీల గుర్తులు, ఫొటోలు, సందేశాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. -
No Headline
● నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ● జిల్లాలో ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు ● మొదటి రోజే శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ ● ఇక ఊపందుకోనున్న ప్రచారం నంద్యాల/ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం గురువారం నుంచి మొదలు కానుంది. జిల్లాలో జరగనున్న ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే రోజు నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించరు. 26న నామినేషన్ల పరిశీలన చేసి, 29వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఇస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. పార్లమెంట్కు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పాణ్యం అసెంబ్లీకి సంబంధించి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, పోలీసు, నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ నియమావళిని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఉండాల్సిన అర్హతలపై ఎన్నికల కమిషన్ దిశా నిర్దేశం చేసింది. అలాగే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సువిధ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికల షెడ్యూల్ మార్చి 16వ తేదీన విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడతలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంది. దీంతో 58 రోజులపాటు సమయం దొరికింది. అందులో ఇప్పటికే 32 రోజులు గడిచిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన 26 రోజుల్లో ఎన్నికల నామినేషన్లు, స్క్రూటీని, నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ తదితర ప్రక్రియలు ముగుస్తాయి. నామినేషన్కు అర్హతలు ఇవే.. ● అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే రోజుకు 25 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ● రాష్ట్రంలో ఏదైనా ఓ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ● పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులైతే నలుగురు, స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులను 10 మంది ఓటర్లు బలపర్చాలి. బలపరిచే వారు అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయి ఉండాలి. ● నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటలకు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే తమ ఎన్నికల ప్రచా రానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించి లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్ దాఖలు ఇలా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి సువిధ యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ● నామినేషన్ హార్డ్ కాఫీలు అందజేసే సమయంలో ఆర్వో చాంబర్లోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ● అభ్యర్థులు తమ ఒరిజనల్ బీ– ఫారమ్, ఏ – ఫారమ్లను నామినేషన్ గడువు ముగిసే రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు అందజేయవచ్చు. ● అభ్యర్థులు రెండు (ఒకటి స్టాంప్ సైజ్, మరొకటి పాస్పోర్ట్ సైజ్) ఫొటోలతో పాటు తన ఓటరు కార్డు, బలపరిచే వారి గుర్తింపు కార్డు నామినేషన్తో పాటు అందజేయాలి. ● ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి తన సంతకం ఉండే విధానాన్ని విధిగా తెలియజేయాలి. ● బ్యాలెట్ యూనిట్లో తన పేరు ఎలా ముద్రించాలో వివరించి చెప్పాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని మూడు దినపత్రికల్లో ప్రకటన ద్వారా బహిర్గతం చేయాలి. అందుకు అయ్యే ఖర్చును లెక్క చూపాలి. ● ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో అనువజ్ఞులైన అధికారులతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఏవైనా సందేహాలుంటే అక్కడ నివృత్తి చేసుకోవచ్చు. డిపాజిట్ ఎంత అంటే.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సాధారణ (ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 5 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు తెలిసేలా.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సమయంలో అధికారులకు సమర్పించే వివరాలను ప్రజలకు తెలిసేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. నకలును ప్రజలు కోరితే వాటిని ఉచితంగానే అధికారులు అందజేస్తారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఆ రోజు వచ్చిన నామినేషన్లపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల కమిషన్కు తెలియజేస్తారు. నామినేషన్లను, అఫిడవిట్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనూ నోటీసు బోర్డులోనూ ప్రజల పరిశీలనకు ఉంచుతారు. నామినేషన్ దాఖలు పారదర్శకంగా ఉండేందుకు సంపూర్ణంగా వీడియో తీయిస్తారు. నియమావళి పాటించాల్సిందే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నియమావళిని, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. అభ్యర్థి నామినేషన్ల పత్రాల్లోని ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ పక్కాగా పరిశీలిస్తుంది. ఇందులో ఏమాత్రం పొరపాటు, తప్పు జరిగినా ఏమాత్రం ఉపేక్షించకుండా చెల్లుబాటు కాలేదని ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కొందరు డమ్మీ సెట్ దాఖలు చేయనున్నారు. మొత్తం మీద ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది.నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల వివరాలు.. నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేసే కేంద్రం రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ నంబర్ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం, నంద్యాల రాహుల్కుమార్రెడ్డి, జేసీ, నంద్యాల 8522030888 శ్రీశైలం తహసీల్దార్ కార్యాలయం, ఆత్మకూరు సుధారాణి, డిప్యూటీ కలెక్టర్, నంద్యాల 9989925007 బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం, బనగానపల్లె ఎస్.కామేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్, నంద్యాల 8978882804 ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం, ఆళ్లగడ్డ మల్లికార్జునరెడ్డి, ఆర్డీఓ, నంద్యాల 8333989000 డోన్ ఆర్డీఓ కార్యాలయం, డోన్ మహేశ్వరరెడ్డి, ఆర్డీఓ, డోన్ 7815959530 నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం, నందికొట్కూరు ఎం.దాసు, ఆర్డీఓ, ఆత్మకూరు 7815959529 నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీలు నామినేషన్ల ప్రారంభం – ఏప్రిల్ 18 చివరి తేదీ – ఏప్రిల్ 25 పరిశీలన – ఏప్రిల్ 26 ఉపసంహరణ చివరి తేదీ – ఏప్రిల్ 29 పోలింగ్ – మే 13 ఓట్ల లెక్కింపు – జూన్ 04 2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో అంటే గురువారం 11 గంటల నుంచి సార్వత్రిక సమరానికి కీలక అడుగు పడనుంది. నోటిఫికేషన్ విడుదలతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలవుతుంది. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నంద్యాల పార్లమెంట్ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తొలిరోజు దశమి, ఆ తర్వాత ఏకాదశి రెండూ మంచి రోజులు కావడంతో తొలి రెండు రోజుల్లో అధికశాతం మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. -
ముమ్మరంగా వాహనాల తనిఖీ
డోన్ టౌన్: సార్వత్రిక ఎన్నికలను దృష్ట్టిలో ఉంచుకొని పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై వెలసిన శ్రీదత్తాత్రేయ స్వామి గుడ్డి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి డీఈ సురేష్ ఆధ్వర్యంలో వాహనాలను క్షణ్ణంగా పరిశీలించారు. హోం ఓటింగ్ కోసం నేటి నుంచి విచారణ కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఎన్నికల సంఘం వయో వృద్ధులు(80 ఏళ్లు దాటిన వారు), దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ) ఇంటింటా తిరిగి హోం ఓటింగ్కు అర్హులైన ఓటర్లను గుర్తిస్తారు. వారిని కలసి హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకుంటారా లేదంటే పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారా అన్న విషయాలను సేకరిస్తారు. -
కలిసికట్టుగా పని చేద్దాం
వెలుగోడు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బుధవారం వేల్పనూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో రామసుబ్బారెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ హబీబుల్లా సమావేశమయ్యారు. పార్టీ నేతలు ఐక్యతతో ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి బుడ్డా వెంగల్రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. వైఎస్ఆర్ మరణాంతరం బుడ్డా శేషారెడ్డి వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారన్నారు. శ్రీశైలంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి 2019 కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డిని, నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిలను గెలిపించేందుకు కృషి చేయాలని నేతలుకు సూచించారు. మరింత బలం.. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డితో కలిసి పని చేయడంతో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. 1989 నుంచి బుడ్డా కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డిని కలిసి ముందుకు వెళ్తామన్నారు. బుడ్డాను కలుపుకొని ఎన్నికల్లో పని చేసి మళ్లీ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. టీడీపీని ఓడించేందుకు అందరం ఐక్యంగా పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశాలను ధిక్కరించలేదు.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను తాను ఎప్పుడూ ధిక్కరించలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాల కోసం మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పని చేస్తామన్నారు. రాజకీయాల్లో పది మందికి సాయం చేయాలన్నది మా తండ్రి బుడ్డా వెంగళ్రెడ్డి నుంచి నేర్చుకున్నానని, ఆ దిశగానే తాను పని చేస్తున్నానని చెప్పారు. చక్రపాణిరెడ్డికి విజయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గురువారం శిల్పా నామినేషన్ కార్యక్రమంలో అందరం పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి