నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు | Sakshi
Sakshi News home page

నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు

Published Sat, Apr 20 2024 1:20 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్‌, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో 44.2, బండిఆత్మకూరులో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్‌, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలోరెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

Advertisement
Advertisement