New Dellhi
-
ఇండియా ఓపెన్ టోర్నీ.. సింధు సత్తాకు సవాల్
న్యూఢిల్లీ: స్వదేశంలో మరోసారి సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్, సైనా నెహ్వాల్ నేటి నుంచి మొదలయ్యే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మాజీ చాంపియన్ పీవీ సింధు నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్)తో... ప్రపంచ 31వ ర్యాంకర్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గత ఏడాది ఇదే టోర్నీ సెమీఫైనల్లో సుపనిద చేతిలో సింధు ఓడిపోగా... మియా బ్లిచ్ఫెల్ట్తో గతంలో ఆడిన రెండుసార్లూ సైనాకు ఓటమి ఎదురైంది. ఈ నేపథ్యంలో సింధు, సైనాలకు తొలి రౌండ్లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ భారత్కే చెందిన ప్రణయ్తో తొలి రౌండ్లో ఆడనున్నాడు. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో వీరిద్దరు తలపడగా ప్రణయ్ పైచేయి సాధించాడు. బుధవారం జరిగే మరో తొలి రౌండ్ లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 3–9తో వెనుకంజలో ఉన్నాడు. చదవండి: Australian Open 2023: శ్రమించి... శుభారంభం India Open - The biggest badminton tournament held in India will see the world's best players in action in Delhi from 17 January. 🏸@BAI_Media #IndiaOpen pic.twitter.com/cM4ZiB3lFm — Doordarshan Sports (@ddsportschannel) January 16, 2023 -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్ప్రీత్ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన హర్ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 0.8% తగ్గి $1,975.69కు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.5% తగ్గి 1,978.80 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.2,000కి పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.2050కి పైగా తగ్గి రూ.52,230కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.49,723 నుంచి రూ.47,843కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.49,800 నుంచి రూ.48,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.1600 తగ్గింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.52,580కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.3,000కి పైగా తగ్గి రూ.68,837కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. #Gold and #Silver Opening #Rates for 10/03/2022#IBJA pic.twitter.com/coh4GaBHax — IBJA (@IBJA1919) March 10, 2022 (చదవండి: టాటా మోటార్స్ బంపరాఫర్.. ఈ కార్లపై భారీ తగ్గింపు) -
శ్మశాన వింత! చితిపై పడుకోబెట్టబోతుంటే హఠాత్తుగా కళ్లు తెరిచి..
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం.. నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు. చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్! -
ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై..
న్యూఢిల్లీ: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని సంభాల్కు చెందిన తను పనినిమిత్తం ఢిల్లీ వచ్చింది. శనివారం ఉదయం కశ్మీరీ గేట్కు వెళ్లేందుకు ఖజురిఖాస్లో ఆ మహిళ ఐటీఓ ప్రాంతంలో ఆటో ఎక్కింది. అయితే ఆ సమయంలో ఆటోడ్రైవర్ మహిళ చెప్పిన ప్రదేశానికి కాకుండా యమున బ్రిడ్జి సమీపంలోని ఓ రూమ్కు తీసుకువెళ్లి, అక్కడ అతనితో పాటు మరో ముగ్గరు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. అనంతరం తనని ఆ ఆటోడ్రైవర్ కశ్మీరీ గేట్ వద్ద వదిలేసి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరిక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: దొంగతనంలో కొత్త టెక్నిక్.. ధూమ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు -
కంటి ఆపరేషన్ చేయించుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. గురువారం ఉదయం ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. President Ram Nath Kovind underwent cataract surgery at Army Hospital (Referral & Research), New Delhi today morning. The surgery was successful and he has been discharged from the hospital: Ajay Kumar Singh, Press Secretary to the President pic.twitter.com/DQcxf0Wnf8 — ANI (@ANI) August 19, 2021 -
బీజేపీలోనే కొనసాగుతా
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ మంత్రి దేవేందర్గౌడ్తో పాటు, తాను కూడా కాంగ్రెస్లో చేరుతున్నామన్న ఊహాగానాలకు బీజేపీనేత తూళ్ళ వీ రేందర్గౌడ్ తెరదించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దేవేందర్గౌడ్ని కలిసిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లను కలిసిన అనంతరం వీరేందర్గౌడ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిపై ఉన్న గౌరవంతోనే మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమను కలిశారని, వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంజయ్తో చర్చించినట్లు వీరేందర్గౌడ్ తెలిపారు. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు. టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు 13,23,567 కి చేరుకోగా.. 300 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కోవిడ్ వల్ల 19,344 మంది మృతి చెందారు. ఆదివారం 61,552 మందికి పరీక్షలు చేయగా, దీనిలో 49,787 ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 11,765 మందికి వేగంగా యాంటిజెన్ పరీక్షలు జరిగాయి. కాగా పాజిటివ్ కేసులు స్వల్వంగా తగ్గి 86,232 కు చేరుకున్నాయి. కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ ఉన్న 52,263 మంది ఇంటి నుంచే కోలుకుంటున్నారు. రాజధానిలో లాక్డౌన్ పొడగింపు దేశ రాజధానిలో కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్ను పొడిగించారు. మే 17 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈసారి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామన్నారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పలు వర్గాలకు చెందిన వారితో చర్చించిన అనంతరం లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. 14 రాష్ట్రాల్లో లాక్డౌన్! ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 4,000 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన బంగారం ధరలు మంగళ, బుధవారం స్వల్పంగా తగ్గాయి. మళ్లీ నేడు భారీగానే బంగారం ధర పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారంపై రూ.400 వరకు పెరుగగా, ఢిల్లీలో రూ.350 వరకు పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,352 నుంచి రూ.46,706కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,783 నుంచి రూ.42,852కు చేరుకుంది. అలాగే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,444 నుంచి రూ.67,953కు పెరిగింది. ఒక చోట బంగార ధర పెరుగుదల తక్కువగా ఉంటే, మరో చోట ఎక్కువగా ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని వెళితే మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: జూన్ నుంచి గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి -
మహిళలపై నేరాలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గాయి. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన క్రైమ్ రికార్డు జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మహిళల మీద జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే 2,111 తగ్గాయని ఆ నివేదిక వెల్లడించింది. 2020 సెప్టెంబర్ వరకు 7,236 కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాదివతో పోలీస్తే 22.58 శాతం తక్కువ. గతేడాది 9,347 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మహిళళపై జరుగుతున్న అత్యాచారాలు కూడా 29.8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఢిల్లీలో ఐపీసీ సెక్షన్ 376 కింద 1,132 కేసులు నమోదయ్యాయి. అదే 2019లో ఈ కేసుల సంఖ్య 1613గా ఉంది. ఇదిలా ఉండగా ఐపీసీ సెక్షన్ 509 ( మహిళలను అవమానించడం) కింద నమోదయిన కేసుల సంఖ్య 312 రెట్లు పెరిగాయి. ఈ కేసులు 2019లో 333 నమోదు కాగా, 2020లో వీటి సంఖ్య ఒక్కసారిగా 1,374కు పెరిగింది. ఇక వరకట్న వేధింపులకు సంబంధించి 2020లో సెప్టెంబర్ 15వరకు 89 కేసులు నమోదు కాగా 2019లో వీటి సంఖ్య 107గా ఉంది. మొత్తం మీద 2020లో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగానే తగ్గింది. మహిళల కిడ్నాప్ల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇది లాక్డౌన్ కారణంగా తగ్గిందా? భద్రతా ప్రమాణాలు పెంచడం వల్ల తగ్గింద అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి -
జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్’ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు. కోవిడ్–19 కారణంగా రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ను సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల మధ్య, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ, నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కెమిస్ట్రీలో ఒక ప్రశ్న తొలగింపు జేఈఈ మెయిన్స్ ఫైనల్ ఆన్సర్ కీని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దీనిలో రోజు వారీగా, సెషన్ వారీగా ప్రశ్న ఐడీ, సరైన సమాధానం ఐడీలను విడుదల చేసింది. 3వ తేదీన ఉదయం సెషన్లో ఇచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నల్లో ఒక ప్రశ్న తప్పుగా ఉండడంతో దాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రశ్నకు సంబంధించి ఆ సెషన్లో పరీక్ష రాసిన వారికి 4 మార్కులు కలపనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. చదవండి: తెలంగాణ విద్యార్థులే టాప్! -
అన్ని మతాలకూ ఒకే దత్తత చట్టం కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకేరకమైన దత్తత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దత్తత చట్టం, సంరక్షణ బాధ్యత, వివక్షా పూరితంగా ఉన్నాయనీ, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ని ఉల్లంఘిస్తున్నందున దత్తతకు సంబంధించిన యూనిఫాం మార్గదర్శకాలు ఉండాలని కోరారు. ప్రస్తుత దత్తత పద్ధతి వివక్షా పూరితంగా ఉందనీ, హిందువులకు ప్రత్యేక చట్టం ఉంది, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు, పార్శీలకు ఎటువంటి చట్టం లేదని, తెలిపారు. (మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్) -
అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకే అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే కేసులో గతంలో ఓసారి అహ్మద్ పటేల్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులను కలవలేకపోయానని ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొందని ఆహ్మద్ తెలిపారు. (ఐటీ నోటీసులపై అహ్మద్ పటేల్ స్పందన) ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీకి సంబంధించి 5,000 వేల కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వీరు నైజీరియాలో దాక్కున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. -
ఆ పుకారు వల్లే ఢిల్లీ అల్లర్లు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో కలిసి మౌజ్పూర్లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ తీశారు. అయితే వీరు జఫరాబాద్లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో డయల్పూర్లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్పై దుండగులు మూక దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశారని ఛార్జిషీటులో ప్రస్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు) అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించినప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అతను ఛాంద్ బాగ్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఇక సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ
సాక్షి, ఢిల్లీ: బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది. ఎవరితోనూ అపాయింట్మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి చవిచూశారు. -
రాష్ట్రాల సహకారం లేనిదే అమలు కుదరదు : పీకే
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్కిషోర్ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రశ్న : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మీరు ట్వీట్ చేశారు. మీ పార్టీ ఏమో పార్లమెంటులో మద్దతిచ్చింది. దీనిపై మీరేమంటారు? జవాబు : పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాను. మా పార్టీ కూడా మొదట సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ తర్వాత వైఖరిని మార్చుకుంది. దీనిపై మా అధ్యక్షుడు నితీష్కుమార్ను అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందేంటంటే సీఏఏ, ఎన్నార్సీలను వారు వేర్వేరుగా చూస్తున్నారు. సీఏఏకు మద్దతిచ్చినా, ఎన్నార్సీకి మద్దతివ్వనని, అది బీహార్కు అవసరం లేదని ఆయన నాకు భరోసానిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. ప్రశ్న : ఈ చట్టాలను బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలని మీరు పిలుపునిచ్చారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప మిగతా ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. వారంతా మీ సూచనను పాటిస్తారని అనుకుంటున్నారా? జవాబు : దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేగా అర్థం. ఇప్పుడు బీజేపీ దేశ ప్రజలు మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 61 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కదా. వారి సంగతేంటి? ఈ 61 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే నేను వ్యతిరేకించమని చెప్పేది. ప్రశ్న : కానీ, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు లేదు కదా? జవాబు : వ్యతిరేకించే అధికారం రాజ్యాంగం ప్రకారమైతే లేదు. కానీ రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం ఈ చట్టాన్ని దేశంలో అమలు చేయగలదా? ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీ చేపడితే రేయింబవళ్లు కష్టపడినా మూడేళ్లు పట్టింది. అలాంటిది దేశం మొత్తం అమలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది. అది కూడా కేంద్రం మాత్రమే చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండి. ప్రశ్న : మరి పార్లమెంటులో మీ పార్టీ సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం ద్వంద వైఖరి కాదా? జవాబు : ఇది ద్వంద వైఖరి కాదు. పైన చెప్పినట్టు సీఏఏ, ఎన్నారర్సీలకు మధ్య లింకు ఉంటుందని వారు బహుశా ఊహించి ఉండరని అనుకుంటున్నాను. ప్రశ్న : బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో మీ పార్టీ జేడీయూ భాగస్వామి కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జవాబు : మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను. కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు. -
తర్వాత ఎన్నార్సీయే : జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం మండిపడ్డారు. మూడు దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీ శరణార్థులను కలిస్తే వారి బాధలేంటో తెలుస్తాయని చురకంటించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన సిక్కు శరణార్థులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. 28, 30 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి భారత పౌరసత్వం లేనందున ఇల్లు కట్టుకోలేరు. పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు పట్టవు. వారికి కావాల్సిందల్లా రాజకీయమే’ అంటూ ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టం తర్వాత సమీప భవిష్యత్తులో ఎన్నార్సీ కూడా ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సంస్కరణలతో దేశం అభివృద్ధి పయనంలో సాగుతోందని వెల్లడించారు. చదవండి : పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్ -
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్హ్యాండెడ్ బ్యాట్స్మన్గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్లో ఇన్నింగ్స్కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
పుకారు వార్తలతో చనిపోయిన వారి సంగతేంటి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా, మతపరమైన హత్యలనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఉత్తర భారత దేశంలో గోమాంసం పేరిట జరిగిన హత్యలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి.. ఇతర కారణాలతో జరిగే మూక హత్యలపై మౌనం వహిస్తోందని ఆరోపించారు. నకిలీ వార్తల వ్యాప్తితో.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే పుకార్లను నమ్మి ప్రజలు అనుమానితులను హత్య చేసిన ఘటనలు యూపీఏ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు 2012లో 16, 2013లో 14 జరిగాయనీ.. వీటిపై ఏ మీడియా సంస్థ కూడా డిబేట్ పెట్టలేదని విమర్శించారు. ‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరిగినప్పుడు స్థానికంగా అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. ఆతర్వాత మరచిపోతారు. కానీ ప్రజల చేతిలో హతమైన వారి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు’అని మంత్రి అన్నారు. ఇలాంటి హత్యలను గుర్తించి టీవీలలో చర్చించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన మీడియాకు సూచించారు. కాగా, గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా మంది బిచ్చగాళ్లు, వేరే రాష్ట్రాల వారు ప్రజల చేతిలో దాడికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. -
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్రాయ్లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసే వీలుంది. గత నెలలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను కేంద్రానికి సూచించింది. వీరిలో జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హృతికేశ్ రాయ్లు రాజస్తాన్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరనుంది. సుప్రీంకోర్టులో 59,331 కేసులు పెండింగ్లో ఉన్నాయని జూలై 11న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. -
కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..
న్యూఢిల్లీ: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్ఎస్ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్ఎస్ఐటీ క్యాంపస్ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్ క్యాంటీన్ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
ఎయిర్పోర్టులోకి అక్రమంగా ప్రవేశం.. అరెస్ట్
న్యూఢిల్లీ : విమానాశ్రయంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ...తన పేరు ఉబైద్ లాల్ అని, శ్రీనగర్కు వెళ్తున్న తన తల్లిని చూడటానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. టెర్మినల్ 3 లోకి ఎలా ప్రవేశించావని పోలీసులు ప్రశ్నించగా అతను సవరించిన విమాన టికెట్ను చూపించి లోనికి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉబైద్ లాల్ను ఢిల్లీ పోలీసులకు అప్పగించి... అతనిపై మోసం, నేరపూరిత దుర్వినియోగం కేసు నమోదు చేశారు. కాగా రద్దు అయిన టికెట్ను చూపించి టెర్మినల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని అంతకు మందే సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్ జాతీయుడైన రాజ్ధనోటా రద్దు అయిన టికెట్ను చూపించి టెర్మినల్ లోపలికి వచ్చేశాడు. అతను తన భార్య, కుమారుడిని చూడటానికే ఇలా చేశానని విచారణలో ఒప్పుకున్నాడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో విమనాశ్రయంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు. చదవండి : విమానంలోనే తుది శ్వాస విడిచిన ప్రయాణికుడు -
రాష్ట్రపతిని కలిసిన ఏపీ గవర్నర్ బిశ్వభూషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన తొలి రోజు పర్యటనలో భాగంగా గురువారం భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను మర్యాద పూర్వకంగా కలిసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం డిల్లీ చేరుకున్న గవర్నర్.. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. గవర్నర్ హోదాలో దేశాధ్యక్షుడిని తొలిసారి కలుసుకున్న హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులను వివరించారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయిడు, హోం మంత్రి అమిత్ షా లను గవర్నర్ కలవనున్నారు. గవర్నర్ బిశ్వభూషన్తోపాటు కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎడిసి మాధవ రెడ్డి, ఆంధ్రా భవన్ అధికారులు ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం 1157మంది ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్య ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ మాత్రం మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అందరికీ ఆప్షన్లు ఇచ్చిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగుల విభజనను మరింత క్లిష్టం చేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ అరణ్మిశ్రా ధర్మాసనం తుది కేటాయింపులు జరిగాక దానిపై సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను కూడా పిటిషనర్లకే ఇచ్చింది. -
బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్పై ప్రధాని మోదీ మండిపాటు
-
ఎవరి కొడుకైతే ఏంటి?.. అతన్ని పీకేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా ప్రభుత్వ అధికారిని బ్యాటుతో చితకబాదిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన ఈ దాడి ఆయన ఖండించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయిన మోదీ ఈ దాడిపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతను ఎవరి కొడుకైతే ఏంటి...? అలా ప్రవర్తించడం మాత్రం సబబు కాదు’ అంటూ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారిపై పట్టపగలు దాడి చేసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆకాశ్.. బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా కొడుకు కావడం గమనార్హం. క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించడం ఎంత తప్పో, దాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పని.. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మోదీ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఆకాశ్ విజయ్వార్గియాతోపాటు అతనికి అండగా నిలిచిన వారిని సైతం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. అంతేకాకుండా ఆకాశ్ బెయిల్పై విడుదలైన సందర్భంగా అతనికి స్వాగతం చెప్పేందుకు వెళ్లిన వారిని, ఈ సందర్భంగా గాలిలో కాల్పులు జరిపిన వారిని కూడా పార్టీకి దూరంగా ఉంచాలని, అలాంటివారిని పార్టీ సహించబోదని పేర్కొన్నారు. ఇండోర్ మున్సిపల్ అధికారి దీరేంద్ర సింగ్ భాయ్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన విషయం తెలిసిందే. తన దుందుడుకు చర్యతో విమర్శలపాలైన ఆకాశ్ ఇండోర్-3 అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
నితిన్ గడ్కరీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, నేతకాని వెంకటేష్, బండ ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రహదారుల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రారంభించిన రోడ్ల విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని గడ్కరీని కోరారు. మందమర్రి నుంచి చెన్నూర్ వరకు నూతన రహదారి వేయాలని బాల్క సుమన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మార్గం ద్వారా దాదాపు 40 నుంచి 50 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. వెనకబడిన ప్రాంతాల నుంచి వెళ్లే ఈ మార్గంతో స్థానికంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మంత్రికి వెల్లడించారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలందరం కలిసి కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండ ప్రకాశ్ మీడియాకు వెల్లడించారు. -
చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు సంపాధించుకున్నబాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఓ చిన్నారితో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ సింగర్, ప్రియాంక భర్త నిక్ జోన్స్ మేనేజర్ కూతురు అవాకు డాన్స్ నేర్పుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో 1998 నాటి బాలీవుడ్ హిట్ మువీ ‘మేజర్ సాబ్’లోని ‘సోనా సోనా’ పాటకు ఎలా డాన్స్ చేయాలో అవాకు ప్రియాంక నేర్పుతున్నారు. ఇక, ప్రియాంక చోప్రా గత నెల ‘వాంగో టాంగో’ కాన్సర్ట్లో తన భర్త నిక్ జోన్స్తో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ రోమియో హో రోమిమో’ అంటూ పోస్ట్ చేసింది. సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే ప్రియాంక .. తన భర్త నిక్ జోన్స్ చేతిని మురిపెంగా పట్టుకున్న ఫోటోను ‘హోమ్ స్వీట్ హోమ్’ అంటూ షేర్ చేసింది. నిక్తో ప్రియాంక హైహీల్స్ వేసుకొని మోకాలుకు బాండేజ్ కట్టుకొని చేతిలో డియారో బహుమతి బ్యాగ్ని పట్టుకొని శనివారం నగరాన్ని సందర్శించి సందడి చేసింది. ఇటీవల ప్రియాంక ‘ఇజ్నాట్ ఇట్ రోమాంటిక్’ అనే హాలీవుడ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. -
నాన్న ఇల్లు అమ్మి.. రైఫిల్ కొనిచ్చాడు!
న్యూ ఢిల్లీ: ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రఖ్యాత షూటర్, ఒలింపిక్ మెడల్ సాధించిన గగన్ నారంగ్ తన తండ్రి గొప్పతనాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. షూటింగ్లో బాడా ఆడి దేశానికి గొప్ప పాత్రినిథ్యం వహించి పలు జాతీయ, అంర్జాతీయ పతకాలు సాధించాలని తన తండ్రి ఆకాంక్షించారని తెలిపారు. 20 ఏళ్ల క్రితం సొంతింటిని అమ్మి తనకు షూటింగ్ ప్రాక్టిసుకు ఇబ్బంది కలగకూడదని ‘రైఫిల్’ కొనిచ్చారని గుర్తుచేసుకున్నాడు. ‘ఏదో రోజు నేను భారతదేశానికి గొప్ప మెడల్స్ సాధిస్తాననే నమ్మకం నాన్నకు ఉండేది. అందుకే నా కోసం సొంతింటిని అమ్మి.. రైఫిల్ను కొనిచ్చారు’ అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ‘షూటింగ్లో ప్రపంచ రికార్డును నెలకొల్పుతానని, ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధిస్తానని నేను ఏనాడూ ఊహించలేదు. కానీ ఓ తండ్రిగా మా నాన్న నా ప్రతిభ మీద అపార నమ్మకం కలిగి ఉండేవారు’ అని తెలిపారు. ‘నా విజయాల వెనుక మా నాన్న సహకారం ఎంతో ఉంది. తండ్రిగా నా ప్రతిభను తెలుసుకోవడంతోపాటు, నా ముఖంలో సంతోషాన్ని నింపాలని తాపత్రయ పడిన గొప్పతండ్రి ఆయన.. హ్యాపి ఫాదర్స్ డే నాన్న’ అని పోస్ట్ చేశారు. -
‘అస్సలు ఊహించలేదు’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకున్నఅభ్యర్థులందరికి ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో మహారాష్ట్ర విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచాడు. బల్లార్పూర్కి చెందిన కార్తికేయ గుప్తా 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అలహాబాద్కి చెందిన హిమాన్షు సింగ్ రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీకి చెందిన ఈర్చిత్ బుబ్నా మూడో ర్యాంకు సాధించాడు. అస్సలు ఊహించలేదు.. ప్రతిష్టాత్మక పరీక్షలో టాపర్గా నిలవడం పట్ల కార్తికేయ హర్షం వ్యక్తం చేశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్లో సీట్ లభిస్తుందని అనుకున్నాను గానీ.. ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నాడు. రోజుకు 6 నుంచి 7 గంటలు పరీక్ష కోసం సన్నద్ధమైనట్లు తెలిపాడు. సబ్జెక్టు నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆస్వాదించినపుడే ఉత్తమైన ఫలితాలు పొందగలమన్నాడు. చదువుకునే సమయంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. తన ప్రిపరేషన్లో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చంద్రేశ్ గుప్తా, పూనం కీలక పాత్ర పోషించారని వెల్లడించాడు. వారి సహకారంతోనే ఇంటర్మీడియట్లో 93.7 శాతం మార్కులు సాధించానని పేర్కొన్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 19న జరగాల్సిన జేఈఈ పరీక్షను.. మే 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. తెలుసుకోవచ్చు. -
ప్రియాంక పడిపోయిందా..?
సాక్షి, ఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంక మెట్ల మీద నుంచి జారి పడబోయింది. అక్కడే ఉన్న తన భర్త ప్రియాంక పడిపోకుండా రెప్పపాటులో ఆమెని రక్షించాడు. ప్రియాంక మొదట కాస్త కంగారు పడినా తర్వాత ఒక్కసారిగా పగలబడి నవ్వింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో అభిమానుల్ని కట్టిపడేసింది. ప్రియాంక, నిక్ జోనస్లు గత సంవత్సరం జోధ్పూర్లో డిసెంబర్ 1,2 తేదీలలో క్రైస్తవ, హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరుపుకున్నారు. పెళ్లికి ముందురోజు నిక్ తనకిచ్చిన సర్ప్రైజ్ని మర్చిపోలేనని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ ‘ ఆ రోజు నా గదిలో ముస్తాబవుతుండగా నిక్ వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లాడు. ఆ దారి పూలతో అందంగా అలంకరించి ఉంది. అక్కడ నా కోసం షూస్ని బహుమానంగా పెట్టి ఉంచాడు. దాంతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంద’ని చెప్పింది. అందులో ‘నువ్వు నా అదృష్టానివి. నువ్వు ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. నన్ను నీ భాగస్వామిగా ఎంపిక చేసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది’ అని రాసి ఉందని ప్రియాంక తన సంతోషాన్ని వెలిబుచ్చింది. పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందో రిసెప్షన్ వేడుకను అంతకన్నా ఘనంగా జరుపుకుంది ఈ కొత్తజంట. రిసెప్షన్ను 4 రోజులపాటు ఢిల్లీ, ముంబై, అమెరికా ఉత్తర కరొలినాలోని కార్లొట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. -
ప్రియాంక పడిపోయిందా..?
-
ఎన్నికలప్పుడే ఆయనకు పూనకం వస్తుంది!
సాక్షి, న్యూఢిల్లీ: మాములుగా బాగానే ఉంటారు కానీ, ఎన్నికల సమయంలోనే పూనకం వచ్చినవాడిలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊగిపోతారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవర్ ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మోదీ పనిగా పెట్టుకున్నారని, ఈ నెల 10న ఆయన బారామతికి వస్తున్నారని, మీరే స్వయంగా ఆయన ఏం మాట్లాడతారో టీవీలో చూడువచ్చని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో శరద్ పవర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కుటుంబంపై మోదీ చేసిన వ్యక్తిగత ఆరోపణలకు పవార్ సమాదానమిస్తూ.. ‘నేను, మోదీ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. కానీ ఢిల్లీ, బారామతి, పూణేలోని వసంత్దాదా చక్కెర కర్మాగారం వద్ద మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలుసు. మా కుటుంబంలో జరిగిన ఏ గొడవలైనా మోదీకి ఎలా తెలుస్తాయి? ఆయనను ఓసారి కలిసినపుడు మా కుటుంబసభ్యులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని, మేమంతా కలిసే ఉంటామని చెప్పాను’ అని పేర్కొన్నారు. మోదీ కుటుంబంలో ఏ ఒక్కరైనా ఉన్నారో.. లేదో దేశానికే తెలియదని, అటువంటి వ్యక్తి ఇతరుల కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదని మండిపడ్డారు. ఒకవేళ మోదీ ఓడిపోతే, పార్లమెంటులో ఎంపీగా ఉంటారని, అపుడు తానే స్వయంగా మోదీకి వివరణ ఇస్తానని తెలిపారు. -
కేజ్రీవాల్ యాంటీ హిందూ.. అందుకే పోటీ!
న్యూఢిల్లీ: స్వయం ప్రకటిత స్వామీజీ, బిగ్బాస్ టీవీ షో మాజీ కంటెస్టెంట్ స్వామి ఓం మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘హిందూ వ్యతిరేక వైఖరి’ ని అవలంబిస్తున్నారని, అందుకే తాను న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని తెలిపారు. హిందూమత చిహ్నమైన స్వస్తిక్ను ఆప్ గుర్తు అయిన చీపురుకట్ట తరుముతున్నట్టు కేజ్రీవాల్ చేసిన ట్వీట్ను ఆయన తప్పుబట్టారు. ఈ నెల 23న హిందూ సంఘాలు సమావేశమై.. తనను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించాయని ఆయన చెప్పుకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచిన స్వామీ ఓంపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మహిళను లైంగిక వేధించి.. బెదిరించినట్టు కూడా ఆయనపై కేసు నమోదైంది. ఓ టీవీ చానెల్ లైవ్ చర్చా కార్యక్రమంలో ఆయన ఓ మహిళ వక్త చెంప చెళ్లుమనిపించారు. గతంలో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. -
నవీనమా...వికాసమా
సాక్షి, సెంట్రల్డెస్క్ : చీకట్లో మగ్గిన ఒడిశా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు నింపిన ప్రజాకర్షక నాయకుడు ఇప్పుడు ఏటికి ఎదురీదుతున్నారా? పందొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నవీన్ పట్నాయక్ పాలనకు ఇక తెరపడుతుందా? బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందా? 120 సీట్లు తమ లక్ష్యమని బీజేపీ ప్రకటిస్తే, 123 గెలుస్తామన్న ధీమా నవీన్ది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? అయిదోసారి కూడా నవీనపథంలో ప్రజలు నడుస్తారా? లేదంటే ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతారా?.. ఇప్పుడు అందరిలోనూ అదే ఆసక్తి.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఒడిశా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులున్న ఈ రాష్ట్రంలో ఆదివాసీలే ఎక్కువ. ఎటు చూసినా పేదరికం, ఆకలి కేకలు, ఉద్యోగాల కొరత.. వీటికి తోడు పులి మీద పుట్రలా ఎప్పుడు తుపాన్లు ముంచేస్తాయో తెలియదు. అలాంటి రాష్ట్రానికి ఆపద్బాంధవుడిలా వచ్చారు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్. 2000 సంవత్సరంలో ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఆయన.. అవినీతి బురదలో కూరుకుపోయిన అధికారులు, రాజకీయ నాయకుల్లో మార్పు తెచ్చారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు తీయించారు. సుపరిపాలన, ప్రజాసేవ, ఇతరుల్ని గౌరవించడమే పార్టీ నినాదాలుగా మార్చుకొని జనంలో పట్టు పెంచుకున్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఒకప్పటి ముఖ్యమంత్రి, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదు. బొగ్గు, బాక్సైట్, ఉక్కు, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండడంతో వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేశారు. మైనింగ్ కార్యకలాపాలతోనే మధ్య తరగతి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గత అయిదేళ్లలో రాష్ట్ర జీడీపీ సగటున 6.66 శాతం పెరుగుతూ వచ్చింది. ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచడానికి చర్యలు చేపట్టారు. గత ఏడాది దేశవ్యాప్తంగా నెలకొన్న మోదీ ప్రభంజనంలోనూ నవీన్ పట్నాయక్ సొంతంగానే అఖండ మెజార్టీని సొంతం చేసుకున్నారు. 147 అసెంబ్లీ స్థానాలకు 117 కైవసం చేసుకున్నారు. 21 లోక్సభ స్థానాల్లో 20 సీట్లలో విజయకేతనం ఎగురవేశారు. నవీన్కు ఎందుకింత ఆదరణ? సిక్కింలో పవన్కుమార్ చామ్లింగ్, త్రిపురలో మాణిక్ సర్కార్, పశ్చిమ బెంగాల్లో జ్యోతిబసు.. ఒకే రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రుల సరసన నవీన్ పట్నాయక్ కూడా చేరారు. నాలుగేళ్లు వరసగా అధికారం దక్కించుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారని జనం బలంగా నమ్మడం మొదటి కారణం. రెండోది– ప్రతిపక్షాల బలహీనతలు. కాంగ్రెస్ పార్టీలో జేబీ పట్నాయక్ హవా తగ్గిపోయాక నవీన్ పట్నాయక్ను ఢీకొట్టే నాయకుడే కనిపించలేదు. బీజేపీ కూడా ఇప్పటివరకు సమర్థుడైన నాయకుడ్ని తయారు చేయలేకపోయింది. 2008లో ఆదివాసీల అభ్యన్నతి కోసం పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన మత ప్రచారకుడు గ్రహం స్టెయిన్స్, ఆయన పిల్లల్ని వీహెచ్పీ కార్యకర్తలు ఖందమాల్లో దారుణంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో అప్పటివరకు ఎన్డీయేతో ఉన్న నవీన్ పట్నాయక్ ఆ కూటమితో తెగదెంపులు చేసుకొని సెక్యులర్ నాయకుడిగా ఎదిగారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ఒడిశాలో 2013లో ఫైలాన్ తుపాను సమయంలో ఆయన చూపించిన సన్నద్ధత తీసుకున్న చర్యల్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. అంతర్గత పోరే ఎసరు పెడుతుందా? నవీన్ పట్నాయక్కు జనంలో ఎంత చరిష్మా ఉన్నా.. సొంత పార్టీలో వ్యతిరేకత ఈసారి బలంగానే కనిపిస్తోంది. రెండో స్థాయి నాయకత్వాన్ని ఎదగనీయకుండా పార్టీని తన గుప్పెట్లో ఉంచుకోవడం మైనస్గా మారింది. గత కొన్నేళ్లలో 36 మంది మంత్రులపై ఏకపక్షంగా వేటు వేశారు. బీజేడీని స్థాపించిన తొలినాళ్లలో నవీన్కు అండదండగా ఉన్నవారినే తొలగించారు. వ్యవస్థాపక సభ్యుడు బిజయ్ మహాపాత్రో, రాజకీయ సలహాదారు పైరిమోహన్ మహాపాత్రో వంటి వారిని చాలా ఏళ్ల క్రితమే పార్టీ నుంచి గెంటేశారు. మూడేళ్లుగా నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీ వి.కె.పాండ్యన్ ఆడింది ఆటగా మారింది. పోస్కో స్టీల్ప్లాంట్, మరికొన్ని నేచురల్ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. పాండ్యన్ రాజ్యాంగేతర శక్తిగా ఎదగడంతో ఎంపీ బలభద్ర మాఝి, ఎమ్మెల్యేలు సుకాంత నాయక్, త్రినాథ్ గొమాంగో పార్టీని వీడారు. బీజేపీ బలం ఎలా పెరుగుతోందంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా చాలాకాలంగా ఒడిశాపై దృష్టి పెట్టారు. 120+ సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి షా.. వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మోదీ, షా తరచూ ఒడిశాలో పర్యటిస్తున్నారు. 2012లో 36 జిల్లా పరిషత్లను సాధించిన బీజేపీ, గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 297 స్థానాల్లో గెలుపొందింది. ఇది కచ్చితంగా నవీన్ పట్నాయక్ సర్కార్కు డేంజర్ బెల్స్ మోగినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బలభద్ర మాఝీ వంటి వారి చేరికతో మరింత బలం చేకూరింది. బాలాకోట్ దాడుల తర్వాత ఒడిశాలో జాతీయ భావం బాగా పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రేజ్ పెరిగింది. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు. అయితే రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారింది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హిందీ రాష్ట్రాల్లో గెలుపొందిన ఆత్మవిశ్వాసంతో ఒడిశాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. తరచూ ఒడిశా వెళుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే బీజేడీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఆకలి మరణాలు, ఆదివాసీలు ఎక్కువుండే ఈ రాష్ట్రంలో కోటి మంది కరువు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు నిరుద్యోగం 6.6 శాతానికి చేరుకుంది. 85 లక్షల మంది యువత ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి వ్యాపారాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటంతో సామాన్యుల్లో అసంతృప్తి.. ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం బీజేడీ అనుకూల అంశాలు సీఎం నవీన్ పట్నాయక్పై జనంలో సడలని నమ్మకం 19 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలతో పాటు పారిశ్రామిక ప్రగతి మహిళలకు 33 శాతం టికెట్ల కేటాయింపు ప్రతికూల అంశాలు 19 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేడీ నుంచి నాయకులు పార్టీని వీడడం బీజేపీ అనుకూల అంశాలు క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పట్టు బీజేడీ నుంచి తరలివస్తున్న నాయకగణం పుల్వామా తర్వాత ప్రజల్లో పెరిగిన దేశభక్తి ప్రతికూల అంశాలు సమర్థులైన నాయకుల కొరత నవీన్ పట్నాయక్కు ఉన్న జనాకర్షణ -
చీపురుకూ చెత్త అంటుతోందా !
సాక్షి వెబ్ ప్రత్యేకం : ఉన్నత చదువులు చదవి, ఉన్నత ఉద్యోగాల్లో చేరి, ఆ ఉద్యోగాలను కూడా తణప్రాయంగా త్యదించి, ప్రజా సంక్షేమం కోసం సామాజిక కార్యకర్త అవతారం ఎత్తడమే కాకుండా అవినీతి రహిత భారతాన్ని ఆవిష్కరించాలనే సమున్నత లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రివాల్ది సాధారణ నేపథ్యం కాదు. అనన్య సాధ్యం కానిది. అటడ్డుగు జనంలో చైతన్యం తీసుకొచ్చి సమాచార హక్కు అనే ఆయుధాన్ని ఎలా వాడాలో వారికి నేర్పించి ‘మెగసెసే’ అవార్డు అందుకున్న ఘన కీర్తి ఆయనది. మొదటిసారి మెజారిటీలేక 49 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినా తదుపరి ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 67 సీట్లు సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘన చరిత్ర ఆయనది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ ప్రజా నాయకుడిగా ఎదుగుతున్నారనుకున్న గ్రాఫ్ ఆయనది. నియంత్రత్వ పోకడలతో స్వీయ పార్టీలోనే కలహాలు చెలరేగి, మహా మహలు పార్టీనీ వీడిపోగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేక తడబడుతున్న వర్తమానం ఆయనది. అన్ని అధికారాలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే ఢిల్లీ ప్రజలను అన్ని విధాల ఆదుకోలేకపోతున్నానంటూ కేంద్రంపై కన్నెర్ర చేసి నిరవధిక దీక్ష చేస్తానంటూ నినదించిన ఆయనది భవిష్యత్తు బంగారు బాటేం కాదు. విద్యాభ్యాసం ఆయన హర్యానాలోని బివానిలో 1968, ఆగస్టు 16వ తేదీన జన్నించారు. ఖరగ్పూర్లోని ఐఐటీ నుంచి 1989లో మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేశారు. సివిల్స్ రాయలనే సంకల్పంతో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. సివిల్స్ రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేరారు. తనతోపాటు ముస్సోరిలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్’లో శిక్షణ పొందిన తన బ్యాచ్ అధికారి సునీతను పెళ్లి చేసుకున్నారు. ఆదాయం పన్ను శాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న కేజ్రివాల్ 2006లో ఆ పదవికి రాజీనామా చేసి పూర్తి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. ఆయన ఆదాయం పన్ను శాఖలో పనిచేస్తున్నప్పుడే 1999లో ‘పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. పేదలకు సరసమైన ధరలకు రేషన్ బియ్యం అందించడంతో పాటు సబ్సిడీ ధరలపై విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ పోరాటం జరిపారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అందుకు గుర్తింపుగా 2006లో మెగాసెసే అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును కార్పస్ ఫండ్గా పెట్టి ‘పబ్లిక్ కాజ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. అన్నా హజారే ఆధ్వర్యంలో 2012లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో అరవింద్ కేజ్రివాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుకు జన్ లోక్పాల్ బిల్లును తేవాలనే డిమాండ్కు ఆమోదం తెలిపారు. ఈ విషయంలోనే ఆయనకు అన్నా హజారేతో విభేదాలు వచ్చాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును తీసుకరావాలన్నది హజారే పంథా కాగా, తామే ప్రభుత్వుంలోకి వస్తే తప్ప అది సాధ్యం కాదన్న అభిప్రాయంతో కేజ్రివాల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావం 2012 అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి రోజున తాను పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రివాల్ ప్రకటించారు. 2012 నవంబర్ 26వ తేదీన (భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు) ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. 2013 డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటికీ మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిన షీలా దీక్షిత్పైనే పోటీచేసి గెలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కావాల్సిన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జన్ లోక్పాల్ బిల్లు విషయమై కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, ఇదే బిల్లు ఇష్టం లేక బీజేపీ మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో కేజ్రివాల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అఖండ మెజారిటీతో అధికారంలోకి 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఢిల్లీ నుంచి కాకుండా యూపీలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసి కేజ్రివాల్ ఓడిపోయారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.14 శాతం ఓట్లతో 70 సీట్లకుగాను 67 సీట్లలో తన పార్టీని విజయపథాన నడిపించారు. ఫిబ్రవరి 14వ తేదీన రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు అనుకూలంగా రాష్ట్రం విద్యుత్, రేషన్ సరకుల రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అంతర్గత కలహాల కారణంగా యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి సామాజిక కార్యకర్తలు కూడా పార్టీని వీడిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాంగా ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతారనుకున్న ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అవార్డులు – రివార్డులు అరవింద్ కేజ్రివాల్కు 2004 లో అశోక ఫెల్లో 2005 లో కాన్పూర్ ఐఐటీ నుంచి సత్యేంద్ర దూబే స్మారక అవార్డు 2006 లో రామన్ మెగసెసె అవార్డు 2006 లో సీఎన్ఎన్–ఐబీఎన్ నుంచి ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు 2009 లో ఖరగ్పూర్ ఐఐటీ నుంచి ‘డిస్టింగ్ష్డ్ అలుమ్నుస్ అవార్డ్’ 2009 లో భారతీయ అభివద్ధి సంస్థ ఫెల్లోషిప్ 2010 లో ‘ఎకనామిక్ టైమ్స్’ నుంచి కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు 2010 లో ఎన్డీటీవీ నుంచి హజారేతోపాటు ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కేజ్రివాల్ రాసిన పుస్తకం : స్వరాజ్ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో కేజ్రివాల్ ఇందులో వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సిద్ధించాలంటే ఢిల్లీలోని కొద్ది మంది పెద్దల చేతుల్లో అధికారం కేంద్రీకతమై ఉండరాదని, గ్రామ సభలకు, మొహల్లా సభలకు ఎక్కువ అధికారాలు ఉండాలంటూ ఆయన వాదించారు. కేజ్రివాల్ పైన పుస్తకాలు ది మేన్ విత్ ఏ విజన్–అరవింద్ కేజ్రివాల్ ది జర్ని ఆఫ్ అరవింద్ కేజ్రివాల్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ - వి. నరేందర్ రెడ్డి -
సెల్ఫీ దిగడం మానేయండి! పేలకు చెక్ పెట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ: పేలు.. వీటితో బాధపడినవారు కనీసం ఇంటికొక్కరైనా ఉంటారు. ఆడపిల్లలకైతే ఈ బాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పటికీ మీరు పేల సమస్యతో బాధపడుతుంటే ఓసారి మీ అలవాట్లను చెక్ చేసుకోండి..! బహుశా మీకు సెల్ఫీ దిగే అలవాటు ఎక్కువగా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే తలలో పేలు పెరగడానికి సెల్ఫీ దిగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘సెల్ఫీలంటే ఈ మధ్య పుట్టుకొచ్చిన పిచ్చి. కానీ పేలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా?’ అనే అడగాలనుకుంటున్నారు కదూ? నిజమే.. అయితే తలలో పేలు పెరగడానికి ఎన్నో కారణాలున్నా.. సెల్ఫీ కూడా ఓ కారణమని చెబుతున్నారు. సెల్ఫీలు దిగే అలవాటు ఉన్నవారు స్నేహితులతో కలసి తలలు ఆనించుకుంటూ దిగుతారు. ఇటువంటప్పుడు ఒకరి తలలోని పేలు మరొకరి తలలోకి సులభంగా చేరిపోతాయట. అంతేకాదు.. చెవిదగ్గర పెట్టుకునే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పుడు లాజిక్ సరిపోయిందా! -
'ఈ సమావేశాలు దేశాన్ని మలుపు తిప్పుతాయి'
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో భారత పార్లమెంటులో అర్థవంతంగా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో తమ భుజానవేసుకొని సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రుల వివరాలు ప్రధాని మోదీ సభకు పరచియం చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన నాయకులకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాపం తెలియజేశారు. అనంతరం సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ ఈ వర్షాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భారత్ను ఓ కొత్త మార్గంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో ఎక్కువ విలువ ఉన్న అంశాలపై చర్చ జరగాలని అన్నారు. జీఎస్టీ బిల్లును ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తుచేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇటీవల మరణించిన నేతలకు లోక్ సభ సంతాపం ప్రకటించింది. మరోపక్క, రాజ్యసభ సభ్యుడిగా వెంకయ్యనాయుడు ప్రమాణం చేశారు. హిందీ భాషలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, నిర్మలాసీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేశారు. టీజీ వెంకటేశ్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.