New twist
-
విశాఖలో NRI మహిళ మృతి కేసులో అనేక ట్విస్టులు
-
మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
-
వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత నిఘా విభాగం ‘రా’మాజీ అధికారి అని అమెరికా ఆరోపిస్తున్న వికాస్ యాదవ్(39) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్సింగ్ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్పై అమెరికా దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్ను సహ కుట్రదారుడిగా చేర్చారు. అయితే, ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో గత ఏడాది డిసెంబర్ 18న వికాస్ యాదవ్ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్లో అతడికి బెయిల్ లభించిందని వెల్లడించాయి. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారిని అపహరించి, డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట వికాస్ బెదిరించాడని వివరించాయి. స్పెషల్ సెల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో 2023 డిసెంబర్ 11న తనను కలవాలని వ్యాపారవేత్తకు వికాస్ సూచించాడు. కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో బాధితుడు తన మిత్రుడితో కలిసి వికాస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వికాస్ వెంట అబ్దుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వికాస్, అబ్దుల్లా కలిసి వ్యాపారవేత్తను ఓ కారులోకి బలవంతంగా ఎక్కించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులమని చెప్పారు. ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నారు. తర్వాత వదిలేశారు. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉంచిన రూ.50 వేల నగదును వికాస్, అబ్దుల్లా తీసుకున్నట్లు బాధితుడు గుర్తించాడు. సీసీటీవీ రికార్డింగ్లు సైతం తొలగించినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వికాస్ యాదవ్, అబ్దుల్లాపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న వికాస్పై చార్జిïÙట్ దాఖలు చేశారు. కోర్టు అతడికి మార్చి 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 22న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. వికాస్ యాదవ్ మాజీ ప్రభుత్వ అధికారి అని బెయిల్ ఆర్డర్లో కోర్టు పేర్కొంది. అయితే, అమెరికా దర్యాప్తు అధికారులు తమ అభియోగాల్లో వికాస్ను భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రెటేరియట్లో పనిచేసే అధికారిగా ప్రస్తావించారు. వికాస్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, అతడు ప్రభుత్వ అధికారి కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ స్పష్టంచేశారు. ఖలిస్తాన్ ఉద్యమం ఆగదు: పన్నూ వికాస్ యాదవ్పై అమెరికా అధికారులు అభియోగాలు మోపడంపై గురు పత్వంత్సింగ్ పన్నూ తాజాగా ‘ఎక్స్’వేదికగా స్పందించాడు. అమెరికా పౌరుడి జీవితాన్ని, స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలన్న ప్రాథమిక రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అంకితభావం చూపిందని ప్రశంసించాడు. స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ అమెరికా పౌరుడి ప్రాణాలను అమెరికా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పాడు. వికాస్ యాదవ్ ఒక మధ్యశ్రేణి సైనికుడు అని వెల్లడించాడు. పన్నూను హత్య చేయాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోపాటు ‘రా’చీఫ్ సామంత్ గోయెల్ నుంచి వికాస్ యాదవ్కు ఆదేశాలు అందాయని ఆరోపించాడు. ఖలిస్తాన్ రెఫరెండమ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే తనను అంతం చేయాలని కుట్ర పన్నారని విమర్శించాడు. తనపై ఎన్ని హత్యాయత్నాలు జరిగినా ఖలిస్తాన్ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పాడు. భారత్లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతానని, ఇందులో భాగంగా నవంబర్ 17న న్యూజిలాండ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు. భారత్కు ఇబ్బందులేనా? ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే కెనడా, భారత్ మధ్య దూరం పెరుగుతోంది. తమ దేశ పౌరుడైన నిజ్జర్ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరో ఉగ్రవాది పన్నూ హత్యకు జరిగిన కుట్ర కేసులో భారతీయుడైన వికాస్ యాదవ్పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మున్ముందు భారత ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వికాస్ యాదవ్న తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఇంకా భారత్ను కోరలేదు. తమ భూభాగంలో తమ పౌరుడిని(పన్నూ) హత్య చేయడానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమని అమెరికా అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. -
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్
-
హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్
-
సీసీటీవీ ఫుటేజ్ మాయం..డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
మంచింగ్ కోసం బోటులో ఉప్పు చేప ఫ్రై చేయడం కారణంగానే మంటలు
-
చంపాపేట్ లో స్వప్న హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చేసుకుంది. పెద్దమ్మ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ సంబంధం వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా సంపులో పడి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు బొబ్బిలి నుంచి విశాఖ రాగా, విశాఖ వచ్చిన పెద్దమ్మ పార్వతీ వేధింపులు ఆగలేదు. సంధ్య భర్తను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ కాగా, ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
హయత్నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే, అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్పేట్లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా, ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో.. ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె ఆ బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది.. నిన్నటి వరకు తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా పోలీసులు తేల్చేశారు. అతనితో కలిసి వెళ్లి.. బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్చాట్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్లో ఇరువురు ఫొటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద రాగా.. అతనితో కలిసి వెళ్లింది. చదవండి: నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్గా వీడియో కాల్స్ మాట్లాడి.. ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అసలు నాటకం అక్కడే మొదలైంది.. ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. తప్పించుకుని వచ్చానని తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ బాలికకు ధైర్యం చెప్పి.. పోలీసులకు సమాచారం అందించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. విచారణలో అసలు నాటకం బయటపడింది. చదవండి: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్! -
HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది?
సాక్షి, హైదరాబాద్: తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. గత కొంత కాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న తల్లి, కూతురు కరోనా సమయం నుంచి బయటికి రావడం లేదు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు అలివేలు.. భర్తనుదూరంగా పంపించింది. భర్త సదానందానికి రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపించింది. కూతురు చేతిపై ‘Do Something That Make You Happy’ అని రాసింది. ‘The Game Is Started’ అని గోరింటాకుతో రాసుకున్న తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యకి ముందు.. ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఇదే విషయంపై కొడుకుతో వాగ్వివాదం జరిగింది. ఉద్యోగం మానేసిన భర్త సదానందం.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. రెండేళ్లగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇంటి పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు.. ఆత్మహత్యకి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు.. ఎందుకు అని బాబు అడిగితే.. చిన్న పిల్లాడివి.. నీకేం తెలియదు అంటూ తల్లి మందలించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వెల్లడించారు. -
రాజేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
-
రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాదం ఘటనలో కొత్త ట్విస్ట్
-
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం
-
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
-
ఢిల్లీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
అటు ఈడీ ఇటు సీబీఐ.. జంక్షన్ లో బీఆర్ఎస్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్స్టా బయోలో తాను సూపర్వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టు బెయిలిచ్చినా నిందితులు విడుదల కాలేదు. రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమకూర్చలేక న్యాయవాదులు తంటాలు పడుతున్నారు. నందకుమార్పై పెండింగ్ కేసులో బెయిల్పై నాంపల్లి కోర్టు శనివారం తీర్పు చెప్పనుంది. కోర్టు ఆర్డర్ తర్వాతే నందకుమార్ విడుదలపై క్లారిటీ రానుంది. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు కొట్టేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ అన్నారు. చదవండి: పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్ -
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు సీఐబీ కోర్టు కస్టడీ విధించింది. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. విచారణ సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు చందన్ను ఈడీ అధికారులు కొట్టారంటూ శరత్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. బలవంతంగా చందన్ స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. ఈడీ అధికారులు కొట్టిన దెబ్బలకు చందన్ చెవి దెబ్బతిందని శరత్ తరపు లాయర్ అన్నారు. బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు చందన్రెడ్డి పేర్కొన్నారు. ఈడీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని శరత్ తరఫు న్యాయవాది అన్నారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గత నెలలో మొయినాబాద్ పోలీసులు రామచంద్రభారతి, సింహయాజితోపాటు నగరానికి చెందిన నందుపై కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా, రామచంద్రభారతి తనకు రెండు డ్రైవింగ్ లైసెన్సులు, రెండు పాన్కార్డులు, రెండు ఆధార్ కార్డులు చూపించి ప్రభుత్వంలో తాము ఏమైనా చేయగలమని చెబుతూ మోసం చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రామచంద్రభారతిపై ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం గమనార్హం. చదవండి: గవర్నర్కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
మనోజ్ కేసులో కొత్త ట్విస్ట్.. మధ్యవర్తిగా ‘పెద్ద మనిషి’.. బెడిసి కొట్టిన వ్యూహం..
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసు సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఫిర్యాదుదారులు కూడా సహ నిందితులని తేలింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో డబ్బు రాబట్టుకునేందుకు ‘ఫిర్యాదు’ డ్రామాకు తెరలేపారని నిర్ధారించారు. ‘ఫిర్యాదు’ ప్లాన్కు రూపకల్పన చేసిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. టీడీపీ బడా నేతల అండదండలు కలిగిన అనంతపురానికి చెందిన రాయల్ శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు అలియాస్ డీవీ నాయుడు ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్తో జతకట్టారు. అతని సహకారంతో నకిలీ ఎన్ఓసీలు సృష్టించడం, డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయించడం తదితర అక్రమ మార్గాల ద్వారా అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. చదవండి: వచ్చే రెండు రోజులు వర్షాలు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు.. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వేనంబర్ 513లోని భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం రూ.కోట్లు చేతులు మారాయి. చెప్పిన విధంగా ఎన్ఓసీ చేయించకపోవడంతో భూమి యజమాని తానిచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. మనోజ్ మాత్రం గడువు మీద గడువు కోరుతూ వచ్చాడు. ఇరువైపులా కమీషన్ తీసుకున్న రాయల్ శ్రీనివాసులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఇరకాటంలో పెట్టయినా సరే మనోజ్ నుంచి డబ్బు రాబట్టాలని డీవీ నాయుడుతో కలసి ప్లాన్ వేశారు. రంగంలోకి ‘పెద్ద మనిషి’.. అనుకున్నదే తడవుగా పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ ‘పెద్ద మనిషి’ని రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ఆశ్రయించారు. ఎలాగైనా మనోజ్పై ఒత్తిడి పెంచి డబ్బు రాబట్టాలని, మీరు కూడా కావలసినంత దండుకోవచ్చని సలహా ఇచ్చారు. మనోజ్ను భయపెట్టడానికి అవసరమైతే అతని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ‘పెద్ద మనిషి’ సరేనన్నాడు. ఈ పని చేసిపెట్టడానికి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి.. అనంతపురంలోని పోలీసు అతిథిగృహానికి పిలిపించాడు. మనోజ్ను భయపెట్టి, మనకు కావలసినంత డబ్బు రాబట్టుకోవడానికి ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వాలని శ్రీనివాసులు, డీవీ నాయుడు కోరారు. ఎన్ఓసీ విషయంలో మనోజ్ మోసం చేశాడని ‘పోలీస్ స్పందన’లో ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదు నేరుగా తన వద్దకే వస్తుందని, అప్పుడు మన పని సులభమవుతుందంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్కా ప్లాన్ రచించారు. ఇందుకు గాను శ్రీనివాసులు, నాయుడుతో డీల్ కుదుర్చుకున్నారు. వీరికి అనుసంధానకర్తగా ఉన్న ‘పెద్ద మనిషి’కి కూడా రూ.లక్షల్లో ముట్టజెప్పారు. బెడిసి కొట్టిన వ్యూహం.. సీఐ ప్లాన్ మేరకు గత నెలలో రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ‘స్పందన’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మనోజ్ తమను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్గా తీసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)ను రంగంలోకి దింపారు. మనోజ్ను ఎస్ఓజీ తన ఆదీనంలో ఉంచుకుంది. తెలుగు తమ్ముళ్లలో ఒకరైన రాయల్ శ్రీనివాసులును సైతం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. దీంతో మరొక తెలుగు తమ్ముడు డీవీ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా వ్యూహం బెడిసికొట్టడంతో సదరు సీఐ కంగుతిన్నారు. నిందితులను ఎస్పీ నేరుగా విచారణ చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం నిందితుల వద్దే ఉంటున్నట్లు సమాచారం. -
అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన అట్రాసిటీ కేసు ఫాల్స్గా నిర్థారణ అయ్యింది. ఎస్పీపై నమోదైన ఎఫ్ఐఆర్పై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేశారు. చదవండి: 15 మంది బాయ్ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. పోలీసు నియమావళిని ఉల్లంఘించినందునే కానిస్టేబుల్ ప్రకాష్ను ఎస్పీ డిస్మిస్ చేశారని ఆయన వెల్లడించారు. 11 క్రిమినల్ కేసులు నమోదైనందునే ప్రకాష్ను ఎస్పీ డిస్మిస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దురుద్దేశంతో ఎస్పీ ఫకీరప్ఫపై డిస్మిస్ కానిస్టేబుల్ కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో అనంతపురం టూటౌన్లో నమోదైన ఈ కేసును కొట్టివేశారు. -
అర్ధరాత్రి మహిళ ఇంట్లో ‘డిస్మిస్’ కానిస్టేబుల్.. ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి హౌసింగ్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉన్న ప్రకాష్.. లక్ష్మి బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ప్రకాష్కు లక్ష్మి భర్త, బంధువులు దేహశుద్ధి చేశారు. లక్ష్మిని లోబరుచుని నగదు, బంగారం అపరిహరించాడని ఆమె భర్త, బంధువులు అంటున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి కాగా, ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆది నుంచీ నేర చరిత్ర కలిగిన వాడని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రకాష్పై ఉన్న కేసులు, అభియోగాలను వివరించారు. ఉన్నతాధికారులు అతన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారన్న దానిలో వాస్తవం లేదన్నారు. ప్రకాష్పై అభియోగాలు రుజువైనందున అండర్ రూల్ ఆఫ్-20 ‘ఏపీసీఎస్ రూల్స్ 1991’ ప్రకారం ఆగస్టు 24న ప్రకాష్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. విచారణ రిపోర్టులు అన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు. ఇదీ లక్ష్మి కేసు.. ‘అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన బి.లక్ష్మి ‘స్పందన’లో జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక పిటిషన్ ఇచ్చింది. కానిస్టేబుల్ ప్రకాష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించడమే కాకుండా 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొన్నాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించి, బెదిరించినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఎస్పీ తక్షణమే గార్లదిన్నె పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. గార్లదిన్నె ఎస్ఐ 2019 జూన్ 22న కేసు నమోదు చేశారు. ప్రకాష్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఎస్పీకి నివేదిక పంపారు. దాని ఆధారంగా 2019 డిసెంబరు 19న ప్రకా‹Ùను సస్పెండ్ చేశారు. అదే రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్గా ధర్మవరం ఎస్డీపీవో రమాకాంత్ని నియమించారు. ఓరల్ ఎంక్వైరీ ఆఫీసర్గా అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాను నియమించారు. విచారణాధికారులు 8 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. మార్చి 1న లక్ష్మి కూడా డీఎస్పీ మహబూబ్ బాషా ముందు సాక్ష్యం ఇచ్చింది. ప్రకాష్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడని తెలిపింది. ఈ ఏడాది జూన్ 23న ప్రకాష్ ఓరల్ ఎంక్వైరీ ఆఫీసరు ముందు సంజాయిషీ ఇచ్చారు. లక్ష్మి చెప్పిన విషయాలను అతను ఖండించలేదు. దీంతో ఓరల్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్టును జూన్ 23న డీఎస్పీ మహబూబ్బాషా జిల్లా ఎస్పీకి అందజేశారు. అనంతరం ప్రకాష్కు మూడు నోటీసులిచ్చాం. చివరి నోటీసుకు అతను ఆగస్టు 17న సంజాయిషీ ఇచ్చారు’ అని ఏఎస్పీ వివరించారు. ప్రకాష్ నేరాల చిట్టా ఇది ♦2000 ఫిబ్రవరి 11న ఆర్ఎస్ఐ శేఖర్పై హత్యాయత్నం కేసులో ప్రకాష్ నిందితుడు. ఈ కేసులో 2001 జనవరి 1న అతన్ని అరెస్టు చేశాం. ♦2006లో హైవే పెట్రోలింగ్ వాహనం డ్రైవర్గా ఉన్న ప్రకాష్.. ఇందిరా ప్రియదర్శిని హోటల్ çసప్లయర్ బి.ధనుంజయబాబును ఇనుప రాడ్తో కొట్టాడు. ఈ కేసులో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి 2 ఏళ్లు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. అప్పీల్ సమయంలో నిందితుడు, ఫిర్యాదుదారు రాజీ పడ్డారు. ♦2008 అక్టోబరు 18న కదిరిలో బజాజ్ క్యాలిబర్ (ఏపీ0హెచ్ 5780) చోరీ చేశాడు. ♦2009లో అనంతపురం సాయినగర్కు చెందిన కురుగోడు గంగాధర్కు స్లె్పండర్æ బైక్(ఏపీ04ఎఫ్ 0874) చోరీ చేశాడు. ఈ కేసులో ప్రకా‹Ùను పోలీసులు 2009 జూన్ 13న అరెస్టు చేశారు. ♦2009 జూన్ 12న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద బైక్ (ఏపీ02 కే 9283) చోరీ చేశాడు. ఈ కేసులోనూ ప్రకాష్ను అరెస్టు చేశారు. ♦కదిరిలో 2014 ఫిబ్రవరి 11న ప్రకాష్, మరో నలుగురు ఏపీ 02 ఆర్ 1456 స్కార్పియో వాహనంలో అబ్రహాంను కిడ్నాప్ చేసి కేరళలో నిర్బంధించి, ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. ♦2019లో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుండగా కలెక్టర్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ఈ ఏడాది అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రకాష్పై ఫోర్జరీ కేసు నమోదయ్యింది. ఈ తరహా 10 కేసులతో పాటు శాఖాపరమైన చర్యలు ప్రకా‹Ùపై చాలా ఉన్నాయి. ♦2008 జూన్ 25న ప్రకాష్ను ఓసారి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఎస్పీ, మరో ఇద్దరు అధికారులపై కేసు నమోదు డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, అనంతపురం సీసీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషాలపై (క్రైం నంబర్ 209/2022 అండర్ సెక్షన్ 167, 177, 182 రెడ్విత్ 34 ఐపీసీ 3 (1)(క్లాజ్), సెక్షన్ 3 (2) సెవెన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్) కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణాధికారిగా పలమనేరు ఎస్డీపీవో సి.ఎం. గంగన్నను నియమిస్తూ డీఐజీ ఎం.రవిప్రకాష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాష్ అందుబాటులోకి రాలేదు : గంగన్న ఎస్పీపై నమోదైన కేసులో విచారణాధికారి గంగన్న గురువారం అనంతపురం వచ్చారు. విచారణకు హాజరుకావాలని కానిస్టేబుల్ ప్రకాష్ను ఫోన్లో సంప్రదించామన్నారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో నోటీసు ఇంటికి, ప్రకాష్ ఫోన్కు మెసేజ్, వాట్సాప్ ద్వారా పంపినట్లు చెప్పారు. -
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా? తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్ డిస్క్లను దొంగించారని రాజు పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కంచన్బాగ్ డీఆర్డీవో హనీ ట్రాప్ కేసులో కీలక ట్విస్ట్
-
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేటీఆర్
-
మత ఘర్షణల కేసులో ట్విస్ట్.. ఖైదీలపై కేసు!
శ్రీ రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసులు మత ఘర్షణల పేరిట ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. వాళ్లు ఘర్షణల కంటే నెల ముందు నుంచే జైళ్లో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. హత్యాయత్నం పేరిట దాఖలైన ఓ కేసులో ఆ ముగ్గురు.. మార్చి 5వ తేదీ నుంచి జైల్లోనే ఉన్నారన్న విషయం ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడంతో వెలుగు చూసింది. ఆల్రెడీ జైల్లో ఉన్న ఈ ముగ్గురిపై విచిత్రంగా.. ఏప్రిల్ 10న బార్వాని జిల్లా సెంద్వా దగ్గర చోటుచేసుకున్న అల్లర్లలో ఓ మోటర్ బైక్ను తగలబెట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో కొసమెరుపు ఏంటంటే.. హత్యాయత్నం కేసు నమోదు అయిన పోలీస్ స్టేషన్లోనే.. ఇప్పుడు ఈ మతఘర్షణల కేసు కూడా ఫైల్ కావడం. దీని గురించి ఉన్నతాధికారుల్ని మీడియా ఆరా తీయగా.. ఫిర్యాదుదారుని(వివరాలు వెల్లడించలేదు) ఆరోపణల మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై విచారణ చేపట్టి జైలు సూపరింటెండెంట్ నుంచి సమాచారం తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా.. ఉరేగింపులపై ఖార్గాన్, బర్వానీ జిల్లాల్లో రెండు చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో 24 మంది, ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. దీంతో అధికారులు 16 ఇళ్లు, 29 దుకాణాలను కూల్చేశారు. ఇక సెంద్వాలో బైక్ను తగలబెట్టారన్న ఆరోపణలపై షాబాజ్, ఫక్రూ, రౌఫ్లపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ముగ్గురిలో ఒకడైన షాబాజ్ ఇంటిని అక్రమ కట్టడంగా ఆరోపిస్తూ అధికారులు దగ్గురుండి బుల్డోజర్లతో కూల్చేయించారు కూడా. ఆ సమయంలో షాబాజ్ తల్లి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేయడంపై చేతులెత్తి వేడుకుంది.. తమ కొడుకు అప్పటికే జైల్లో ఉన్నాడని అధికారులకు చెప్పింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది కూడా. సంబంధిత వార్త: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అసదుద్దీన్ సవాల్ -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
-
నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం
-
హారిక మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): పిఠాపురంలో అదృశ్యమైన విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉప్పాడ సెంటర్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న హారిక విజివల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మూల మలుపు వద్ద బ్లూ కలర్ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని.. అయితే హారిక అంతకు ముందు తాను ఆటోలో వస్తున్నానని.. ఆటో డ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉందంటూ తన స్నేహితురాలికి వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అదే సమయంలో కొన్ని వాట్సాప్ గ్రూప్ల నుంచి లెఫ్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హారిక కోసం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థిని బీబీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. హాల్ టికెట్ కోసం హారిక పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు..
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు
-
జూబ్లీహిల్స్ ఘటనలో కొత్త ట్విస్ట్..
-
మీనా జ్యువెలర్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
-
జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే కారు బీభత్సం కేసులో కొత్త కోణం
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో మరో పరిణామం
-
మట్టిమాఫియా దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
-
షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తన కూతురు షీనా బతికే ఉందని ఈ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ సీబీఐని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని ఇంద్రాణి డిమాండ్ చేయంటా హాట్ టాపిక్గా నిలిచింది. తన కూతురు షీనా బోరా బతికే ఉందని ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులోని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరింది. దీంతో ఈ లేఖపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఇంద్రాణి నేరుగా సీబీఐకి లేఖ రాశారని, ఈ లేఖలో ఆమె ఏమి ప్రస్తావించారో తనకు తెలియదని అన్నారు. దీనిపై సమాచారం సేకరిస్తానని చెప్పారు. కాగా షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె. ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలు షీనా, మిఖాయిల్లను గౌహతిలో వదిలి ముంబైకి వెళ్లి అక్కడ మీడియా బారన్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఇంద్రాణి షీనాను తన సోదరిగా పీటర్కు పరిచయం చేసింది. అనూహ్యంగా 2012లో షీనా అదృశ్యమైంది. దాదాపు మూడేళ్ల తరువాత కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఇంద్రాణి ముఖర్జీని 2015లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మూడు ఛార్జిషీట్లు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అలాగే ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జీను నిందితులుగా పేర్కొంది. డబ్బు, ఇల్లు కోసం షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తుపాకీ పట్టుబడటం, అతని వాంగ్మూలం ఆధారంగా ఇంద్రాణి షీనాను హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకోగా, పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. ఈ కేసులో గత నెలలో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
వివాహిత ఆత్మహత్య కేసులో ట్విస్ట్
పెడన(కృష్ణా జిల్లా): కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడా? భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య చేసి.. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. పెడన పట్టణంలోని ఐదో వార్డు దాదాగుంట సమీపంలో అక్టోబర్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత నఫిసాబేగం(31) కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తు పోయే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అవమానించిందని ఇంటి పెద్ద కోడలిని చంపేశారు..) దీంతో ఈ కేసును తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా మార్చారు. దీనికి సంబంధించి ఎస్ఐ టి. మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం పరాసుపేటకు చెందిన నఫిసాబేగం(31)ను పెడన దాదాగుంటకు చెందిన ఎండీ యూసఫ్కు ఇచ్చి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల బాబు. వివాహామైన నెల రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరగసాగాయి. ఈ క్రమంలో యూసఫ్ మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం నఫిసాబేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. (చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి) ఈ విషయమై అక్టోబరు 26న ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన యూసఫ్ తన భార్య వంటింట్లో ఉరివేసుకుందని కిందకు దించానని చెప్పి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు మహమ్మద్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూసఫ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టు మార్టం నివేదిక ఆధారంగా విచారించారు. ఈ విచారణలో నఫిసాబేగంది ఆత్మహత్య కాదని తేల్చి.. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
దర్భంగా పేలుడు కేసులో కొత్తకోణం
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నెల్లూరు: గూడూరు రెండు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం బయటపడింది. యువతిని హత్య చేసి యువకుడు ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. యువతి గొంతుపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్లో యువకుడు చికిత్స పొందుతున్నాడు. -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్
-
మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, తిరుపతి/మదనపల్లె: సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మదనపల్లెలోని శివనగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ కుమార్తెలైన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను పూజల పేరుతో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తల్లిదండ్రులు కూడా బలిదానం చేసుకోవాలని భావించారట. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆ ప్లాన్ బెడిసికొట్టినట్టు వారిద్దరూ తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటలు ఆలస్యమైతే ఆ ఇద్దరూ మరణించి ఉండేవారని సమాచారం. మళ్లీ పుడతామనే మూఢ నమ్మకంతో.. పిల్లలిద్దర్నీ చంపిన తల్లిదండ్రులు అనంతరం వారు కూడా బలిదానం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేయడం వల్ల నలుగురూ కలిసి మరోసారి జన్మిస్తామనేది వీళ్ల మూఢ నమ్మకం. ఈ విషయాల్ని పురుషోత్తం నాయుడు తన సహోద్యోగి ఒకరికి ఫోన్ చేసి చెప్పాడు. తాము కూడా మరికొద్దిసేపట్లో చనిపోతామని, ఆ అద్భుతాన్ని వచ్చి చూడాలని ఫోన్లో కోరినట్టు తెలిసింది. వెంటనే మేల్కొన్న సహోద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పురుషోత్తం నాయుడు, పద్మజలను అదుపు చేశారు. తల్లి పద్మజ మాత్రం తన బిడ్డలు బతికి వస్తారని.. పోలీసులు, ప్రజలు అనవసరంగా ఆందోళనపడుతున్నారని వాదిస్తోంది. చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు') మూడో వ్యక్తి ప్రమేయంపై అనుమానాలు సోమవారం ఉదయం పురుషోత్తం నాయుడును పరామర్శించేందుకు వచ్చిన స్నేహితుడు, సహోద్యోగి జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. స్నేహితుడి అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులెవరో కుటుంబాన్ని ఊబిలోకి దించి ఈ ఘాతుకం చేయించారన్నారు. ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తులు వారి బిడ్డల్ని ఇంత కర్కశంగా హత్య చేశారంటే నమ్మలేమని.. దీనివెనుక ఎవరోఉన్నారని ఆరోపించారు. ఇదిలావుండగా అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఆ రూ.5 కోట్లే హత్యకు కారణమా? -
అంతా ఆమే చేసిందా?
-
బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు
-
ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసులో మలుపులు
-
గ్యాంగ్ వార్ కేసులో కొత్తకోణం
-
బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్
-
టీడీపీ,జనసేన భూ వివాదం: ఒకరి మృతి
సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పటమటలో ఆదివారం జరిగిన ఇరువర్గాల పరస్పర దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంగా మొదట అంతా భావించారు. మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో భాగంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. (రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు) ఒకే ల్యాండ్ విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ల్యాండ్ దక్కించుకునేందుకు హత్యలకు ఇరువర్గాలు స్కెచ్ వేశాయి. రాజీ ముసుగులో ప్లాన్ అమలుకు రెండు గ్రూపులు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్తోనే కత్తులు,కర్రలతో వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. టీడీపీకి చెందిన తోట సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తింపు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. దాదాపు 30 మంది ఘర్షణకు పాల్పడినట్టు గుర్తించారు. (చంద్రబాబుపై కేసు నమోదు) భూ వివాదంలో ఒకరు మృతి.. టీడీపీ, జనసేన మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. రూ.2 కోట్ల స్థలం విషయంలో చెలరేగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్
-
జెట్ ఎయిర్వేస్ సాగాలో న్యూ ట్విస్ట్
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సాగాలో సరికొత్త ట్విస్ట్ వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రమోటర్, గత నెలలో చైర్మన్గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్లైన్స్లో వాటాను తిరిగి దక్కించు కోవాలని యోచిస్తున్నారట. జెట్లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్మ్యాప్తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిడ్ను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రుణపరిష్కారప్రనాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వెస్లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్లైన్ను పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్ 12వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల ఒక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్బీఐ అధికారులతో సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా అప్పుల సంక్షోభంతో కుప్పకూలుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు వెన్నంటుతున్నాయి. తీవ్ర నిధుల కొరత, రుణాల భారంతో పాటు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్ధితిలో జెట్ ఎయిర్వేస్ అష్ట కష్టాలు పడుతోంది. బాకీలు కట్టలేందంటూ ఎయిర్వేస్కు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఇంధన సరఫరాను నిలిపివేసింది. తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించే ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ను స్థాపించి విజయపథంలో పరుగులు పెట్టించిన ఛైర్మన్ నరేష్ గోయల్ చివరికి అనివార్య పరిస్థితుల్లో కంపెనీ బోర్డు నుంచి సతీమణి అనితా గోయల్తోపాటు వైదొలగిన సంగతి తెలిసిందే. -
జయరామ్ హత్య కేసులో మరో కోణం
-
మలుపు తిరుగుతున్న నవ వరుడు హత్యకేసు
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఐటీడీఏ పార్క్ సమీపంలో ఇటీవల జరిగిన నవ వరుడు హత్యకేసు ఉదంతం మలుపు తిరుగుతోంది. కట్టుకున్న భార్యే... భర్తను హతమార్చడానికి పన్నిన పన్నాగాన్ని పోలీసులు చేధించారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు మృతుడి భార్య సరస్వతి, ప్రియుడు శివకుమార్ కలిసి విశాఖకు చెందిన గుండాలతో హత్య చేయించినట్లు తెలిసింది. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మృతుడు గౌరీశంకర్ భార్య సరస్వతికి బెంగళూరులో ఒక స్నేహితురాలు ఉంది. సరస్వతి భర్త గౌరీశంకరరావు కూడా బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సరస్వతి తన స్నేహితురాలితో కలసి బెంగళూరులోనే తన భర్త గౌరీశంకర్ను హతమార్చేందుకు వివాహానికి ముందే పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో పార్వతీపురం ఏఎస్పీ ఆదేశాల మేరకు బెంగళూరులో ఉన్న సరస్వతి స్నేహితురాలిని కూడా విచారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరులో హత్య చేయడం కుదరకపోవడంతో విశాఖకు చెందిన రౌడీలతో జిల్లాలో హత్య చేయించారు. వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. గణపతినగరం స్టేషన్కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్కు చెందిన రౌడీషీటర్ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ఐటీడీఏ పార్క్ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తూనికల శాఖ ఆఫీసులో అగ్నిప్రమాదం కేసులో మలుపు
-
హారిక కేసులో కొత్త కోణం
-
ఎస్సై ఆత్మహత్య కేసులో కీలక మలుపు
-
మద్యంలో కలిపిన నీటిలో సైనేడ్
-
మళ్లీ గలీజుదందా!
మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలంలో కొత్త ట్విస్ట్ * 100 శాతం పెంచి పాత వారికే ఇస్తారంటా.. * పోతూ.. పోతూ పాత కమిషనర్ నిర్ణయం * 30 ఏళ్లు వారికే ఇవ్వాలని జీఓ వచ్చిందంట కోదాడటౌన్ : కోదాడ పురపాలక సంఘానికి చెందిన దుకాణాల సముదాయ బహిరంగ వేలం విషయంలో పాలకులు, అధికారులు పట్టణ ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేలం వేస్తాం అదిగో.. ఇదిగో అంటూ చెప్పిన అధికారులు తెరవెనుక వేరే రాజకీయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కమిషనర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడానికి ముందు దుకాణాల లీజు దారుల నుండి 100 శాతం అద్దెలు పెంచి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్లు మొదలుకొని అధికారుల వరకు కుమ్మక్కై అడుగడుగునా బహిరంగ వేలానికి మొకాలడ్డుతూ లీజుదారుల కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరపైకి కొత్త విషయం మున్సిపల్ దుకాణాల వేలం విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం కొందరు లీజు దారులు కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చిందని దాని ప్రకారం ఒక సారి లీజు దక్కించుకున్న వారు 30 ఏళ్ల వరకు దానిపై హక్కులు ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి వేలం వేసి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా మరీ 30 సంవత్సరాల మాటేమిటో విషయం అర్థం కావడం లేదని పలువురు విపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. అసలు ఆ జీఓ ఎపుడు వచ్చింది? దాని అర్థం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? అసలు అది అసలు జీఓనేనా? ముందు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరిలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాతవారికే ఇపుడు ఉన్న అద్దెలపై 100 శాతం పెంచి దుకాణాలను కేటాయించాలని తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విపక్ష కౌన్సిలర్లు మాత్రం ఈ విషయం అసలు మాకు తెలియదని, దీనిపై తమకు పూర్తి వివరాలను ఇవ్వాలని వారం క్రితం జరిగిన సమావేశంలో ప్లోర్లీడర్ దండా వీరభద్రం కోరారు. గుడ్విల్ తీసుకొని ఇతరులకు.. దుకాణాల వేలం విషయం పక్కన పెడి తే దీనిలో వ్యాపారులు అనేక ఉల్లంఘనలకు పా ల్పడ్డట్లు తెలుస్తోంది. గతం లో లీజుకు తీసుకున్న వారిలో సగానికి పైగా వ్యాపారులు ఈ దుకాణాలను లక్షల రూపాయల గుడ్విల్ కింద ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి లీజుదారుడు ఇతరులకు దుకాణాన్ని ఇస్తే వెంటనే లీజు ర ద్దువుతుంది. దీన్ని లీజు అగ్రిమెంట్లో ప్ర ముఖంగా పేర్కొంటారు. అంతే కాకుండా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. కానీ, పలువురు వ్యాపారులు తమ దుకాణాలను రెండుగా విభజించి ఇతరులకు అద్దెకు ఇచ్చారు. కొందరు రెండు షాప్లను కలిపి ఒకటి చేశారు. ఈ మార్పులను దొడ్డిదారిని రికార్డుల్లో కూడా నమోదు చేయించారంటే ఈ వ్యవహారంలో సిబ్బంది చేతివాటం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. లీజు అగ్రిమెంట్ కాగితాలు ఒక్కసారి బయటకు తీస్తే ఆ వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కారణం ఇదంతా బహిరంగ రహస్యమే కాబట్టి. 100 శాతం పెంచినా తక్కువే.. దుకాణాల వేలం జరగకుండా అడ్డుకోవడానికి లీజుదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం వెనక అనేక కారణాలే ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెల్లో ఉన్న తేడాతో పాటు షాప్లు పట్టణ నడిబొడ్డున ఉండడం, ఈ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉండడం కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో షాప్ అద్దె రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. కానీ, మున్సిపల్ దుకాణాల అద్దె మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తాజాగా అద్దెలను 100 శాతం పెంచినా అది రూ.5 నుంచి రూ.6వేలు కూడా దాటదు. అంతే కాదు లక్షల రూపాయలు అడ్వాన్సగా చెల్లించినా షాప్ అద్దెకు దొరకడం కష్టమే. పాత కమిషనరే నిర్ణయం తీసుకున్నారు కమినర్గా బాలోజీనాయక్ ఉన్న సమయంలోనే సాయికృష్ణ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణాల అద్దెపై 100 శాతం పెంచి ఏప్రిల్-2016 నుంచి వసూళ్లు చేయాలని ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. - బుచ్చిబాబు, మున్సిపల్ మేనేజర్ -
గీత వ్యవహారంలో అనూహ్య మలుపు!
న్యూఢిల్లీ: దాదాపు 15 ఏండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన గీత వ్యవహారంలో అనూహ్య మలుపు తిరిగింది. పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన 23 ఏండ్ల ఆమె తన కుటుంబసభ్యులను గుర్తుపట్టలేదు. చెవిటి, మూగ అమ్మాయి అయిన గీత తమ కూతురని బిహార్కు చెందిన జనార్దన్ మహతో కుటుంబం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. జనార్దన్ మహతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గీత తమ బిడ్డేనని పలువురు ముందుకొచ్చారు. వీరి ఫొటోలను పాకిస్థాన్కు పంపించగా.. జనార్దన్ మహతో తన కుటుంబ సభ్యుడిగా గీత గుర్తించింది. అయితే ఢిల్లీలో మహతో కుటుంబాన్ని చూసి కూడా గీత వారిని గుర్తుపట్టలేదు. దీంతో గీత అసలు తల్లిదండ్రులు ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు వేచిచూస్తామని, ఫలితాలు వచ్చిన తర్వాత నిజమైన కుటుంబసభ్యులను గుర్తించి గీతను అప్పగిస్తామని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం స్పష్టం చేశారు. గీత అసలైన తల్లిదండ్రులను వెతికేవరకు ఆమె ఇండోర్లో ఉండనున్నారు. ఢిల్లీలో ఘనస్వాగతం దాదాపు దశాబ్దంన్నరకు పాకిస్థాన్ నుంచి స్వదేశం చేరుకున్న గీతకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలుపు-ఎరుపు రంగులో ఉన్న సల్వార్ కమీజ్ ధరించి.. సంతోషం నిండిన వదనంతో భారత్కు వచ్చిన ఆమెకు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 'మన బిడ్డ గీతకు స్వాగతం' అంటూ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. అనంతరం గీత సుష్మాస్వరాజ్ను కలిశారు. ఈ సందర్భంగా తన హృదయం ఎప్పుడూ భారత్లోనే ఉందని మంత్రితో గీత పేర్కొన్నారని అధికారులు తెలిపారు. ఇన్నాళ్లు పాకిస్థాన్లో గీత బాగోగులు చూసుకున్న ఈధీ ఫౌండేషన్ సభ్యులు గీతతోపాటు భారత్ వచ్చారు. కాగా, గీతకు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఇవ్వనున్న విందును భూకంపం ఘటన కారణంగా రద్దుచేశారు. మరోవైపు పాక్ చూపిన ఈ సౌహార్దానికి ప్రతిగా భారత్ కూడా 459మంది తమ దేశపు ఖైదీలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు పాక్ రాయబార కార్యాలయం తెలిపింది. నాకు పెళ్ల కాలేదు: గీత తాను చిన్నప్పుడే పాకిస్థాన్కు వెళ్లిపోయానని, తనకు ఇంకా పెళ్లికాలేదని, పిల్లలు లేరని గీత స్పష్టం చేశారు. మైనర్గా ఉన్నప్పుడే గీతకు ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని మహతో కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనను ఆమె తిరస్కరించారు. -
సత్యం కంప్యూటర్స్ స్కాంలో మరో మలుపు
-
సహారా కేసులో కొత్త ట్విస్ట్
రాయ్ బెయిల్ నిధుల విషయంలో సంబంధంలేదన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణ అంశం కీలకమైన మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఎదుట సహారా గ్రూప్ స్వయంగా తన బ్యాంకరుగా పేర్కొన్న బ్యాంకింగ్ సంస్థే హఠాత్తుగా తనకు సహారా డీల్తో ఏ సంబంధంలేదంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే- సహారా గ్రూప్ సుప్రీంకోర్టుకు దాదాపు నెల రోజుల క్రితం ఒక నోట్ సమర్పిస్తూ, అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ గ్రూప్ 2 బిలియన్ డాలర్ల ఫైనాన్షింగ్ ప్యాకేజ్ని ఆఫర్ చేసినట్లు తెలిపింది. దీనిని అమెరికా కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు మిరాచ్ తమకు కొన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే అందించినట్లు సహారా గ్రూప్ కోర్టుకు తెలిపింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం డీల్కు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) బ్యాంకర్గా వ్యవహరిస్తున్నట్లు కూడా సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తాజా విషయం ఏమిటంటే... ఈ డీల్లో తమకు ఎటువంటి పాత్రా లేదని బీఓఏ ప్రతినిధి ఒకరు ఖండిస్తూ ప్రకటన చేశారు. మిరాచ్ కేపిటల్కు భారత సంతతికి చెందిన సరాంచ్ శర్మ సీఈఓగా పనిచేస్తున్నారు. తాజా బీఓఏ ప్రకటనతో ఈ డీల్ మొత్తం వ్యవహారంపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లయ్యింది. కోర్టు డాక్యుమెంట్లలో తమ పేరును పేర్కొన్నట్లు తెలుసుకున్న బీఓఏ, ఈ విషయంలో ఏవైనా ఫోర్జరీలు జరిగాయా అన్న కోణంలో తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం డీల్కు సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీ లోపు సహారా, మిరాచ్ల మధ్య ఒప్పందం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా పరిణామంతో ఈ వ్యవహారం మొత్తం సందేహాస్పదమైపోయింది. 2014 మార్చి నుంచీ సహారా చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో సహారా వైఫల్యం... మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ దీనికి నేపథ్యం. మోసపోయాం: సహారా మరోవైపు తాజాగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంపై సహారా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నిధులు రెడీగా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంటున్నట్లుగా సృష్టించిన ఒక ఫోర్జరీ లేఖను ఆ సంస్థ తమకు అందించిందని ఆరోపించింది. అననుకూల వాతావరణంలో తాను ఈ విషయంలో ఘోరంగా మోసపోయినట్లు పేర్కొంది. దేశంలోనూ, అమెరికాలోనూ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై సివిల్, క్రిమినల్సహా, తగిన చట్టపరమైన చర్యలు అన్నీ తీసుకోనున్నట్లు ప్రకటించింది. మిరాచ్ కేపిటల్ గ్రూప్ ప్రవర్తనను ఘోరమైనదిగా తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ మోసపూరిత వ్యవహారంలో మిరాచ్ కేపిటల్ గ్రూప్కు చెందిన భారత, అమెరికా అధికారులు అందరూ భాగస్వాములేనని విమర్శించింది. ఈ డీల్కు సంబంధించి కలతచెందే సమాచారం ఫిబ్రవరి 1న తమకు తెలిసిందని కూడా పేర్కొంది. దీనితో బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖపై నిజనిర్థారణకు తాము స్వయంగా ప్రయత్నం చేయడం ప్రారంభించామని వివరించింది. చివరకు మిరాచ్ తమను మోసం చేసిందని గుర్తించామని తెలిపింది. దీనిని తాము తేలిగ్గా తీసుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సహారా చేసిన ఈ ఆరోపణలపై మిరాచ్ కేపిటల్పై స్పందన ఇంకా తెలియరాలేదు. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి నుంచి వచ్చిన ప్రకటన తరువాతే, సహారా దీనిపై స్పందించడం ఇక్కడ గమనార్హం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే మిరాచ్ కేపిటల్పై సీఈఓ శర్మను మీడియా సంప్రదించింది. బీఓఏ ప్రకటనపై ఆయన ప్రత్యక్షంగా ఏదీ వివరణ ఇవ్వలేదు. ఈ లావాదేవీని తెగతెంపులు చేసుకోవడంలేదన్నారు.. -
మరో మలుపు తిరిగిన విభజన అంశం
-
మరో మలుపు తిరిగిన విభజన అంశం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం మరో మలుపు తిరిగింది. మళ్లీ అఖిలపక్షం తెరపైకి వచ్చింది. విభజన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ వేయాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన విషయమై ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం కావడంతో సమస్యను పరిష్కరించడం కేంద్రానికి మరింత జఠిలమైపోయింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటులో ప్రతితిధ్యం వహించే పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న కొత్త ఆలోచన చేస్తోంది.