Pranahita-Chevella scheme
-
మల్లన్నసాగర్తో కామారెడ్డికి అన్యాయమే
కామారెడ్డి : ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి అన్యాయం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ విమర్శించారు. మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డికి నీళ్లివ్వడం సాధ్యం కాదని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా కామారెడ్డి ప్రాంతానికి నీటినందించేందుకు పనులు ప్రారంభించారన్నారు. 22వ ప్యాకేజీ ద్వారా కామారెడ్డి పనులు చేపడితే సాగునీటి కష్టాలు తీరుతాయనుకుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో పనులను వదిలేసిందన్నారు. మల్లన్నసాగర్ విషయంలో ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరివ్వడం సాధ్యం కాదని నిపుణులు ఇచ్చిన రిపోర్టులు తన వద్ద ఉన్నాయని.. దీనిపై మంత్రి హరీశ్రావు, విప్ గోవర్ధన్ స్పష్టం చేయాలన్నారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది తమ హయాంలోనేనని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, సీడీసీ చైర్మన్ అశోక్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శి అశోక్, నేతలు అంజయ్య, శ్రీనివాస్రెడ్డి, రాజు, రాంకుమార్, మోహన్, గోనె శ్రీను, బాబా,తదితరులున్నారు. రెండో ఏఎన్ఎంల సమ్మెకు సంఘీభావం.. రెండో ఏఎన్ఎంల సమ్మెకు షబ్బీర్అలీ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరానికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు. 14 రోజులుగా ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. -
కాంగ్రెస్ది గోబెల్స్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పనులు సీఎం కేసీఆర్ సొంత వ్యవహారమా అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నోరు పారేసుకుంటున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రాణహితపై చర్చించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అసెంబ్లీలో కూడా చర్చిస్తామని పేర్కొనారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంపై గాంధీభవన్లో జరిగిన సదస్సులో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ప్రభుత్వం రద్దు చేయలేదని, ఆదిలాబాద్ జిల్లాకు అక్కడి నుంచే నీరివ్వనున్నామని ప్రకటించినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ వద్ద మరో బ్యారే జీ అవసరం ఎందుకు కలిగిందో ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు వివరించిందని, ఆ వివరాలు కాంగ్రెస్ నేతలకు తెలియకపోవడం తమ తప్పుకాదన్నారు. గతంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన సుదర్శన్రెడ్డి, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదన్నారు. అన్ని రకాల అధ్యయనాలు జరిగాకే మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావించిందని, సమగ్ర సర్వే జరిపిన తర్వాతే ముంపు, కాల్వల పొడవు, ఎంత కరె ంటు అవసరం.. తదితర వివరాలు తెలుస్తాయని అన్నారు. ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సమాచారంతో మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు విజ్ఞత అనిపించుకోదని మంత్రి హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద అధిక విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొందరు పదే పదే అంటున్న విషయాల్ని ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, సుదర్శన్రెడ్డి వంటి నేతలు నమ్మడం విచిత్రంగా ఉందన్నారు. ఇక్కడ 152 మీటర్ల వద్ద ఒక్క మెగావాట్ కరెంటుకు కూడా ప్రతిపాదనలు లేవని, మరి విద్యుత్ ఉత్పత్తి కోల్పోతున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. ముడుపులు బొక్కింది మీరు కాదా? ‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించలేక పోయిన వైఫల్యం మీది కాదా..? విభజన చట్టంలో ప్రాణహితకు జాతీయ హోదా ఇప్పించలేక పోయారు... పైగా పోలవరానికి జాతీయ హోదా కట్టబెడుతుంటే చేష్టలుడిగి చూస్తూ కూర్చుంది మీరు కాదా..? ప్రాజెక్టును సమస్యల వలయంలో పడేసి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు బొక్కింది మీరు కాదా..’ అని మంత్రి హరీశ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ వివరాలు నిర్ధారణ అయ్యాక అసెంబ్లీ వేదికగా అన్ని వివరాలూ తెలియజేస్తామన్నారు.