rajamandri
-
రాకీ అవెన్యూస్ వివాదంపై వివరణ ఇచ్చిన యాంకర్ సుమ
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఆ సంస్థ మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆ సంస్థను ఒక యాడ్ ద్వారా సుమతో పాటు ఆమె భర్త, రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంతో తామందరం పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. దీంతో సుమ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా యాంకర్ సుమ సోషల్మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్కు సంబంధించిన ఒక యాడ్లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్కు సంబంధించిన యాడ్లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సుమ తెలిపారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య
టాలీవుడ్కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా స్వప్న వర్మ పనిచేస్తుంది. టాలీవుడ్లో పలు చిన్ని సినిమాలకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడు సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీలో నిలబడాలని హైదరాబాద్కు వచ్చింది. అయితే, గతేడాది నుంచి మాదాపూర్ కావూరి హిల్స్లోని తీగల హౌస్ అపార్ట్మెంట్ 101 ఫ్లాట్లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆరు నెలలుగా సినిమా పరిశ్రమలో తనకు ఎలాంటి ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో సమాచారం వెంటనే తెలియలేదు. బాడీ డి కంపోజ్ అవ్వడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎక్కడ నివసిస్తున్నారు : ఎంపీ మార్గని భరత్
-
రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి
-
బైక్ నడుపుతూ సందడి చేసిన మంత్రి రోజా
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
అనాథలైన చిన్నారులకు చెరో 5లక్షలు సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశం
-
అక్టోబర్ 1న రాజమండ్రిలో దసరా మహిళా సాధికారత ఉత్సవం
-
లోన్ యాప్ వేధింపులకు మరో ఇద్దరు బలి
-
‘ఎన్టీఆర్ను అమిత్ షా కలవగానే చంద్రబాబుకు వణుకు మొదలైంది’
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోందని.. అందుకే చంద్రబాబు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి ఆర్కే రోజా.. రాజమండ్రిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయి. మొన్నటి వరకు ఓ ఫేక్ వీడియోతో చంద్రబాబు నాటకాలు ఆడారు. నిన్న కుప్పంలో మరో నాటకానికి తెరలేపారు. సీఎం ఏం చేసినా రాద్దాంతం చేయాలని బాబు చూస్తున్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడం లేదు. కుప్పంలో తన కోట కూలిపోతోందని బాబు భయపడుతున్నాడు. అందుకే తన కార్యకర్తలను రెచ్చగొడుతూ ఓ అమ్మాయి అని కూడా చూడకుండా ఎంపీపీ మీద దాడి చేశారు. ఎప్పుడైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కలిసి మాట్లాడారో.. అప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైంది. రాజకీయంగా కాదు.. అన్ని రకాలుగా చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బాబు.. ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నార’ని విమర్శించారు. ఇది కూడా చదవండి: అందుకే సీఎం జగన్ జననేత అయ్యారు..! -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్: బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్ (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్ కలర్ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం మెండు జోసఫ్(బాబి) తండ్రి రవికుమార్ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. -
జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, రాజమండ్రి: జెన్కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ భరత్
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్సీపీ ఎంపీ మార్గని భరత్రామ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం స్థానిక వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాజీవితంలో ఉండటంతో ఇప్పటివరకు కుటుంబంతో కలవడం సాధ్యం కాలేదని తెలిపారు. తనపై సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వేదికగా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశానని, పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని భరత్రామ్ తెలిపారు. -
‘చంద్రబాబు, లోకేష్ పాస్పోర్టులను సీజ్ చేయాలి’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు) -
ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం సరైందే
-
‘ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పేమీ లేదు’
సాక్షి, తూర్పుగోదావరి: ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆయన గురువారం రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించారు. ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు అవినీతి మకిలి అంటుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని లోక్సభలో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తాలని సీఎం జగన్కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి దానవైపేట ప్రకాష్ నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని ‘కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్’ గా వ్యవహరిస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. -
చంద్రబాబుకు ఎంపీ మర్గాని భరత్ సవాల్
సాక్షి, రాజమండ్రి: ఇసుక కొరత నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మర్గాని భరత్ తోసిపుచ్చారు. ఇసుక విషయంలో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యానానికి సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. బుధవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుత పాలన చేస్తూంటే జీర్ణించుకోలేని చంద్రబాబు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఇసుకను తరలించానని తనపై టీడీపీ ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని ఆయన ధ్వజమెత్తారు. తాను ఇసుక నుంచి ఒక్క రూపాయి సంపాదించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడిని ఎంపీగా ఎన్నికైతే..తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో టీడీపీకి చెందిన మురళీమోహన్, ఆయన బంధువులు ఇసుక నుంచి వందల కోట్లు దోచారని, ఇందులో చంద్రబాబుకు కూడా షేర్ ఉందన్నారు. పెందుర్తి వెంకటేశ్వర్లు కూడా ఇసుక పేరుతో దోచుకున్నారని విమర్శించారు. తనపై బురద చల్లచడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా టీడీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 23 సీట్లు ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలు ఏరకంగా తిరస్కరించారో జ్ఞానోదయం చేసుకోవాలన్నారు. సుమారు 800 ఎకరాలల్లో ఇసుక తవ్వకాలు చేసి టీడీపీ నేతలు ఎలా దోచుకున్నారో అందరికి తెలుసు అన్నారు. తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనాన్ని ఆదా చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని, సుపరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని మర్గాని భరత్ హితవు పలికారు. -
జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..
సాక్షి, రాజమహేంద్రవరం : తప్పు చేశారు. ఆ తప్పులకు శిక్ష కూడా అనుభవించారు. పశ్చాత్తాపంతో జైలు జీవితాన్నీ గడిపిన ఆ ఖైదీలు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తిపొందారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 12 మంది ఖైదీలు విడుదలయ్యారు. అర్హులైన ఖైదీలకు గత టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో కొందరు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 6 విడుదల చేస్తూ రాష్ట్రంలో అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు జీవో విడదల చేసింది. దాని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 57 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలున్నారని, వీరు క్షమాభిక్షకు అర్హులని జైలు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం జీవో 46 ప్రకారం కేవలం ఎనిమిది మంది ఖైదీలను మాత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ పక్షపాత వైఖరికి అర్హులైన ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. ఖైదీల పిటిషన్ విచారణ చేసిన కోర్టు అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు వెళ్లిన ఖైదీలు జూలై ఒకటో తేదీన ఒకరు విడుదల కాగా, ఆగస్టు నెలలో 11 మంది, సెప్టెంబర్ ఒకటో తేదీన ఎనిమిది మంది, సెప్టెంబర్ 12న 12 మందిని విడుదలయ్యారు. మరో 17 మంది అర్హులైన ఖైదీలు ఈ వారంలో విడుదలవుతారని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కె.వెంకట రాజు పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు వీరే.. చేదల రామిరెడ్డి, కాపర్తి సత్యనారాయణ, నక్కా సత్యనారాయణ, మోర్త నాగేశ్వరావు, గుమ్మడి ఏసు, ఉచ్చుల రాఘవులు, గంటేటి ప్రసాద్, శెట్టి చిన్నయ్య, గంటి నూకరాజు, డేరింగుల సుమంత్, పొలినాటి ప్రేమ్ కుమార్, చెక్కా జోసఫ్. టీడీపీ ప్రభుత్వ తీరుతో నా కుమారుడిని కోల్పోయాను నేను 2010లో హత్య కేసులో శిక్షపడి జైలుకు వచ్చాను. వ్యవసాయం చేసుకుని జీవించేవాడిని, నాకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడికి వివాహమైంది. విడుదల కావడం సంతోషంగా ఉంది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఎదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. నేను విడుదలవుతానని ఆశతో ఎదురు చూసిన నా చిన్న కుమారుడు గణేష్ విడుదల కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. – చెక్కా జోసఫ్ గుంటూరు కుటుంబాన్ని చక్కదిద్దాలి నా కుటుంబ ఆస్తితగాదాలో కుమారుడిని కోల్పోయాను. దానికి నేనే కారణమయ్యాను. 2010లో జీవిత ఖైదీ పడింది. కూలి పనులు చేసుకుని జీవించేవాడిని, జీవనోపాధి వెతుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలి. – నక్కా సత్యనారాయణ, రాజోలు -
భారీ వర్షాలు; పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరో 24 గంటల్లో వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో గోదావరి తీర లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8 లక్షల 60 వేల క్యూసెక్కులు ఉండగా గంట గంటకు ఉధృతి పెరుగుతూ నది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు దేవిపట్నం మండలంలోని దాదాపు 26 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం ఇప్పటికే 10.6 అడుగులకు చేరడంతో బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. ధవళేశ్వరం దిగువన గోదావరి ఉప నదులైన వశిష్ట, వైనతేయ, గౌతమి పరవళ్లు తొక్కుతున్నాయి. సాయంత్రానికి నీటిమట్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదారి వరద పోటెత్తడంతో మొదటి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. -
విద్యుత్ షాక్తో కౌలురైతు మృతి
సాక్షి, కడియం (రాజమహేంద్రవరం రూరల్): దుళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు తోట చింతాలు (59) పొలంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌలుకు తీసుకున్న చేనులో మోటారు తిరగడం లేదని అతడు గోతిలోకి దిగి చూశాడు. మోటార్ను తాకిన వెంటనే షాక్కు గురై గోతిలో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సరఫరాను నిలిపివేసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు స్థానిక ప్రైవేటు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎల్.కనకరాజు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కడియం ఎసై ఎ.వెంకటేశ్వరరావు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కౌలురైతు చింతాలు (ఫైల్) -
‘చంద్రబాబు మమ్మల్నీ మోసం చేశారు’
సాక్షి, రాజమహేంద్రవరం : అబద్దపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరికి తమకు కూడా అన్యాయం చేశారని దివ్యాంగులు వాపోతున్నారు. మంగళవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న కొంతమంది దివ్యాంగులు తమ కష్టాలను ఆయనతో పంచుకున్నారు. సైగలతో వారు పడుతున్న కష్టాలను తెలపడం అక్కడున్న వారిని కలచివేసింది. తమకు వచ్చే పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు వైఎస్ జగన్ కలిసి తాము ఇప్పుడు బతికి ఉండేందు కారణం వైఎస్ఆర్ దయే అని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సువర్ణయగం చూశామని, ఇప్పుడా పరిస్థితి లేదని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ తరహా పాలన సాధ్యమవుతుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్లోకి అగ్నికులక్షత్రియులు.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జొన్నలంక వద్ద వైఎస్ జగన్ను కలుసుకున్న వంద మంది అగ్నికుల క్షత్రియులు ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అదే గ్రామంలో ఓ పసిబిడ్డకు రాజశేఖర్ అని నామకరణం చేశారు వైఎస్ జగన్. ఆయన చేత తమ బిడ్డకు పేరు పెట్టించాలని దాదాపు మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ బిడ్డ తల్లిదండ్రులు తెలిపారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు. -
బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
రాజమహేంద్రవరం క్రైం : మైనర్పై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. చింతూరు ఎస్సై శ్రీనివాస కుమార్ కథనం ప్రకారం.. 2015 నవంబర్ 28న చింతూరుకు చెందిన తిలపురెడ్డి సాయి మణికంఠ, చింతూరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న బాలికను కాలేజీ వెనుకకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకోమంటే కులం తక్కువ అని నిరాకరించాడు. ఈ సంఘటన పై అప్పటి చింతూరు ఎస్సై గజేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సుంకర మురళీ మోహన్ దర్యాప్తు చేసి కేసును రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టులో విచారణ నిమిత్తం పంపారు. కేసును విచారణ చేసిన ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ తీర్పు ఇస్తూ నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతోపాటురూ.వెయ్యిజరిమానావిధిస్తూ తీర్పు ఇచ్చారు. -
ఇంటికి రానా? బ్రిడ్జిపై నుంచి దూకి చావనా?
రాజమహేంద్రవరం క్రైం: భార్య వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన పిరియ కరుణ కుమార్(32) పదేళ్ల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అడ్రస్ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కరుణకుమార్ను వెతుక్కుంటూ రాజమహేంద్రవరం వచ్చారు. కరుణకుమార్ తండ్రి ధవళేశ్వరం గ్రామంలో టైలరింగ్ పని చేసుకుని జీవిస్తుండగా, కరుణకుమార్ కార్లు అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేసుకుంటున్నాడు కరుణ కుమార్, రమ్యలకు ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్య రమ్యతో మనస్పర్థలు ఉన్నట్టు మృతుడి సోదరుడు మనోజ్, బంధువులు పేర్కొంటున్నారు. ప్రతీ విషయానికి గోడవలు పడడంతో మద్యానికి బానిసైన కరుణకుమార్ జీవితంపై విరక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. కార్ల అమ్మకాలు లేకపోవడం, భార్యతో గొడవగా ఉండడంతో మంగళవారం కరుణకుమార్ తనతో కలిసి కార్లు వ్యాపారం చేసే వీరేంద్రను మోటారు సైకిల్పై కొవ్వూరులో కారు ఉంది కొందామని తీసుకువెళ్లాడు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద ఫోన్లో మాట్లాడేందుకు మోటారు సైకిల్ ఆపాడు. భార్యతో ఫోన్లో మాట్లాడినట్టు స్నేహితులు పేర్కొంటున్నాడు. భార్యతో ఫోన్లో మాట్లాడి.. భార్యతో ఫోన్లో మాట్లాడే సందర్భంలో కరుణకుమార్ ‘‘ఇంటికి రానా? లేక బ్రిడ్జి మీద నుంచి దూకి చావనా?’’ అంటూ భార్యతో అన్నట్టు స్నేహితుడు పేర్కొంటున్నారు. దీనికి భార్య ‘‘దూకి చావు నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి స్నేహితుడు ఫోన్లో భార్య రమ్యకు చెప్పగా ‘‘అతడికి, తనకు ఏ విధమైన సంబంధం లేదని, అతని తల్లిదండ్రులకు చెప్పండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. వెంటనే స్నేహితుడు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గోదావరిలో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం : గుండె పోటుతో జీవిత ఖైదీ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నెహ్రూనగర్కు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు(41) గుండె పోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఉదయం ఆరు గంటలకు పెట్రోల్ బంక్లో పని చేసేందుకు వచ్చిన వెంకటేశ్వరరావు పది గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందని పెట్రోల్ బంక్లో పడిపోయాడు. ఇతడిని సెంట్రల్ జైలులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.తన భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా ఉన్న మృతుడికి 2014 జనవరి 14న కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు శిక్ష నిమిత్తం వచ్చాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఓపెన్ ఎయిర్ జైల్కు వేస్తారు. దీనిలో భాగంగా 2017 జనవరి ఏడో తేదీన ఓపెన్ ఎయిర్ జైలుకు వెంకటేశ్వరరావును మార్చారు. జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో పని చేస్తుండేవాడు. సత్ ప్రవర్తన కలిగి ఉండేవాడు. మృతుడు జైలుకు రాకముందు సెల్స్ టాక్స్ శాఖలో క్లర్కుగా పని చేయడంతో అకౌంట్లు బాగా రాసేవాడు. దీంతో బంక్లోని రికార్డులు సక్రమంగా రాసేవాడని తోటి ఖైదీలు పేర్కొంటున్నారు. ఎంతో సౌమ్ముడిగా ఉండే వెంకటేశ్వరరావు అకాల మృతికి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన బావమరిదిని సకాలంలో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని మృతుడి బావ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గిరీష్ పంచనామా నిర్వహించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు నెలలో విడుదల ఉండగా.. సత్ ప్రవర్తనతో ఉండే వెంకటేశ్వరరావు మరో రెండునెలలో విడుదల అవుతాడనగా ఆకస్మికంగా మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. సకాలంలో వైద్య సదుపాయం అందక మృతి చెందాడని పేర్కొంటున్నారు. చికిత్స అందించడంలో జాప్యం లేదు జైలులో చికిత్స అందించడంలో జాప్యం చేయలేదు. ఉదయం బీపీ డౌన్ అయ్యిందని జైలులో ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే జైలు వైద్యులు చికిత్స అందించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంలో అంబులెన్స్తో హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ఖైదీకి వైద్య చికిత్సలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు. – రఘు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ -
కారు బోల్తా : యువకుడి మృతి
రాజమండ్రి : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎస్వీజీ మార్కెట్ వద్ద జరిగింది. మోరంపూడి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని ఎస్వీజీ మార్కెట్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీకి చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. -
రాజమండ్రి పుష్కర ఘాట్లో అపశృతి
-
వైఎస్ఆర్ సీపీ నేత చింతా కృష్ణమూర్తి మృతి
రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. చింతా కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. -
సూది సైకో కలకలం
సూదితో ఓ వ్యక్తి తన చేతిపై గుచ్చాడంటూ ఓ మహిళ రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం హైరానా సృష్టించింది. బాధితులు, వైద్యుల కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లా ఐనవోలు మండలం జోగిరాజుపాలెంకు చెందిన ఎడ్ల అనూష (35) కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా వర్ని వెళ్లి.. ఆదివారం ఉదయం నాగవల్లి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగింది. మూడో నంబర్ ప్లాట్ఫారం నుంచి మెట్లు ఎక్కి దిగి వచ్చే క్రమంలో ఓ వ్యక్తి సూదితో గుచ్చాడంటూ ఆమె కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, చేతిపై ఎక్కడా సూది గాయం లేదని, ఫోబియోతో ఆమె అలా భ్రమపడి ఉంటుందని డాక్టర్ చలం తెలిపారు. -
పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ
తూర్పుగోదావరి: గోదావరి పుష్కర నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లతో పాటు, అధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. -
పారిపోయి వచ్చిన విద్యార్థి అప్పగింత
రైల్వేస్టేషన్ (రాజమండ్రి), న్యూస్లైన్ : తల్లి మందలించిందని ఇంటి నుంచి పారిపోయి వచ్చిన విద్యార్థిని రైల్వే పోలీసులు అతడి తండ్రికి అప్పగించిన సంఘటన ఇది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు పట్టణానికి చెందిన తుంపాల అర్జున్ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు గణేష్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సరిగ్గా చదవడం లేదని అతడి తల్లి మందలించడంతో, కోపగించుకున్న అతడు రెలైక్కి రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. బుధవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతున్న అతడిని హెచ్సీ రుద్రబాబు గమనించారు. అతడిని ఆరాతీయడంతో విషయం వెలుగుచూసింది. వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఏలూరు నుంచి రాజమండ్రి వచ్చిన తండ్రి అర్జున్కు జీఆర్పీ ఎస్సై చలపతి రాజమండ్రి రైల్వే స్టేషన్లో గణేష్ను అప్పగించారు. -
లిస్టులు రెడీ
రాజమండ్రి : ఓ వైపు శాసనసభ, లోక్సభ ఎన్నికల రణభేరి మోగనుండగా.. మరోవైపు ‘పురపోరు’ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆ శాఖ అధికారులు ఆదివారం ఓటర్ల తుది జాబితాల్ని విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘ కసరత్తు జరిపిన అనంతరం.. డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరగని కాకినాడ మినహా రాజమండ్రి నగరం, మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీల్లో డివిజన్ల వారీ ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసే పని చేపట్టారు. మండపేట, రాజమండ్రి మినహా మిగిలిన పట్టణాలకు సంబంధించి డివిజన్లవారీ తుది జాబితాలు రాత్రి పది గంటలకు సిద్ధమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం రాజమండ్రి నగరంలో, మిగిలిన పట్టణాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 5,40,507 మంది ఓటర్లలో పురుషులు 2,66,692 మంది ఉండగా స్త్రీలు 2,73,815 మంది ఉన్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పోలింగ్ నిమిత్తం 489 బూత్లు ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీల్లో 2013 జనవరి ఒకటి నాటికి జరిగిన ఓటర్ల గణన ఆధారంగా గత ఏడాది ఆగస్టులో ప్రచురించిన జాబితా ప్రకారం జిల్లాలో 4,75,176 మంది ఓటర్లు ఉన్నారు. వారి సంఖ్య 2014 జనవరి ఒకటి నాటికి 65,331 మేర పెరిగింది. రాజకీయ పక్షాల్లో నిరాసక్తత..: అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ రాజకీయ పక్షాలు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నెల ఏడు నుంచి సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలు జరగకపోవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఎన్నికలపై ఎటువంటి చర్యలు చేపట్టదలచుకోలేదని రాజమండ్రి సహా పలు ప్రాంతాల టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. కాంగ్రెస్లో నేతలే కరువయ్యారు. ఇతర పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలకు ఇది సమయం కాదని అభిప్రాయపడుతున్నాయి. -
వారసుడి వరస... తమ్ముళ్ల రుసరుస
సీనియర్లు, పార్టీ కోసం శ్రమిస్తున్న కొందరు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పొగబెడుతున్నారా? అవుననే అంటున్నారు పార్టీ నేతలు. తెలుగు తమ్ముళ్లకు లోకేష్ రూపంలో ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. చంద్రబాబు చెప్పిందే వేదంగా సాగిన పార్టీలో ఇపుడు లోకేష్ హవా ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ ప్రమోట్ చేస్తున్న రెడీమేడ్ అభ్యర్థులకు, పార్టీ సీనియర్లకు మధ్య చిచ్చు రేగడంతో క్యాడర్ గందరగోళంలో ఉంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల సిగపట్లు పడుతున్న తెలుగుదేశం నేతలకు ఇపుడు కొత్త సమస్య ఎదురైంది. చంద్రబాబు తనయుడు లోకేష్ను ప్రసన్నం చేసుకోవడం వారికి అనివార్యంగా మారిందంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు తెరపై ఉన్న ఆశావహులకు లోకేష్ ప్రభావంతో మొండిచేయి తప్పని వాతావరణం కనిపిస్తోంది. లోకేష్ పరోక్షంగా కొందరిని ప్రోత్సహిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళానికి దారితీస్తోంది. లోకేష్ హిట్లిస్ట్లో తొలి పేరు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చియ్యచౌదరిది. రాజమండ్రి సిటీ నుంచి మరోసారి బరిలోకి దిగాలని తహతహలాడుతున్న గోరంట్లకు లోకేష్ రూపంలో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి నెలకొంది. రాజమండ్రి సిటీలో గోరంట్లకు టికెట్ ఇస్తే ఓటమి పునరావృతం అవుతుందని వ్యతిరేక వర్గం గన్ని కృష్ణ శిబిరం పోరుపెడుతోంది. పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి మురళీమోహన్ కూడా గన్ని వర్గానికి మద్దతు అని చెబుతున్నారు. తాజాగా అధినేత తనయుడు లోకేష్ కూడా గోరంట్ల వ్యతిరేక శిబిరంలో చేరారంటున్నారు. గన్ని, మురళీమోహన్ అభిప్రాయాల ప్రాతిపదికగా గోరంట్లకు పొగబెట్టేందుకు లోకేష్ పావులుకదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి సిటీ అభ్యర్థిగా లోకేష్ ప్రతిపాదిస్తున్న సుంకవల్లి సూర్య మంత్రాంగమే ఈ వ్యవహారం వెనుక అసలు కారణమంటున్నారు. -
నాడు జై.. నేడు నై...
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చారిత్రక నగరం రాజమండ్రిలో దీనస్థితికి దిగజారింది. ఈ పార్టీ పరిస్థితి నడిసంద్రంలో చుక్కాని లేని నావలా మారింది. నగరంలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతలు కరువయ్యారు. ఒకనాడు పార్టీలో చక్రం తిప్పిన నాయకులంతా నేడు కొత్తపార్టీ కోసం ఆశతో చకోరాల్లా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సమైక్యాంధ్ర ఉద్యమం కాంగ్రెస్ పాలిట సునామీగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయం జనాగ్రహానికి గురైంది. పార్టీ భవితవ్యంపై చీకటి అలముకుంది. సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన పెను అలజడి సృష్టించింది. ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వారి వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేయడంతో కార్యకర్తలు కూడా లేని దుస్థితి ఏర్పడింది. పార్టీపై జిల్లా అధ్యక్షుడి అదుపు కూడా లేకుండా పోయిందని ఒకప్పటి పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సీటీఆర్ఐ (రాజమండ్రి), న్యూస్లైన్ : స్థానిక పేపరుమిల్లు సమీపంలోని ఆనంద్నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడి భార్య నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. సింహాద్రి నగర్కు చెందిన వరప్రసాద్ (30)కు గాదిరెడ్డి నగర్కు చెందిన వరలక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత వరప్రసాద్ అప్పులు చేసి ఆటోలు కొనడం, వాటిని తిరిగి అమ్మేసి ఖాళీగా తిరగడం చేసేవాడు. ఇదిలావుండగా అతడి భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుం డడంతో తరచూ ఘర్షణ పడేవారు. 2012 ఆగస్టులో వారిద్దరూ ఓ అంగీ కారానికి వచ్చి వేర్వేరుగా జీవిస్తున్నారు. వరలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలసి మరో వ్యక్తితో జీవిస్తుండగా, వరప్రసాద్ తన అక్క వద్ద ఉంటున్నాడు. గురువారం వరప్రసాద్, వరలక్ష్మిల పుట్టినరోజు కావడంతో అతడు ఆనందనగర్లో నివసిస్తున్న భార్య వద్దకు వచ్చి.. ‘ఇకపై ఇద్దరం కలసి జీవిద్దామ’ని చెప్పాడు. అంగీకరించిన వరలక్ష్మి ఆ రోజు సాయంత్రం గాదాలమ్మ నగర్లోని పుట్టింటికి వెళ్లింది. అతడు వరలక్ష్మి ఇంట్లోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం కుమారుడు సిద్ధును భర్త వద్దకు పంపించింది. కుమారుడితో ‘నీవు అమ్మను తీసుకురా’ అని చెప్పి వరప్రసాద్ పంపించేశాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వచ్చి చూసేసరికి తలుపులు వేసి ఉన్నాయని, లోనికి వెళ్లి చూడగా తన భర్త ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని ఆమె పోలీసులకు వివరించింది. సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాలెన్నో వరప్రసాద్ మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా ఇంటికి వచ్చినట్టు సమాచారం. వీరి మధ్య ఏమైనా తగా దా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఫ్యానుకు ఉరి వేసుకున్న వ్యక్తిని చూసిన వెంటనే చీరను కత్తి పీటతో కోసేశానని చెబుతున్న వరలక్ష్మి మాటలు ఎంతమేర నిజమో నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇంటికి దూరంగా ఎందుకు పడవేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతు తోంది. వరలక్ష్మి ఉదయం భర్త ఇంటి ముందు ముగ్గు వేసి, తాపీగా పోలీసుస్టేషన్కు వెళ్లి పోలీసులకు తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. -
‘వెలుగుల’ పథకం..నిలువెల్లా మసకే
సాక్షి,రాజమండ్రి : నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఆ విద్యుత్ ‘ఉచితం’ అని గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇచ్చిన వరం నేటికీ సాకారం కాలేదు. ఆ వర్గాల్లో పేదలకు మేలు కోసం అన్న ఈ పథకం విధి విధానాలు నేటికీ ఓ కొలిక్కి రాలేదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనంగా నిలుస్తోంది. సర్కారు మీద నమ్మకంతో ఆ వర్గాల్లో అర్హులైన పేదల బిల్లులు వసూలు చేయకూడదన్న నిర్ణయం ఈపీడీసీఎల్కు కూడా బొప్పికట్టేలా చేసింది. ప్రస్తుతం ఈ పథకం అసలైన లబ్ధిదారుల ఎంపిక అనే దశలోనే మిణుకుమిణుకుమంటోంది. ఆ అసలైన లబ్ధిదారులు ఎవరో తేల్చలేక అధికారులూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి నవంబరు వరకూ జిల్లాలో సుమారు లక్షా 60 వేలమందికి పైగా ఎస్సీ లబ్ధిదారులు ఈ పథకం పరిధిలోకి వస్తున్నారు. ఈ వ్యవధిలో వారు వినియోగించిన విద్యుత్తు విలువ సుమారు రూ.2.60 కోట్లు. 58,000 మంది ఎస్టీలు పథకం పరిధిలోకి వస్తుండగా వీరు సుమారు రూ.కోటి 50 లక్షల విలువైన విద్యుత్తును ఉపయోగించారు. ఇదంతా ప్రభుత్వం భరించి విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి నవంబరు వరకూ ఏనెలకానెల జాబితాలను తయారుచేసి పంపుతూనే ఉన్నా ఇప్పటివరకూ ఆ బాపతు సొమ్ము సర్కారు నుంచి తమకు చేరలేదని వాపోతున్నారు ఈపీడీసీఎల్ అధికారులు. ఇప్పుడేం జరుగుతోందంటే.. ఆయా మండలాల్లో విద్యుత్తు శాఖ సహాయ ఇంజనీర్లు రూపొందించిన అర్హులైన ఎస్సీ, ఎస్టీల జాబితాలను వారి కుల ధృవీకరణ కోసం తహశీల్దార్లకు పంపారు. తహశీల్దార్లు వీఆర్వోల సాయంతో ఇంటింటి సర్వే చేసి, వారు ఎస్సీ, ఎస్టీలు అవునో, కాదో నిర్ధారించి తిరిగి వాటిని విద్యుత్తు శాఖకు అందచేస్తే వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నిధులు విడుదలవుతాయి. విధి విధానాలను నిర్దేశించకుండా ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ పథకంలో ముందుగా లబ్ధిదారుల ఎంపికే నెలనెలా ఓ ప్రహసనంగా మారుతోంది. ఈపీడీసీఎల్ రీడింగుల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకూ 50 యూనిట్ల లోపు వినియోగిస్తున్న వారిని ప్రాథమికంగా గుర్తించి బిల్లుల వసూలు విరమించారు. కొందరు తమంతట తామే కట్టడం మానేశారు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న కులధృవీకరణలో ఒకవేళ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో అనర్హులైతే వారు పాత బకాయిలతో పాటు భారీగా బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాబితాలూ కప్పల తక్కెడలే.. ఏ నెలకా నెల 50 యూనిట్ల లోపు వాడే వినియోగదారుల చిట్టా మారుతూనే ఉంటుంది. వేసవి దగ్గర పడితే ప్రతి కుటుంబంలోనూ 50 యూనిట్లకు పైబడే వినియోగం ఉంటుంది. ప్రతి నెలా అర్హుల జాబితాలు తయారుచేయడం, వాటిని కులధృవీకరణకు పంపడం, తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు నివేదించడం, అక్కడినుంచి విద్యుత్తు బిల్లులు రప్పించుకోవడం విద్యుత్తు శాఖకు తలకుమించిన భారంగా తయారవుతోంది. దీనిపైన ఇంత క్లిష్టమైన పద్ధతి కాక ఓ నిర్దిష్టమైన విధానం ఉండాల్సిందేనని ఆ శాఖ అధికారులు చెపుతూనే ఉన్నారు. వచ్చేది వేసవి కావడంతో ఈపీడీసీఎల్ అదనంగా విద్యుత్తు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ సంస్థ కొన్న విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తు మధ్య ఆర్థిక సమతుల్యతను బేరీజు వేసుకుంటోంది. ఈ తరుణంలో ప్రభుత్వ పథకాల పేరుతో కోట్లు బకాయిలు పెడితే తద్వారా ఆ సంస్థకు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు ఈపీడీసీఎల్కు భారీగా బకాయి పడ్డాయి. ‘వాటికి తోడు ఇదొకటా?’ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
జోరందుకున్న సంక్రాంతి కొనుగోళ్లు
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో మార్కెట్లు సంక్రాంతి పండగ శోభను సంతరించుకున్నాయి. వస్త్రాల కొనుగోళ్లు రెండు రోజులుగా ముమ్మరమయ్యాయి. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అంటే కొత్త దుస్తులు ధరించాల్సిందే. ఈ సంవత్సరం పండగకు ముందే కళామందిర్, శ్రీనికేతన్ వంటి కార్పొరేట్ వస్త్రవ్యాపార సంస్థలు రాజమండ్రి, కాకినాడల్లో షోరూమ్లు ప్రారంభించాయి. ఇక హోల్సేల్ వస్త్రవ్యాపారానికి పేరొందిన రాజమండ్రి, ద్వారపూడిలలో అమ్మకాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కొత్త సరుకును రప్పిస్తున్నారు. రాజమండ్రిలో 800, ద్వారపూడిలో 600 హోల్ సేల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఈ దుకాణాల్లో సుమారు రూ.కోటిన్నర వ్యాపారం జరుగుతుండగా పండగ సీజన్లో రోజుకు సగటున రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వ్యాపారం సాగుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల రిటైల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటిలో మామూలు రోజుల్లో సుమారు రూ.పది కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందని, పండగ సీజన్లో అది రూ.35 కోట్లకు పైబడి ఉంటుందని వాపార వర్గాలు చెపుతున్నాయి. క్రిస్మస్ పండగతో డిసెంబర్ 15 నుంచి ఊపందుకునే అమ్మకాలు సంక్రాంతి ముందు తారస్థాయికి చేరతాయంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా పండగ కొనుగోళ్లకు రాజమండ్రి వస్తుంటారు. దీంతో రాజమండ్రి మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తాడితోట, మెయిన్ రోడ్లలో ఈ సందడి అధికంగా కనిపిస్తోంది. కాగా కాకినాడలో, కోనసీమ కేంద్రం అమలాపురంలో కూడా నాలుగు రోజులుగా పండగ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పండగ సీజన్ మొత్తమ్మీద జిల్లాలో కే వలం వస్త్ర వ్యాపారమే రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. కాగా జిల్లాలో ఈ ఏడాది వస్త్ర వ్యాపారంలో 30 శాతానికి పైగా కార్పొరేట్ దుకాణాలే దక్కించుకోనున్నట్టు అంచనా. వందలాదిగా వెలసిన ఫుట్పాత్ షాపులు రాజమండ్రి, కాకినాడల్లో ఫుట్పాత్లపై దుస్తులు, ఫాన్సీ వస్తువులు అమ్మేవారికీ పండగతో అమ్మకాలు పెరిగాయి. బెంగాల్ కాటన్, పంజాబీ డ్రెస్సులు, రెడీమేడ్ దుస్తుల వంటివి విక్రయించే ఫుట్పాత్ షాపులు వందలాదిగా వెలశాయి. రాజమండ్రి, కాకినాడల్లో పండగ సీజన్లో ఫుట్పాత్ వ్యాపారం రోజుకు రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారాలకు కూడా జిల్లావ్యాప్తంగా గిరాకీ పెరిగింది. మామూలు రోజుల్లో కిరాణా వ్యాపారం రోజుకు రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుంది. క్రిస్మస్ లగాయతు సంక్రాంతి వరకూ ఇళ్లల్లో పిండి వంటలు ఎక్కువగా వండుతుంటారు. దుకాణాల్లో స్వీట్ల తయారీ కూడా రెట్టింపవుతుంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలు, పంచదార వినియోగం పండగ సీజన్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కాగా పండుగ సీజన్లో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ధగధగలాడని పసిడి వ్యాపారం కాగా బంగారం అమ్మకాలు మామూలు రోజులతో పోలిస్తే 15 నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఈ సారి బంగారం ధర కూడా నిలకడగా ఉండడంతో జనం కొనుగోళ్లపై తాపీగా వ్యవహరిస్తున్నారు. 2012లో ఇదే కాలంలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2580 ఉండగా 24 క్యారట్ల బంగారం రూ.2820 ఉంది. 2013 జనవరిలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2839 ఉంటే 24 క్యారట్ల బంగారం రూ.3036 పలికింది. ప్రస్తుతం ఆ ధరలు రూ. 2770, రూ.2928 గా కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర తక్కువగా ఉన్నా సంక్రాంతికి జనం బంగారంపై కన్నా వస్త్రాల పైనే మక్కువ చూపుతారని వ్యాపారులు అంటున్నారు. -
మరో పది మీ సేవలు
సాక్షి, రాజమండ్రి : ‘ఈ సువిధా’ పేరుతో మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి మరో పది కొత్త సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల్లో లభించే సేవల సంఖ్య 48కు పెరగనుంది. ఇప్పటి వరకూ 43 శాఖలకు చెందిన 38 రకాల సేవలను మీసేవా కేంద్రాల్లో అందిస్తున్నారు. వీటిలో 15 సేవలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పౌరులకు సంబంధించినవి ఉన్నాయి. కొత్తగా చేరుస్తున్న వాటితో 70 శాతం పుర సేవలు మీ సేవల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో పురపాలక శాఖ పరిధిలో 58 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో ఈ సేవలను పౌరులు పొందే అవకాశం ఉంది. కొత్త సర్వీసులు ఇవే... కొత్తగా చేరుస్తున్న సర్వీసులను కొన్నింటిని తక్షణ ప్రాతిపదికగా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా మరి కొన్నింటిని మాత్రం సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొత్తగా చేరుతున్న సేవల ప్రకారం పుర పౌరులు నీటి కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో వ్యాపారం చేసుకునేందుకు లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. లెసైన్సుల రెన్యువల్, కొత్త భవన నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చును. కొత్త ఎసెస్మెంట్ కోసం అభ్యర్థన పత్రాలు దాఖలు చేయవచ్చు. ఎసెస్మెంట్ల సబ్ డివిజన్ కోసం మీసేవ ద్వారా అభ్యర్థన పత్రం దాఖలు చేయవచ్చు. పన్ను మినహాయింపు, వేకెన్సీ రెమిషన్ అభ్యర్థనలు, స్థల అనుభవ, స్వాధీన ధ్రువ పత్రాలతో పాటు ఆస్థి యాజమాన్య బదలాయింపులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అవగాహన కార్యక్రమాలు ట్రేడ్ లెసైన్సులు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర సేవలు అందించాలంటే మీసేవ నిర్వాహకులకు తగిన అవగాహన అవసరం అని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం మున్సిపల్ రీజియన్ల వారీగా సిబ్బందికి శిక్షణలు ఇవ్వనున్నారు. రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల మీ సేవా కేంద్రాల సిబ్బందికి కొత్త సేవలపై ఈ నెల 27న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషణ్ ప్రాంగణంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం కొత్తగా ప్రవేశ పెట్టిన పది సేవలు కొత్త సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయి. పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక శాఖ అధికారులు కొత్త సేవలకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘మంచి నాయకులను ఎన్నుకోండి’
రాజమండ్రి సిటీ, న్యూస్లైన్ : ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించుకోవడం అంతే ముఖ్యమని ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిభూషణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజమహేంద్రి మహిళా కళాశాల ఆవరణలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను కలసి ఓటు ప్రధాన్యతను వివరించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కచ్చితంగా ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. యువతరం పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కుపై ఇంతమంది విద్యార్థులకు అవగాహన ఉండడం అభినందనీయమన్నారు. ఓటు వేయడం ద్వారా హక్కును సద్వినియోగపరచుకోవాలని విద్యార్థినులను కోరారు. జేసీ రేవు ముత్యాలరావు మాట్లాడుతూ చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం 60-70 శాతం మధ్య పోలింగ్ జరుగుతోందని, అది 80-90 శాతానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి కళాశాలలో 470 మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉందని నిర్వాహకుడు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధికారులను సత్కరించారు. ప్రిన్సిపాల్ ప్రకాశరావు పాల్గొన్నారు. -
చదరంగం విజేత మహేశ్
రాజమండ్రి సిటీ, న్యూస్లైన్ : అంధుల రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన బి. మహేశ్ విజయబావుటా ఎగురవేశాడు. రాజమండ్రిలోని రౌతు తాతాలు కల్యాణ మండపంలో మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. రఘురామ్ (తిరుపతి), అంజనప్ప (అనంతపురం) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 17 జిల్లాలకు చెందిన సుమారు 90 మంది పాల్గొన్నారు. విజేతలతో పాటు ప్రతిభ కనబరిచిన 20 మందికి సర్టిఫికెట్లు, నగదు పారితోషికం అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవానికి అంధుల చదరంగం అంతర్జాతీయ క్రీడాకారుడు కోలా శేఖర్ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఎసెట్ మేనేజర్ పి.కె.రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సేవను బాధ్యతగా గుర్తించిన ఓఎన్జీసీ ఏటా రూ.20 కోట్లు వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేస్తోందని రావు తెలిపారు. వికలాంగులు ఎవరైనా దరఖాస్తు చేస్తే 45 రోజుల్లో వారికి కృత్రిమ అవయవాలు ఉచితంగా అందజేస్తామన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు రూ.1.2 లక్షల చెక్కును ఆయన నిర్వాహకులైన మిరాకిల్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్అధ్యక్షుడు చల్లా మహేశ్కు అందజేశారు. పోటీల నిర్వహణకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన ట్రిప్స్ స్కూల్ కరస్పాండెంట్ బాలాత్రిపుర సుందరి ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. గౌతమి నేత్రాలయం అధినేత మధు, వికలాంగ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మకాయల సురేష్, ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు రంగస్వామి, జనరల్ సెక్రటరీ సి.సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జనం గుండెచప్పుడై...
పండుపున్నమి వేళ సాగరసంగమానికి పోటెత్తిన జీవఝరిలా ప్రతి పదం జగన్మోహన్రెడ్డి బాటలో కదం తొక్కింది. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది. ప్రతి గుండెచప్పుడై జగన్నినాదం ప్రతిధ్వనించింది.బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది.మధురపూడి విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న అభిమానులుమధురపూడి విమానాశ్రయంలో జగన్కు స్వాగతం పలికేందుకు రంపచోడవరం నుంచి వచ్చిన గిరిజన మహిళలుతూర్పు గోదావరి జిల్లా గాడాలలో జగన్తో కరచాలనం చేస్తున్న మహిళబుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ జగన్జగన్కు ఉత్సాహంగా యువకుల అభివాదంరాజమండ్రి శానిటోరియం వద్ద బారులు తీరిన మహిళలురాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో జగన్కు అభివాదం చేస్తున్న విద్యార్థులురాజమండ్రి కొంతమూరులో వృద్ధుడిని పలకరిస్తూ....బస్సులో నుంచి ప్రయాణికులు, డ్రైవర్ అభివాదంజక్కంపూడి విజయలక్ష్మి నివాసంలో ఆమె కుమార్తె సింధుసహస్ర, అల్లుడు భుజంగరాయుడులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, కోడలు దివ్యశ్రీలకు శుభాకాంక్షలు తెలుపుతున్న జగన్క్వారీమార్కెట్ రోడ్డులో విద్యార్థినిని ముద్దాడుతూ...రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో కార్యకర్తలు ఇచ్చిన శంఖాన్ని పూరిస్తున్న జగన్భారీగా తరలివచ్చిన జనంకు అభివాదం చేస్తున్న జగన్అభిమానులకు అభివాదం చేస్తూ... -
రేపు జగన్ రాక
సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. కాకినాడలో జరిగే మాజీ మంత్రి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుని వివాహానికి ఆయన హాజరు కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా బోస్ మాట్లాడుతూ, 19 నెలల తర్వాత జిల్లాకు వస్తున్న జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఇప్పటివరకూ జగన్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా అపూర్వ స్వాగతం అందించాం. బుధవారం అంతకన్నా ఘనమైన రీతిలో ఆహ్వానం పలుకుదాం’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ జగన్ పర్యటన విజయవంతానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలో నిర్దేశించారు. పర్యటన రూట్ మ్యాప్పై నేతలతో చర్చించారు. సమైక్య జెండాలు పట్టండి.. ‘రాష్ట్రంలో సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న జగన్ వస్తున్న తరుణంలో ప్రతి నేత, కార్యకర్త పార్టీ జెండాకు తోడు సమైక్య జెండాను కూడా తీసుకురావాలి’ అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పిలుపునిచ్చారు. మరో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జైలు నుంచి వచ్చాక తొలుత కడప జిల్లా వెళ్లిన జగన్ అనంతరం మన జిల్లాకే వస్తున్నారన్నారు. ‘అధినేతకు మనపై ఉన్న అభిమానానికి తగ్గట్టుగా మనం పలికే స్వాగతం ఉండాలి’ అన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ, కడప తర్వాత జగన్ జిల్లాకు రావడం వల్ల సెంటిమెంట్గా కూడా పార్టీకి లాభం చేకూరుతుందన్నారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓపక్క సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, జాతీయస్థాయికి ఉద్యమాన్ని నడిపిస్తూ, క్షణం తీరిక లేని సమయంలో కూడా పార్టీ నేతల కుటుంబాలతో మమేకమై, వారింట్లో శుభకార్యాలకు జగన్ హాజరవుతున్న తీరును తాను ఇప్పటివరకూ ఏ నేతలోనూ చూడలేదన్నారు. ఈ పర్యటన పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. జనాదరణ కలిగిన నేత జగన్ ఒక్కరే.. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్ ఎక్కడ సభ పెట్టినా ఆదరించేందుకు జనం తరలివస్తారన్న విషయం ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమైక్య శంఖారావం సభ ద్వారా నిరూపితమైందన్నారు. అంతటి సత్తా కలిగిన నేత జగన్ మాత్రమేనన్నారు. తన భర్త జక్కంపూడి రామ్మోహనరావు దూరమైనప్పటి నుంచీ జగన్ తమ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. సీజీసీ సభ్యుడు గంపల వెంకట రమణ మాట్లాడుతూ జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్తా బాధ్యతగా పని చేయాలన్నారు. పని చేయని వారిని ఉపేక్షించబోం.. మండలస్థాయిలో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలపై నెలాఖరులోగా కసరత్తు పూర్తి చేయాలని మండల కన్వీనర్లకు కుడుపూడి సూచించారు. ఇందులో విఫలమైన వారి వివరాలను కేంద్ర కమిటీకి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తామన్నారు. పని చేయని నేతలను ఉపేక్షించేది లేదని కేంద్ర కమిటీ ఆదేశించిందన్నారు. ఇందుకు ఏ స్థాయి నాయకుడూ అతీతం కాదన్నారు. ఈ నెల 30 వరకూ ఓటరు జాబితా సవరణలకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చిందని, నేతలు గ్రామస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలు పరిశీలించాలని ఆదేశించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని పార్టీ ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర కమిటీ పంపిన లేఖను జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు చదివారు. సమావేశంలో మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్కుమార్, తోట సుబ్బారావునాయుడు, దాడిశెట్టి రాజా, మత్తి జయప్రకాష్, వివిధ సెల్ల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, అనంత ఉదయభాస్కర్, మార్గన గంగాధర్, నయీం భాయి, రొంగల లక్ష్మి, గెడ్డం రమణ, గారపాటి ఆనంద్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్, వాసిరెడ్డి జమీల్, ఎన్.వసుంధర, కాకినాడ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్, జక్కంపూడి రాజా, అద్దేపల్లి శ్రీధర్, వేగిరాజు సాయిరాజు, ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.